Sri reddy fires on Nagababu : శ్రీ రెడ్డి సోషల్ మీడియా లో కనిపించిందంటే ఈరోజు ఎవరిని ఏకిపారేస్తుందో అని ఎదురుచూస్తారు నెటిజన్లు. ఇపుడు హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ ఉదంతం తో మరోసారి శ్రీ రెడ్డి కి అవకాశం దొరికింది. ఇక వైసీపీ వల్ల పై విమర్శలు చేసే వాళ్ళపై విరుచుకుపడడం శ్రీ రెడ్డి కి అలవాటే ఇపుడు నాగబాబు కూతురు పబ్ లో పోలీసులకు దొరకడం తో మంచి అవకాశం దొరికింది. ఇక నాగబాబు ను ఘటైనా మాటలతో విమర్శించింది . కర్మఫలం అంటూ నాగబాబు ను ఏకిపారేసింది.

నన్ను మానసిక క్షోభకు గురిచేసారు….
గతంలో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు తనని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారాలు చేశారని దాంతో నేను కూడా చాలా మానసిక క్షోభను అనుభవించానని తెలిపింది. ఈ క్రమంలో మరి కొందరైతే ఏకంగా తాను రాత్రి పూట రోడ్డుపై లారీలు ఆపి ఏదో చేస్తున్నానని అలాగే డబ్బు కోసం ఇంకేదో చేస్తున్నానని తప్పుడు కథనాలు ప్రచారం చేసారని చెప్పింది.
డబ్బుకోసం దిగజారి ఏనాడు ప్రవర్తించలేదని కాని తనపై చెడు ప్రచారం చేసారని ఇక ఇపుడు పబ్ లో దొరికిన నిహారికను ఎలా జన సైనికులు సమర్థిస్తారని ప్రశ్నించింది.మెగాస్టార్ కుటుంబాన్ని ఎపుడు టార్గెట్ చేస్తూ విమర్శించే శ్రీ రెడ్డి ని ఈ మధ్య జన సైనికులు పట్టించుకోవడం లేదు అయితే ఇపుడు ఈ వాఖ్యలకు ఇలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి. మొత్తానికి నిహారిక ఇష్యూ ఇపుడపుడే ముగిసేలా లేదు.




























