దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ. దీనిలో దాదాపు చాలామందికి ఖాతా ఉండి ఉంటుంది. అయితే ఎవరైనా సేవింగ్ లేదా కరెంట్ ఖాతాలు ఓపెన్ చేస్తూ ఉంటారు. అందులో మనం డిపాజిట్ చేసే అమౌంట్ కు ఎస్ బీఐ చాలా తక్కువగా వడ్డీని ఇస్తుంటుంది. అయితే చాలామందికి తెలియని మరొక అకౌంట్ ఎస్ బీఐ లో ఉంది. అదే ఎస్బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్. ఈ అకౌంట్ ను ఓపెన్ చేసిన ప్రతీ ఒక్కరికీ ఎక్కువ వడ్డీని ఇస్తుంటారు.

సాధారణ అకౌంట్తో పోలిస్తే ఎస్బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ ద్వారా వచ్చే లాభాలు అధికమనే చెప్పాలి. సాధారణ సేవింగ్స్ అకౌంట్లో ఖాతాదారులు దాచుకునే డబ్బులకు 2.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఎస్బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ వినియోగదారులు సేవింగ్స్ బ్యాలెన్స్పై ఎక్కువ వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఖాతా మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్కు లింక్ అయి ఉంటుంది. ఖాతాలఓ మనకు ఇప్పుడు అవసరం లేని డబ్బులు ఉంటే వాటికి ఎస్ బీఐ అధికంగా వడ్డీ చెల్లిస్తుంటుంది. మన అకౌంట్ లోని కొంత డబ్బులను ఆటోమెటిక్గా టర్మ్ డిపాజిట్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతాయి. మీకు అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఖాతాలో ఉన్నన్ని రోజులు సాధారణ వడ్డీ కంటే ఎక్కువ పొందవచ్చు. ఉదాహరణకు మన అకౌంట్లో రూ. 45 వేలు ఉంటే కనీసం రూ. 10 వేల మల్టీ పర్పస్ ఆప్షన్ డిపాటిట్ స్కీమ్ లో జమ అవుతాయి. మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్లో జమ అయిన మొత్తానికి ఎక్కవ వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. అదే ఒక వేళ మన అకౌంట్లో రూ. 50 వేలు ఉంటే అందులో నుంచి రూ. 15 వేలు మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్లో జమ అవుతుంది. ఈ రూ. 15 వేలకు అధిక వడ్డీని ఎస్ బీఐ ఇస్తుంది.
అంటే ఒక ఖాతాలో రూ. 30 వేల కంటే అధికంగా ఎంత ఉంటే అంత అమౌంట్ ను మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్లో జమ చేసి అధిక వడ్డీని పొందొచ్చు. ఈ అకౌంట్ తీసుకున్నవారికి సాధారణ సేవింగ్స్ ఖాతాలో లభించే ఏటీఎం కార్డులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ లాంటి సదుపాయాలన్నీ ఉంటాయి. అంతే కాకుండా చెక్ బుక్స్ నుకూడా ఉచితంగా పొందచ్చు. ఈ స్కీమ్ లో లోన్ సౌకర్యం కూడా ఉంది. ఈ ఖాతాలో ఎంత అమౌంట్ అయినా మెయింటెన్ చేసుకునే వీలుంటుంది. పూర్తి వివరాలకు https://bank.sbi/ ను సందర్శించి అందులో పేర్కొన్న టర్మ్స్ అండ్ కండీషన్స్ ను చదివితే అర్థం అవుతుంది.



























