Tag Archives: Anchor Rashmi Gautam

Rashmi: హీరోయిన్ కి తీసిపోని అందం.. అయినా ఇండస్ట్రీలో సక్సెస్ కానీ యాంకర్ రష్మీ.. కారణమేంటో తెలుసా?

Rashmi : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆకట్టుకునే అందం ఎంతో నటన నైపుణ్యం ఉన్నటువంటి ఈమె బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ సాధించిన రష్మీ సినిమా ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఇండస్ట్రీలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన రష్మీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయారు. ఇలా బుల్లితెరపై సక్సెస్ అయిన విధంగా వెండితెరపై ఈమె సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి అని పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. ఇక బుల్లితెరపై కూడా సుధీర్ కొనసాగుతున్న సమయంలో రష్మి హవా కొనసాగింది.

ఎప్పుడైతే సుధీర్ బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారో ఆ క్షణం నుంచి రష్మికి కూడా క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా చేస్తూనే వెండితెరపై కూడా రష్మీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈమె ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోవడానికి కారణం రష్మీనే అని తెలుస్తోంది.

Rashmi బోల్డ్ సన్నివేశాలలో చేయడమే తప్పా…


రష్మీ డబ్బు కోసం కెరియర్ మొదట్లోనే బోల్డ్ సన్నివేశాలను ఎంపిక చేసుకున్నారు. ఇదే తాను చేసిన పెద్ద తప్పు అని తెలుస్తుంది.ఇలా కెరియర్ మొదట్లోనే బోల్డ్ సన్నివేశాలలో నటించడం వల్ల ఈమెను ప్రేక్షకులు అదే తరహా పాత్రలలో చూడటానికి ఇష్టపడుతున్నారు తప్ప హీరోయిన్ గా చూడటానికి ఇష్టపడలేదని అందుకే ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారని చెప్పాలి.

Anchor Rashmi : టాప్ పొజిషన్ కు రావాలంటే పడుకోవాల్సిందేనా.. వైరల్ అవుతున్న యాంకర్ రష్మి పోస్ట్..

బుల్లితెర మీద పేరు గడించిన టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా ఆపై బుల్లితెరపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ.. వచ్చిన సినిమా ఆఫర్లనూ కూడా వదులుకోకుండా వెండితెరపై కూడా ఈమధ్య బిజీ బిజీగానే ఉంటోంది నటి రష్మీ.

సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ ఈ అమ్మడికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. సుధీర్, రష్మి ల మధ్య ఎదో ఉందని.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఈ రష్మి, సుధీర్ లిద్దరూ వార్తలను కొట్టిపారేశారు. తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమె అంటూ క్లారిటీ ఇచ్చారు.అయినా కూడా ఇప్పటికీ వీరిద్దరి జంటకి బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్న మాట వాస్తవం.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి తాజాగా తన ఇంస్టగ్రామ్ లో ఒక మీమ్ షేర్ చేసింది. అందులో ‘టాప్‌ పొజిషన్ కు వచ్చేందుకు ఆమె కచ్చితంగా అందరితో పడుకుందని అంటుంటారు’ అనే మీమ్‌ ఒకటి షేర్‌ చేసింది.. దానితో పాటూ ‘అవును, చాలామంది ఇలా ఎంతో సులువుగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు.’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ స్టొరీ వైరల్ అవుతుంది.

సుదీర్ – రష్మీ పెళ్లి చేసుకుంటే చూడాలనేదే ప్రతి ఒక్కరి కోరిక : నటి రోజా

వెండి తెరపై కొందరి హీరో హీరోయిన్ల కాంబినేషన్ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. వారి కాంబినేషన్ రిపీట్ అయితే బాగుంటుందని ఎంతోమంది ఎదురుచూస్తుంటారు.అదేవిధంగా బుల్లితెరపై కూడా కొన్ని జంటలు ఎవర్ గ్రీన్ అన్నట్టుగానే ఉంటాయి.ఈ విధంగా వెండితెరపై బుల్లితెరపై ఎంతో మంది అభిమానులను సందడి చేసే ఆ జంటలు నిజజీవితంలో కూడా ఒక్కటైతే చూడాలని ఎంతోమంది వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు.

