Swara Bhaskar: ప్రస్తుత కాలంలో ప్రేమ వివాహాలు చేసుకోవడం చాలా సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ఒకరినొకరు ప్రేమించుకుని వివాహాలు చేసుకుంటున్నారు. ప్రేమకు కులమత బేధాలు ప్రాంతాలు వంటి భేదాలు ఏమీ ఉండవు. అందువల్ల ఇతర దేశాలకు చెందిన వారితో కూడా ప్రేమలో పడి పెళ్లిలో చేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు పొందిన స్వరా భాస్కర్ కూడా ఒక రాజకీయ నాయకుడు అని ప్రేమించే వివాహం చేసుకుంది.
ప్రస్తుతం ఈమె వివాహం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సమాజ్ వాది పార్టీకి చెందిన ఫాహద్ జిరార్ అహ్మద్ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. స్వరా భాస్కర్ 2020లో సమాజ్ వాది పార్టీ తరపున ప్రచారం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రచారం సందర్భంగా ఫాహద్తో ఆమెకు పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారింది. మొదట్లో ఆమె ఫాహద్ జిరార్ అహ్మద్ను ‘అన్నయ్య’ అని పిలిచేది. ఆ తర్వాత ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళి వరకూ వెళ్ళింది.
ఇద్దరి మతాలు వేరే అయినా ఇరు కుటుంబాల వారు వీరి పెళ్లికి ఒప్పుకోవటంతో పెళ్ళి చేసుకొని ఒక్కటయ్యారు. తాజాగా, వీరి పెళ్లికి సంబంధించిన వివరాలను స్వయంగా స్వరా భాస్కర్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలో ఆమె గురువారం రోజున ట్వీట్ చేస్తూ..మనం మన పక్కనే ఉన్న దాని కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. మేము కూడా ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాం. మా మధ్య మొదట స్నేహం మొదలైంది. తర్వాత అది ప్రేమగా మారింది.
నా హృదయం ఫాహద్ జిరార్ అహ్మద్కు స్వాగతం పలుకుతోంది అంటూ ట్వీట్ చేస్తూ తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేసింది. దీంతో ఈ అమ్మడు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు. నీతో కొందరు గతంలో ఆమె ఫాహద్ జిరార్ అహ్మద్ను అన్న అని సంభోదించిన సంగతిని గుర్తు చేస్తు ‘అన్న అని పిలిచి, అతడినే పెళ్లి చేసుకోవటానికి సిగ్గులేదా’ అంటూ ఫైర్ అవుతున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…