Surekha Vani:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి సురేఖ వాణి.ఇలా ఎన్నో తెలుగు సినిమాలలో అక్కగా పిన్ని వదిన పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలకు దూరంగా ఉంటున్నారు.ఇలా ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన కూతురితో కలిసి చేసే హంగామా మామూలుగా లేదు.
తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేసే సురేఖవాణి హీరోయిన్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఈ వయసులో కూడా ఈమె ఓ రేంజ్ లో అభిమానులను సందడి చేస్తున్నారని చెప్పాలి. ఇదిలా ఉండగా సురేఖ వాణి స్వాతిముత్యం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సురేఖ వాణి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ చాలా మంది తనని సినిమాలకు దూరమయ్యారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి సురేఖవాణి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా సురేఖ వాణి మాట్లాడుతూ అసలు సినిమాలు మాదాక వస్తే కదా చేయడానికి అంటూ అసలు విషయం చెప్పారు.
ఒకప్పుడు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే తనకి ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు రావడం లేదని అలా ఎందుకు జరుగుతుందో తనకు ఇప్పటికే అర్థం కాలేదని తెలిపారు.నేను సినిమాలకు దూరం కాలేదని నాకు సినిమా అవకాశాలు రాకపోవడం వల్ల ప్రేక్షకులకు దూరంగా ఉన్నానని ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. తనకు సినిమా అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని ఇక స్వాతిముత్యం సినిమాలో తనకు ఇలాంటి మంచి పాత్ర ఇచ్చినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…