ఈ విధంగా బుల్లితెరపై ఎవర్ గ్రీన్ జంటగా పేరు సంపాదించుకున్న వారిలో రష్మి -సుదీర్ ఒకరు. ఈ కార్యక్రమంలోనైనా రష్మి సుదీర్ ఉన్నారంటే ఆ కార్యక్రమం ఎంతో విజయవంతం అవుతుంది. అంతగా ఈ జంటకు పాపులారిటీ ఉందని చెప్పవచ్చు. ఈ జంటకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి నిర్వాహకులు వీరితో పలు ఈవెంట్స్, స్పెషల్ షో లు చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఈ జంట గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను దృష్టిలో ఉంచుకొని షో నిర్వాహకులు వీరికి పలు కార్యక్రమాలలో ఉత్తిత్త పెళ్లిళ్లు చేసి షో రేటింగ్స్ పెంచుకుంటారు. ఈ క్రమంలోనే వినాయక చవితి పండుగ సందర్భంగా ఈటీవీలో నిర్వహిస్తున్న టువంటి “ఊరిలోవినాయకుడు” కార్యక్రమంలో కూడా ఈ విధమైనటువంటి ప్రయత్నం చేశారు నిర్వాహకులు.

ఈ క్రమంలోనే తొమ్మిది సంవత్సరాల నుంచి పరిచయం ఏర్పడి వారి ప్రేమకు ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఊరిలో వినాయకుడు అనే ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ఈ కార్యక్రమంలో భాగంగా సుధీర్, రష్మి వారు తొమ్మిది సంవత్సరాల ప్రేమకు గుర్తుగా చేసినటువంటి లవ్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు.

గత తొమ్మిది సంవత్సరాల నుంచి వీరి మధ్య జరిగినటువంటి కొన్ని తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ పాటల రూపంలో రష్మి తన ప్రేమను వ్యక్తపరిచారు. ఇక ఈ పాటలను చూసిన రోజా తొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేసినందుకు రష్మీ ఎంతో అందంగా ప్రపోజ్ చేసింది. మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రతి ఒక్కరి కోరిక అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేయగా ఒక్కసారిగా రష్మి సుదీర్ కౌగిలించుకొని ఎంతో బావోద్వేగానికి గురయ్యారు. అంతలో ఇంద్రజ మాట్లాడుతూ మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఓకే ఎస్ అనే ఫైనల్ వరల్డ్ కావాలి మాకు అంటూ ఈ కార్యక్రమం పై ఆసక్తని పెంచారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు చేస్తున్నారంటూ స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న వర్ష.. ఓదార్చిన రష్మీ!

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు లేదా బుల్లితెర నటీనటులు మీద సోషల్ మీడియాలో పెద్దఎత్తున కామెంట్లు ట్రోలింగ్ రావడం అనేది సర్వసాధారణం.ఈ విధమైనటువంటి కామెంట్లు కొన్నిసార్లు సదరు నటీనటులకు ఎంతో ఇబ్బందికరంగా మారుతాయి. అయితే ఈ కామెంట్లపై స్పందించి కొందరు తీవ్రస్థాయిలో నెటిజన్ల పై మండిపడతారు. మరికొందరు వారి బాధను బయటకు చెప్పుకోలేక ఎంతో మనో వేదన అనుభవిస్తుంటారు. తాజాగా ఇలాంటి చేదు అనుభవం జబర్దస్త్ కమెడియన్ అయినటువంటి వర్షకి ఎదురయింది.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న. అను ఇమ్మానియేల్ తో జతకట్టి ఈమె చేసేటటువంటి స్కిట్లు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తన పై సోషల్ మీడియాలో కూడా దారుణంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఈ విషయమే జబర్దస్త్ వేదికపై తెలియజేస్తూ వర్ష కన్నీటిపర్యంతమయ్యారు.

