Super Star Krishna : అలనాటి తెలుగు హీరోల్లో ట్రెండ్ ఫాలోయింగ్ అవకుండా సెట్ చేసిన వాళ్లలో కృష్ణ ముందుంటారు. కొత్తదానాన్ని సైన్మ ఇండస్ట్రీ కి పరిచయం చేసింది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన కుటుంబం కథా చిత్రాలు తీసినా, కౌ బాయ్ సినిమాలు తీసినా గూఢచారి అంటూ వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇక కృష్ణ గారి వారాసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. కృష్ణ గారికి అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి. అలాగని కమర్షియల్ పంథాలో సినిమాలను కృష్ణ చేయలేదు. ఇక ఆయన సినిమాల్లోనే కాదు నిజంగా కూడా హీరోనే అని నిరూపించుకున్న ఘటన ఒకటి ఉంది.

కరువు కాలంలో సహాయం…
1972 లో ఆంధ్రప్రదేశ్ లో కరువు విలయ తాండవం చేసింది. అలాంటి సమయంలో పేపర్ లో ఆ వార్త చూసి చలించిన కృష్ణ గారు అన్న ఎన్టీఆర్ గారిని సలహా అడిగి నాటకాలు వేసి వసూలైన డబ్బులతో కరువు ప్రాంతం వారికి సహాయం చేయాలని భావించారు. ఇక విజయవాడ మొదలు రాజమండ్రి అలా మొత్తం కొన్ని ప్రాంతాలలో అందరి నటులతో కలిసి నాటకాలు వేసి డబ్బు సేకరించాలని కృష్ణ గారి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈ పనికి పూనుకున్నారు. ‘విచిత్ర మనుషులు’ అనే నాటికను ప్రదర్శించాలని నిర్ణయించుకుని. సావిత్రి, జమున, కృష్ణ, రామకృష్ణ, పద్మనాభం, అల్లు రామలింగయ్య వంటి అగ్ర తారలందరూ నాటకాలు పాటలు పాడటం అలాగే హాస్య ప్రదర్శన వంటివి చేసారు. అయితే వీళ్ళు విజయవాడ బయలుదేరే సమయానికి విపక్షాల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం వెళ్లకుండా విజయవాడకి నాటకప్రదర్శన వాయిదా వేసుకోమని చెప్పినా కృష్ణ గారు బెదరకుండా విజయవాడ మొత్తం నటీనటులతో బయలుదేరారు.

ఇక అక్కడకి వెళ్ళాక నాటక ప్రదర్శన మొదలయ్యాక కుండపోత వర్షము మొదలయింది. అయినా ప్రేక్షకులు వెళ్ళిపోలేదు అలాగే నిలబడి చూసారు. కానీ ఎంతకూ వర్షం తగ్గకపోవడం వల్ల ప్రదర్శన నిలిపి వేసి అదే టికెట్లకు మళ్ళీ ప్రదర్శన ఇస్తామని చెప్పి ప్రజలను వెనక్కి పంపారు. ఇక నాటకాన్ని మొదలు పెట్టింది ఎన్టీఆర్ గారు అయితే చివర్లో ముగించుకుని వచ్చాక అక్కినేని వారు సన్మాన సభ ఏర్పారు చేసారు. అక్టోబర్ లో మొదలు పెట్టి నవంబర్ లో నాటక ప్రదర్శన అన్ని ప్రాంతాల్లో ప్రదర్శించారు. ఇక ఈ మొత్తం సంఘటనలు మళ్ళీ అందరు నటీ నటులతో నటింపజేసి పద్మనాభం గారు సినిమాగా తీశారు. ఇక ఈ సినిమా కోసం ఎవరూ రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం విశేషం.
































