Tag Archives: cricketer

Ravindra Jadeja: గాలిలోకి డబ్బులు విసిరిన క్రికెటర్ రవీంద్ర జడేజా.. విమర్శలు చేస్తున్న నేటిజన్స్!

Ravindra Jadeja: టీమిండి ఆల్ రౌండర్ రవీందర్ జడేజా ఎంతో సంతోషంలో ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ సంతోషంలో ఈయన డబ్బులను గాల్లోకి విసురుతూ తన సంతోషాన్ని వ్యక్తపరచడంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈయన వ్యవహారి శైలి పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే…

ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా రవీంద్ర జడేజా భార్య రివాబా జ‌డేజా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.ఈ ఎన్నికలలో భాగంగా రివాబా జడేజా అత్యధిక మెజార్టీతో గెలవడంతో రవీందర్ జడేజా సంతోషంలో మునిగితేలుతున్నారు. జడేజా బంగ్లాదేశ్ టూర్ కు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. గాయాన్ని సాకుగా చూపిన ఈయన.. భార్య ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.

రివాబా జామ్ నగర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఆప్ అభ్యర్థి కర్షన్ ‌భాయ్‌పై సుమారు 53 వేల ఓట్లకు మెజార్టీతో గెలుపొందారు ఇలా తన భార్య ఎమ్మెల్యేగా గెలవడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా హలో మై ఎమ్మెల్యే అంటూ సోషల్ మీడియా వేదికగా తన భార్యకు శుభాకాంక్షలు తెలిపారు.

Ravindra Jadeja: విజయానికి అర్హురాలు…

ఈ విజయానికి స్థానం అర్హురాలని జామ్ నగర్ ప్రజలు గెలిచార అంటూప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా తన భార్యకు తనను గెలిపించిన ప్రజలకు అభినందనలు తెలియజేశారు.ఈ ఆనందంలోనే రవీంద్ర జడేజా డబ్బులను గాల్లోకి విసరడంతో కొందరు ఈ విషయంపై స్పందించి చేతికి ఇవ్వచ్చు కదా ఇలా గాల్లో విసరడం ఏంటి ఏంటి అని మళ్ళీ పడుతున్నారు.

KL Rahul: ప్రేయసితో డిన్నర్ కెళ్ళిన క్రికెటర్ కేఎల్ రాహుల్.. భారీగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

KL Rahul: టి 20 వరల్డ్ కప్ మ్యాచ్లో భాగంగా ఇండియా ఫైనల్ కు వెళుతుందని ప్రతి ఒక్కరూ ధీమా వ్యక్తం చేశారు. అయితే అందరి ఆశలపై టీమ్ ఇండియా జట్టు నీళ్లు చల్లిందని చెప్పాలి. రెండో సెమీ ఫైనల్స్ లో భాగంగా ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలయింది. ఈసారి ఎలాగైనా కప్పు కొడతామని చెబుతూ ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయారు.

KL Rahul: బాలీవుడ్ స్టార్ హీరో కూతురితో ఏడడుగులు వేయనున్న కేఎల్ రాహుల్…పెళ్లేప్పుడంటే!

ఇకపోతే టి20 మ్యాచ్ లు మొదలైనప్పటి నుంచి పెద్ద ఎత్తున కేఎల్ రాహుల్ ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఈ టోర్నమెంట్ మొదలైనప్పటి నుంచి అతి పేలవ ప్రదర్శనతో అందరినీ నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఓపెనర్‌గా రావడం ఏమాత్రం పరుగులు సాధించలేక అవుట్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఈయన ఆట తీరు పట్ల ఎంతగానో విసుకు చెందుతూ దారుణంగా ఆయనను ట్రోల్ చేశారు.

