Swetha Lakshmipathi : యాంకర్ గా అలాగే స్క్రిప్ట్ రైటర్ గా కమెడియన్ గా 70 కి పైగా సినిమాల్లో నటించిన లక్ష్మీపతి గారు చేసింది కొన్ని సినిమాలు అయినా తెలుగు ప్రేక్షకులు ఆయనని మర్చిపోలేరు. ఆంధ్రుడు, అల్లరి, కితకితలు, పెద్ద బాబు వంటి సినిమాల్లో అయన కామెడీని ఎవరూ మర్చిపోలేరు. ఇక ఆయన విలన్ గా చేసిన ఏకైక సినిమా ఆయన తమ్ముడు శోభన్ దర్శకత్వం వహించిన మహేష్ బాబు సినిమా బాబీ. ఇక చూడాలని ఉంది సినిమాతో కమెడియన్ గా తెలుగులో బ్రేక్ తెచ్చుకున్న లక్ష్మీపతి గారు 2008లో మరణించారు. అయన మరణం కంటే నెల రోజుల ముందు ఆయన తమ్ముడు డైరెక్టర్ శోభన్ గుండెపోటుతో మరణించారు. ఇక నెల వ్యవధిలో కుటుంబంలో ఇద్దరిని కోల్పోవడం ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేక పోవడంతో చాలా ఇబ్బందులు పడినట్లు లక్ష్మీపతి గారి కూతురు శ్వేత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియపారు. తన తండ్రి బాబాయ్ తో ఉన్న అనుబంధాన్ని పుస్తకాల రూపంలో తెచ్చారు శ్వేత.
నాన్న చనిపోడానికి కారణం…
రేడియో జాకీ గా వైజాగ్ లో పనిచేస్తున్న సమయంలో 2008 జనవరి 7 న బాబాయ్ శోభన్ మరణించారు. ఆయన మరణించిన నెల రోజులకు సరిగ్గా అదే రోజున తండ్రి లక్ష్మీపతి మరణించారు. శ్వేత గారు ఆ సమయంలో జాబ్ చేస్తున్నా ఖర్చులు పోను తన వద్ద 1500 మాత్రమే చేతిలో ఉన్నాయంటూ అసలు ఏం చేయాలో తెలియలేదంటూ తెలిపారు. తన తండ్రి మరణించే రోజు కూడా ఫోన్ చేసారంటూ చెప్పారు. శ్వేత గారి అమ్మ, తమ్ముడు ఇద్దరూ శ్వేత గారిని చూడటానికి వైజాగ్ వెళ్లగా ఆరోజు తిరిగి హైదరాబాద్ వెళ్లారట. ఇంకా వాళ్ళు ఇంటికి రాలేదని లక్ష్మీపతి గారు కూతురికి ఫోన్ చేసి అడిగితే వస్తారు కాస్త ఎక్కడైనా ఆలస్యమై ఉంటుంది అంటూ చెప్పి మామూలుగా మాట్లాడారట. తీరా మధ్యాహ్నం సమయంలో ఆయన అనారోగ్యంగా ఉంది హాస్పిటల్ తెసుకెళ్ళమని ఫోన్ చేయగా తరచూ లక్ష్మీపతిగారు అనారోగ్యం పాలవుతూ ఉండటం వల్ల శ్వేత సీరియస్ గా తీసుకోలేదట.
Advertisement
అయితే మరో బాబాయ్ ఫోన్ చేసి త్వరగా రా అని చెప్పేసరికి ఏదో జరిగిందని అర్థమై ఫ్లైట్ పట్టుకుని వెళ్లగా ఒక్కసారిగా నాన్న మరణించాడని తెలిసి షాక్ అయ్యాను. సినిమాల్లోకి వచ్చాక తాగడం బాగా అలవాటైపోయింది దాంతో అయన ఆరోగ్యం పాడైంది. ఇక బాబాయ్ మరణంను అసలు తట్టుకోలేని నాన్న ఆ బాధతోనే మరణించారు అంటూ శ్వేత ఎమోషనల్ అయ్యారు. ఆయన అంత్యక్రియలకు మా వద్ద డబ్బులు లేక అందరూ ఆలోచిస్తుంటే ఇండస్ట్రీలో వాళ్ళు బాగా సహాయం చేసారు అయితే అప్పటి పరిస్థితుల్లో పెద్దగా తెలియదు కానీ మహేష్ బాబు, ప్రభాస్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ వంటి వారు సహాయం చేసారు అంటూ తెలిపారు.
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.
Advertisement
యుద్ధం గెలిచిన రాముడు… ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.
Advertisement
రంగమ్మత్త.. ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
గోల్డ్.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.