Tag Archives: central government

Sr.NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారికి అరుదైన గౌరవాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!

Sr.NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. నందమూరి తారక రామారావు సినీ రాజకీయ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన శత దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా వంద రూపాయల వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మతో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పూర్తిగా వెండితో తయారు చేసిన వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ప్రతిమ రూపొందించనున్న నాణెం నమూనాను మింట్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి చూపిస్తూ ఈ నాణెం పై సలహాలు సూచనలు కోరారు. 2022 మే 28వ తేదీ నుంచి ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఇలా ఏడాది పాటు ఈ జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇలాంటి నాణేలపై
చారిత్రక ఘటనలు, , ప్రముఖల గుర్తుగా నాణెలను విడుదల చేస్తుంటారు. ఇక ఎన్టీఆర్ సినిమా రంగంలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఎంతో మంచి ఆదరణ గుర్తింపు సంపాదించుకున్నారు.

Sr.NTR: సంతోషంలో నందమూరి అభిమానులు….


ఈ క్రమంలోనే ఈయన ప్రతిమతో వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే 1964 నుండి ఇలా నాణెల విడుదల చేయడం ప్రారంభించారు.తొలుత నెహ్రు స్మారకార్ధం నాణెం విడుదల చేశారు.

Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?

Agneepath Scheme: అగ్నిపథ్ గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఈ స్కీమ్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా యువతను సైన్యంలోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.భారత సైన్యాన్ని మరింత శక్తివంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది.

Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?

ఈ పథకంలో భాగంగా 17.5 నుంచి 21 సంవత్సరాలు వయస్సున్న యువకుల ను ఈ పథకం ద్వారా సైన్యంలోకి ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చే అనంతరం మూడున్నర సంవత్సరాల పాటు సర్వీస్ లో ఉంచుతారు. వీరిలో ప్రతిభ ఆధారంగా 25% మందిని శాశ్వత కమిషన్ లో పనిచేయడానికి అవకాశం కల్పిస్తారని వెల్లడించారు. తొలి సంవత్సరం రూ.4.76 లక్షల ప్యాకేజీ అందిస్తారు. వీరిని అగ్నివీరులుగా అభివర్ణిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రతిపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తూ పలు చోట్ల ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ పథకం గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయానని,దేశం రాష్ట్రం అభివృద్ధి కోసం కాకుండా వచ్చే ఎన్నికలలో అధికారం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఏదైనా ఒక పథకం గురించి అధికారపక్షం నిర్ణయం తీసుకుని ఆ పథకం గురించి ప్రతిపక్షం మరుక్షణమే తీవ్రస్థాయిలో ఆందోళనలు చేయడం సర్వసాధారణం అయింది.

ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రాజకీయాలు జాతీయ స్థాయిలో రాజకీయాలు కూడా ఇదే ధోరణిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత దేశ సైనిక దళాలను పెంచడం కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. అయితే మనకు ఎంత సైన్యం ఉన్నారు అనేది ముఖ్యం కాదు ఆ సైన్యం ఎంత సమర్థవంతంగా ఉన్నారనేది ముఖ్యం అని జయప్రకాశ్ నారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలా అధిక మొత్తంలో సైన్యాన్ని తీసుకొని వారికి అధిక స్థాయిలో జీతభత్యాలు చెల్లిస్తూ సరైన శిక్షణ లేకపోతే కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్నికల కోసమే ఉద్యోగ ప్రకటనలు…

అమెరికా వంటి దేశాలలో సైన్యం తక్కువగా ఉన్నప్పటికీ వారి దగ్గర అధునాతనమైన సాంకేతిక శక్తిని కలిగి ఉంది. అత్యాధునికమైన ఆయుధాలు ఉండటం వల్ల దేశ భద్రత మరింత పటిష్టంగా ఉంది. మనదేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలను విడుదల చేస్తూ వారికి నెలవారి జీతాలు ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఏ స్థాయిలో ఉద్యోగుల అవసరం అనే విషయం గుర్తించలేదు. కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఎన్నికల కోసం ఆలోచన చేస్తూ ఇలాంటి ధోరణిని ఎంపిక చేసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఒక పై అధికారికి డ్రైవర్ బంట్రోతు అందరూ ఉన్నారు అధికారికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు కానీ దేశ ప్రజలకు సేవ చేసేవాళ్ళు లేరని తెలిపారు.

మన దేశంలో సరైన విద్య, సరైన ఆరోగ్యం లేదు. కొన్ని ప్రాంతాలలో శాంతి భద్రత కూడా లేదు.వీటిపై దృష్టి పెట్టకుండా కేవలం వచ్చే ఎన్నికలపై దృష్టి పెడుతూ ప్రధాన మంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనకు ఎంతమేర సైన్యం అవసరం అనే విషయాన్ని ఆలోచించకుండా ఒకేసారి లక్షలు ఉద్యోగ ప్రకటన ఇస్తే వారికి తదుపరి ఎన్నికలలో ప్రయోజనకరంగా ఉంటుందనేది వారి ఉద్దేశమని ఈయన ఈ అగ్నిపథ్ స్కీమ్ గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు.

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! డీఏ పెంపు..!

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత డియర్ నెస్ అలవెన్స్(DA) 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడున్న ఉద్యోగులు, పెన్షనర్లకు 34 శాతం డీఏ పొందుతారు. జనవరి 2022 నుంచి మొత్తం డియర్నెస్ అలవెన్స్ 34 శాతం సెట్ చేశారు. 

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! డీఏ పెంపు..!

7వ వేతన సంఘం సిఫార్సులు ప్రకారం బేసిక్ జీతంపూ మాత్రమే డియర్ నెస్ అలవెన్స్ చెల్లిస్తారు. దీన్ని మార్చిలో ప్రకటించ వచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కారణంగా ప్రభుత్వం వీటిని ప్రకటించలేదు. ప్రభుత్వ నిర్ణయంతో 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతోంది. తదుపరి డియర్నెస్ అలవెన్స్ జూలై 2022లో లెక్కిస్తారు. డిసెంబర్ 2021కి సంబంధించిన AICPI-IW డేటా విడుదల చేశారు. 

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! డీఏ పెంపు..!

ప్రస్తుతం ఈ గణాంకాల ప్రకారం డిసెంబర్ లో ఈ సంఖ్య 0.3 పాయింట్లు తగ్గి 125.4 పాయింట్లకు చేరకుంది. నవంబర్లో 125.7 పాయింట్లు ఉంది. డిసెంబర్ లో 0.24 తగ్గింది. కానీ ఇది డియర్ నెస్ అలెవెన్స్ పై ప్రభావం చూపించలేదు. 

కార్మిక శాఖ లెక్కల ప్రకారం.. ఇలా

కార్మిక మంత్రిత్వ శాఖ కు చెందిన ఏఐసీపీఐ ఐడబ్ల్యూ గణాంకాల తర్కవాత ఈ సారి డీఏ అలెవెన్స్ 3 శాతం పెంచాలని నిర్ణయించారు. 34 శాతం డీఏపై లెక్కింపు డియర్ నెస్ అలెవెన్స్ 3 శాతం పెంచిన తర్వాత మొత్తం డీఏ 34 శాతం అవుతుంది. ఇప్పుడు రూ. 18,000 బేసిక్ జీతంపూ వార్షిక పెరుగుదల రూ. 6480 అవుతుంది. పెరుగనున్న జీతం ప్రకారం 1. ఉద్యో గి ప్రాథమిక వేతనం రూ. 18,000, 2. కొత్త డియర్నెస్ అలవెన్స్ (34%) రూ. 6120/నెలకు, 3. డియర్నెస్ అలవెన్స్ ఇప్పటివరకు (31%) రూ. 5580/నెల, 4. ఎంత డియర్నెస్ అలవెన్స్ పెరిగింది 6120- 5580 = రూ. 540/నెలకు, 5. వార్షికర్షి జీతంలో పెరుగుదల 540X12 = రూ. 6,4 గా ఉండనుంది

Omicron New Symptom:వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ కొత్త లక్షణం… ఏమిటంటే?

Omicron New Symptom: భారత దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ప్రతిరోజు దేశంలో లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. అతి తక్కువ లక్షణాలతో వేగంగా వ్యాపిస్తున్న ఈ మహమ్మారి రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న వారిని కూడా వదలడం లేదు.

Omicron New Symptom:వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ కొత్త లక్షణం… ఏమిటంటే?

ఈ క్రమంలోనే బూస్టర్ డోసు కూడా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇటీవల స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని నిపుణుల బృందం ఒమిక్రాన్‌కి సంబంధించిన కొత్త లక్షణం గురించి తెలియజేశారు.ఈ మహమ్మారి లక్షణాలు తేలికపాటివి అయినప్పటికీ ఇది కళ్ళనుంచి గొంతు గుండె మెదడు వంటి భాగాలను కూడా ప్రభావితం చేస్తుందని తెలిపారు.

Omicron New Symptom:వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ కొత్త లక్షణం… ఏమిటంటే?

