Sri Reddy: పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.

ఇక ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేయడమే కాకుండా సినిమాలో ఏ మాత్రం కంటెంట్ లేకపోయినా సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించారని, చివరికి విజయ్ దేవరకొండ అభిమానుల సైతం ఈ సినిమా విషయంలో సంతృప్తి పడలేదని తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమా విజయం పై నటి శ్రీరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి మాట్లాడుతూ తీసేవన్నీ అట్టర్ ఫ్లాప్ సినిమాలే… పైగా మహేష్ బాబు డేట్స్ ఇవ్వలేదని చెప్పడం ఏంటో.. అట్టర్ ఫ్లాప్ సినిమాలకు బాబు డేట్స్ ఇవ్వలేదని ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష అంటూ ఈమె కామెంట్ చేశారు.

Sri Reddy: లైగర్ కన్నా కార్తికేయ 2 బెటర్…
సినిమాలో కంటెంట్ లేదు కానీ సినిమాకి ఇలాంటి హైప్ అవసరమా.. అంతేకాదు లైగర్ ముందు లైగర్ తర్వాత అంట మనకు ఇలాంటి వన్నీ అవసరమా.. అసలు లైగర్ సినిమా కన్నా కార్తికేయ 2 సినిమా చాలా బాగుందంటూ ఈ సందర్భంగా శ్రీ రెడ్డి చేసిన ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా పూరి జగన్నాథ్ ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమాని విడుదల చేసినప్పటికీ ఈ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి.






























