Singer Parvathi : సంగీత కార్యక్రమాలకు కొదవ లేదు తెలుగు బుల్లి తెరపై . ఈటీవీ లో ఏళ్ల తరబడి వస్తోన్న పాడుతా తీయగా కార్యక్రమం ఇప్పటికి కొనసాగుతోంది. కరోనా కాలంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇన్ఫెక్షన్లతో మరణించాక ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఇప్పుడు పాడుతా తీయగాను నడిపిస్తున్నారు. ఇక ఈ టీవీలో వచ్చే ఈ షో ఎంతో మంది గాయనీ గాయకులను తెలుగు తెరకు పరిచయం చేసింది. ఇక దీనిలాగే జీ తెలుగులో కూడా సరిగమప అంటూ పాటల ప్రోగ్రాం వస్తుంది. సంగీత దర్శకుడు కోటి సారథ్యంలో వస్తున్న ఈ పాటల కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయనీ గాయకులు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇక ఈ కార్యక్రమం ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. సరిగమప కొత్త సీజన్ మొదలయ్యాక తొలిగా గుర్తింపు పొందిన సింగర్ పార్వతి. మొదటి రోజే పెద్దఎత్తున వార్తల్లో నిలిచింది తన గాత్రంతో పార్వతి.
పార్వతి గ్రామానికి బస్సు….పార్వతి పాట చలవే…..
పార్వతి ఎంతో కష్టపడి సంగీతాన్ని నేర్చుకున్నారు. సంగీతంపై ఆసక్తితో తన గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోయినా నడుచుకుంటూ వేరే గ్రామానికి వెళ్లి సంగీత సాధన చేసింది పార్వతి. ఇక తన గాత్రం తో మంచి పేరు తెచ్చుకున్న పార్వతి తన కోకిల గొంతు తో అందరినీ ఆకట్టుకుంది.మొదటి రోజే అద్భుతమైన పాట పాడి బస్సులేని తన గ్రామానికి బస్సు రప్పించిన ఘనత పార్వతికి దక్కిందని చెప్పాలి.
అవమానాలు ఎదురవుతాయా…లేక ప్రోగ్రాం టీఆర్పి పెంచడం కోసమా…..
ఇలా కొద్ది కాలం లోనే తన ప్రతిభతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పార్వతి ఇకపై అవమానాలను ఎదుర్కొనబోతోందా అనే సందేహాలు వస్తున్నాయి చూసే ప్రేక్షకులకు. ఇక ఈ వారం ప్రోమోలో పార్వతి కి చేదు అనుభవం ఎదురైనట్టు చూపించడాన్ని అలాగే భావించలేమో. ఈ ప్రోమోలో భాగంగా సింగర్ పార్వతికి చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తోంది. ఈ ప్రోమోలో పార్వతి పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలోని మగువా మగువా అనే పాట పాడింది. ఇక ఈ పాట పాడే సమయంలో ఈమె మొదటిలోనే లిరిక్ మర్చిపోయినట్లు తెలుస్తోంది. ఇలా వేదికపై పార్వతి పాట పాడుతూ తడబడటంతో వెంటనే జడ్జి స్థానంలో ఉన్న కోటి కట్ చెప్పారు. ఈ విధంగా పార్వతి పాట పాడుతూ తడబడటంతో ఒక్కసారిగా సరిగమప వేదిక మొత్తం షాక్ కి గురైంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఈ విషయంపై స్పందిస్తున్నారు. ఇక పార్వతి అవమానాలు ఎదుర్కొనబోతోందని కొందరు భావిస్తుంటే మరికొందరు జీ తెలుగు ప్రోగ్రాం టీఆర్పి పెంచడం కోసం. వేసిన ఎత్తుగడగా చెప్తున్నారు. ఇంతకీ అసలు ఏమి జరిగిందో తెలియాలంటే మాత్రం ప్రోగ్రామ్ చూడాల్సిందే.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…