Tag Archives: comment

Gabbarsingh: గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పింది ఒకటి.. చూపించింది ఒకటి.. బెంగళూరు పద్మ షాకింగ్ కామెంట్స్!

Gabbarsingh: బెంగళూరు పద్మ ఈమె నటిగా ఎన్నో సినిమాలలోను బుల్లితెర సీరియల్స్ లోనూ నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే బెంగళూరు పద్మ స్వయాన హ్యాపీ డేస్ సినిమాలో అప్పు పాత్రలో నటించిన గాయత్రి తల్లి అనే సంగతి అందరికీ తెలిసిందే.

Gabbarsingh: గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పింది ఒకటి.. చూపించింది ఒకటి.. బెంగళూరు పద్మ షాకింగ్ కామెంట్స్!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పద్మ హ్యాపీడేస్ చిత్రంలోని అప్పు పాత్ర గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముందు అప్పు పాత్రలో నటించడం గాయత్రికి ఇష్టం లేదని అయితే ఈ పాత్రలో నటించాలంటే తనకు బాయ్ కట్ ఉండాలని చెప్పారు.తనకు జుట్టు బాగా పొడుగు ఉండేది తన జుట్టు కత్తిరించినప్పుడు చాలా ఏడ్చింది. అప్పుడు శేఖర్ కమ్ముల గారు తనకు పెద్ద చాక్లెట్ ఇచ్చి తనని కన్విన్స్ చేశారని ఈ సందర్భంగా తెలిపారు.

Gabbarsingh: గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పింది ఒకటి.. చూపించింది ఒకటి.. బెంగళూరు పద్మ షాకింగ్ కామెంట్స్!

హ్యాపీడేస్ చిత్రం తర్వాత గబ్బర్ సింగ్ సినిమాలో శృతిహాసన్ ఫ్రెండ్ పాత్రలో ఈమె నటించారు. ఇక ఈ పాత్ర గురించి పద్మ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గాయత్రి ఒకసారి ఫోటో షూట్ చేయించుకుంది. ఆ ఫోటోలు చూసిన హరీష్ శంకర్ తనకు గబ్బర్ సింగ్ సినిమాకు ఇలాంటి పాత్రలో నటించే వాళ్ళు కావాలి అంటూ తనని సెలెక్ట్ చేశారని పద్మ తెలిపారు.

పై చదువుల కోసం ఇండస్ట్రీకి దూరం…

ఈ సినిమా కథ చెప్పేటప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుందని చెప్పారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే తన పాత్రకు మంచి గుర్తింపు ఉంటుందని భావించాము. తీరా చూస్తే హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో తనని చూపించారు అంటూ పద్మ ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాలోని తన కూతురు పాత్ర గురించి తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత తాను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇండస్ట్రీకి దూరమైందని పద్మ తన కూతురు గాయత్రి అలియాస్ అప్పు గురించి తెలిపారు.

Sammeta Gandhi: బాలకృష్ణ గురించి అందరూ చెప్పినా వినకుండా డైరెక్టుగా వెళ్లి నమస్కారం పెడితే ఏం అన్నాడో తెలుసా? సమ్మెట గాంధీ షాకింగ్ కామెంట్స్!

Sammeta Gandhi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాక్టర్ సమ్మెట గాంధీ ఒకరు. ఈయన రాజన్న వకీల్ సాబ్ అఖండ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. రాజన్న సినిమాలో ఆయన నటన చూసి తనని వకీల్ సాబ్ సినిమా కోసం ఫోన్ చేసి మరి పిలిపించి వేషం ఇచ్చారని ఈ సందర్భంగా సమ్మెట గాంధీ వెల్లడించారు. తనకు పవన్ కళ్యాణ్ తో నటించాలని ఎప్పటినుంచో కల. ఆ కల ఈ సినిమా రూపంలో నెరవేరిందని సమ్మెట గాంధీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

Sammeta Gandhi: అందరూ చెప్పినా వినకుండా బాలకృష్ణకు నమస్కారం పెడితే అతను అలా అన్నారు.. సమ్మెట గాంధీ షాకింగ్ కామెంట్స్!

ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి మందు తీసుకురావడం కోసం సగం రోజు మొత్తం తిప్పించి షూట్ చేశారు.. సినిమాలో మాత్రం ఆ సీన్ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉందని ఆయన తెలిపారు. ఇకపోతే అఖండ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సమ్మెట గాంధీ ఈ సినిమా గురించి, బాలకృష్ణ గారి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ సినిమా అనుకున్న సమయంలో బోయపాటి స్వయంగా నాకు ఫోన్ చేసి ఇలా మీకోసం ఒక పాత్ర ఉంది గాంధీ గారు తప్పకుండా మీరే చేయాలి అని అడిగారు. 2020 మార్చి నెలలో సినిమా ముహూర్తం ఫిక్స్ చేసి నాకు చెప్పారు.

Sammeta Gandhi: అందరూ చెప్పినా వినకుండా బాలకృష్ణకు నమస్కారం పెడితే అతను అలా అన్నారు.. సమ్మెట గాంధీ షాకింగ్ కామెంట్స్!

సాధారణంగా సినిమా స్టార్ట్ చేసే ముందు హీరోలు నిర్మాతలతో స్టార్ట్ చేస్తారు. కానీ బోయపాటి శ్రీను మాత్రం కొబ్బరికాయ నా చేతి కిచ్చి ఒక డైలాగ్ చెప్పి కొబ్బరికాయ కొట్టమన్నారు.అలా కొబ్బరికాయ కొట్టే సమయంలో ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుని కొబ్బరికాయ కొట్టాను అంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే చాలామంది బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ అని చెబుతుంటారు .మరి బాలకృష్ణ గారితో నటించడం మీకు ఎలా ఉందని ప్రశ్నించగా ఈయన బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

కల్మషం లేని వ్యక్తి బాలకృష్ణ…

నేను అఖండ సినిమా సెట్ లో ఉన్నప్పుడు నాకు కూడా చాలామంది బాలకృష్ణ గారితో మాట్లాడకండి ఆయనకు కోపం ఎక్కువ ఆయనకు నమస్కారం పెట్టిన కోప్పడతారు అంటూ చాలా చెప్పారు.అయితే బాలకృష్ణ గారు రాగానే వెళ్లి నమస్కారం సార్ అని రెండు చేతులతో నమస్కారం పెట్టాను. అందుకు బాలకృష్ణ నమస్కారం అని నవ్వుతూ ఎంతో చక్కగా మాట్లాడారు. అందరూ అనుకునే విధంగా బాలకృష్ణ వ్యక్తిత్వం అది కాదు ఆయన ఎలాంటి కల్మషం లేని మనిషి.మంచి మనసున్న మనస్తత్వం బాలకృష్ణది అంటూ ఈ సందర్భంగా సమ్మెట గాంధీ బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి తెలియజేశారు.

Dimple Kapadia: ఆ ప్యాలెస్ లో దయ్యాలు ఉన్నాయి.. మా అమ్మ వాటితో మాట్లాడింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ట్వింకిల్ ఖన్నా!

Dimple Kapadia: దెయ్యాలు నిజంగానే ఉన్నాయా అనే ప్రశ్న వేస్తే ఎవరైనా సమాధానం చెప్పడానికి కాస్త ఆలోచిస్తారు. దయ్యాలు ఉన్నాయా లేదా అనే విషయం గురించి ఇప్పటికీ సరైన సమాధానం లేదు. అయితే కొందరు దయ్యాలున్నాయని నమ్ముతారు మరి కొందరు ఇలాంటి మాటలను కొట్టిపారేస్తారు.

Dimple Kapadia: ఆ ప్యాలెస్ లో దయ్యాలు ఉన్నాయి.. మా అమ్మ వాటితో మాట్లాడింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ట్వింకిల్ ఖన్నా!

తాజాగా దయ్యాల గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తల్లి డింపుల్ కపాడియా జైపూర్ లోని రాయల్ ప్యాలెస్ లో దయ్యం ఉందని తన తల్లి ఆ దెయ్యంతో మాట్లాడారని వెల్లడించారు. తన తల్లి 1990లో ‘లేకిన్’సినిమా షూటింగ్ సమయంలో జైపూర్ లోని రాయల్ ప్యాలెస్ లో గడిపారు. అదే గదిలో తన పక్కన ఒక మహిళ ఉండగా తనతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు.

Dimple Kapadia: ఆ ప్యాలెస్ లో దయ్యాలు ఉన్నాయి.. మా అమ్మ వాటితో మాట్లాడింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ట్వింకిల్ ఖన్నా!

ఆ గదిలో తనతో పాటు ఉన్నది దయ్యమని తన తల్లి దయ్యంతో మాట్లాడిందని వెల్లడించారు. ఇక ఈ విషయంపై జైపూర్ రాజవంశీకురాలు, రాజమాత పద్మిని దేవి మాట్లాడుతూ.. జైపూర్ రాయల్ ప్యాలెస్ లో ఎలాంటి దయ్యాలు లేవు. తన తల్లి డింపుల్ కపాడియా సినిమాలో ఒక దెయ్యం పాత్రలో నటించారు.ఆమె రోజంతా అలాంటి పాత్రలో నటించడం వల్ల రాత్రికి కూడా అదే పాత్రలో లీనమై దయ్యం ఉన్నట్లు ఊహించుకున్నారు.

కేవలం తన భ్రమ మాత్రమే..

ఈ విధంగా ఆమె దయ్యం పాత్రలో నటించడం వల్ల తనకు అలాంటి బ్రమ కలిగిందని ఎలాంటి దయ్యాలు లేవని తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా పద్మిని దేవి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రాయల్ ప్యాలెస్ లో ఎలాంటి దయ్యాలు లేవనే విషయం గురించి ఈమె ఇలా క్లారిటీ ఇచ్చారు. గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేకిన్ సినిమాలో డింపుల్ కపాడియా రేవా అనే దెయ్యం పాత్రలో నటించారు.

Raghu Kunche: డైరెక్టర్ వి.వి.వినాయక్ నాకు చాలా దగ్గర బంధువు.. అవకాశం ఇవ్వమని అడిగితే అలా చేశారు.. రఘు కుంచే షాకింగ్ కామెంట్స్?

Raghu Kunche: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రఘు కుంచె గురించి అందరికీ తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే తనకు డైరెక్టర్ వి.వి.వినాయక్ చాలా దగ్గర బంధుత్వం ఉందని తెలిపారు.

Raghu Kunche: డైరెక్టర్ వి.వి.వినాయక్ నాకు చాలా దగ్గర బంధువు.. అవకాశం ఇవ్వమని అడిగితే అలా చేశారు.. రఘు కుంచే షాకింగ్ కామెంట్స్?

వివి వినాయక్ గారి చెల్లెలు మా బాబాయ్ గారి కొడుకుకి వివాహం చేసుకున్నాము.అలా వి.వి.వినాయక్ వరుసకు బావ అవుతారని ఈ సందర్భంగా రఘు కుంచే వారిద్దరి మధ్య ఉన్న బంధుత్వం గురించి బయట పెట్టారు. ఇకపోతే వి.వి.వినాయక్ బావ కావడంతో ఆయన ద్వారా ఎలాంటి అవకాశాలను అందుకో లేదా అనే ప్రశ్న ఎదురయింది.

Raghu Kunche: డైరెక్టర్ వి.వి.వినాయక్ నాకు చాలా దగ్గర బంధువు.. అవకాశం ఇవ్వమని అడిగితే అలా చేశారు.. రఘు కుంచే షాకింగ్ కామెంట్స్?

ఈ ప్రశ్నకు రఘు కుంచే సమాధానం చెబుతూ బావ అనే బంధుత్వాన్ని అడ్డుపెట్టుకొని అవకాశాలు అడగలేము కదా అని సమాధానం చెప్పారు. అయితే ఒకసారి కృష్ణ సినిమా షూటింగ్ చేసేటప్పుడు తనకు అందులో ఒక పాట పాడే అవకాశం కల్పించమని అడిగాను. ఈ విధంగా నేను అడగడంతో వెంటనే డైరెక్టర్ చక్రి గారికి చెప్పి నా చేత ఆ సినిమాలో పాట పాడించారు.
కృష్ణ సినిమాలో నేను పాడిన పాట ఎంతో మంచి విజయం సాధించింది. అయితే మా మధ్య ఉన్న బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని తనని తరచు అవకాశాలు అడగలేక పోయానని ఈ సందర్భంగా తెలిపారు.

కనీసం రిప్లై కూడా ఇవ్వరు..

ఇకపోతే ఇండస్ట్రీలో ఎంతో మందితో తనకు పరిచయం ఉన్నప్పటికీ తాను తన కొత్త సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ వాట్సప్ ద్వారా వారికి పంపించి ఆ సినిమా వివరాలను కూడా పంపిస్తాను. వారుతమ తరువాత కథను సిద్ధం చేసుకున్నప్పుడు ఫలానా పాత్రకు నేను సరిపోతాను అన్న ఆలోచన వస్తుందేమోనని నా ప్రయత్నం. అయితే నాతో ఎంతో మంచి పరిచయం ఉన్న వారు అలా ఫోటోలు పంపినప్పుడు కనీసం ఓకే అని కూడా రిప్లై ఇవ్వరని ఇలా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు కూడా దూరం పెడతారని రఘు కుంచే ఈ సందర్భంగా వెల్లడించారు.

Jani Master: నాకు డాన్స్ రాదంటూ వేదికపై నుంచి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. బ్యాడ్ అవుతున్నా అంటూ ఆది కామెంట్స్!

Jani Master: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అన్ని భాషలలో స్టార్ హీరోలతో జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇటీవల తమిళ హీరో విజయ్ తో బీస్ట్ సినిమాలో జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.

Jani Master: నాకు డాన్స్ రాదంటూ వేదికపై నుంచి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. బ్యాడ్ అవుతున్నా అంటూ ఆది కామెంట్స్!

ఇక పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన జానీ మాస్టర్ టాలీవుడ్ లో ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోలకు డాన్స్ కంపోజ్ చేస్తుతుంటాడు. అయితే జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీతో బిజీగా ఉండటమే కాకుండా అప్పుడప్పుడు పలు టీవీ షోలలో కూడా సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తున్నాడు. బుల్లితెర మీద ప్రసారమౌతున్న ప్రముఖ డాన్స్ షో ” ఢీ “. ఈ ఢీ షోతో జానీ మాస్టర్ కి ఎంతో అనుబంధం ఉంది. మొదట ఈ షోలో తన కెరీర్ స్టార్ట్ చేసిన జానీ మాస్టర్ తర్వాత ఆ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.

Jani Master: నాకు డాన్స్ రాదంటూ వేదికపై నుంచి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. బ్యాడ్ అవుతున్నా అంటూ ఆది కామెంట్స్!

ఇటీవల జానీ మాస్టర్ ఢీ షోలో తెగ సందడి చేస్తున్నాడు. యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది, జానీ మాస్టర్ మధ్య జరిగే సరదా సన్నివేశాలు ఈ షోకి అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. ఇటీవల షోకి సంబంధించిన ప్రోమో మొదలైంది. ఈ ప్రోమోలో హైపర్ ఆది, జానీ మాస్టర్ కి మధ్య డాన్స్ కాంపిటీషన్ జరిగింది. జానీ మాస్టర్ స్టెప్పులు వేస్తుంటే ఆది కుప్పిగంతులు వేసాడు. తర్వత ప్రదీప్ వచ్చి ఇద్దరికీ ఎన్ని ఓట్లు వచ్చాయని అనగా.. టై అయిందని ఆది అన్నాడు. దీంతో జానీ మాస్టర్ గతాన్ని గుర్తు చేసుకున్నాడు.

గతాన్ని గుర్తు చేసుకున్న జానీ మాస్టర్…

గతంలో జానీ మాస్టర్ చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడు. ముక్కుసూటిగా మాట్లాడుతూ..జడ్జ్‌లను కూడా ఎదురించేవాడు. ఆది టై అయింది అనటంతో జానీ మాస్టర్ గతంలో తను అన్న మాటలు గుర్తు చేశాడు. నాకు డాన్స్ రాదు.. యాక్టింగ్ రాదు.. అందుకే నేనూ వెళ్ళిపోతా అంటూ స్టేజి దిగి వెళ్లిపోతుంటే ఆది మాట్లాడుతూ.. మాస్టర్ మీరు ఇలా చేయటం వల్లే నేను బ్యాడ్ అవుతున్నా అని అంటాడు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగ నవ్వారు.

Chiranjeevi -Nassar: నేను హోటల్ లో పని చేయడం చూసి చిరంజీవి అలా అన్నారు… నటుడు నాజర్ షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi -Nassar:దక్షిణాది సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా ఉత్తరాది సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు నాజర్.తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ చిరంజీవి ఇద్దరు కలిసి ఒకే యాక్టింగ్ స్కూల్లో చేరామని తెలియజేశారు.

Chiranjeevi -Nassar: నేను హోటల్ లో పని చేయడం చూసి చిరంజీవి అలా అన్నారు… నటుడు నాజర్ షాకింగ్ కామెంట్స్!

ఈ విధంగా ఇద్దరూ ఒకే యాక్టింగ్ స్కూల్లో చదువుకున్న చిరంజీవి మాత్రం పెద్ద నటుడిగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారని తాను మాత్రం హోటల్లో పని చేస్తూ ఉండి పోయాయని నాజర్ తెలిపారు.తనకు నెలనెలా డబ్బులు వస్తే మంచిగా ఉంటుంది సినిమా అంటే ఎప్పుడో డబ్బులు వస్తాయి ఇబ్బంది అవుతుందని సినిమా సెకండ్ ఆప్షన్ గా పెట్టుకున్నానని తెలిపారు.

Chiranjeevi -Nassar: నేను హోటల్ లో పని చేయడం చూసి చిరంజీవి అలా అన్నారు… నటుడు నాజర్ షాకింగ్ కామెంట్స్!

ఇలా తాజ్ కోరమండల్ హోటల్లో పని చేస్తుండగా ఒకరోజు సైకిల్ పై వెళ్తున్న సమయంలో చాలామంది గుంపుగా ఉన్నారు. ఏం జరిగిందని అక్కడికి వెళ్లి చూస్తే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంది. చిరంజీవి తనను చూడకముందే వెనక్కి తిరిగి వెళ్దామని వెళ్తుండగా చిరంజీవి నన్ను చూసి పలకరించారు. ఏం చేస్తున్నావ్ ఎలా ఉన్నావ్ అని అడగగా హోటల్లో పని చేస్తున్నానని తెలిపాను.అదేంటి ఎంతో గొప్ప యాక్టర్ వి ఇలా హోటల్లో పని చేయడం ఏంటి రేపు ఒకసారి నన్ను కలువు అంటూ చిరంజీవి ఆరోజు చెప్పారు.

చంపేస్తానని బెదిరించారు…

ఇక ఆ తర్వాత నేను చిరంజీవి గారిని కలవలేదని అయితే బాలచందర్ దర్శకత్వంలో తనకు సినిమా అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా నాజర్ చెప్పారు.అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించే అవకాశం మాత్రమే వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇకపోతే యాక్టింగ్ స్కూల్లో చదువుకునే సమయంలో మేము ప్రతిరోజూ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాక్టింగ్ స్కూల్ కి వెళ్లేవాళ్లం ఆ సమయంలో అందరం కలిసి ఆంధ్ర మెస్ నుంచి భోజనం తెచ్చుకునే తినేవాళ్ళం. అయితే ఒకరోజు నేను అన్నం మాత్రమే తీసుకు వెళ్ళడంతో అది చూసిన చిరంజీవి ఉదయమే క్యారేజ్ కోసం ఇబ్బంది పెడితే చంపేస్తాను. రేపటి నుంచి నువ్వు కూడా మాతో పాటే తినాలి అని చిరంజీవి తనకి వార్నింగ్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా నాజర్ గుర్తు చేసుకున్నారు.

Actress Kasturi : కేఎల్ రాహుల్ అండర్ వేర్ యాడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంటింటి గృహలక్ష్మి కస్తూరి.. ట్వీట్ వైరల్!

Actress Kasturi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈమె మా టీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తులసి పాత్రలో ఒదిగిపోయి నటిస్తున్నారు.

