Smriti Irani: కేంద్ర స్త్రీ శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మంత్రి స్మృతి ఇరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోక ముందు నటిగా పలు బుల్లితెర కార్యక్రమాలలోనూ నటించి పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న స్మృతి ఇరానీ అనంతరం రాజకీయాలలోకి వెళ్లి అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇకపోతే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ కెరియర్ గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతోమందికి ఒక కుటుంబ సభ్యురాలుగా మారిపోయానని తెలిపారు. అయితే అప్పట్లో సీరియల్స్ ద్వారా వచ్చే డబ్బు తనకు ఏమాత్రం సరిపోయేది కాదని తెలిపారు.
పెళ్లి చేసుకున్న తర్వాత బ్యాంకు నుంచి 25 లక్షల లోన్ తీసుకొని ఇల్లును కొనుగోలు చేసాము ప్రతినెల ఈఎంఐ కట్టడానికి కూడా డబ్బు సరిపోయేది కాదు.ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము అలాంటి సమయంలో కొందరు వ్యక్తులు నా వద్దకు వచ్చి ఒక యాడ్ చేయమని చెప్పారు. అందుకోసం వారు కోటి రూపాయల రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారు.అయితే తాను ఆఫర్ రిజెక్ట్ చేసానని తెలిపారు. అప్పుడు తన స్నేహితులందరూ పిచ్చి గాని పట్టిందా నీకు అంటూ తనని తిట్టారని తెలిపారు.
ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈమె కోటి రూపాయలు ఆఫర్ వచ్చినప్పటికీ ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయానికి వస్తే ఈమెకు అంత పెద్ద ఆఫర్ ఇచ్చినది మరెవరో కాదు పాన్ మసాలా కంపెనీకి చెందినటువంటి వారు. ఇలా పాన్ మసాలా యాడ్ చేస్తే తనకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పడంతో హానికరమైన వస్తువులను తాను ప్రమోట్ చేయనని చెప్పి ఈ ఆఫర్స్ రిజెక్ట్ చేశానని స్మృతి ఇరానీ వెల్లడించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…