Suresh Babu -Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో క్యూట్ కపుల్ గా ఉన్నటువంటి నాగచైతన్య సమంత గురించి అందరికీ సుపరిచితమే.ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న ఈ దంపతులకు పెళ్లైన మూడు సంవత్సరాలకు విడిపోయారు.ఇలా నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నప్పటికీ ఇటు నాగార్జున ఫ్యామిలీ కానీ ఇటు దగ్గుబాటు ఫ్యామిలీ కానీ ఈ విషయంపై ఏ మాత్రం స్పందించలేదు. ఇది వారి వ్యక్తిగత విషయం అని మాత్రమే చెప్పుకొచ్చారు.
ఇకపోతే నాగచైతన్య మేనమామ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ అల్లు అరవింద్ ను ప్రశ్నిస్తూ.. ఈ తరం ఉన్నటువంటి హీరోయిన్లలో మహానటి అనే బిరుదు ఎవరికి ఇస్తారు అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్న విన్నటువంటి అల్లు అరవింద్ సురేష్ బాబు ఇద్దరూ కూడా సమంత అంటూ సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే సురేష్ బాబు మాట్లాడుతూ ఈ తరం హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో మహానటి అనే బిరుదు అందుకోవడానికి సమంత పూర్తిగా అర్హురాలు అంటూ ఈయన చెప్పుకొచ్చారు.
ఈ విధంగా సురేష్ బాబు సమంతను మహానటి సావిత్రితో పోల్చడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాలుగు తరం హీరోయిన్లను చూసినటువంటి సురేష్ బాబు సమంతను సావిత్రి వంటి నటీమణితో పోల్చడం విశేషం.ఇక ప్రస్తుతం సురేష్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత విషయంలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఏ విధమైనటువంటి కోపం లేదని ఈ సందర్భంగా క్లారిటీ వచ్చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…