Tag Archives: anchor anasuya

Sreemukhi: ఆ విషయంలో అనసూయకు పోటీ ఇస్తున్న యాంకర్ శ్రీముఖి.. తగ్గేదేలే అంటూ?

Sreemukhi: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు యాంకర్ శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఉన్న టాప్ యాంకర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు ప్రస్తుతం తెలుగులో ఎన్నో షో లకు, ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. ఇక ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తోంది. ఏ షోలో చూసిన, ఏ ఈవెంట్ లో చూసిన కూడా శ్రీముఖి పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా శ్రీముఖి చేసే అల్లరి ఆమె ఎనర్జీకి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పవచ్చు.

ఒకవైపు యాంకర్ గా అల్లరిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. కాగా మూడు పదుల వయసు దాటినా కూడా ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాను బాగా వాడుకోవడంలో అనసూయ ముందు వరుసలో ఉంటుంది. చిన్నితెరపై జబర్దస్త్ వేదికగా భారీ పాపులారిటీ కూడగట్టుకున్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్ తో ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తూ ఉంటుంది.

అయితే మరో యంగ్ యాంకర్ శ్రీముఖి కూడా అనసూయ బాటలోనే తగ్గేదే లే అంటోంది. ఇంకా చెప్పాలంటే అందాల ఆరబోత విషయంలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేయడంలో యాంకర్ శ్రీముఖి అనసూయకు గట్టి పోటీని ఇస్తోంది. కొన్ని కొన్ని సార్లు అనసూయ అందాన్ని బీట్ చేస్తూ తన గ్లామర్ తో యువతను ఆకట్టుకుంటోంది శ్రీముఖి. దీంతో తమను తాము ప్రమోషన్ చేసుకోవడంలో అనసూయకు శ్రీముఖి గట్టి పోటీ ఇస్తోందని నెటిజన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒకవైపు బుల్లితెరపై పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ అలరిస్తూనే అప్పుడప్పుడు సినిమాలలో నటిస్తోంది.

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీముఖి..

తాజాగా సోషల్ మీడియాలో శ్రీముఖి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె చాలా అందంగా కనిపించడంతోపాటు తన చూపులతోనే యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. మత్తెక్కింతే చూపులతో యువతను రెచ్చగొడుతోంది. డిఫరెంట్ లుక్ లో ఓల్డ్ కాస్ట్యూమ్స్ ను ధరించిన ఈమె అందంగా కనిపించడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రోజురోజుకీ శ్రీముఖి అందం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటోస్ చూసేయండి.

Anchor Anasuya: మరొకసారి ట్రోలర్స్ కి వార్నింగ్ ఇచ్చిన యాంకర్ అనసూయ… రచ్చ మళ్లీ మొదలైంది గా..?

Anchor Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనసూయ యాంకర్ గా ఎంత గుర్తింపు పొందిందో సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసి పోస్టుల వల్ల కూడా అంతే పాపులర్ అయింది. సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే పోస్టులకు నేటిజన్స్ నుండి అనేక విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయితే అనసూయ మాత్రం వాటిని లెక్కచేయకుండా తనదైన శైలిలో తనని విమర్శించే వారి మీద విరుచుకుపడుతూ ఉంటుంది.

ఇలా ఆమె డ్రెస్సింగ్, ఫోటో షూట్స్ పై ట్రోల్‌ చేస్తూ రచ్చ చేయటమే కాకుండా ఆంటీ అంటూ ట్రోల్ చేస్తుంటారు. గతంలో ఈ విషయమై అనసూయ కొందరిపై కేసులు కూడా పెట్టింది. అయితే వారికి శిక్ష పడిన విషయాన్ని అనసూయ ఇటీవలే పేర్కొంది. అంతే కాకుండా ఇకపై తాను అలాంటి వాటిపై స్పందించనని, అయితే తనని ట్రోల్ చేస్తే తాను ఏదైనా చేయగలననే సందేశం ట్రోలర్స్ కి రీచ్ అయితే చాలు అని తెలిపింది.

తాజాగా హైదరాబాద్ పోలీసులు ట్రోలర్స్ మీద ఆంక్షలు విధించారు. మహిళలను కించపరిచేలా, అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించారు. ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌లలో ట్రోలింగ్‌ చేసినా, ఫోటోలు మార్ఫింగ్‌ చేసినా కఠినమైన శిక్షలు పడతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అనసూయ తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా పోస్ట్ చేసింది.

శిక్షలు పడతాయి…

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. యాంకర్ గా ఫేమస్ అయిన అనసూయ బుల్లితెరకు దూరమై ప్రస్తుతం వెండితెర మీద తన సత్తా చాటుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలతో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది.

