దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ లు, సాంగ్ లు రిలీజ్ చేయగా ఇవి మంచి ప్రేక్షకాదరణ పొందాయి. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సామీ సాంగ్ ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా ఇదే పాట వినిపిస్తోంది.
అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న ఈ సినిమాను, రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్టు పార్టుకు సంబంధించి షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయింది. మిగిలిన 10 శాతం చిత్రీకరణను పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్ర బృందం.ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడనే విషయం తెలిసిందే.ఆయన ఫస్టులుక్ కు ఏ విధమైన రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే.అయితే ఆయన ఫస్టు పార్టు చివరలో, కథ పతాకస్థాయికి చేరుకుంటున్న సమయంలో తెరపై ప్రత్యక్షమవుతాడట సెకండ్ పార్టు కోసం వెయిట్ చేసేలా చేస్తారని చెప్పుకుంటున్నారు.
ఈ సినిమా ఫస్టు పార్టులో సునీల్ విలన్గా కనిపించనున్నాడట.ఇక తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప చిత్రంలో తన రోల్ గురించి తెలిపాడు సునీల్.ఇందులో తనకుమంచి పాత్ర దొరికిందని అన్నాడు.రామ్ చరణ్ సినిమాతో పాటు గా మంచి పాత్రలు తనకు దొరుకుతున్నాయని తెలిపారు.ఇక సునీల్ రీసెంట్గా హెడ్స్ అండ్ టేల్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సునీల్, చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హెడ్స్ అండ్ టేల్స్,‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. ఈ సినిమాకు నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ 5 లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…