సోనియా అగర్వాల్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు 7/G బృందావన్ కాలనీ. ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకుంది. అంతేకాకుండా 7/G బృందావన్ కాలనీ సినిమాలో నటించి అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాలో అనిత అనే పాత్రలో నటించి మెప్పించింది.ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది.
ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తరువాత ఆమె తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తమిళంలో పాటు తెలుగులో కూడా పలు సినిమాలలో నటించింది.మొదట 2002లో నీ ప్రేమకై ఈ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించినప్పటికీ ఆమె సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది.
ఇక 2006లో డైరెక్టర్ సెల్వరాఘవన్ ను పెళ్లి చేసుకొని కొన్నాళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ అంత హ్యాపీగా కొనసాగుతుంది అనుకుంటున్న క్రమంలోనే ఆమె ఆ దర్శకుడుతో విడాకులు తీసుకుంది. అలా 2010 లో విడాకులు తీసుకుని అనంతరం ఒంటరిగా నివసిస్తోంది. ఆ తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న సినిమాలతో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆ సినిమాలు పెద్దగా ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి.
ఇదిలా ఉంటే గత కొంతకాలంగా సోనియా రెండవ పెళ్లి పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే ఈమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఒక కొత్త రూమర్ వైరల్ గా మారింది.ఆమె ఒక యువ దర్శకుడితో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వయసు కూడా మించి పోతుండడంతో అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఆలోచిస్తోందట. ఇకపోతే ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక తమిళం సినిమాతో పాటు తెలుగులో కూడా సహా నటిగా పలు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం సోనియా మళ్లీ పెళ్లి చేసుకుంటుందా? ఈ మేరకు వినిపిస్తున్న కథనాలు నిజమవుతాయా? తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన సుస్వాగతం సినిమా వెనుక ఆసక్తికరమైన విషయం తాజాగా మళ్లీ చర్చకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోగా…
ప్రస్తుతం మార్కెట్లో కల్తీ ఆహారంపై పెరుగుతున్న ఆందోళన మధ్య, పాలు కూడా భద్రత పరంగా చర్చకు వస్తున్నాయి. పిల్లల నుంచి…
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడం అభిమానుల్లో…
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు దోష నివారణ పూజల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో…
అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమయ్యే చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఏడాది యాత్రను…
ఎండాకాలం వచ్చిందంటే మార్కెట్లలో కనిపించే ప్రత్యేక పండ్లలో ‘పాల పండ్లు’కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అడవుల్లో సహజంగా పెరిగే…