Suresh Babu -Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో క్యూట్ కపుల్ గా ఉన్నటువంటి నాగచైతన్య సమంత గురించి అందరికీ సుపరిచితమే.ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న ఈ దంపతులకు పెళ్లైన మూడు సంవత్సరాలకు విడిపోయారు.ఇలా నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నప్పటికీ ఇటు నాగార్జున ఫ్యామిలీ కానీ ఇటు దగ్గుబాటు ఫ్యామిలీ కానీ ఈ విషయంపై ఏ మాత్రం స్పందించలేదు. ఇది వారి వ్యక్తిగత విషయం అని మాత్రమే చెప్పుకొచ్చారు.

ఇకపోతే నాగచైతన్య మేనమామ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ అల్లు అరవింద్ ను ప్రశ్నిస్తూ.. ఈ తరం ఉన్నటువంటి హీరోయిన్లలో మహానటి అనే బిరుదు ఎవరికి ఇస్తారు అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్న విన్నటువంటి అల్లు అరవింద్ సురేష్ బాబు ఇద్దరూ కూడా సమంత అంటూ సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే సురేష్ బాబు మాట్లాడుతూ ఈ తరం హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో మహానటి అనే బిరుదు అందుకోవడానికి సమంత పూర్తిగా అర్హురాలు అంటూ ఈయన చెప్పుకొచ్చారు.

Suresh Babu -Samantha:సమంతను సావిత్రితో పోల్చిన సురేష్ బాబు..
ఈ విధంగా సురేష్ బాబు సమంతను మహానటి సావిత్రితో పోల్చడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాలుగు తరం హీరోయిన్లను చూసినటువంటి సురేష్ బాబు సమంతను సావిత్రి వంటి నటీమణితో పోల్చడం విశేషం.ఇక ప్రస్తుతం సురేష్ బాబు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత విషయంలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఏ విధమైనటువంటి కోపం లేదని ఈ సందర్భంగా క్లారిటీ వచ్చేసింది.































