Singer yasaswi: సరిగమప సింగింగ్ కాంపిటీషన్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు సింగర్ యశస్వి. అద్భుతమైన గాత్రంతో పాటలు పాడుతూ ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి ఈయన ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే ఈయనలో మంచి గాయకుడు మాత్రమే కాకుండా మంచి మనసు కూడా ఉందని నిరూపించుకున్నారు. ఈయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కొంతమంది అనాధ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.

ఇలా పేద అనాధ పిల్లలను తాను ఆదరించి హక్కును చేర్చుకున్నానని ఒక ఎన్జీవో సమస్థ ద్వారా వీరి బాగోగులు తానే చూసుకుంటున్నానని పెద్ద ఎత్తున కలరింగ్ ఇచ్చారు.ఇలా తాను మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పి ఎంతోమంది సింపతి ఓట్లు కూడా దక్కించుకున్నారు.

ఇలా యశస్వి కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ పేరుతో ఓ ఎన్జీవో సంస్థ నడుస్తోంది.ఇక్కడ సుమారు 60 మంది పిల్లల వరకు ఆశ్రయం పొందుతున్నారు. ఇక వీరి బాగోగులు వీరి చదువులను సదురు నవసేన ఎన్జీవో సమస్థ బాధ్యతలు చూసుకుంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో ఫోటోలు దిగిన యశస్వి తానే ఆయన నడుపుతున్నానంటూ కలరింగ్ ఇచ్చారు.
నవసేన ఫౌండేషన్ కు ఎవరు సహాయం చేయలేదు…
ఈ క్రమంలోనే నవసేన ఫౌండేషన్ ఎన్జీవో సమస్థ ఓనర్ ఫరా కౌసర్ ఈ విషయంపై స్పందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా నవసేన ఫౌండేషన్ కి ఎవరూ కూడా సెలబ్రిటీలు విరాళం ఇవ్వలేదని, తానే తన డబ్బుతో పిల్లల అవసరాలు తీరుస్తూ ఈ ఎన్జీవో సమస్థ నడుపుతున్నానని తెలిపారు. తనది కానీ ఎన్జీవో సమస్తను తానే నడుపుతున్నట్లు చెప్పుకుంటున్నటువంటి సింగర్ యశస్వి పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలంటూ నవసేన నిర్వాహకురాలు పరాక్ కౌసర్ అసలు విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

































