Tag Archives: chiru

Nara Lokesh: చిరు బాలయ్య కులాల పేరుతో ఫేక్ అకౌంట్స్… ట్విట్టర్ వేదికగా మండిపడిన నారా లోకేష్?

Nara Lokesh: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా పండుగ వస్తుందంటే పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతూ నువ్వా…నేనా అన్నట్టు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలోనే వచ్చే యేడాది సంక్రాంతి బరిలో పెద్ద ఎత్తున సినిమాలు పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ నటించబోతున్న సినిమాల మధ్య పోటీ ఏర్పడనుంది.

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు రెండు కూడా సంక్రాంతి బరిలో విడుదల కానున్నాయి. ఇక ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం.ఈ క్రమంలోనే ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్టర్లను విడుదల చేస్తూ పోటీపడుతున్నారు.

బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరి హీరోల పేరుతో టీడీపీ ఫర్ ఎవర్ అనే ట్విట్టర్ అకౌంట్ తో ఇద్దరు హీరోలని టార్గెట్ చేస్తూ, కులల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదంతా కూడా వైఎస్ఆర్సిపీ పని అంటూ ఈయన మండిపడటమే కాకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Nara Lokesh: అధికార ప్రభుత్వంపై మండిపడిన లోకేష్…

కులం మతం పేరు చెప్పి రాజకీయాలు చేసే వారిని చెప్పుతో కొట్టండి. ఇలా ఫేక్ అకౌంట్స్ ఫేక్ ట్వీట్స్ నీకు సంతృప్తినిస్తాయేమో కానీ.. గెలుపును మాత్రం ఇవ్వవు జగన్ రెడ్డి అంటూ నారా లోకేష్ అధికార ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Allu Aravind: బాలయ్యకు దగ్గరవుతూ చిరుని పక్కన పెడుతున్న అల్లు అరవింద్.. ఒంటరవుతున్న చిరు?

Allu Aravind:తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య ఎలాంటి మంచి అనుబంధం ఉందో మనకు తెలిసిందే. చిరంజీవి అల్లు అరవింద్ ఇద్దరు వరుసకు బావ బావమరిది అయినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతో మంచి అన్యోన్యత ఉండేది. ఏ చిన్న వేడుక జరిగిన మెగా అల్లు కుటుంబం ఒకే చోట చేరి పెద్ద ఎత్తున ఆ వేడుకను జరుపుకునే వారు.

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ క్రమక్రమంగా మెగాస్టార్ చిరంజీవిని దూరం పెడుతూ నందమూరి నటసింహం బాలకృష్ణకు దగ్గర అవుతున్నారని వార్తలు వినపడుతున్నాయి.

ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా అల్లు అరవింద్ వ్యవహార శైలి చూస్తే అందరికీ ఇది నిజమేనని అర్థమవుతుంది. అల్లు అరవింద్ ఆహా సమస్థను స్థాపించి ఇందులో అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బాలయ్యను తీసుకువచ్చారు. ఇలా ఈ కార్యక్రమంతో వీరి బంధం బలపడింది.ఇక గతంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా వెళ్లారు.

Allu Aravind: బాలయ్యకు దగ్గరవుతున్న అల్లు అరవింద్…

ఇకపోతే అల్లు అరవింద్ త్వరలోనే తన బ్యానర్ లో బాలకృష్ణ చేత ఓ సినిమా చేయనున్నారని వార్తలు కూడా ఇండస్ట్రీలో వినపడుతున్నాయి.ఇకపోతే అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం బాలకృష్ణ ముఖ్యఅతిథిగా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా అల్లు అరవింద్ చిరంజీవిని దూరం పెడుతూ బాలకృష్ణకు దగ్గర అవుతున్నారని తెలుస్తోంది.

God Father: నేను చిరు కలిసి నటిస్తే 3000 కోట్ల బిజినెస్ పక్కా… సల్మాన్ ఖాన్ కామెంట్స్ వైరల్?

God Father: ప్రస్తుత కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే సౌత్ హీరోలు నటించే సినిమాలలో బాలీవుడ్ హీరోలు గెస్ట్ పాత్రలలో నటించగా బాలీవుడ్ హీరోల సినిమాలలో సౌత్ సెలబ్రిటీలు గెస్ట్ పాత్రలలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో సందడి చేయనున్నారు.ఇక ఈ సినిమా కథ వినగానే తాను ఏమాత్రం ఆలోచించకుండా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను అంటూ సల్మాన్ ఖాన్ తెలియజేశారు.

ఇకపోతే సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి మల్టీ స్టార్ సినిమాలు ఎంతో అవసరం అని తెలిపారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో 300 _400కోట్ల బిజినెస్ వరకు మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ మల్టీ స్టార్ సినిమాలు చేస్తే ఈ బిజినెస్ మరింత పెరిగే అవకాశం ఉందని సల్మాన్ ఖాన్ వెల్లడించారు.