గత వారం ఎపిసోడ్ లో భాగంగా భాస్కర్ స్కిట్ లో కామెడీ పండించిన వర్ష ఉద్దేశించి జడ్జి రోజా “ఏంటి వర్ష ఈమధ్య నీ మీద కామెంట్స్,ట్రోల్స్ ఎక్కువయ్యాయట, బాగా ఇబ్బంది పడుతున్నట్టుంది” అని అనడంతో వేదికపైనే వర్ష కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఈమె చెబుతూ స్టేజ్ పై మనం చేసేవన్నీ ప్రేక్షకుల ఆనందం కోసమే, ఇక్కడ మన నటనను చూసి అందరూ అభిమానిస్తుంటారు. సెట్ కి వచ్చినప్పుడు మనకి ఎంతో గౌరవం ఉంటుంది.కానీ సోషల్ మీడియాలో మాత్రం దారుణమైన కామెంట్స్ చేస్తారంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.

వర్ష నువ్వు ఎవరితోనైనా వెళ్ళావా? వర్ష కి ఎవడైనా ఉన్నాడా? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తుంటారని, తన తమ్ముడు ఈ కామెంట్లు చూసి మొహం పై ఫోన్ పెట్టి ఏంటక్కా ఇది? అని అడిగినప్పుడు దాన్ని ఫేస్ చేయలేకపోయానని స్టేజ్ పైన కన్నీరుమున్నీరయ్యారు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ స్పందిస్తూ.. ఈ క్రమంలోని తనకు జరిగిన అనుభవాన్ని పంచుకుంది. సుధీర్ ఎంతమందితో అయినా యాక్టింగ్ చేయవచ్చునేను వేరే వాళ్ళతో చేస్తే మాత్రం సుధీర్ తో చేయొచ్చు కదా అంటూ కామెంట్ చేశారని సుధీర్ వేరే వాళ్ళతో చేస్తే తప్పులేదు నేను చేస్తే తప్పంటారు అంటూ తనకు జరిగిన చేదు అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుని వర్షకు ధైర్యం చెప్పి ఓదార్చారు.

మంత్రి కేటీఆర్ సహాయం కోరిన యాంకర్ రష్మి.. ఎందుకో తెలుసా?

బుల్లితెరపై యాంకర్ గా తన హవా కొనసాగిస్తున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న యాంకర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను సహాయం కోరుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యాంకర్ రష్మి జంతు ప్రేమికురాలన్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మూగజీవాలకు ఏదైనా ఆపద వస్తే స్పందించడానికి ముందుగా ఉంటారు. కరోనా కారణం వల్ల లాక్ డౌన్ సమయంలో ఎన్నో జంతువులకు ఆహారం అందిస్తూ వాటిపై ప్రేమను వ్యక్త పరిచిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉన్నటువంటి శునకాలకు యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి వాటికి ఏ విధమైనటువంటి చికిత్స అందించకుండా రోడ్లపై వదులుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా జంతువుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు సరైన పరిష్కార మార్గాన్ని ఆలోచించాలని.. అందుకు సహాయం చేయాలని రష్మి మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేస్తూ..కేటీఆర్‌ కార్యాలయ ఖాతాతో పాటు కేటీఆర్‌ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేశారు.

గత కొంత కాలం నుంచి సోషల్ మీడియా వేదికగా
“సేవ్‌యానిమల్స్‌ఇండియా” అనే ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ నెటిజన్ ఈ విషయం చెబుతున్నారు. ఈ విధంగా యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసిన తర్వాత కుక్కలను రోడ్లపై వదలడంతో ఫోటోలతో సహా ఆ వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు జిహెచ్ఎంసి పరిధిలో సుమారు 2,122 కుక్కలకు ఆపరేషన్ చేసే రోడ్లపై మొదలుపెట్టినట్లు సదరు నెటిజన్ పేర్కొనడంతో ఈ విషయంపై యాంకర్ రష్మీ స్పందిస్తూ మంత్రి కేటీఆర్ కిట్వీట్ చేస్తూ అతని సహాయం కోరింది. మరి మంత్రి గారు రష్మీ విజ్ఞప్తిపై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.