Anchor Anasuya: దారుణమైన దెబ్బ తిన్నాను…. నాలా ఎవరు బాధపడలేదేమో…. అనసూయ పోస్ట్ వైరల్!

Anchor Anasuya: చిత్ర పరిశ్రమలో యాంకర్ గా నటిగా, ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి గ్లామరస్ యాంకర్ అనసూయ గురించి అందరికీ సుపరిచితమే.కెరియర్ మొదట్లో న్యూస్ రీడర్ గా తన కెరియర్ ప్రారంభించిన అనసూయ అనంతరం యాంకర్ గా మారిపోయారు. ఇలా పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేసినటువంటి ఈమెకు జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ఇదే పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకొనే అనసూయ కొన్నిసార్లు తను చేసే పోస్టుల వల్ల నేటిజన్ల నుంచి తీవ్రమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ఇలా పలుమార్లు నేటిజన్లో ట్రోలింగ్ గురైన ఈమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా వారికి దీటుగా తన స్టైల్ లో సమాధానం చెప్పారు.

Anchor Anasuya: బాధాకరమైన పోస్ట్ షేర్ చేసిన అనసూయ…

ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక బాధాకరమైన పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పోస్ట్ చేస్తూ నేను బాగా దెబ్బ తిన్నాను. నేను బాధపడినంతగా బహుశా ఎవరుబాధపడలేదేమో అంటూ ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేయడంతో అనసూయను ఇంతలా బాధ పెట్టినది ఎవరు అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Anchor Anasuya: యాంకర్ అనసూయ భర్త గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Anchor Anasuya: బుల్లితెర జబర్దస్త్ యాంకర్ గా, వెండితెర రంగమ్మత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి అందరికీ సుపరిచితమే. న్యూస్ రిప్రజెంటేటర్ గా పని చేస్తున్నటువంటి ఈమె అనంతరం సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు. అయితే ఏవి గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి.జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనసూయకు ఈ కార్యక్రమం ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి అనసూయ ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుని వెండితెర అవకాశాలను అందుకున్నారు.ఇలా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన తర్వాత ఈమె వెండితెరపై కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా వరుస సినిమాలతోను వెబ్ సిరీస్ లతోను ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇలా మృతి పరమైన జీవితంలో ఎంతో సక్సెస్ అయినటువంటి అనసూయ వ్యక్తిగత విషయానికి వస్తే… సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరి వివాహం జరిగి 12 సంవత్సరాలు పూర్తి కావడంతో తమ 12వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇక అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే.

Anchor Anasuya: ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా పనిచేస్తున్న సుశాంక్ భరద్వాజ్…

అనసూయ ఎన్ సీసీలో ఉన్న సమయంలో సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక అనసూయ భర్త సుశాంక్ ఫైనాన్షియర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా పనిచేస్తున్నారు. ఈయన తన వృత్తి విషయంలో బిజీగా ఉండగా,అనసూయ సైతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతూ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

Anchor Anasuya: అనసూయ తాజా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. భారీగా సంపాదిస్తోందిగా!

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సుమ తరువాత అంత క్రేజ్ సంపాదించుకున్న వారిలో అనసూయ ఒకరు. జబర్దస్త్ యాంకర్ గా పరిచయమైనటువంటి అనసూయ తన మాట తీరుతో, తన అందంతో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు.

ఇకపోతే ఈమెకు వరుస సినిమాలు వెబ్ సిరీస్లలో నటించే అవకాశం రావడంతో జబర్దస్త్ కార్యక్రమానికి పూర్తిగా దూరమయ్యారు. అయితే ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లో సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి అనసూయ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Anchor Anasuya: సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న అనసూయ…


ఈ విధంగా అనసూయ ఒక్క కాల్ షీట్ కోసం రెండు లక్షల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఒకవైపు వెబ్ సిరీస్ లో సినిమాలతో పాటు మరోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా అనసూయ భారీగానే సంపాదిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. అయినప్పటికీ తన గురించి ట్రోల్ చేసే వారికి తన స్టైల్ లో సమాధానం చెబుతుంటారు.

Anchor Anasuya: యాంకర్ అనసూయ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంత మొత్తంలో ఆస్తులు సంపాదించిందో తెలుసా?

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ యాంకర్ గా ఈమె తన వాక్చాతుర్యంతో అభిమానులను సందడి చేయడమే కాకుండా తన అందాల ఆరబోతతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా బుల్లితెర మహారాణిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు.