God Father: మల్టీ స్టార్ సినిమాలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం..

చిరంజీవి అభిమానులు నన్ను ఆదరించి నా అభిమానులు చిరంజీవిని ఆదరిస్తే పెద్ద అభిమాన లోకం అవుతుందని, ఇద్దరం కలిసి నటిస్తే మూడు వేల కోట్ల బిజినెస్ చేయవచ్చు అంటూ ఈ సందర్భంగా సల్మాన్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక నార్త్ సౌత్ సెలెబ్రిటీలు కలిసిన నటించడం వల్ల సినిమా ఇండస్ట్రీకి ఎంతో ప్లస్ పాయింట్ అవుతుందని ఇది ఇండియన్ సినిమా అంటూ ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Vijayshanthi: అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి.. పరోక్షంగా చిరు పై సెటైర్స్?

Vijayshanthi: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకి రీమేక్ చిత్రంగా తెరకెక్కిన సినిమా లాల్ సింగ్ చద్దా.ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమాకు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. గతంలో అమీర్ ఖాన్ భారతదేశం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండియాలో ఉండాలంటే అసహనం వేస్తుందని, ఇక్కడ రక్షణ లేదు, ఎక్కడికైనా వెళ్లిపోవాలని ఉంది అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ప్రస్తుతం ఎంతోమంది నేటిజన్ లు తన సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి బిజెపి నాయకురాలు విజయశాంతి సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి స్పందిస్తూ ప్రజలను నోటికొచ్చినట్లు మాట్లాడితే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రజలు అర్థమయ్యేలా అమీర్ ఖాన్ కు చెబుతున్నారని ఈమె ట్వీట్ చేశారు. గతంలో సర్కారుపై వ్యతిరేకతతో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఫలితాన్ని ఇస్తున్నాయని తెలిపారు.

మనదేశంలో స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత మతసామరస్యంతో అందరికీ స్థానమిచ్చి గౌరవాన్ని ఇస్తుంది. ఈ వాస్తవం తెలిసిన ప్రజలు అమీర్ ఖాన్ సినిమాలను బాయికాట్ చేయాలని డిమాండ్ చేయడమే కాకుండా ఆయన నటించిన వాణిజ్య ఉత్పత్తులను సైతం తిరస్కరిస్తున్నారనీ విజయశాంతి పేర్కొన్నారు.

Vijayshanthi: చిరంజీవిని కూడా టార్గెట్ చేసిన విజయశాంతి…

ఇక ఈ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా అందర్నీ మేలుకొలుపుతుంటే.. కొందరు టాలీవుడ్ హీరోలు మాత్రం ప్రజల మనోభావాలు వాళ్ళకి తెలియవు అన్నట్టుగా అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ టీవీలలో కనిపిస్తున్నారని పరోక్షంగా ఈమె చిరంజీవిని కూడా ఉద్దేశించి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ గురించి విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ : లీకైన” ఆచార్య” టెంపుల్ టౌన్ వీడియో!

టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో అయినా మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా నిర్మాణ పనులను జరుపుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ టెంపుల్ టౌన్ సృష్టించాడు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా లేని అతిపెద్ద టెంపుల్ టౌన్ ఆచార్య సినిమాలో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో వేశారు. అయితే ఈ టెంపుల్ టౌన్ గాలి గోపురానికి సంబంధించిన వీడియోను హీరో చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ గా 20 ఎకరాల విస్తీర్ణంలో వేశారు. ప్రతి చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో అద్భుతంగా మలిచి గాలి గోపురాన్ని క్రియేట్ చేశారు. ఈ విధంగా క్రియేట్ చేయడం కళా దర్శకత్వం ప్రతిభకే ఓ మచ్చుతునక. నాకెంతో ముచ్చట అనిపించి ఈ గాలి గోపురాన్ని నా కెమెరాలో బంధించి.. మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజంగానే ఓ టెంపుల్ టౌన్ లో ఉన్నామా? అనేంతగా ఈ టెంపుల్ ను డిజైన్ చేసిన కళాదర్శకుడు సురేష్ ను, టెంపుల్ టౌన్ ను విజువలైజ్ చేసిన దర్శకుడు కొరటాల శివను, ఈ టెంపుల్ టౌన్ నిర్మించడానికి కావలసినవి సమకూర్చిన నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చిరంజీవి ఈ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో మెగా వారసుడు రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు మనకు తెలిసిందే. ఆచార్య సినిమాలో ప్రముఖ బాలీవుడ్ ప్రతి నాయకుడు అయిన సోనుసూద్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తొందరలోనే షూటింగ్ పూర్తిచేసుకుని ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపారు.