Singer Chinmayi: గత వారం రోజుల నుంచి బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు గల కారణం ఈయన ఒక ప్రముఖ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ జరుపుకోవడమే. ఇలా మ్యాగజైన్ న్యూడ్ ఫోటోల కోసం సుమారు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకొని ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
ఈ విధంగా రణవీర్ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా చాలామంది ఈ ఫోటోలపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అలాగే మరికొందరు తనకు మద్దతుగా నిలబడి తన ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు సైతం ఎంతో ధైర్యం ఉండాలి ఇలాంటి ఫోటోషూట్స్ చేయాలంటే అని చెప్పడమే కాకుండా మహిళలు కూడా ఇలాంటి ఫోటోలు దిగితే వారికి కూడా ఇలాంటి మద్దతే తెలపాలి అప్పుడే సమానత్వం ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇకపోతే ఈయన న్యూడ్ ఫోటోలపై ఏకంగా మహిళా సంఘాలు కోర్టుకు ఫిర్యాదు చేసిన విషయం కూడా తెలిసిందే. ఇలా ఈయన న్యూడ్ ఫోటోలు పట్ల వ్యతిరేకత ఏర్పడటంతో తాజాగా ఈ విషయంపై సింగర్ చిన్మయి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీకు బుద్ధుందా? పని పాట లేదా? ఇలాంటి పనికిమాలిన కేసులు కోర్టుకు వేసి కోర్టు టైం వేస్ట్ చేస్తున్నారంటూ ఈమె మండిపడ్డారు.
మహిళలను ఇబ్బందులకు గురి చేస్తూ, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులు అలాగే రాజకీయ నాయకులను టార్గెట్ చేయండి అంటూ ఈమె హితువు పలికారు. మహిళలతో కలిసి డాన్స్లు చేసే సీఎంలు మహిళలను వేధిస్తున్న ఎంపీలు బయట దర్జాగా తిరుగుతున్నారు. అలాంటి వారిపై కేసులు పెట్టండి ఇదంతా కేవలం జనాల అటెన్షన్ కోసమే అంటూ చిన్మయి కామెంట్ చేశారు. సాధారణంగా అయితే చిన్మయి ఇలాంటి వాటికి మద్దతు తెలిపరు కానీ రణవీర్ న్యూడ్ ఫోటోలపై ఈ కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…