ఈ విధంగా అనసూయ ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని నటిస్తున్నప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు రాలేదు అయితే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకేక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి సందడి చేశారు.ఈ సినిమాలో ఈమె పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఇక వరుస సినిమా అవకాశాలను అందుకొని బిజీబిజీగా మారిపోయారు.

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈమె బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. అయితే అనసూయ సినిమాలలో నటిస్తున్నందుకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు సినిమా షూటింగులతో పాటు కమర్షియల్ యాడ్స్ అలాగే పలు ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ఈ విధంగా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూనే పెద్ద మొత్తంలో ఆస్తులను కూడా కూడబెట్టినట్టు తెలుస్తుంది.

Anchor Anasuya:కోట్లు విలువ చేసే ఇంటిని కొన్న అనసూయ…


ప్రస్తుతం ఈమెకు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ లో సుమారు 10 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు కూడా ఉందని అలాగే తన గ్యారేజ్ లో కాస్ట్లీ కారులు కూడా ఉన్నాయని సమాచారం. ఇలా అనసూయ ఆస్తులు మొత్తం సుమారు 30 కోట్ల వరకు ఉంటాయని తెలుస్తుంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలో కొనసాగుతూ అనసూయ భారీగానే ఆస్తులను పోగు చేసిందని తెలుస్తుంది.

Anchor Anasuya: అనసూయతో క్లోజ్ గా ఫోటో దిగిన వ్యక్తి ఎవరబ్బా… అనసూయకు తను ఏమవుతారో తెలుసా?

Anchor Anasuya: అనసూయ భరద్వాజ్ ఈ పేరు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న అనసూయ పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు. వరుస సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా ఉన్న అనసూయ గత కొన్ని రోజుల నుంచి అమెరికాలో ఉంటున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అమెరికా వీధులలో చక్కర్లు కొడుతూ ఫోటోలు దిగడం ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం చేస్తున్నారు.ఈ క్రమంలోనే అనసూయ దీపావళి పండుగను కూడా తన కుటుంబానికి దూరంగా ఉండి అమెరికాలో తన స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.ఇకపోతే అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.

ఈ క్రమంలోనే అనసూయతో కలిసి ఫోటో దిగిన ఆ వ్యక్తి ఎవరు అనసూయతో అంత క్లోజ్ గా ఉండడంతో అతనికి అనసూయ ఏమవుతుంది అనే విషయం గురించి పెద్ద ఎత్తున నేటిజన్లు ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ ఆ వ్యక్తితో ఫోటో దిగడమే కాకుండా అతనిని ఉద్దేశిస్తూ నా సంరక్షకుడు.. స్నేహితుడు నేను జెర్రీ అయితే అతను టామ్.హ్యాపీ బర్త్డే అంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన పేరు ఉజ్వల్ అని చెప్పుకొచ్చారు.

Anchor Anasuya: హీరోగా నటించిన ఉజ్వల్..

ఇక ఈయన కూడా సినీ పరిశ్రమకు చెందిన వారే. ఉజ్వల్ అడవి శేషు దర్శకత్వంలో తెరకెక్కిన కిస్ అనే సినిమాలో హీరోగా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఇలా ఒక సినిమాలో హీరోగా నటించిన ఉజ్వల్ మరే ఇతర సినిమాలలోను నటించలేదు. అయితే ప్రస్తుతం ఆయన అమెరికాలో నివసిస్తున్నారు. ఇలా తన స్నేహితుడు అని అనసూయ చెప్పడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే విషయం గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ గా మారింది.

Anchor Anasuya: షర్ట్ చిరిగింది.. ఎయిర్ పోర్టులో యాంకర్ అనసూయకు అవమానం.. మండిపడుతున్న యాంకరమ్మ?

Anchor Anasuya:తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన ఈమె వెండితెరపై అవకాశాలను అందుకోవడంతో వరుస సినిమాలతో ఎంతో బిజీగా అయ్యారు. ఇలా వరుస సినిమాలతో బిజీ కావడం వల్ల ఈమె బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.

ఈ విధంగా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసే కొన్ని పోస్టులకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది.అయినప్పటికీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ తన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఎయిర్ పోర్ట్ లో తనకు జరిగినటువంటి చేదు సంఘటన గురించి తెలియజేస్తూ ఎయిర్ లైన్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లినటువంటి అనసూయ తిరిగి హైదరాబాద్ రావడం కోసం ఆలియన్స్ ఎయిర్ లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫ్లైట్ 6:55 కి టేక్ ఆఫ్ కావాల్సి ఉండగా అరగంట పాటు ఆలస్యంగా వచ్చిందని తెలిపారు.

