Tag Archives: anupama parameswaran

Karthikeya 2: మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన కార్తికేయ… ఎంత వసూలు రాబట్టిందంటే?

Karthikeya 2: చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదలయ్యే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సినిమాలను సైతం పక్కకు నెట్టి ఈ సినిమా పెద్ద ఎత్తున కలెక్షన్లను రాబడుతుందని చెప్పాలి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం 5 థియేటర్లలో ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ల సంఖ్య 3 వేలకు పైగా పెరగడంతో ఈ సినిమాకి ఎలాంటి స్పందన లభించిందో అర్థమవుతుంది. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా,అక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలను వెనక్కినట్టే కార్తికేయ దూసుకుపోతుంది.

ఈ క్రమంలోనే గత వారం రోజులుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సుమారు 60.12 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కృష్ణాష్టమిని అద్భుతంగా క్యాష్ చేసుకొని భారీ వసూలను రాబట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సాధారణ హీరోగా కొనసాగుతున్నటువంటి నిఖిల్ నటించిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి సత్తా చాటడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Karthikeya 2: నిఖిల్ కెరియర్ లోనే భారీ హిట్ సినిమా…

ఇది నిఖిల్ కెరియర్ లోనే అత్యధిక వసూలను సాధించిన సినిమాగా నిలిచిపోతుంది.ఇక ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ విధమైనటువంటి కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం సైతం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నిఖిల్ సినిమా తరచూ వాయిదా పడుతూ వచ్చినప్పటికీ చివరికి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుందనే చెప్పాలి.

Balakrishna: హిందీలో భారీ వసూళ్లను రాబడుతున్న కార్తికేయ 2… హార్ట్ అయిన బాలయ్య ఫ్యాన్స్.. కారణం అదేనా?

Balakrishna: హీరో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ నటించిన కార్తికేయ 2 సినిమా హిందీలో కూడా విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇప్పటికే ఈ సినిమా హిందీలో దాదాపు మూడు కోట్లకు చేరువలో కలెక్షన్లను రాబడుతుందని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా కృష్ణుడు ద్వారక నేపథ్యంలో తెరకెక్కడంతో బాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుందని తెలుస్తోంది.మొత్తానికి ఊహించని విధంగా ఈ సినిమా ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోను మంచి విజయాలను అందుకుందని చెప్పాలి.

ఇదిలా ఉండగా ఈ సినిమా హిందీలో కూడా మంచి ఆదరణ సంపాదించుకోవడంతో బాలకృష్ణ అభిమానులు కాస్త హర్ట్ అయినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా తెలుగులో ఎలాంటి విజయమందుకుందో మనకు తెలిసిందే. కార్తికేయ2 సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేసినప్పుడు బాలకృష్ణ సినిమా ఎందుకు విడుదల చేయలేదని బాధపడుతున్నారు.

ఇకపోతే ఈ సినిమా హిందీలో డబ్ చేసి విడుదల చేయకపోవడానికి ఓ కారణము ఉందని తెలుస్తోంది. బాలకృష్ణ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైంది అప్పటికి ఇంకా థియేటర్లు పూర్తిస్థాయిలో రన్ కాలేదు. కోవిడ్ నేపథ్యంలో నార్త్ ఇండస్ట్రీలో థియేటర్లో పూర్తిగా మూసివేసి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయలేకపోయారని తెలుస్తోంది.

Balakrishna: పూర్తిస్థాయి థియేటర్లు రన్ కాలేదు..

ఒకవేళ హిందీలో డబ్ చేసినప్పటికీ భారీ బిజినెస్ చేసి వసూళ్లను రాబట్టలేకపోతుందన్న ఉద్దేశంతోనే ఈ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయలేదు. అందుకే ఈ సినిమాని హిందీలో విడుదల చేయలేకపోయారు. ఒకవేళ ఈ సినిమాని కనుక హిందీలో విడుదల చేసి ఉంటే అక్కడ కూడా వసూళ్ల సునామీ సృష్టించేదని చెప్పాలి. ఇక అఖండ తర్వాత బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Anupama Parameswaran: కార్తికేయ 2 సినిమా విషయంలో బాధగా ఉందన్న అనుపమ… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేనటువంటి హీరోయిన్. కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ తాజాగా నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 సినిమాలో నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదల అయ్యి కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది.

ఇలా ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా మంచి వసూళ్లను రాబడుతుంది.ఇకపోతే ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి ప్రస్తుతం లాభాలను అందుకుంటుంది. ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ క్రమంలోనే అల్లు అరవింద్ దిల్ రాజు వంటి నిర్మాతలు హాజరై చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు.ఇలా ఈ సినిమా విజయం సాధించినందుకు అందరూ సంతోషంగా ఉండగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాత్రం అనుపమ తనకు చాలా బాధగా ఉందంటూ బాంబు పేల్చారు.

Anupama Parameswaran: ఈ సినిమాతో రుణం తీరిపోయిందా…

ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ కార్తికేయ 2 సినిమా విషయంలో తనకు చాలా బాధగా ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతో అద్భుతమైన ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగిపోవడంతో ఈ సినిమాతో నాకు రుణం తీరిపోయిందా అనే బాధ తనలో ఎక్కువగా ఉందంటూ చెప్పుకొచ్చారు.ఇలా ఈమె ఈ సినిమా విషయంలో బాధగా ఉందని చెప్పడంతో యధావిధిగా నేటిజన్ లు తనపై భారీగా ట్రోల్ చేస్తున్నారు.

Actor Nikhil: కార్తికేయ 2విడుదల విషయంలో దిల్ రాజు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నిఖిల్?

Actor Nikhil: చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ2. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల తరచూ వాయిదా పడుతూ తిరిగి ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలైనప్పటినుంచి మంచి టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్లను రాబడుతుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడుతున్నప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా థియేటర్లు దొరక్కుండా చేశారంటూ నిఖిల్ బాధపడిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని నిఖిల్ సినిమా విడుదల విషయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు హస్తం కూడా ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ…ఈ సినిమా విడుదల వాయిదా విషయంలో దిల్ రాజు ప్రమేయం ఏమాత్రం లేదని చెప్పాలంటే ఆయన మద్దతు వల్లే ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిందని అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి అంటూ నిఖిల్ దిల్ రాజు గురించి వస్తున్న వార్తలపై ఖండించారు. ఇకపోతే ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న కొత్త నిర్ణయాలు ప్రకారం ఒకే రోజే ఇద్దరి హీరోల సినిమాలు విడుదలయితే కలెక్షన్ల పరంగా పెద్ద ఎత్తున నష్టాలు వస్తాయని చెప్పడం వల్లే తాను మరోసారి తన సినిమాని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని నిఖిల్ తెలిపారు.

Actor Nikhil: మంచి సినిమా తరచూ వాయిదా పడటం బాధ కలిగించింది…

ఇకపోతే ఒక మంచి సినిమా ఇలా తరచూ వాయిదా పడటంతోనే తాను బాధపడ్డానని, తాను ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న నా సినిమా విడుదలకు ఫలానా వాళ్లు కారణమంటూ ఎక్కడ ప్రస్తావించలేదని ఈయన వెల్లడించారు. మొత్తానికి అనుపమ నటించిన ఈ సినిమా కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి కలెక్షన్లను రాబట్టిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం నిఖిల్ దిల్ రాజు గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Karthikeya 2: కార్తికేయ 2 విజయాన్ని ఆ టాలీవుడ్ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారా… కర్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో?

Karthikeya 2: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ నేపథ్యం లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చితక సినిమాలు చేసుకుంటూ పోతున్న హీరోలను స్టార్ సెలబ్రిటీలు అణిచి వేస్తుంటారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి. అయితే హీరో నిఖిల్ విషయంలో ఇదే జరిగిందని ఆయన పరోక్షంగా వెల్లడించారు.

నిఖిల్ పెద్ద హీరో కాకపోయినప్పటికీ చివరికి ఆయన నటించిన సినిమాలను విడుదల చేయడానికి కూడా థియేటర్లో దొరక్కుండా చేసి ఆయనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని,వాళ్ల సినిమాలను విడుదల చేయడం కోసం తన సినిమాని పలుసార్లు వాయిదా వేశారని తనకు జరుగుతున్న అన్యాయం గురించి చెబుతూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా తన సినిమాని థియేటర్లోనే విడుదల చేయాలని పంతం పట్టిన హీరోకి థియేటర్లు దొరకపోవడంతో ఎంతో బాధను అనుభవించారు.

అయితే నిఖిల్ సినిమాని వాయిదా వేసి తమ సినిమాలను విడుదల చేసినప్పటికీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఇకపోతే తరచు వాయిదా పడుతూ ఆగస్టు 13వ తేదీ విడుదలైన నిఖిల్ కార్తికేయ 2 సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో పరుగులు పెడుతుంది. ఇలా నిఖిల్ అందుకున్న ఈ విజయం కొందరు సెలబ్రిటీలు ఓర్వలేకపోతున్నారనేది వాస్తవం.ఈ సినిమాని విడుదల చేయకుండా ఎలా అయితే అడ్డుకొని తమ సినిమాలను విడుదల చేసుకున్నారు.

Karthikeya 2: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కార్తికేయ 2..

ఆ సినిమాలకు మించి హిట్ అందుకోవడంతో ఎంతోమంది కర్మ సిద్ధాంతం అంటే ఇదే కదా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఫలితం అంటూ పలువురు నెటిజన్లు నిఖిల్ సినిమా గురించి, ఆయనని ఇబ్బందులు పెట్టిన వారి గురించి కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నిఖిల్ ఎన్నో అవంతరాలు నడుమ తన సినిమాను థియేటర్లో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఇదే స్థాయిలో విజయాన్ని అందుకోవడం విశేషం.

Anupama Parameswaran: రాజమౌళి కాళ్లపై పడిన అనుపమ పరమేశ్వరన్.. వైరల్ అవుతున్న వీడియో !

Anupama Parameswaran: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళికి సినిమా అంటే ఎలాంటి ఫ్యాషన్ ఉందో మనకు తెలిసిందే. ముఖ్యంగా థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాలంటే ఆయనకు ఎంతో ఇష్టమని ఇదివరకు ఎన్నోసార్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఇక ఈ చిత్ర బృందం ఐమాక్స్ థియేటర్లో ఈ సినిమాని ప్రేక్షకుల మధ్య కూర్చుని వీక్షించారు.ఇదే సినిమాకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలాగే కీరవాణి కుటుంబ సభ్యులకు కూడా అదే థియేటర్లో సినిమా చూశారు.

సినిమా మొత్తం పూర్తయిన తర్వాత రాజమౌళి కీరవాణి కుటుంబ సభ్యులు కారు పార్కింగ్ దగ్గర చేరుకోగానే అక్కడ వీరిని చూసిన అనుపమ పరమేశ్వర ఒక్కసారిగా వారి వద్దకు వెళ్లి డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ ను ఆశీర్వదించిన రాజమౌళి సినిమా చాలా బాగుందని తన నటన మరింత అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.

Anupama Parameswaran: సినిమాపై ప్రశంసలు కురిపించిన జక్కన్న..

ఈ క్రమంలోనే పక్కనే ఉన్న కీరవాణి కుటుంబ సభ్యులను కూడా అనుపమ పరమేశ్వరన్ పరామర్శించారు. ఇక ఈ విషయాన్ని ఈమె తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇలా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనుపమ వ్యవహారంపై నేటిజన్ లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Anupama Parameswaran: ఆ హీరోతో కలిసి నైట్ సినిమాకి వెళ్లాను.. అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్?

Anupama Parameswaran: మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయం అవసరం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని తాజాగా నిఖిల్ సరసన ఈమె కార్తికేయ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సాధారణంగా ప్రతి ఒక్క నటి నటులు వారి సినిమా విడుదలైతే తప్పనిసరిగా విడుదలైన రోజు చూస్తారు. మరికొందరైతే వారి నటించిన సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎలా వస్తుందోనని దొంగ చాటుగా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి రావడం చేస్తుంటారు.

ఈ విధంగానే అనుపమ పరమేశ్వరన్ శర్వానంద్ ఇద్దరు కలిసి నటించిన శతమానం భవతి సినిమా విడుదలైన రోజు వీరిద్దరూ కలిసి ఆ రోజు రాత్రి సినిమాకు వెళ్లారని,అయితే వీరిద్దరూ కలిసి నటించిన శతమానం భవతి సినిమాకు మాత్రం కాదంటూ ఈమె షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. మరి వీరిద్దరూ వీరి నటించిన సినిమా కాకుండా మరో ఏ సినిమాకు వెళ్లారని విషయానికి వస్తే…

Anupama Parameswaran: మెగాస్టార్ కి పెద్ద అభిమానిని…

శతమానం భవతి సినిమా విడుదలైన సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా విడుదలైంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా చూడటానికి వెళ్లారని ఈమె వెల్లడించారు.ఇక తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టమని తాను థియేటర్లో చూసిన మొదటి సినిమా కూడా అదేనని ఈ సందర్భంగా అనుపమ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anupama Parameswaran: ఆ నిర్మాత డైరెక్షన్ లో అనుపమ నటించిందా… అన్ని ఆయన చెప్పినట్టే చేస్తుందా?

Anupama Parameswaran: సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం ఈ గ్లామర్ ప్రపంచంలో కొనసాగాలంటే హీరో హీరోయిన్లు మేము ఇలాంటి పాత్రలలోని నటిస్తాము అని కంకణం కట్టుకొని కూర్చుంటే వారికి ఇండస్ట్రీలో లైఫ్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పాలి. విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడే ప్రేక్షకులు వారిని ఆదరిస్తారని అలాంటి వారికి ఇండస్ట్రీలో మనుగడ ఎక్కువగా ఉంటుందని భావిస్తారు.

ఈ క్రమంలోనే నటి అనుపమ పరమేశ్వరన్ సైతం ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా హోమ్లీ పాత్రలలో నటించేది. అప్పట్లో ఈమెకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉండేవారు అంటే అతిశయోక్తి కాదు. ఇలా గ్లామర్ షో చేయకుండా హోమ్లీ పాత్రలకే పరిమితమైన అనుపమకు అనంతరం ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో ఈమె గ్లామర్ షో కి తెరతీసింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు తన అన్నయ్య కుమారుడు ఆశిష్ ను హీరోగా రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా పరిచయం చేశారు.అయితే తన కొడుకుని ఇండస్ట్రీలోకి లాంచ్ చేస్తున్న సమయంలో హీరోయిన్ కూడా కొత్త వాళ్ళు అయితే సినిమాకు ప్లస్ అవ్వదని భావించిన దిల్ రాజు ఈ సినిమాలో నటిగా అనుపమను సంప్రదించారు.

ఇకపోతే ఈ సినిమాలో తాను లిప్ లాక్ సన్నివేశాలలో నటించాల్సి ఉంటుందని ఇలా నటిస్తేనే తన ఆశిష్ కెరియర్ కు ప్లస్ అవుతుందని చెప్పారట.అంతేకాకుండా తనకు తన నిర్మాణంలో మరొక సినిమా అవకాశం కూడా ఉంటుందని దిల్ రాజు తనకు చెప్పినట్లు ఇండస్ట్రీ టాక్.అవకాశాలు లేని సమయంలో తనకు ఇలాంటి అవకాశం రావడంతో అనుపమ సైతం ఆ అవకాశాన్ని ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకుందని తెలుస్తుంది.

Anupama Parameswaran: భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న అనుపమ…

ఈ విధంగా అనుపమ పరమేశ్వరన్ రౌడీ బాయ్స్ చిత్రంలో ఏకంగా హీరోకి లిప్ లాక్ సన్నివేశాలు ఇవ్వడంతో ఈమె ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.ఇలా ఇలాంటి సన్నివేశాలలో నటించడంతో ఈమెకు సినిమా అవకాశాలు రావడమే కాకుండా ఈ సన్నివేశంలో నటించినందుకు భారీగా రెమ్యూనరేషన్ కూడా తీసు కుందని తెలుస్తుంది. మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ దిల్ రాజు చెప్పినట్టుగానే చేస్తుందని మొత్తం ఆయన డైరెక్షన్ లోనే ఈమె నటిస్తున్నారని తెలుస్తోంది.

Nikhil: అనుపమకు ఆ పని చేయడం అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్?

Nikhil: హీరో నిఖిల్ సిద్ధార్థ్ అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా నటించిన సినిమా కార్తికేయ 2. ఆగస్టు 12వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కార్తికేయ 2 సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదల చేయటంతో నిఖిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ.. బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలో కూడా సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ హీరోయిన్ అనుపమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.షూటింగ్ అంటే ఉదయం ఐదు గంటలకే షూటింగ్ లో ఉండే అనుపమ ప్రమోషన్స్ అంటే మాత్రం నిరాకరిస్తుంది. సినిమా షూటింగ్ విషయంలో చాలా ప్రొఫెషనల్ గా ఫ్రెండ్లీగా ఉండే అనుపమ ప్రమోషన్స్ అనగానే ఆమె నుండి రెస్పాన్స్ ఉండదు అని నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అనుపమ కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్ కి పూర్తిగా దూరంగా ఉండలేదు. అప్పుడప్పుడు ప్రమోషన్స్ లో పాల్గొనింది. ఇదిలా ఉండగా 2014 లో విడుదలైన కార్తికేయ సినిమా కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించిన కార్తికేయ 2 సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. మొదట జూలై 5వ తేదీ ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు.

Nikhil: థియేటర్లు దొరక్క ఇబ్బందులు పడ్డాము…

అదే రోజు కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమా విడుదల కానుంది. అందువల్ల ఈ సినిమాను ఆగష్టు 12 న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికీ విడుదల కావాల్సి ఉండగా ఎన్నో కారణాలవల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ఈ సినిమాను విడుదల చేయడానికి థియేటర్లు దొరకడం లేదని కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Nikhil: థియేటర్లు ఇవ్వం.. సినిమా విడుదల కాదన్నారు.. దిక్కుతోచక ఏడ్చేసాను : నిఖిల్

Nikhil: టాలివుడ్ యంగ్ హీరో నిఖిల్ హ్యాపీ డేస్ సినిమా ద్వార ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఈ సినిమా ద్వారా నిఖిల్ మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత యువత, వీడు తేడా, కార్తికేయ, స్వామి రారా వంటి సినిమాల ద్వారా హీరోగా బాగా పాపులర్ అయ్యాడు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ సినిమా 2014 లో విడుదలై మంచి హిట్ అందుకుంది.

ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమా ద్వారా నిఖిల్ ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఈ సినిమా విడుదల చేయటం కోసం ఈ సినిమా నిర్మాతలు దర్శకుడు చాలా అవస్థలు పడవలసి వచ్చింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

ఈ క్రమంలో నిఖిల్ బుల్లితెర మీద ప్రసారమవుతున్న పలు టీవీ షోస్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా సినిమా ప్రమోషన్స్ కోసం సీరియల్స్ లో కూడా సందడి చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలో సినిమా విడుదల చేయడం కోసం వారు పడ్డ అవస్థలు గురించి కూడా వివరించాడు.

Nikhil: బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే సినిమాలకు వ్యాల్యూ లేదు…

ఈ ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ..కార్తికేయ 2 విడుదల చేయటానికి ఎన్నో అవస్థలు పడ్డాము. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే సినిమాలను పట్టించుకోరు. మా సినిమా పరిస్థితి కూడా అలాగే ఉండేది. సినిమా రిలీజ్ డేట్ ఆగస్టు 12 అని ప్రకటించే సమయంలో కూడా ఆ డేట్ వద్దని చెప్పి అక్టోబర్ , నవంబర్ కు పోస్ట్ ఫోన్ చేసుకోండి . ఇప్పుడే మీ సినిమా రిలీజ్ అవ్వదు. మీకు థియేటర్లు ఇవ్వము అని అన్నారు. దీంతో సినిమా ఆగిపోతుందని ఒక సమయంలో ఎడ్చేశాను అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. సినిమా విడుదల విషయంలో చాలా అవస్థలు ఎదుర్కొని ఎట్టకేలకు ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకి వస్తున్నాము అంటూ నిఖిల్ వెల్లడించాడు.