Suman : సుమన్.. తెలుగు ప్రేక్షకులకు ఈయన గురించి ప్రత్యేరకమైన పరిచయం అవసరం లేదు. ఇప్పటిదాకా దాదాపు 150 సినిమాలకు పైగా నటించాడు. 1979 లో నీచల్ కులం అనే మలయాళం సినిమా ద్వారా సినిమా రంగానికి పరిచయం అయ్యాడు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మాత్రమే కాకుండా 2004 లో ‘డెత్ అండ్ ఆక్సిస్’ అనే హాలీవుడ్ చిత్రం లో కూడా కనిపించారు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా, రామాదాసు లో రాముడిగా నటించి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక శివాజీ సినిమాలో విలన్ గా కూడా అలరించాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న నిర్మాత సంఘాలు తీసుకున్న స్ట్రైక్ నిర్ణయం పై సంచలనం వ్యాఖ్యలు చేశారు.
డబ్బులు పెట్టి వెళ్లి పడుకుంటే ఎలాగ, దగ్గరుండి చూసుకోవాలి…
ఆర్టిస్టులు రేట్లు తగ్గించాలని, ప్రొడక్షన్ ఖర్చులు పెరుగుతున్నాయని, ఓటీటీ ల వళ్ళ నష్టం జరుగుతోందని నిర్మాతలు స్ట్రైక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై చాలా మంది ప్రముఖులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో హీరో సుమన్ తన అభిప్రాయాన్ని తెలియజేసారు. షూటింగ్ సమయాన్ని పెంచాలని, రెండు రోజులు చేయాల్సిన పనిని ఒక రోజులో పూర్తిచేయాలని అయన చెప్పారు. హీరోల రెమ్యూనరేషన్ నిర్మాతలు మాట్లాడి కాస్త తగ్గించే విదంగా మాట్లాడాలని అయన సూచించారు.
నిర్మాతలు డబ్బులు మాత్రం పెట్టి అంతా మేనేజర్ మీద వదిలేసి వెళ్లి పడుకోవడం కాదు, నిర్మాతలు అప్పట్లో రామానాయుడు గారు ఆచరించిన విధానాలను ఫాలో అవ్వాలని చెప్పుకొచ్చారు. టికెట్ల రేట్లు తగ్గిస్తే బైయ్యర్ల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అందరూ పద్దతిగా రోజుకు 9 గంటల పనితనాన్ని అలవాటు చేసుకోవాలి అని అయన సూచించారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…