Tag Archives: anasuya

Anasuya: ఆంటీ వివాదంపై ఆట మొదలుపెట్టిన అనసూయ.. వారిపై పోలీస్ కంప్లైంట్ వైరల్ అవుతున్న పోస్ట్!

Anasuya: యాంకర్ అనసూయ లైగర్ సినిమా విజయం పట్ల అనసూయ చేసిన పోస్ట్ అందరికీ తెలిసిందే.అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన నటించిన లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో అనసూయ పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది.

అనసూయ కూడా ఇండస్ట్రీలో ఒక సెలబ్రిటీగా కొనసాగుతూ మరొక హీరో సినిమా ఫ్లాప్ అయితే ఇలా ఆనంద పడటం ఏంటి అని విజయ్ దేవరకొండ అభిమానులు ఓ రేంజ్ లో ఈమె పై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే అనసూయను ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇలా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆంటీ ట్రెండింగ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తనని ఎజ్ షేమింగ్ చేసిన వారిపై తాను కేస్ ఫైల్ చేస్తానని చెప్పినప్పటికీ పెద్ద ఎత్తున తనని ట్రోల్ చేశారు.

ఈ క్రమంలోనే అనసూయ అన్నంత పని చేసిందని చెప్పాలి.ఇప్పటికే తనని దారుణంగా ట్రోల్ చేసిన వారిపై ఈమె సైబర్ క్రైమ్ ఫైల్ చేసి ఆ కేసుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక విషయాన్ని అనసూయ తెలియచేస్తూ ఏదైతే అది అయ్యింది కేసు పెట్టాను ప్రాసెస్ జరుగుతుందనీ అసలు విషయం వెల్లడించారు.

Anasuya: నాపై అటాక్ చేశారు..

ఇన్ని రోజులు మీ భవిష్యత్తు పాడవకూడదన్న ఉద్దేశంతోనే కేసు పెట్టలేదు అయితే చివరికి కేసు పెట్టాల్సిన పరిస్థితిలను కల్పించారు అంటూ ఈమె తాను కేసు పెట్టిన విషయాన్ని వెల్లడించారు. అలాగే తాను ఏ సినిమానీ, ఏ హీరోని కించపరిచే విధంగా పోస్టులు పెట్టలేదనినా అభిప్రాయాన్ని నేను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తే నాపై డైరెక్ట్ అటాక్ చేశారంటూ ఈ సందర్భంగా అనసూయ క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా అనసూయ కేసు పెడతానంటూ అన్నంత పని చేయడంతో ప్రస్తుతం ఈ విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.

Rashmi -Anasuya: అనసూయ గొడవ.. రష్మీనీ గెలికిన నెటిజన్… దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన యాంకర్ రష్మి !

Rashmi -Anasuya: జబర్దస్త్ యాంకర్లుగా రష్మీ అనసూయ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే వీరిద్దరూ యాంకర్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ వీరిద్దరి వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది.రష్మీ నిత్యం మూగజీవాల గురించి రోడ్లపై వాటిని ఎవరైనా హింసిస్తే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వాటి గురించి స్పందిస్తూ వాటిని హింసించిన వారికి శిక్షపడేలా చేస్తూ మూగజీవాలపై తన ప్రేమను చాటుకుంటారు.

ఇక అనసూయ సైతం తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ తన గురించి ఎవరైనా ట్రోలింగ్ చేస్తే వారికి తనదైన శైలిలో సమాధానం చెబుతూ ఉంటారు.ప్రస్తుతం అనసూయకు విజయ్ దేవరకొండ అభిమానులకు మధ్య పెద్ద ఎత్తున ట్వీట్ వార్ జరుగుతుంది. ఈ క్రమంలోనే కొందరు నెటిజెన్లు ఈ గొడవ మధ్యలోకి రశ్మిని లాగారు.

ఈ సందర్భంగా ఒక నెటిజన్ రష్మికి ట్వీట్ చేస్తూ అందులో.. ఎవరేమన్నా పట్టించుకోవు నీతో అసలు గొడవే ఉండదు… అసలు ఎవరికీ రిప్లై ఇవ్వవు నీకు తెలుగు అర్థం కాదు అంటూ ఒక నెటిజన్ రశ్మిని ఉద్దేశిస్తూ ఆమె నవ్వుతూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ మరి ఈ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై రష్మీ ఎంతో భిన్నంగా స్పందించింది.