ఇకపోతే తాజాగా మరోసారి కేఎల్ రాహుల్ మరోసారి నేటిజన్ ల ట్రోలింగ్ కి గురయ్యారు. సెమీస్‌కి రెండ్రోజుల ముందు టీమిండియా అడిలైడ్‌లోని బ్రిటిష్‌ రాజ్‌ రెస్టారెంట్‌కి డిన్నర్‌కి వెళ్లింది. ఇక్కడ క్రికెటర్స్ అందరూ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి డిన్నర్ కి వెళ్లారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ సైతం తన ప్రేయసితో కలిసి డిన్నర్ కి వెళ్ళగా అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

KL Rahul: పెళ్లి చేసుకుని ఆటకు గుడ్ బై చెప్పు..


ఈ ఫోటోలో రాహుల్ తన ప్రేయసి వంక తదేకంగా చూస్తున్నటువంటి ఫోటో వైరల్ కావడంతో కొందరు ఈ ఫోటోని తన ఆటకు ముడి పెడుతూ భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇలా ప్రేయసి వంక చూస్తూ ఉంటే ఆట ఇంకేం ఆడుతావ్ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఆట ఆడటం వదిలేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి టి20 సిరీస్ మొదలైనప్పటి నుంచి కేఎల్ రాహుల్ పట్ల అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

Sourav Ganguly -VVS Laxman: గంగూలీ కారణంగానే క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ వరల్డ్ కప్ ఆశలు గల్లంతు అయ్యాయా..? ఆ విషయంలో లక్ష్మణ్ ను దాదా ధారుణంగా మోసం చేసాడా?

Sourav Ganguly -VVS Laxman: టీమిండియా క్రికెటర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వివిఎస్ లక్ష్మణ్ సౌరవ్ గంగూలీ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మణికట్టు మాంత్రికుడిగా టెస్ట్ క్రికెట్లలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న వివిఎస్ లక్ష్మణ్ ఎంతో అద్భుతమైన ఆటతీరును కనపరుస్తూ ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న ఆస్ట్రేలియాను ఒంటి చేతితో ఓడించారు.

ఇలా ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టిస్తూ క్రికెటర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వివిఎస్ లక్ష్మణ్ తన క్రికెట్ ప్రస్థానంలో తనకు తీరని కోరిక అలాగే మిగిలిపోయిందని తెలుస్తోంది. అయితే లక్ష్మణ్ కోరిక తీరకుండా ఉండడానికి కారణం అప్పుడు ఇండియన్ కెప్టెన్ గా ఉన్నటువంటి సౌరఫ్ గంగూలీ అని తెలుస్తుంది.

లక్ష్మణ్ కి గంగూలి బద్ధ శత్రువుగా మారి తన కోరికను అణచివేసారని అప్పట్లో ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2001లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆడిన 281 పరుగుల ఇన్నింగ్స్‌ ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో ఒక సంచలనం. 1996 లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లతో వివిఎస్ లక్ష్మణ్ షార్ట్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. 2001 సంవత్సరానికి గాను క్రికెట్లో పీక్ స్టేజ్ కు చేరిన ఈయన 2003లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Sourav Ganguly -VVS Laxman: లక్ష్మణ్ కు శత్రువుగా మారిన గంగూలి..

2003 వ సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో తనకు చోటు ఖాయమని ఫిక్స్ అయిపోయినటువంటి లక్ష్మణ్ కు గంగూలి షాక్ ఇచ్చారు. ఆ సమయంలో టీం ఇండియన్ కెప్టెన్ గా ఉన్నటువంటి గంగూలీ మాత్రం తన ఆలోచనలతో వండే వరల్డ్ కప్ మ్యాచ్లో లక్ష్మణ్ కు చోటు కల్పించకుండా కేవలం ఒక సెంచరీ చేసిన కారణంతో దినేష్‌ మోంగియాను వన్డే వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తీసుకున్నాడు. ఇలా గంగూలి కారణంగా తన చిరకాల కోరిక అలాగే మిగిలిపోయిందని చెప్పాలి. ఇలా వండే వరల్డ్ కప్ మ్యాచ్లో లక్ష్మణ్ కు చోటు సంపాదించకపోవడంతో టీమిండియా ఫైనల్ వరకు వెళ్లిన చివరికి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలు కాక తప్పలేదని ఆ సమయంలో లక్ష్మణ్ కనుక టీం లో ఉండి ఉంటే ఇండియాకు వరల్డ్ కప్ ఖాయమంటూ ఎంతోమంది క్రికెట్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇలా లక్ష్మణ్ తీరని కోరికకు గంగూలి కారణమని చెప్పాలి.

