కివి ఫ్రూట్ అధిక పోషకాల గనిగా ప్రసిద్ధి చెంది ప్రత్యేకమైన రుచితో అందరినీ ఆకర్షిస్తోంది. వీటిని చైనీస్ గూస్బెర్రీ అని కూడా అంటారు.కివి పళ్లు తీపి మరియు పులుపు కలిసిన అద్భుతమైన రుచితో ఉండి నారింజ, బత్తాయి కంటే అధిక మొత్తంలో విటమిన్ సి లభిస్తుంది.కావున ప్రతి రోజు కివి పండ్లను ఆహారంగా తీసుకుంటే తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు తద్వారా సీజనల్గా వచ్చే వ్యాధులతో పాటు అనేక రకాల వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.కావున రోజువారి ఆహారంలో కివి ఫ్రూట్ ను ఆహారంలో తీసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కివి పండును ప్రతిరోజూ తినడం మన ఆరోగ్యానికి మంచిదే ! అయినప్పటికీ కొన్ని అనారోగ్య సమస్యలతో నిత్యం బాధపడేవారు కివి పండ్లను వీలైనంతవరకు తినకుండా ఉండడమే మంచిదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కివి పండ్లను తినకూడదో ఇప్పుడు చూద్దాం.
ముఖ్యంగా దీర్ఘకాలం పాటు కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కివి ఫ్రూట్ కు దూరంగా ఉండటమే మంచిది. కారణం ఏమిటంటే కివి పండ్లలో అత్యధికంగా పొటాషియం కలిగి ఉంటుంది.కాబట్టి కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పొటాషియం కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే కివి ఫ్రూట్ కు దూరంగా ఉండటమే మంచిదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే కివి పండులో కూడా నిమ్మ, నారంజ మాదిరిగానే విటమిన్ సి తోపాటు సిట్రిక్ యాసిడ్ అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారికి ఇలాంటి పండ్లను తినడం అంత మంచిది కాదు.
మీరు తరచూ చర్మ సమస్యలతో మరియు అలర్జీలతో బాధపడుతుంటే కివి ఫ్రూట్ ను అధిక మొత్తంలో తీసుకోకపోవడమే మంచిది.అలర్జీ సమస్య ఉన్నవారు కివి ఫ్రూట్ ను అధికంగా తీసుకుంటే చర్మంపై దద్దుర్లు రావడం తామర, చర్మం ఎర్రబడటం, పెదవులు, నాలుక వాయడం జరుగుతుంది. అలాగే జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు కివి పండ్లను అధికంగా తింటే విరేచనాలు, వివిధ రకాల అలెర్జీలకు కారణం అయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు రోజుకొక కివి ఫ్రూట్ తింటే ఆరోగ్యానికి మంచిదే. అయితే ఒకటి కంటే ఎక్కువ పళ్ళను ఆహారంగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు సూచించడం జరిగింది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…