Soundarya: వెండితెర నటిగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో నటి సౌందర్య ఒకరు.కేవలం 30 సంవత్సరాల వయసులోనే దాదాపు 100 సినిమాలలో నటించే అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో అతి చిన్న వయసులోనే మరణించారు. ఇప్పటికీ ఈమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎలాంటి గ్లామరస్ పాత్రలకు తావు లేకుండా అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె మరణం ఇప్పటికీ అభిమానులకు తీరని లోటు.ఇక సౌందర్య మరణించి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ ఈమె జ్ఞాపకాలను అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు.
తాజాగా సౌందర్య తల్లి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కుమార్తె సౌందర్య కుమారుడు అమర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే రోజు ప్రమాదంలోసౌందర్య తన సోదరుడు అమర ఇద్దరు కూడా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సౌందర్య తల్లి మాట్లాడుతూ తనకు మనసు బాగా లేకపోయినా తాను ఏదైనా బాధగా ఆలోచిస్తూ పడుకున్న ఆరోజు రాత్రి తన పిల్లలు కలలోకి వస్తారని ఈమె తెలియజేశారు.
ఇలా నా మనసు బాధగా ఉన్నప్పుడు నా పిల్లలు తప్పకుండా కలలోకి వస్తారని ఇక సౌందర్య అయితే మమ్మీ నీకెందుకు నేను ఉన్నాను కదా అంటుంది కానీ ఆ కల మధ్యలోనే ఆగిపోతుంది అలా ఎందుకు ఆగిపోతుందో నాకు ఇప్పటికే అర్థం కావడం లేదు. అంటూ ఈమె తన కూతురు కొడుకుని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…