Urvashi Rautela -Rishabh Pant: మళ్లీ ప్రేమలో పడ్డ అక్క తమ్ముడు.. ఇదేం రోత అంటూ మండిపడుతున్న ఫ్యాన్స్?

Urvashi Rautela -Rishabh Pant: సాధారణంగా సినీ సెలబ్రిటీలకు క్రికెటర్లకు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు క్రికెటర్లతో ప్రేమలో పడి వారిని పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు అలాగే ప్రేమలో ఉండి బ్రేకప్ చెప్పుకున్న వారు కూడా ఉన్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఊర్వశి రౌటేలా రిషబ్ పంత్ వ్యవహారం గురించి మనకు తెలిసిందే. వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు వచ్చినప్పటికీ అలాంటిదేమీ లేదని ఇద్దరి మధ్య అక్క తమ్ముళ్ల అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు.

ఇలా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం గురించి వార్తలు రావడం అలాగే వీరిద్దరి మధ్య ఏదో గొడవలు రావడంతో సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ అక్క తమ్ముడు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే క్రికెటర్ రిషబ్ సోషల్ మీడియా వేదికగా నన్ను వదిలే అక్క అంటూ కామెంట్ చేయగా ఈ కామెంట్ పై ఊర్వశి స్పందిస్తూ.. నా సంగతి వదిలేసి నువ్వు బ్యాటింగ్ సరిగ్గా చేయి తమ్ముడు అంటూ కామెంట్ చేశారు.

ఈ విధంగా అక్కా తమ్ముడు అంటూ పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నటువంటి వీరిద్దరి మధ్యవివాదానికి ముగింపు పలుకుతూ ఊర్వశి సారీ అంటూ ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఊర్వశి ఫ్లేట్ పిటాయిస్తూ ఆ సారీ రిషబ్ కి పెట్టలేదని కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Urvashi Rautela -Rishabh Pant:వీరి రిలేషన్ పై మండిపడుతున్న నెటిజన్స్

ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు అక్క తమ్ముడు అంటూ ట్రోల్ చేసుకున్నటువంటి వీరిద్దరూ తిరిగి ప్రేమికులుగా మారి చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇది తెలిసినటువంటి నేటిజన్స్.. అక్క తమ్ముళ్లు చట్టా పట్టాలు తిరగడం ఏంటి మరి ఇంత రోతగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి వీరి గురించి బాలీవుడ్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్తలపై ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Priyanka Jawalkar: క్రికెటర్ తో ప్రేమలో ఉన్న ప్రియాంక జవాల్కర్.. ఫోటో వైరల్!

Priyanka Jawalkar: ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన ప్రియాంక జవాల్కర్ సినిమాపై ఇష్టంతో పదవ తరగతి పూర్తి చేసుకున్న అనంతరం ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్లో చేరి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే 2017 వ సంవత్సరంలో కలవరం ఆయె సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తదుపరి చిత్రం విజయ్ దేవరకొండ సరసన నటించారు.

Priyanka Jawalkar: క్రికెటర్ తో ప్రేమలో ఉన్న ప్రియాంక జవాల్కర్.. ఫోటో వైరల్!

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా చిత్రంలో ప్రియాంక జవాల్కర్ సందడి చేస్తూ ఎంతోమంది కుర్రకారులకు అభిమాన హీరోయిన్ గా మారిపోయారు. ఇలా ఈమె రెండు సినిమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Priyanka Jawalkar: క్రికెటర్ తో ప్రేమలో ఉన్న ప్రియాంక జవాల్కర్.. ఫోటో వైరల్!

ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్దఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే గత కొంత కాలం నుంచి ఈమె క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ తో ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గతంలో ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేయడంతో వెంకటేష్ క్యూట్ అంటూ కామెంట్ చేశారు.

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మరికొన్ని ఫోటోలను షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ట్రెడిషనల్ డ్రెస్ లో ప్రియాంక ఒక వ్యక్తితో రెస్టారెంట్లో కూర్చుని సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు.అయితే ఆ వ్యక్తి మొహం కనపడకుండా వెనుక నుంచి తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మై లవ్ అంటూ హార్ట్ సింబల్ ఎమోజి షేర్ చేశారు.

మై లవ్ అంటూ ఫోటోలు షేర్ చేసిన ప్రియాంక…

ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటో పై కామెంట్ చేస్తూ వెనుక నుంచి అతనిని చూస్తుంటే వెంకటేష్ అయ్యర్ లాగే పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.మరి ఈమె నిజంగానే అతనితో ప్రేమలో ఉందా లేదా అనే విషయం తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి ఏది ఏమైనా ఈ ఫొటోలతో ప్రియాంక ప్రస్తుతం వార్తల్లో నిలిచారు.

KL Rahul: బాలీవుడ్ స్టార్ హీరో కూతురితో ఏడడుగులు వేయనున్న కేఎల్ రాహుల్…పెళ్లేప్పుడంటే!

KL Rahul: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు, క్రికెటర్లకు ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు క్రికెటర్లతో ప్రేమలో పడుతూ పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాగే మరికొందరు లవ్ బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం చాలామంది సినీ సెలబ్రిటీలు క్రికెటర్లను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు.

KL Rahul: బాలీవుడ్ స్టార్ హీరో కూతురితో ఏడడుగులు వేయనున్న కేఎల్ రాహుల్…పెళ్లేప్పుడంటే!

ఈ క్రమంలోనే మరికొన్ని రోజులలో మరొక క్రికెటర్ కూడా స్టార్ హీరో కూతురిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే ఐపీఎల్ లో సెంచరీల పై సెంచరీలు కొడుతూ క్రికెట్ అభిమానులను సందడి చేస్తున్న కె.ఎల్.రాహుల్ గత కొంతకాలం నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టీని ప్రేమిస్తున్నారు.

KL Rahul: బాలీవుడ్ స్టార్ హీరో కూతురితో ఏడడుగులు వేయనున్న కేఎల్ రాహుల్…పెళ్లేప్పుడంటే!

గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలలో తెలియడంతో వీరి ప్రేమ పెళ్లికి ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అతియా…

ఇక అతీయా విషయానికి వస్తే ఈమె సునీల్ శెట్టి కుమార్తెగా హీరో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.అనంతరం ముబారకన్, నవాబ్జాదె, మోతీచూర్ ఛక్నాచూర్ మూవీల్లో మెరిసింది. ఇలా స్టార్ హీరో కూతురుగా హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె గత కొన్ని సంవత్సరాల నుంచి కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్నారు. ఇక వీరి ప్రేమ గురించి పెద్దలకు తెలియడంతో పెద్దల అంగీకారంతో ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

Virat Kohli: విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ ద్వారా ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి వామికా అనే గారాలపట్టి రావడంతో వీరి జీవితం మరింత సంతోషంగా సాగిపోతుందని చెప్పాలి. విరాట్ కోహ్లీ అనుష్క శర్మ వృత్తిపరంగా సెలబ్రిటీలు కావడంతో వీరికి ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో మనకు తెలిసిందే.

Virat Kohli: విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ ద్వారా ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇలా వీరిద్దరు వృత్తి పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ జంట వీరికి సంబంధించి కేవలం ఒక పోస్ట్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఎన్నో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి.

Virat Kohli: విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ ద్వారా ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇకపోతే ఇప్పటి వరకు వీరికి సంబంధించిన ఎన్నో ఫోటోలను షేర్ చేసినప్పటికీ వీరి కూతురి వామిక ఫోటోని మాత్రం ఇప్పటివరకు చూపించలేదు.దీంతో ఎంతో మంది అభిమానులు వీరి గారాల పట్టిన చూడటానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. జనవరి 11వ తేదీ అనుష్క శర్మ తన కూతురికి జన్మనిచ్చి ఏడాది అవుతుంది. దీంతో ఆ రోజైనా తన కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తారని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఒక్క పోస్ట్ కి అన్ని కోట్లా..

ఇలా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి విరాట్ కోహ్లీ కేవలం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తే ఈయన సుమారు 680,000 డాలర్లు సంపాదిస్తారు. మన భారత దేశ కరెన్సీ ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 5.08 కోట్లు అందుకు ఉంటున్నట్లు తెలుస్తోంది.ఇలా సోషల్ మీడియా ద్వారా విరాట్ కోహ్లీ భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈయనకు ఇంస్టాగ్రామ్ లో 177 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం.

Pushpa Dialogue: క్రికెటర్ నోటి వెంట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగ్..‘నీయవ్వ తగ్గేదేలే’..అంటూ..!

Pushpa Dialogue: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ప్యాన్ ఇండిమా మూవీ అభిమానులను అలరిస్తోంది. అన్ని భాషల్లో కలెక్షన్ల విషయంలో దుమ్ము రేపుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్నీ కలయికతో వచ్చిన ఈసినిమా విడుదల కన్నా ముందు నుంచే రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Pushpa Dialogue: క్రికెటర్ నోటి వెంట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగ్..‘నీయవ్వ తగ్గేదేలే’..అంటూ..!

ముఖ్యంగా బన్నీ చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. ‘నీయవ్వ తగ్గదే లేదు’ అంటూ డైలాగ్ చెప్పిన స్టైల్ అందరిని ఆకట్టుకుంది. ఈ  డైలాగ్ జనాల నోటిలో నానుతోంది. బన్నీ మ్యానరిజం సెలబ్రెటీలను కూడా మెస్మరైజ్ చేసింది.

Pushpa Dialogue: క్రికెటర్ నోటి వెంట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగ్..‘నీయవ్వ తగ్గేదేలే’..అంటూ..!

దీంతో అన్ని భాషల్లో పుష్పకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా బన్నీ డైలాగ్ క్లబ్ లో చేరారు. ట్విట్టర్ వేదికగా బన్నీ చెప్పిన డైలాగ్ ను దింపేశాడు. దీంతో  బన్నీ అభిమానులు హ్యాపీ అవుతున్నారు. తమ స్టార్ డైలాగ్ కు దేశవ్యాప్తంగా ఫేమ్ వచ్చిందంటూ అభిమానులు ఆనందపడిపోతున్నారు.

జడేజా కూడా.. మాసిన గడ్డంతో ఇలా..

గాయం కారణంగా సౌతాఫ్రికా టూర్ కు దూరంగా ఉన్న జడేజా బెంగళూర్ లో నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టిస్ చేస్తున్నాడు. అయితే పుష్ప సినిమాలో లాగే… జడేజా కూడా మాసిన గడ్డంతో రగ్డ్ లుక్ తో మరో పుష్పగా మారారు. పుష్ప చెప్పిన విధంగానే డైలాగ్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక పుష్ప అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి రవీంద్ర జడేజా వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘పుష్ఫ రి రైజ్‌’కు సక్సెస్ టాక్ రావడంతో.. సక్సెస్ ఈవెంట్లతో పుష్ప టీం సందడి చేస్తోంది.

నగ్మా తో సీక్రెట్ గా పెళ్లి చేసుకుని భార్యకు తెలియడంతో విడాకులిచ్చిన క్రికెటర్ గంగూలీ..!