Actress Kasturi: కేఎల్ రాహుల్ అండర్ వేర్ యాడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంటింటి గృహలక్ష్మి కస్తూరి..ట్వీట్ వైరల్!

ఇలా బుల్లితెర ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూనే మరోవైపు సామాజిక అంశాలపై స్పందిస్తే తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ తన అభిప్రాయాలను తెలియ చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా క్రికెటర్ కేఎల్ రాహుల్ అండర్ వేర్ ప్రకటనపై ఈమె స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.సాధారణంగా బాగా పేరు సంపాదించుకున్న క్రికెటర్లు ఇలాంటి ఆడ్ చేయడానికి ఇష్టపడరు. కానీ రాహుల్ మాత్రం ఈ యాడ్ లో నటించారు.

Actress Kasturi: కేఎల్ రాహుల్ అండర్ వేర్ యాడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇంటింటి గృహలక్ష్మి కస్తూరి..ట్వీట్ వైరల్!

ఈ సందర్భంగా కె.ఎల్.రాహుల్ అండర్ వేర్ యాడ్ ఫై కస్తూరి స్పందిస్తూ.. తాను ఇప్పటివరకు క్రికెటర్లు మాములుగా కోలాలు, చిప్స్, ఆన్లైన్ గేమ్స్, ఇతర ప్రముఖ బ్రాండ్లకు ఎండార్స్ చేయడమే చూశాను.. కానీ ఇలా లోదుస్తుల గురించి ప్రచారం చేయడం ఎప్పుడూ చూడలేదు. కానీ రాహుల్ మాత్రం ఏ విధమైనటువంటి బెరుకు లేకుండా ఇలాంటి యాడ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. రాహుల్ ఇలా బాక్సర్ లా చూడటం బాగుంది అంటూ ఈమె ద్వారా కె.ఎల్.రాహుల్ అండర్ వేర్ యాడ్ పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

వెల్లువెత్తిన విమర్శలు…

ఈ క్రమంలోనే ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఆమె ఈ యాడ్ పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ఈ ట్వీట్ పై పలువురు స్పందిస్తూ కస్తూరిని విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా, ఇలా సామాజిక అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Actor Pradeep: అచ్యుత్ చనిపోయే ముందు రోజు మా ఇంటికి వచ్చి నాతో ఏం చెప్పారంటే… యాక్టర్ ప్రదీప్ కామెంట్స్ వైరల్!

Actor Pradeep: టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాల్లో నటుడిగా అదేవిధంగా బుల్లితెర సీరియల్స్ లో స్టార్ నటుడిగా కొనసాగిన ప్రదీప్ ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ కి దూరమైనప్పటికీ వెండితెరపై పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తాజాగా ఈయన ఎఫ్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.

Actor Pradeep: అచ్యుత్ చనిపోయే ముందు రోజు మా ఇంటికి వచ్చి నాతో అలా అన్నారు.. యాక్టర్ ప్రదీప్ కామెంట్స్ వైరల్!

కొత్తగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ తన స్నేహితుడు, తన మిత్రుడు అచ్యుత్ మరణం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్యుత్ మరణం ఒక మిస్టరీగా ఉండిపోయింది. అసలు అచ్యుత్ మరణానికి కారణం ఏమిటి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశకు ప్రదీప్ సమాధానం చెబుతూ అచ్యుత్ మరణం హిస్టరీ కాదు. అతని మరణానికి ప్రత్యక్ష సాక్షి నేనే అంటూ సమాధానం చెప్పారు.

Actor Pradeep: అచ్యుత్ చనిపోయే ముందు రోజు మా ఇంటికి వచ్చి నాతో అలా అన్నారు.. యాక్టర్ ప్రదీప్ కామెంట్స్ వైరల్!

అచ్యుత్ ప్రాణం పోయే సమయంలో నేను అతని పక్కనే ఉన్నానని అతని మరణంలో ఎలాంటి హిస్టరీ లేదని, అతను సహజ మరణం పొందారని ప్రదీప్ తెలిపారు. అచ్యుత్ ఎక్కువగా నాన్ వెజ్ తినే వారు. అయితే ఆరోగ్యం బాగా లేకపోవడంతో నాన్ వెజ్ పూర్తిగా మానేశారు.ప్రతి రోజు షూటింగ్ ఉన్నా కూడా మా ఇంటికి వచ్చి పిల్లలతో కలిసి వదిన నాకు భోజనం పెట్టు అంటూ భోజనం చేసేవారు. మా ఇద్దరి జర్నీ సుమారు 14 సంవత్సరాలపాటు కొనసాగిందని అచ్యుత్ తెలిపారు.

అచ్యుత్ చనిపోయే ముందు రోజు రాత్రి మా ఇంటికి వచ్చారు. సాయంత్రం నాతో మాట్లాడుతూ రేపు అన్నయ్య సీరియల్ టీమ్ తో కలసి తిరుపతి వెళ్తున్నా అని చెప్పారు.సరే జాగ్రత్త అని చెప్పాను.ఆసమయంలో అచ్యుత్ కాస్త ఆయాస పడ్డారు.ఏమైంది అని అడిగితే ఇప్పుడే ఎండోస్కోపీ చేయించుకున్న కాస్త నోరు పూసినట్టు ఉంది అంటూ సమాధానం చెప్పగా కాస్త జాగ్రత్తగా ఉండని చెప్పాను.మరుసటి రోజు ఉదయం నేను అన్నపూర్ణ స్టూడియోకి షూటింగ్ కోసం వెళ్ళగా రైల్వే స్టేషన్ కు వెళ్లే సమయంలో అస్వస్థతకు గురై హాస్పిటల్ కి వెళ్ళాడని ఫోన్ వచ్చింది.

ఆయనది సహజ మరణం…

ఫోన్ కాగానే హుటాహుటిన తను హాస్పిటల్ కు వెళ్ళినట్టు ప్రదీప్ తెలిపారు. అక్కడి వెళ్తే ఆయనకు హార్ట్ ఎటాక్ అని చెప్పారు. డాక్టర్స్ తన గురించిహోప్స్ వదిలేసారు అదే సమయంలో తన భార్య రమ అక్కడే కూర్చుని ఏడుస్తున్నారు.చివరి ప్రయత్నంగా ఒక ఇంజక్షన్ ఉంది దాన్ని ట్రై చేద్దామని డాక్టర్ ట్రై చేశారు. ఇక అతని ప్రాణాలు కొట్టుమిట్టాడుతుండగా బయటకు వచ్చి నేనే తన భార్యకు కాస్తా తన నోట్లో నీళ్లు పోయమని చెప్పాను. ఇది జరిగినది అచ్యుత్ మరణం లో ఎలాంటి హిస్టరీ లేదు. ఆయన సహజంగా మరణించారని ప్రదీప్ తెలిపారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లోనే అచ్యుత్ భార్య రమ పిల్లలిద్దరూ కూడా లైఫ్ లో సెటిల్ అయ్యారని పిల్లలకి మ్యాచ్ చూస్తున్నారని ప్రదీప్ తెలిపారు.

Serial Actor Satish: నటి సీత వందకోట్ల ఆస్తులు ఎలా పోయాయో బయట పెట్టిన సీరియల్ నటుడు సతీష్!

Serial Actor Satish: ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాలలో అద్భుతమైన నటిగా ఎన్నో సినిమాల్లో నటించి అందరిని మెప్పించిన నటి సీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో పార్థిబన్ తో ప్రేమలో పడి 1990లో అతన్ని వివాహం చేసుకుంది. 2001లో ఆమె వ్యక్తిగత కారణాలవల్ల అతనితో విడాకులు తీసుకున్నారు.

Serial Actor Satish: నటి సీత వందకోట్ల ఆస్తులు ఎలా పోయాయో బయట పెట్టిన సీరియల్ నటుడు సతీష్!

ఈమె తనతో విడాకులు తీసుకున్న సమయానికి తనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇక సీత తన భర్తతో విడాకులు తీసుకున్న తరువాత తిరిగి సీరియల్ నటుడు సతీష్ రెండవ వివాహం చేసుకుందని పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.వీరిద్దరికీ అబ్బాయి కూడా జన్మించారని అలాగే సీతను పెళ్లి చేసుకొని సతీష్ వేల కోట్ల ఆస్తులను తీసుకుని దారుణంగా మోసం చేశారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Serial Actor Satish: నటి సీత వందకోట్ల ఆస్తులు ఎలా పోయాయో బయట పెట్టిన సీరియల్ నటుడు సతీష్!

ఈ సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సతీష్ ఈ విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గురించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఇదంతా కేవలం మీడియా కల్పితాలు అంటూ సమాధానం చెప్పారు. మేమిద్దరం కేవలం మంచి స్నేహితుల మేనని అసలు వివాహం కూడా చేసుకోలేదని సతీష్ ఈ సందర్భంగా వెల్లడించారు.

మీడియా కల్పితాలు మాత్రమే…

ఇకపోతే తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత సీత ఒక అబ్బాయి కావాలని మగ పిల్లాడిని దత్తత తీసుకున్నారని సతీష్ క్లారిటీ ఇచ్చారు.ఇకపోతే తన వేలకోట్ల ఆస్తులు గురించి మాట్లాడుతూ తన ఆస్తిపాస్తులను ఎక్కడికీ పోలేదని తన దగ్గరే ఉన్నాయని తన ఆస్తులను తీసుకొని తనను మోసం చేశాడంటూ కొన్ని పత్రికలు ఇలాంటి కథనాలు సృష్టించారని ఇలాంటి వార్తలు చూసి తాము నవ్వుకున్నామని ఈ సందర్భంగా సతీష్ నటి సీత గారితో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు.

Divyavani: వాళ్లు శవాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లడిగే రకం.. సీనియర్ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు?

Divyavani:తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి దివ్య వాని ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉంటున్నారు. కళాకారుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఈమె ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. 2019లో టిడిపి తీర్థం పుచ్చుకున్న దివ్యవాణి పార్టీ కోసం అహర్నిశలు కష్ట పడ్డారు.

Divyavani: వాళ్లు శవాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లడిగే రకం.. సీనియర్ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు?

ఈ క్రమంలోనే పార్టీకార్యక్రమాలలోనూ ఎంతో యాక్టివ్గా ఉండే ఈమె తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోయారు. దివ్యవాణి టిడిపి పార్టీలో ఉన్నప్పటికీ తాను ఎంతో క్షోభ అనుభవించానని, రాజీనామాకు ముందే ఆమె పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Divyavani: వాళ్లు శవాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లడిగే రకం.. సీనియర్ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు?

తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన తర్వాత పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను పార్టీలో మీకు సరైన న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నలు వేసినప్పుడు లోలోపల ఎంతో బాధను అనుభవిస్తూ తనని తాను కంట్రోల్ చేసుకున్నానని ఈ సందర్భంగా దివ్యవాణి తెలిపారు. ఎలాంటి అధికారం లేని తనకు అధికార ప్రతినిధి అనే పేరు ఇచ్చారని ఈమె తెలిపారు.

మాట్లాడే అవకాశం ఇవ్వలేదు…

పార్టీ కోసం ఎంతో కష్టపడిన పార్టీలో సరైన గుర్తింపు లేదని పార్టీలో సరైన గైడెన్స్ ఇచ్చే వారు లేరని ఈమె వెల్లడించారు.ఎంతో కష్టపడి ఆరోగ్యం బాగా లేకపోయినా ఇంట్లో పిల్లల్ని వదిలేసి హుటాహుటిన మహానాడు కార్యక్రమానికి వచ్చానని, అయితే మహానాడు కార్యక్రమంలో తనకు కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదని వాపోయారు. ఇంటికి వెళ్లి ఎంతో బాధతో ఏడ్చానని ఆ సమయంలో తన పిల్లలు తనని తిట్టారని ఈమె వెల్లడించారు. బహుశా దారిలో నాకు ఏదైనా ప్రమాదం జరిగితే నా శవాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు అడిగే రకం అంటూ తెలుగుదేశం పార్టీపై ఈమె అసహనం వ్యక్తం చేశారు.ఇలా తెలుగుదేశం పార్టీ గురించి దివ్యవాణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.