ఈ వేరియంట్స్ శరీర భాగాలపై ఏవిధమైనటువంటి ప్రభావం చూపిస్తుందోనని నిపుణులు పరిశోధనలు చేయడంతో ఈ పరిశోధనలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ వ్యాధి బారిన పడిన వారి చెవి నమూనాలను పరిశీలించారు.

చెవికి సంబంధించిన సమస్యలు అధికం..

అయితే ఈ మహమ్మారి బారిన పడిన వారు ఎక్కువగా చెవినొప్పి చెవిలో జలదరింపు రావడం వంటి సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే చెవి నొప్పి, చెవికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉంటాయని ముఖ్యంగా ఇది టీకాలు ఎక్కువగా వేసుకున్న వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు వెల్లడించారు.ఏ మాత్రం చెవి సంబంధిత సమస్యలు తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం అని లేదంటే వినికిడి లోపం తలెత్తే అవకాశాలు ఉంటాయని నిపుణులు తెలియజేశారు.

Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో వారందరికీ ఈ -పాస్‌పోర్ట్‌లు జారీ..!

Central Government: కేంద్రం త్వరలో పౌరులందరికీ ఈ -పాస్‌పోర్ట్‌లను జారీ చేయడం ప్రారంభించనుంది . భారత్ పౌరుల కోసం త్వరలో నెక్స్ట్-జెన్ ఈ – పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టనుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య ఒక ట్వీట్‌లో తెలిపారు. బయోమెట్రిక్ డేటాతో పాస్‌పోర్ట్‌లు సురక్షితంగా ఉంటాయని .. ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ పోస్ట్‌ల ద్వారా సాఫీగా వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని సంజయ్ భట్టాచార్య తెలిపారు.

Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో వారందరికీ ఈ -పాస్‌పోర్ట్‌లు జారీ..!

ఈ పాస్ పోర్టులో మైక్రోచిప్ పాస్‌పోర్ట్.. బయోమెట్రిక్ డేటాకు సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారం కలిగి ఉంటుంది. రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా అనధికారికి డేటా బదిలీని అనుమతించని భద్రతా లక్షణాలను కలిగి ఉంటుందన్నారు. అప్‌గ్రేడ్ చేసిన డాక్యుమెంట్‌లు గుర్తించడం, దొంగతనం, ఫోర్జరీని అరికట్టడానికి.. స్ట్రీమ్‌లైన్డ్ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ కోసం కనెక్టివిటీని మెరుగుపరచడానికి అమర్చబడి ఉంటాయన్నారు.

Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో వారందరికీ ఈ -పాస్‌పోర్ట్‌లు జారీ..!

ఇక దీనిని ట్రయల్స్ లో భాగంగా.. అటువంటి చిప్‌లతో పొందుపరిచిన 20,000 అధికారులకు ఈ పాస్‌పోర్ట్‌లను జారీ చేసిందన్నారు. ఇవి విజయవంతంగా పనిచేస్తే.. ఇక పౌరులందరికీ ఇలాంటి పాస్ పోర్టులను జారీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న పాస్ట్ పోర్టులు ప్రింటెడ్ బుక్‌లెట్ల రూపంలో జారీ చేయడం జరిగిందన్న సంగతి తెలిసిందే.

దరఖాస్తును ఇలా చేయండి..

ప్రస్తుతం కొత్తగా జారీ చేసే పాస్ పోర్టులు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ప్రమాణాలను అనుసరిస్తూ భద్రంగా ఉండనున్నాయి. ఇక ఈ పాస్ పోర్టులను ధ్వంసం చేయడం కష్టం అని కార్యదర్శి పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ ముందు భాగంలో ఉన్న చిప్ ఇ-పాస్‌పోర్ట్‌ల కోసం ఉద్దేశించిన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన లోగోతో వస్తుందని.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద భారతదేశంలోని మొత్తం 36 పాస్‌పోర్ట్ కార్యాలయాలు ఇ-పాస్‌పోర్ట్‌లను జారీ చేయనున్నట్లు నివేదించబడిందన్నారు. వీటిని దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను ఫైల్ చేసి.. అపాయింట్‌మెంట్ తేదీని ఎంచుకోవడం లాంటివి అన్ని.. అంతక ముందు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయన్నారు.

నెలకు కేవలం రూ.55లతో.. రూ.3000 పెన్షన్ పొందండి.. ఎలా అంటే..!

కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే ముఖ్యంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ఒకటి. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. దీని ద్వారా రైతులకు ఏడాదికి రూ.6,000 అందిస్తోంది. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతున్నాయి.

మోదీ సర్కార్ కేవలం ఈ ఒక్క స్కీమ్ మాత్రమే కాకుండా రైతుల కోసం మరో పథకాన్ని కూడా అందిస్తోంది. దీని పేరు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ పథకంలో కూడా రైతులు చేరొచ్చు. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్‌లో చేరిన వారికి ప్రతి నెలా రూ.3,000 వస్తాయి. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి.. మన వివరాలను నమోదు చేసి ఈ పథకంలో చేరొచ్చు.

18 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న రైతులు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు. ఈ స్కీమ్‌లో ఇప్పటికే 21,23,809 మంది రైతులు చేరారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు 60 ఏళ్లు వయసు రాగానే వారికి నెలకు రూ.3వేల పెన్షన్ అందుతుంది. ఇందుకోసం రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పథకంలో చేరడానికి ఆధార్ కార్డు, పొలం పట్టా, బ్యాంక్ పాస్‌బుక్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం. 18 ఏళ్ల వయస్సు ఉన్న రైతు ఈ పథకంలో చేరితే నెలకు రూ.55 కట్టాల్సి ఉండగా.. 40 ఏళ్లలో చేరిన రైతు నెలకు రూ.200 చెల్లించాలి. ఇలా వయస్సును బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది. ఇలా 20 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా రైతులకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. ఒక వేళ రైతు మరణిస్తే నామినీకి 50 శాతం డబ్బులు చెల్లిస్తారు.

కేంద్రం నుంచి కొత్త పథకం..ఆ విద్యార్థులకు ఏడాదికి రూ.2 వేలు సాయం..!

పాఠశాల విద్య పూర్తికాకుండానే బడి మానేసిన వారిని మళ్లీ చదువుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 16-19 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. దూరవిద్య విధానంలో పది, ఇంటర్‌ చదవాలనుకునే వారికి సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) కింద ఏడాదికి రూ.2 వేల మేర ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. ఈ పథక సాయాన్ని మొదటి సారిగా 2021-22 విద్యా సంవత్సరంలోనే అమలు చేయనున్నారు.

ఈ మొత్తాన్ని చదువుకు ఉపయోగపడే పరీక్ష ఫీజు, కోర్సు మెటీరియల్‌ వంటి ఖర్చులకు వినియోగించాల్సి ఉంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వీటిని విద్యార్థుల చేతికి ఇస్తే వేరే విధంగా ఖర్చు చేసే వీలుంటుందని.. వాటిని సార్వత్రిక విద్యాపీఠానికి ఇవ్వాలా? డీఈఓలకు ఇవ్వాలా? అన్న దానిపై స్పష్టత రాలేదు అని ఎస్‌ఎస్‌ఏ అధికారి ఒకరు తెలిపారు.

జిల్లా విద్యాధికారుల ఆమోదంతో ఎన్‌ఐఓఎస్‌ లేదా రాష్ట్రాల సార్వత్రిక విద్యాపీఠంలో చేరేవాళ్లకు ఈ ఆర్థిక సాయాన్ని వర్తింపజేసే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. తెలంగాణలో ఈ సాయం పొందేందుకు 3,500 మంది వరకు అర్హులు ఉన్నారని పాఠశాల విద్యాశాఖ గుర్తించింది.

2021-22 విద్యా సంవత్సరానికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠంలో పది, ఇంటర్‌ ప్రవేశాలు ఈ వారంలో ప్రారంభం కానున్నాయి. దీనిలో చదువుకు ఓసీ విద్యార్థికి రూ.1600 వరకు ఖర్చు అవుతోంది. ఇంటర్‌ విద్యకు ఏడాదికి రూ.1850 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూ.2వేలు కేంద్రం సాయం అందిస్తే ఈ భారం నుంచి విద్యార్థులు బయట పడే అవకాశం ఉంటుంది.

పెన్షన్ ప్లాన్.. నెలకు రూ.1.25 లక్షలు రావాలంటే ఈ పని చెయ్యండి!

పెన్షన్ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు పెన్షన్ కూడా ఇస్తుంది. దీని గురించి చాలామందికి తెలియదు. అయితే దీనికి 80 ఏళ్ల వయస్సు నిడిన వారు అర్హులుగా పేర్కొన్నారు. దీనిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఇండియా ప్రారంభించింది. దీనికి కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది. నెలకు రూ.9 వేలు మరియు గరిష్టంగా రూ.1.25 లక్షలు పొందొచ్చని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పొందే దానిలో 20-100 శాతం మధ్య అదనపు పెన్షన్ పెరుగుతుంది. కుటుంబ పెన్షన్ మొత్తం కూడా సేవకుడి చివరి చెల్లింపులో 30 శాతం ఉంటుంది. పెన్షనర్ 80 ఏళ్లు నిండిన వెంటనే ఈ పథకం అమలులోకి వస్తుంది.

దీనిలో ముఖ్యంగా 80 ఏళ్లు నిండిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాథమిక పెన్షన్‌లో అదనంగా 20 శాతం లభిస్తుంది. అదే కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల వయస్సు 85 దాటితో ప్రాథమిక పెన్షన్‌లో 30 శాతం లభిస్తుంది. 90 సంవత్సరాల వయస్సులో ప్రాథమిక పెన్షన్‌లో 40 శాతం, 95 సంవత్సరాల వయస్సులో ప్రాథమిక పెన్షన్‌లో 50 శాతం మరియు 100 సంవత్సరాల వయస్సులో 100 శాతం ప్రాథమిక పెన్షన్ అందుబాటులో ఉంది.

దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DOPPW India) ట్విట్టర్‌లో ట్వీట్ ద్వారా ఈ సేవను పొందడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. వృద్ధాప్య వయస్సులో వచ్చే అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇలా అదనపు పెన్షన్ ను కేంద్రం ప్రవేశపెట్టింది.

ముప్పు తొలగిపోలేదు… కరోనా రెండవ దశ పై హెచ్చరించిన కేంద్రం..!

గత రెండు నెలలుగా కరోనా రెండో దశ భారతదేశంపై ఎలా ఉందో మనందరికి తెలిసిందే. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ఈ మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించడానికి అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేశాయి. ఈ విధంగా కరోనా మహమ్మారిను అదుపు చేయడం కోసం చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

అయితే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కరోనా రెండవ దశ ప్రమాదం ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మన దేశంలో ఇప్పటికి ఆరు రాష్ట్రాలలో కరోనా కేసులు రోజుకి తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయని, ఈ మహమ్మారి నుంచి పూర్తిగా మనం కోలుకోలేదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.జూన్ 23-29 మధ్యలో దేశవ్యాప్తంగా 71 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతానికిపైగా ఉంది. అందువల్ల ఈ వేవ్ నుంచి మనకు ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

కరోనా కేసులు పలు రాష్ట్రాలలో తగ్గుముఖం పట్టాయని ప్రజలు ఎవరూ కూడా నిర్లక్ష్యం వహించిన వద్దు, నిర్లక్ష్యం కారణంగా మరోసారి వ్యాధి తీవ్రతకు కారణం అవుతాయని, ఈ వ్యాధిని అరికట్టడం కోసం వ్యాక్సిన్ కూడా శరవేగంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు కొంతవరకు పెరిగినప్పటికీ జూన్ 30 నాటికి మన దేశంలో పలు రాష్ట్రాల్లో 53 డెల్టా కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలియజేశారు.

ఈ విధంగా వివిధ రూపాలలో ఉత్పరివర్తనం చెందుతున్న వైరస్ నుంచి ప్రజలను కాపాడటం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగిస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి యావరేజ్ గా రోజుకు 50 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లను అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఈ క్రమంలోనే ప్రజలందరూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు.

మరణించిన ఉద్యోగుల ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్?

దేశవ్యాప్తంగా కేంద్ర ఉద్యోగుల పట్ల మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసే ఏ ఉద్యోగి అయినా మరణించిన వెంటనే వారి కుటుంబ సభ్యుల ఇబ్బందులను తీర్చే విధంగా అడుగులు వేస్తోంది. విధులు నిర్వహిస్తూ ఉద్యోగి మరణించిన కేవలం నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ చెల్లించాలని నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.

ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వారి కుటుంబం నుంచి వచ్చిన క్లెయిమ్ వెంటనే నెల వ్యవధిలో గా ఆ కుటుంబానికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని వివిధ శాఖలకు ఆదేశాలను జారీ చేసింది.పాత పెన్షన్‌ పథకం, జాతీయ పెన్షన్‌ కింద ఉండి మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి అందాల్సిన మొత్తాన్ని ఆ కుటుంబానికి అందించాలని తెలిపింది.

ఈ క్రమంలోనే ఉద్యోగి చెల్లించిన మొత్తాన్ని ఎన్‌పీఎస్‌ పెన్షన్‌ కార్పస్ ను కుటుంబ సభ్యులకు వెంటనే అందించడమే కాకుండా పెన్షన్ ఇవ్వడం ప్రారంభిస్తున్న సమయంలోనే ఉద్యోగి శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్యను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 1 నుంచి మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, వారి కుటుంబ సభ్యుల పింఛన్ జారీ, ఇతర వివరాలను నెలవారీగా పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.