సినీ సెలబ్రిటీలకు క్రికెటర్లకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమలో పడి వారిని పెళ్లిళ్లు చేసుకోగా మరికొందరు వారితో రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సౌరబ్ గంగూలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈయన గతంలో నటి నగ్మాతో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయినట్లు వార్తలు వచ్చాయి.వీరిద్దరూ కలిసి విదేశీ పర్యటనలు చేయడం ప్రేమ పక్షులుగా చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీరి గురించి అప్పట్లో మీడియా కోడై కూసింది. ఒకానొక సమయంలో ఈమె తో ప్రేమలో మునిగిపోయి ఆటపై సౌరబ్ శ్రద్ధ చూపలేక పోయారని, అందువల్ల ప్రపంచ కప్ మిస్ చేసుకున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా కెరియర్ పరంగా ఇద్దరు మంచి పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ప్రేమలో పడ్డారని ఈ ప్రేమ కారణంగానే సౌరవ్ గంగూలీ ఎవరికీ తెలియకుండా తనని తిరుపతిలో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటివరకు గంగూలీ భార్య డోనా ఈ వార్తలు గురించి విని సెలబ్రిటీల విషయంలో ఈ విధమైనటువంటి వార్తలు రావడం సర్వసాధారణమని భావించింది ఎప్పుడైతే డోనా వీరిద్దరు తిరుపతి వెళ్ళినట్టు మీడియాలో చూపించారో ఆ సమయంలో ఇదే విషయమై తన భర్తని నిలదీసినట్టు తెలుస్తోంది.

ఇకపోతే తనతో ప్రేమ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న డోనా తనకు ఎలాంటి సంబంధం లేదని మీడియాకు చెప్తారా లేకపోతే నన్ను విడాకులు ఇవ్వమంటారా అని నిలదీయడంతో ప్రేమించిన వ్యక్తిని దూరం పెట్టి చిన్నప్పటినుంచి ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యతో సంతోషంగా గడుపుతున్నారనే విషయాన్ని ఒక సందర్భంలో సావి’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నగ్మా వెల్లడించారు.

క్రికెటర్ తో రిలేషన్లో ఉన్న రాశీఖన్నా.. నిజమెంత?

మద్రాస్‌ కేఫ్‌ అనే చిత్రంతో చిత్ర సీమకు పరిచయమైంది అందాల తార రాశీ ఖన్నా. తొలిసినిమాలోనే తనదైన నటనతో ఆకట్టుకుంది. తర్వాత అతడి రెండో సినిమాను తెలుగులో నటించింది. అది కూడా మనం చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. మూడో చిత్రంతో ఆమె ఫుల్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది.

2014లో ఊహలు గుసగుసలాడే చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలో తన క్యూట్‌ నటన, అందంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అనంతరం జోరు పెంచిన ఈ చిన్నది వరుస సినిమాల్లో నటిస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన రాశీ ఖన్నీ. ఆయితే ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తూ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది.

ఇక సోషల్ మీడియాలో ఆమె ఎప్పిటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను పోస్టు చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. ఆమె మొదటి సనిమా మద్రాస్ కేఫ్ కు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో ఆమె లాంగ్ ఇయర్ రింగ్స్, ఓపెన్ హెయిర్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఆమె ఫొటోలకు విపరీతంగా లైక్ లు వస్తున్నాయి.

ఆ చిత్రాలకు దాదాపు 3 లక్షలకు పైగా లైక్ లు వచ్చాయి. ఇక ఆమె వ్యక్తిగత సినిమాకు వస్తే.. భారత్ క్రికెటర్ జస్ప్రీత్‌ బుమ్రాతో ప్రేమాయణం నడిపారని మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. 2018 లో ఆమె అతడితో డేటింగ్ చేశారనే వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె ఈ మధ్య స్పందిస్తూ.. అతడు కేవలం క్రికెటర్ గా మాత్రమే తెలుసు అని చెప్పింది. తాజాగ ఆమె అతడితో ఎలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేసింది.