Tag Archives: anasuya

Anasuya: అనసూయను మళ్లీ గెలికిన విజయ్ ఫ్యాన్స్… యానిమల్ సినిమా బోల్డ్ సీన్స్ పై ట్రోల్స్!

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకొని వెండితెరపై నటిగా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా చీరకట్టులో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలలో ఈమె ఎంతో అందంగా అందరినీ ఆకట్టుకుంటున్నారు అయితే ఈ ఫోటోలపై విజయ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ మరోసారి ఈమెను గెలికారు.

విజయ్ దేవరకొండ అనసూయ అభిమానుల మధ్య నిత్యం వార్ నడుస్తూనే ఉంటుంది. ఈయన నటించిన అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఆ సినిమా పట్ల అనసూయ చేసినటువంటి కామెంట్స్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలి. ఈ విషయంపై తరచూ ఈమె ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సినిమాకు సందీప్ రెడ్డి డైరెక్టర్గా వ్యవహరించారు అయితే తాజాగా సందీప్ రెడ్డి డైరెక్షన్లో యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది అయితే ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ విషయాల గురించి అభిమానులు అనసూయ పట్ల ట్రోల్స్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనసూయ యానిమల్ సమయంలో సైలెంట్ గా ఉన్నారు.

యానిమల్ సినిమా చూడలేదా..

ఈ విషయంపై విజయ్ ఫ్యాన్స్ స్పందిస్తూ ఏంటి అనసూయ యానిమల్ సినిమా చూడలేదా.. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలపై ఎందుకు స్పందించడం లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఈమె కేవలం విజయ్ సినిమాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మరోసారి అనసూయ పట్ల విజయ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Vijay Devarakonda: అనసూయతో వివాదం పై స్పందించిన విజయ్ దేవరకొండ… ఏమన్నారో తెలుసా?

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఏమాత్రం ప్రేక్షకులు అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానుంది.

విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి చిత్ర బృందం మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా నుంచి అనసూయ పరోక్షంగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి ట్వీట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతున్నాయి. ఇలా అనసూయ విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం విజయ్ ఫాన్స్ ఆమెను భారీగా ట్రోల్ చేయడంతో ఒకానొక సమయంలో పెద్ద ఎత్తున వివాదంగా కూడా మారింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై మీడియా ప్రతినిధులు విజయ్ ను ప్రశ్నించారు.

Vijay Devarakonda: గొడవపడే వాళ్ళనే అడగండి….


అనసూయతో వివాదం ఎప్పుడు మొదలైంది అసలు ఈ వివాదానికి ఎప్పుడు పులిస్టాప్ పడుతుంది అంటూ ఈయనని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విజయ్ సమాధానం చెబుతూ ఏమో మీరు గొడవ పడే వాళ్ళనే అడగాలి సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో నాకు తెలియదు అంటూ చాలా సింపుల్ గా సమాధానం చెబుతూనే ఈ ప్రశ్నకు మీరు అనసూయనే అడగండి అంటూ ఈయన సమాధానం చెప్పేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ వైరల్ అవుతుంది.

Anasuya: అల్లు అర్జున్ హీరో ఏంటి… మెగా ఫ్యామిలీని గెలికిన అనసూయ… ఫైర్ అవుతున్న బన్నీ ఫాన్స్!

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఓ వెలుగు వెలిగినటువంటి అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా గట్టిగా పలు సినిమా అవకాశాలను అందుకున్నటువంటి అనసూయ పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తుంటారు. ఇలా వివాదాల ద్వారా తరచూ వార్తల్లో ఉండే అనసూయ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ పై చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనసూయ పలువురు సెలబ్రిటీలపై తన స్టైల్ లో విమర్శలు కురిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ గురించి గతంలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమా గురించి అనసూయ మాట్లాడుతూ పలు విమర్శలు చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్స్ గురించి అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే అనసూయ కూడా బన్నీపై ట్రోల్స్ చేశారు.

అల్లు అర్జున్ హీరో ఏంటి అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో ఒక పాటలు అల్లు అర్జున్ అమ్మాయి పాత్రలో నటిస్తారు. అసలు ఆ పాట తాను చూడలేకపోయాను అంటూ ఈమె విమర్శలు చేశారు.అంతేకాకుండా మెగా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఎంత మెగా ఫ్యామిలీ అయితే మాత్రం అల్లు అర్జున్ స్టార్ హీరోగా మారుతారా అంటూ గతంలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Anasuya: విమర్శించిన హీరో సినిమాలోని నటిస్తున్న అనసూయ..

ఇలా అనసూయ మెగా ఫ్యామిలీ గురించి అల్లు అర్జున్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఆరోజు అల్లు అర్జున్ గురించి కామెంట్ చేసిన అనసూయ నేడు ఆయన సినిమాలోనే పలు పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Anasuya: అందుకోసమే రాత్రి పడుకునేది అంటూ సంచలన పోస్ట్ చేసిన అనసూయ!

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెరపై సినిమా అవకాశాలను అందుకుంటు వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా వరుస సినిమా షూటింగులలో పాల్గొనడమే కాకుండా తన సినిమా షూటింగులకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

ఇకపోతే పుష్ప 2సినిమా షూటింగ్ పనులలో అనసూయ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె ఈ సినిమా షూటింగ్ పనులలో జాయిన్ అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇక ఈ సినిమాలో ఈమె దాక్షాయిని పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

తాజాగా విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అనసూయ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ సందర్భంగా ఈ ఫోటోని షేర్ చేసినటువంటి అనసూయ ఆ రోజు తనకు ఎలా ప్రారంభమైందనే విషయాన్ని తెలియజేశారు.

Anasuya: బ్రేక్ ఫాస్ట్ అంటే ఇష్టం..


ఇక తనకు ప్రతిరోజు ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తినడం చాలా ఇష్టం అని తెలిపారు. ఇలా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినడం కోసమే తాను రాత్రి నిద్రపోతాను అంటూ అనసూయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా బ్రేక్ ఫాస్ట్ తింటూ ఎర్లీ మార్నింగ్ లుక్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

Anasuya: పుష్ప పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైన దాక్షాయని… పుష్ప 2 సెట్ లోకి అడుగుపెట్టిన అనసూయ!

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మెప్పించిన అనసూయ అనంతరం వెండితెరపై వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇలా వెండితెరపై వరుస సినిమాలలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ తిరిగి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో సునీల్ భార్యగా అనసూయ విభిన్నమైన పాత్రలో నటించారు. ఈమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. మొదటి పార్ట్ లో చాలా వైలెంట్ గా కనిపించిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈమె పుష్ప 2 లో పుష్పపై పగ తీర్చుకునే పాత్రలో నటించబోతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. పుష్ప సినిమాలో అనసూయ తమ్ముడిని పుష్పరాజ్ చంపడంతో తనపై పగ పెంచుకున్నటువంటి దాక్షాయని పాత్రలో అనసూయ కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి ఈమె అడుగుపెట్టడంతో తనకు మేకప్ వేస్తున్నటువంటి ఫోటోలను అలాగే షూటింగ్ లోకేషన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఈమె షేర్ చేశారు.

Anasuya: పుష్పపై పగ తీర్చుకొనున్న దాక్షాయని…


ఈ విధంగా అనసూయ ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఈమె పుష్ప 2 లొకేషన్ లోకి అడుగు పెట్టారని అర్థమవుతుంది.అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అయినప్పటికీ అనసూయ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ప్రస్తుతం షూట్ చేయడంతో ఈమె ఈ సెట్ లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ద్వారా అనసూయ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు,పుష్పరాజ్ పై ఏ విధంగా పగ తీర్చుకోపోతున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

Anchor Anasuya: అర్ధరాత్రి మొదలుపెట్టి తెల్లారే వరకు నాన్ స్టాప్ గా ఆ పని చేసిన అనసూయ… అలసిపోయానంటూ పోస్ట్!

Anchor Anasuya: యాంకర్ అనసూయ ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఒకప్పుడు బుల్లితెరకు మాత్రమే పరిమితమైనటువంటి అనసూయ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని అదే క్రేజ్ తో ఏకంగా సినిమా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలలో నటిస్తూ వెండితెరకు మాత్రమే పరిమితమయ్యారు.

వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ రాత్రి పగలు అనే తేడా లేకుండా సినిమా షూటింగ్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తన సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.అయితే ఆమె ఏ ప్రాజెక్టులో చేస్తున్నారు అనే విషయాన్ని తెలియ చేయకపోయినా షూటింగ్లో మాత్రం పాల్గొన్నట్టు తెలిపారు.

సోషల్ మీడియా వేదికగా అనసూయ షూటింగ్లో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ అర్థరాత్రి మొదలైన షూటింగ్ తెల్లవారే వరకు నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉందని…. ఇలా షూటింగ్లో పాల్గొని చాలా అలసిపోయాను అంటూ కొన్ని షూటింగ్ లోకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఈమె షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Anchor Anasuya: గ్లామరస్ ఫోటోలను షేర్ చేసిన అనసూయ…


ఇలా సినిమాలపరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఈమె సముద్రపు ఒడ్డున తన భర్తతో కలిసి బికినీలో దిగిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేశాయని చెప్పాలి. ఇప్పటికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anasuya: మనిద్దరం పర్ఫెక్ట్ కాదని నాకు తెలుసు… భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ చేసిన అనసూయ!

Anasuya: యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఈమె ప్రస్తుతం తన భర్తతో కలిసి బ్యాంకాక్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా బ్యాంకాక్ పర్యటనలో ఉన్నటువంటి అనసూయ తరచు తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఇక అనసూయ జూన్ 4వ తేదీ వారి పెళ్లి రోజు కావడంతో తన భర్తతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన భర్త పై ఉన్నటువంటి ప్రేమను తెలుపుతూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ నువ్వు నాకు మొదటిసారి ఇచ్చిన ప్రేమలేఖ ఇప్పటికీ గుర్తుంది. న్యూఢిల్లీ ఆడిటోరియంలో నాకు ఆ ప్రేమ లేక ఇచ్చావు బహుశా ఇప్పటివరకు నేను రిప్లై ఇవ్వలేదు.

ఈరోజు ఇలా రిప్లై ఇస్తున్నానంటూ ఈమె ఒక సుదీర్ఘమైన పోస్ట్ రాసుకోచ్చారు. ఇన్ని రోజులు నా జీవితంలో ఎంతో సంతోషాన్ని నింపినందుకు ధన్యవాదాలు. నాకోసం చాలా త్యాగాలు చేశావు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. మన ప్రేమ దేవాలయానికి నువ్వు ఓ పిల్లర్‌లాగా నిలిచావు. ఇప్పుడు మనం కలిసి ఎదుగుతున్నాం. ఇన్నేళ్లు నువ్వు నన్ను ఎలా భరించావో నాకు తెలియడం లేదు. నేను కూడా నిన్ను ఎలా భరించానో అర్థం కావడం లేదు.


Anasuya: ఒకరి కోసం ఒకరు లేము…


మనిద్దరం పర్ఫెక్ట్ జంట కాదని నాకు తెలుసు మనిద్దరం చాలా మూర్ఖులం.కొన్నిసార్లు ఒకరి పట్ల మరొకరు చాలా దారుణంగా ఉన్నాము అలాగే కొన్ని సమయాలలో ఒకరి కోసం ఒకరు నిలబడలేకపోయాం. మన పెళ్లిని ఓ డేటింగ్‌ లాగా చేసిన నీకు థ్యాంక్స్‌. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఈ పోస్టులో ఓ వీడియో ఆమె షేర్‌ చేశారు. ఇలా అనసూయ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Anchor Anasuya: పొట్టి దుస్తులు ధరించి భర్తతో బ్యాంకాక్ వీధులలో చిల్ అవుతున్న అనసూయ…. ఫోటోలు వైరల్!

Anchor Anasuya: బుల్లితెర గ్లామర్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు బుల్లితెరపై వరుస కార్యక్రమాలతో పెద్ద ఎత్తున సందడి చేసే ఈమె ప్రస్తుతం బుల్లితెరకు దూరమై వరుసగా వెండితెర సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

తరచూ సోషల్ మీడియా వేదికగా తన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తెలియజేయడమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాగే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళిన అందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా అనసూయ తన భర్తతో కలిసి బ్యాంకాక్ వెళ్లినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే బ్యాంకాక్ వీధులలో అనసూయ తన భర్తతో కలిసి పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తూ బాగా చిల్ అవుతున్నారని తెలుస్తోంది. పొట్టి నిక్కర్ ధరించి అందాలను ఆరబోస్తూ ఈమె బ్యాంకాక్ వీధులలో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. ఇలా బ్యాంకాక్ వీధులలో తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

Anchor Anasuya: అందాలనారబోస్తున్న అనసూయ…


ఇలా అనసూయ తన భర్తతో కలిసి దిగినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లో ఈ ఫోటోలపై తమ స్టైల్ లో కామెంట్లు చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు. అయితే అనసూయ వస్త్రధారణ గురించి విమర్శలు రావడం ఇది మొదటిసారి కాదు ఇక గత కొద్దిరోజుల క్రితం ఈమె ఏకంగా బికినీలో కనిపించడంతో ఆ ఫోటోలపై కూడా తీవ్రస్థాయిలో నేటిజన్స్ మండిపడ్డారు.

Anchor Anasuya: ఆ పని చేసి పశ్చాత్తాప పడుతున్న అనసూయ… ఎందుకు చేశాను రా బాబు అంటూ కామెంట్స్!

Anchor Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ యాంకర్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె అనంతరం సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ బుల్లితెరకు గుడ్ బై చెప్పారు.

ఇక వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఎప్పటికప్పుడు తన అందాన్ని రెట్టింపు చేసుకుంటూ అందాన్ని కాపాడుకుంటూ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధిక శరీర బరువు పెరగకుండా ఎప్పుడు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటూ వ్యాయామాలు చేస్తూ మనకు కనపడుతూ ఉంటారు.

ఇలా ఫుడ్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ డైట్ ఫాలోఅవుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల కారణంగా మనం పెట్టుకున్న నియమాలను అతిక్రమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అనసూయ కూడా తన ఫుడ్ డైట్ బ్రేక్ చేశారని తెలుస్తోంది.గత కొద్ది రోజుల క్రితం తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా అనసూయ వెకేషన్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.

Anchor Anasuya:

ఇలా వెకేషన్ వెళ్లినటువంటి ఈమె అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తన డైట్ బ్రేక్ చేశారని తెలుస్తుంది. దీంతో శరీర బరువు పెరిగినట్టు అనిపించడంతో ఈమె వెంటనే పెరిగిన బరువును తగ్గించడానికి భారీగా జిమ్ లో వర్కౌట్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసిన అనసూయ తినడం ఎందుకురా బాబు అంటూ తాను ఫుడ్డు తిని ఇలా కష్టపడుతున్నందుకు పశ్చాత్తాపడుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Anasuya: భర్తతో కలిసి జిమ్ లో తెగ కష్టపడుతున్న అనసూయ… వైరల్ అవుతున్న ఫోటోలు!

Anasuya: యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు.ఇలా బుల్లితెరకు దూరంగా ఉన్నటువంటి అనసూయ వెండితెరపై మాత్రం వరుస అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతో ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విజయ్ దేవరకొండ అభిమానులతో ఫైట్ చేస్తున్నారు. అందుకు గల కారణం విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ అనసూయ కామెంట్లు చేయడమేనని చెప్పాలి. గతంలో కూడా అనసూయ విజయ్ దేవరకొండ సినిమా పట్ల చేసినటువంటి కామెంట్స్ కారణంగా భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమా పోస్టర్ గురించి అనసూయ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.ఇలా అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ విజయ్ దేవరకొండ అభిమానులకు కోపం తెప్పించాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఇలా విజయ్ దేవరకొండ అభిమానులను గెలికిన అనసూయ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

Anasuya: అటెన్షన్ కోసమే అనసూయ ఈ పాట్లు పడుతున్నారా..

తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి జిమ్ లోభారీగా వర్కౌట్ చేస్తూ తెగ కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలు షేర్ చేయడానికిరెండు రోజుల ముందు విజయ్ దేవరకొండ గురించి కాంట్రవర్సీట్వీట్ చేసిన ఈమె ఇప్పుడు ఈ ఫోటోలను షేర్ చేయడంతో కేవలం అటెన్షన్ కోసమే అనసూయ ఇలా చేస్తున్నారంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.