ఇలా ఫ్లైట్ ఆలస్యం కావడంతో అందరం కూడా వెయిట్ చేశామని అయితే ఫ్లైట్ టైం అవ్వడంతో లోపలికి వెళ్తుండగా మాస్క్ లేదని సెక్యూరిటీ తనని అక్కడే నిలబెట్టారని, తిరిగి మాస్క్ ధరించే వరకు తనని అలో చేయలేదంటూ తెలియజేశారు.అదేవిధంగా తన కుటుంబానికి మొత్తం ఒకే చోట ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయగా ఒక్కొక్కరిని ఒక్కోచోట కూర్చోబెట్టారంటూ ఈమె మండిపడ్డారు.

Anchor Anasuya: కనీసం సీట్లు కూడా సరిగా లేవు..

ఇక ఫ్లైట్లో కనీసం సీట్లు కూడా సరిగ్గా లేవని, అలా సీట్లు సరిగా లేని కారణంగా తన షర్టు కూడా చినిగిపోయింది అంటూ ఈ సందర్భంగా ఆలియన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ గురించి,తనకు జరిగిన చేదు సంఘటన గురించి ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Anchor Anasuya: రెండో పెళ్లి చేసుకోమన్న నేటిజన్.. ఆలోచనలో పడ్డ అనసూయ.. వైరల్ అవుతున్న పోస్ట్!

Anchor Anasuya: బుల్లితెరపై ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం అదే పాపులారిటీతో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.ఇలా సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నటువంటి అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు.

ప్రస్తుతం అనసూయ వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే అనసూయ ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కలిసి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సెషన్ లో భాగంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఇలా అభిమానులు అడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన అనసూయకు ఓ నెటిజన్ నుంచి విచిత్రమైన ప్రశ్న ఎదురయింది. ఈ క్రమంలోనే అనసూయను ప్రశ్నిస్తూ ఎన్నిసార్లు నన్ను పెళ్లి చేసుకోమని అడగాలి. ఈ విషయంపై ఏమాత్రం స్పందించడం లేదు అంటూ ప్రశ్నించారు. ఈ విధంగా అనసూయకు నేటిజన్ నుంచి పెళ్లి ప్రపోజల్ రావడంతో ఒక్కసారిగా అనసూయ షాక్ కి గురైంది.

Anchor Anasuya: అలా సమాధానం చెప్పిన అనసూయ…

ఈ క్రమంలోనే నేటిజన్ కి రిప్లై ఇస్తూ..మౌనంగా ఉన్నటువంటి ఎమోజీని షేర్ చేయడమే కాకుండా తను ఆలోచనలో ఉన్నటువంటి ఒక ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ పోస్ట్ పై స్పందిస్తూ రెండో పెళ్లి గురించి అనసూయ ఆలోచనలో పడ్డారా…ఈ పోస్ట్ కు అదే అర్థమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అనసూయ తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Anchor Anasuya: నువ్వేమైనా స్టార్ హీరోయిన్ అనుకుంటున్నావా.. అనసూయ పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్?

Anchor Anasuya: యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా ఈమెకు వరుస సినిమా అవకాశాలు రావడంతో ఏకంగా బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.

ఇకపోతే అనసూయ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో ఈమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఈమె మెగాస్టార్ చిరంజీవినీ జైలుకు పంపించే ఒక రిపోర్టర్ పాత్రలో నటించారు. ఈ పాత్రకు ఎంతో మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మీరు గాడ్ ఫాదర్ సినిమాలో మంచి పాత్రలో నటించిన సినిమా ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉన్నారు అని ప్రశ్నించారు.

ఇలా సినిమా ప్రమోషన్లకు ఎందుకు దూరంగా ఉన్నారు అని ప్రశ్నించగా అనసూయ చాలా సిల్లీ రీసన్ చెప్పారు. వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయానని ఈమె సమాధానం చెప్పారు.ఈ క్రమంలోనే ఈమె చెప్పిన రీజన్ విన్నటువంటి మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అనసూయని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన మెగా ఫ్యాన్స్ నువ్వేమైనా పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండడానికి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Anchor Anasuya: మరోసారి ట్రోలింగ్ కి గురైన అనసూయ..

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటున్నటువంటి అనసూయ ఇలాంటి మంచి పాత్రలు నటించినప్పుడు అలాగే స్టార్ హీరోల సినిమాలలో నటించినప్పుడు ప్రమోషన్లలో పాల్గొంటే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా గాడ్ ఫాదర్ విషయంలో మరోసారి ఈమెకు నెటిజెన్ల నుంచి చేదు అనుభవం తప్పలేదు.