Rashmi -Anasuya: రష్మీ చాలా క్లాస్…

ఈ విధంగా నేటిజన్ చేసిన ట్వీట్ కు ఈమె రిప్లై ఇస్తూ… పండగ చేసుకో అంటూ కామెంట్ చేసింది.అందరికీ రష్మీలో నచ్చే విషయం ఇదే తను ఏం చెప్పాలనుకున్న సింపుల్ గా క్లియర్ గా చెప్పేస్తుంది. అనసూయతో పోలిస్తే రష్మీ ఎంతో క్లాస్ అంటూ పెద్ద ఎత్తున నేటిజన్లు రష్మి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో ఆ కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

Anasuya: నన్ను ఆంటీ అంటారా..? మిమ్మల్ని జైలుకి పంపిస్తా… నెటిజన్స్ ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించిన అనసూయ.. వైరలవుతున్న ట్వీట్స్!

Anasuya:విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా విడుదలయ్యి మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా మొదటి షో తోనే ఈ సినిమా డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో వెంటనే అనసూయ పరోక్షంగా హీరో విజయ్ దేవరకొండ పై సంచలనమైన ట్వీట్ చేసింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు..కర్మ ఫలితం రావడం ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం పక్క అంటూ చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయింది.

ఈ విధంగా అనసూయ విజయ్ దేవరకొండను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసింది అంటూ పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు దారుణంగా అనసూయను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కామెంట్లపై అనసూయ స్పందిస్తూ… ఛీ… ఛీ బోలెడంత చెత్త వస్తోంది ఎంత క్లీన్ చేసిన ఈ చెత్త ఇలాగే వస్తోంది అంటూ కామెంట్ చేశారు.

ఇలా ఈమె సోషల్ మీడియాలో వరుస ట్వీట్ చేయడంతో అభిమానుల సైతం రెచ్చిపోయి అనసూయ ను ఏకంగా ఆంటీ అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నన్ను ఆంటీ అని పిలుస్తూ ఏజ్ షేమింగ్ చేస్తారా…మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది తప్పకుండా మీపై చర్యలు తీసుకుంటా అంటూ ఈమె కామెంట్ చేశారు.

Anasuya: ఓ మహిళ చేస్తున్న పోరాటం…

ఈ క్రమంలోనే ఆంటీ అంటేనే కేసు ఫైల్ చేస్తే ట్విట్టర్లో ఉన్నటువంటి దాదాపు సగం మంది జైల్లోనే ఉండాల్సి ఉంటుంది అంటూ కామెంట్ చేయడంతో వెంటనే అనసూయ ఈ ట్వీట్ పై స్పందిస్తూ ఇక్కడ చాలా జైలు, సెక్షన్లో ఉన్నాయి అంటూ ఘాటుగా స్పందించారు. ఇలా ఈమె తన గురించి వచ్చినటువంటి ప్రతి ట్వీట్ కి రిప్లై ఇస్తూ ఘాటుగా స్పందించడమే కాకుండా ఓ మహిళకు జరుగుతున్న అన్యాయంపై చేస్తున్న పోరాటం అని, తన గౌరవం కోసం చేస్తున్న పోరాటమిదని రుజువు చేయడం కోసమే ఇలా రీ ట్వీట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. మీరు నన్ను మాత్రమే కాకుండా ఈ విషయంలోకి నా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారని తప్పకుండా ప్రతి ఒక్కరూ బాధపడతారంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

Anasuya: “అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు..” విజయ్ పై ఇలా పగ తీర్చుకున్న అనసూయ.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది.ఇలా ఈమె సోషల్ మీడియాలో హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి పరోక్షంగా పోస్ట్ చేసిందని భావిస్తున్నారు. లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతోనే అనసూయ ఇలాంటి ట్వీట్ చేశారని పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు భావిస్తూ అనసూయను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

అనసూయ విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి ట్వీట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో భాగంగా విజయ్ దేవరకొండ అమ్మ గురించి మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వివాదం సృష్టించాయి. ఆ సమయంలో అనసూయ సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున మండిపడ్డారు.

ఇక ఆ విషయం గురించి అందరూ మర్చిపోగా తాజాగా మరోసారి అనసూయ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ పెద్ద ఎత్తున వివాదానికి తెర తీశారు.ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమా విడుదల కావడం ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ కొన్నిసార్లు రావడం ఆలస్యం కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్క అంటూ ఈ సందర్భంగా ఈమె ట్వీట్ చేశారు.

Anasuya: అనసూయ డబుల్ మీనింగ్ డైలాగులతో డబ్బు సంపాదించలేదా…

ఈ విధంగా అనసూయ ట్వీట్ చేయడంతో ఈమె విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ కావడంతోనే అప్పట్లో అన్న మాటలకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని, పరోక్షంగా తనని ఉద్దేశించే ట్వీట్ చేశారని పలువురు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ సైతం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటమే కాకుండా అలాంటి డైలాగులు వేసినప్పుడు వెకిలి నవ్వులు నవ్వారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా జబర్దస్త్ కార్యక్రమంలో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాతూ డబ్బు సంపాదించిన అనసూయ ఇప్పుడు నీతులు చెబుతుంది అంటూ విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈమెపై కామెంట్లు చేస్తున్నారు.

Anasuya: ఇండస్ట్రీలో వాళ్లు గిల్లితే గిల్లించుకోవాలి.. దేవదాసీలా మాత్రమే పని చేయాలి.. అనసూయ షాకింగ్ కామెంట్స్!

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు రావడంతో తనకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.

ఈ కార్యక్రమం నుంచి ఈమె దూరమైన అనంతరం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కెమెరా ముందు నిలబడి కాపాడండి అని అరవడం లేదా సిగ్గుపడుతూ నవ్వాలి. హీరోయిన్లకు ఇంతకుమించి మరేం పని లేదంటూ ఈమె కామెంట్ చేశారు.

ఇక ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఏమాత్రం ప్రాధాన్యత లేదంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పోకిరి సినిమాలో గిల్లితే గిల్లిచ్చుకోవాలి అనే డైలాగ్ ఉంది కదా ఇండస్ట్రీలో కూడా హీరోయిన్స్ పరిస్థితి అలాగే ఉంటుందని ఈమె తెలిపారు.ఇక హీరోయిన్స్ హక్కుల గురించి మాట్లాడితే వారిపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని వారికి ఎలాంటి అవకాశాలు ఉండవని ఈమె తెలిపారు.

Anasuya: హక్కుల గురించి మాట్లాడకూడదు….

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కేవలం ఒక దేవదాసీలా మాత్రమే పనిచేయాలని కోరుకుంటారు. ఇలా అనుకోవడం పూర్తిగా తప్పు అంటూ ఈ సందర్భంగా అనసూయ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి వారికి ఏ విధమైనటువంటి విలువ లేదంటూ ఈ సందర్భంగా ఆమె ఈ విషయం గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మొత్తానికి అనసూయ ఇండస్ట్రీలో హీరోయిన్ల గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anchor Anasuya: అనసూయ జబర్దస్త్ మానేయడం వెనుక ఆ డైరెక్టర్ హస్తముందా.. అతను చెప్పడం వల్లే మానేసిందా?

Anchor Anasuya: బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో అనసూయ ఒకరు. జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం అనసూయ ఈ స్థాయిలో ఉందంటే అందుకు పరోక్షంగా జబర్దస్త్ కార్యక్రమం కారణమని చెప్పాలి.

ఇన్ని రోజులు అనసూయ జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకుంటుందని వార్తలు వచ్చాయి. అయితే గతవారం ఆమె అధికారకంగా ప్రకటిస్తూ తను ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇకపోతే అనసూయ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..ఈమెకు వరుస సినిమాలు వెబ్ సిరీస్ ల అవకాశం రావడంతోనే ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.

అదేవిధంగా మరొక చానల్లో తనకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయటం వల్లే జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని వీడిపోవడానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అనసూయను జబర్దస్త్ కార్యక్రమం వదిలి రమ్మని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద డైరెక్టర్ అనసూయ గురూజీ సలహా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.

Anchor Anasuya: కెరియర్ దెబ్బతింటుంది…

ప్రస్తుతం తాను వెండితెరపై సెలబ్రిటీగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ సమయంలో తను ఇంకా బుల్లి తెరపై కొనసాగుతూ ఉంటే తన కెరీర్ కి మైనస్ అవుతుందని సలహా ఇవ్వటం వల్లే అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని మానేసిందని వార్తలు వస్తున్నాయి.మరి అనసూయకు సంబంధించిన ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jabardasth: అనసూయ స్థానంలోకి వచ్చిన కొత్త యాంకర్.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన టీమ్?

Jabardasth: బుల్లి తెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇక గత 10 సంవత్సరాల నుంచి ఎంతో ఆదరణ సంపాదించుకున్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన వారిలో ఒక్కొకరు బయటకు వెళ్తున్నారు.

ఇప్పటికే నాగబాబు రోజా వెళ్లిపోగా హైపర్ ఆది సుడిగాలి సుదీర్ కూడా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక తాజాగా జబర్దస్త్ కార్యక్రమంలో నుంచి బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ కూడా ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పిన విషయం మనకు తెలిసిందే. గత వారం జరిగిన ఎపిసోడ్ అనసూయకు జబర్దస్త్ కార్యక్రమంలో చివరి ఎపిసోడ్ కావడంతో జబర్దస్త్ టీమ్ తనకు వీడ్కోలు పలికారు.

ఇకపోతే ఈ కార్యక్రమం నుంచి అనసూయ వెళ్లిపోవడంతో అనసూయ స్థానంలోకి ఎవరు వస్తారని పెద్ద ఎత్తున ఆత్రుత ఏర్పడింది. అయితే గతంలో అనసూయ తన రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో అనసూయ స్థానాన్ని రష్మి భర్తీ చేశారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి తిరిగి రష్మి రాబోతుందని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మరొక యాంకర్ మంజుష ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

Jabardasth: పల్లకిలో వచ్చిన కొత్త యాంకర్…

ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ టీమ్ కొత్త యాంకర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఏకంగా ఆమెను పల్లకిలో మోసుకొని తీసుకువచ్చారు. అయితే ఆమె ఎవరు ఏంటి అనే విషయం తెలియకుండా సస్పెన్స్ లో పెట్టారు.మరి అనసూయ స్థానంలో జబర్దస్త్ కార్యక్రమానికి రాబోయే ఆ కొత్త యాంకర్ ఎవరు ఏమిటి అనేది తెలియాలంటే మరొక రెండు రోజులు వేచి ఉండాలి.

Anasuya: దర్శకుడు జయశంకర్ సినిమాలో అనసూయ క్రేజీ రోల్!

Anasuya: ప్రస్తుతం జయ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో జబర్దస్త్ బ్యూటీ అనసూయతో పాటు సాయి కుమార్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతుంది. ఆర్ వి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మాతలు ఆర్ వి రెడ్డి, శేషు మారం రెడ్డి నిర్మిస్తున్నారు.

Anasuya: దర్శకుడు జయశంకర్ సినిమాలో అనసూయ క్రేజీ రోల్!

ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా.. నిర్మాత శేషు కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో ఉందని వచ్చే నెలలో ఈ షూటింగ్ పూర్తవుతుందని అన్నారు. ముఖ్యంగా చమ్మక్ చంద్ర, శ్రీనివాస్ రెడ్డి కి సంబంధించిన సన్నివేశాలు మాత్రమే దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడని.. థియేటర్ లో ఇవి హైలెట్ గా మారతాయని తెలిపాడు.

శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర సీన్స్ అద్భుతం: నిర్మాత శేషు

డైరెక్టర్ వర్కింగ్ గురించి కూడా గొప్పగా తెలిపాడు. ఈ నేపథ్యంలో ఆయనతో మరో సినిమా ప్లాన్ కూడా చేస్తున్నామని అన్నాడు. ఇక డైరెక్టర్ మాట్లాడుతూ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నామని అన్నాడు. ఈ సినిమాకు అనూప్ సంగీతం ప్లస్ పాయింట్ అవుతుందని అన్నాడు. ఇక త్వరలోనే టైటిల్ తో పాటు సినిమా విడుదల డేట్ ను విడుదల చేస్తామని డైరెక్టర్ జయశంకర్ తెలిపాడు.

Anchor Suma: వామ్మో… ఏంటి సుమ అనసూయను అంత మాటనేసావు.. అనసూయ పరువు మొత్తం తీసేసిన సుమ!

Anchor Suma: బుల్లితెర యాంకర్ గా సుమకు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇలా ఈమెకున్న టాలెంట్ తో నిత్యం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక సుమ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రతివారం క్యాష్ ప్రోగ్రాం ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.

Anchor Suma: వామ్మో… ఏంటి సుమ అనసూయను అంత మాటనేసావు.. అనసూయ పరువు మొత్తం తీసేసిన సుమ!

ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి లూసర్ టీమ్ సభ్యులు ప్రియదర్శి, కల్పిక, అన్నీ, శశాంక్ గెస్ట్‌ లుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమ నటుడు ప్రియదర్శిని తన బొమ్మ వేయమని చెబుతుంది. దీంతో ప్రియదర్శి తనలో ఉన్న కళాఖండాన్ని బయటపెట్టి బొమ్మ వేస్తాడు. కళ్ళు మూసుకొని వచ్చిన సుమ ఒక్కసారిగా ప్రియదర్శి వేసిన బొమ్మను చూసి షాక్ అవుతుంది.

Anchor Suma: వామ్మో… ఏంటి సుమ అనసూయను అంత మాటనేసావు.. అనసూయ పరువు మొత్తం తీసేసిన సుమ!

ఆ బొమ్మని చూసిన వెంటనే ఏంటి నా బొమ్మ వేయమంటే పుష్ప సినిమాలో దాక్షాయని బొమ్మ వేశావు అంటూ సుమ నోరు జారి అనసూయ పరువు మొత్తం తీసేసింది. ఈ విధంగా సుమ అనసూయ చేసిన పాత్ర దాక్షాయణి గురించి మాట్లాడటంతో నెటిజన్లు సుమ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జబర్దస్త్ లోనూ అనసూయకు అవమానం..

ఇప్పటికే అనసూయ నటించిన దాక్షాయని పాత్ర గురించి సుడిగాలి సుధీర్ హైపర్ ఆది ,జబర్దస్త్ కార్యక్రమంలో దాక్షాయని పాత్రలో శాంతి స్వరూప్ ని చూపిస్తూ తనని అవమాన పరిచారు. ఇప్పుడు సుమ కూడా తనలాగే మరొక తోటి యాంకర్ పట్ల ఇలా మాట్లాడటంతో నెటిజన్లు సుమ పై సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ విషయంపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

Anasuya: ఆ కామెంట్స్ పై అనసూయ ఘాటు సమాధానం..! నీ పెంపకంపై అనుమానం వస్తోంది అంటూ..!

Anasuya: బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా ఉంటూనే వెండితెరపై మంచి మంచి క్యారెక్టర్లు సొంత చేసుకుంటుంది అనసూయ. ఇటు అందంతో అటు అభినయంతో ఆకట్టుకుంటోంది ఈ జబర్థస్త్ భామ. మరోవైపు అవకాశం వచ్చినప్పుడు స్పెషల్ సాంగ్స్ తోనూ అదరగొడుతోంది.

Anasuya: ఆ కామెంట్స్ పై అనసూయ ఘాటు సమాధానం..! నీ పెంపకంపై అనుమానం వస్తోంది అంటూ..!

ముఖ్యంగా రంగస్థలం సినిమాలో ఆమె చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ ఎంతో పేరు తీసుకువచ్చింది. తాజాగా సుకుమార్ పుష్ప సినిమాలో ద్రాక్షాయణిగా నెగిటివ్ రోల్ లో కనిపించింది అనసూయ. పుష్ప 1లో ద్రాక్షాయణి క్యారెక్టర్ నిడివి తక్కువగా ఉన్నా.. పుష్ప 2లో మాత్రం ద్రాక్షాయణి క్యారెక్టర్ కీలకంగా మారుతుందని అనుకుంటున్నారు.

Anasuya: ఆ కామెంట్స్ పై అనసూయ ఘాటు సమాధానం..! నీ పెంపకంపై అనుమానం వస్తోంది అంటూ..!

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడుతుంటారు. గతంలో కూడా ఇలానే నెటిజెన్లు ఆమె డ్రెస్ గురించి, బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్ చేశారు. దీంతో అనసూయ కూడా గట్టిగానే రిప్లే ఇచ్చింది. తన గురించి ఎంతలా ట్రోలింగ్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతానని ఘాటుగా సమాధానం ఇచ్చింది. 


సదరు నెటిజన్ పై అసహనం వ్యక్తం చేసిన అనసూయ..

అయితే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతున్న సమయంలో ఓ నెటిజెన్ అనసూయని రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశాడు. మిమ్మల్ని ఆంటీ అని పిలవాలా లేక అక్క అని పిలవాలా అని అడిగాడు. అతడి ఉద్దేశం అర్థం చేసుకున్న అనసూయ ఘాటుగా బదులిచ్చింది. అసలు మీరెవరో తెలియదు.. మన మధ్య సన్నిహిత సంబంధం లేదంటూనే.. పైగా నువ్వు చెప్పింది ఏజ్ షేమింగ్ కిందికి వస్తుంది. మీ పెంపకంపైనే నాకు అనుమానంగా ఉంది అంటూ అనసూయ సదరు నెటిజన్ పై అసహనం వ్యక్తం చేసింది. అయితే కొందరు నెటిజెన్లు మాత్రం అక్క అని పిలవడం ఏజ్ షేమింగ్ కిందకు ఎందుకు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవద్దని ఘాటుగానే స్పందించారు. దీంతో అనసూయ కాంప్లిమెంట్స్ తీసుకోవాలా వద్దా అనేది నాకు సంబంధించిందని అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.