Tag Archives: crime news

AP News: ఆంటీ వయసు 54 యేళ్లు.. మేకప్ తో కవర్ చేస్తూ 30 ఏళ్ల అంటూ యువకుడిని వివాహమాడింది.. చివరికి ఇలా?

AP News: ప్రస్తుత కాలంలో రోజురోజుకు మోసం చేసే వారి సంఖ్య అధికమవుతుంది. మోసేపోయేవారు ఉన్నన్ని రోజులు మోసం చేస్తూనే ఉంటారు అన్నట్టు రోజురోజుకు మోసాల సంఖ్య అధికమవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు పెద్ద ఎత్తున ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ అబ్బాయిలను మోసం చేస్తున్నారు.

AP News: ఆంటీ వయసు 54 యేళ్లు.. మేకప్ తో కవర్ చేస్తూ 30 ఏళ్ల అంటూ యువకుడిని వివాహమాడింది.. చివరికి ఇలా?

తాజాగా ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో ఒకటి బయటపడింది. చిత్తూరు జిల్లాకు చెందిన శరణ్య అనే ఓ మహిళకు 54 సంవత్సరాలు. అయితే ఈమె మేకప్ వేసి వయస్సు బయటకు కనపడకుండా బాగా కవర్ చేశారు.ఇలా మేకప్ తో తనకు 30 సంవత్సరాలేనని చెబుతూ ఈమె 35 ఏళ్ల యువకుడిని వివాహం ఆడింది. ఇక పెళ్లి అయిన తర్వాత తన అసలు నాటకం బయటపెట్టింది.

AP News: ఆంటీ వయసు 54 యేళ్లు.. మేకప్ తో కవర్ చేస్తూ 30 ఏళ్ల అంటూ యువకుడిని వివాహమాడింది.. చివరికి ఇలా?

ఆ యువకుడి పేరుపై ఉన్న ఆస్తిని మొత్తం తన పేరుకు మార్చాలంటూ ప్రతిరోజు ఆ యువకుడిని వేధింపులకు గురి చేసేది. ఈ విధంగా ఆ మహిళ టార్చర్ భరించలేక ఆ యువకుడు ఆస్తి తన పేరుపై మార్చడానికి తన ఆధార్ కార్డు తీసుకున్నారు.అయితే ఆధార్ కార్డులో ఆమె వయసుతో పాటు ఆమె మొదటి భర్తకు సంబంధించిన వివరాలు కూడా ఉండడంతో ఒక్కసారిగా ఆ యువకుడు షాక్ అయ్యాడు.

ఆస్తికోసం మోసానికి పాల్పడిన యువతి…

ఈ విధంగా తనకు ముందుగానే పెళ్లి జరిగిందని అంతేకాకుండా తన వయసు 55 సంవత్సరాలని తెలియడంతో ఒక్కసారిగా ఆ యువకుడు కంగుతున్నాడు. ఈ విధంగా శరణ్య తనని మోసం చేయడంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఆ యువతకి వివాహం జరిగి ఇద్దరు కూతుర్లు ఉండడమే కాకుండా వారికి కూడా వివాహాలు జరిగాయి.అంతేకాకుండా ఆ యువకుడితో శరణ్యకు ఇది రెండవ వివాహం కాదు మూడవ వివాహం అని తెలియడంతో ఆ యువకుడు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Crime News: నెల రోజులు కాపుకాసి.. 10 నిమిషాల్లో ఖతం.. హైదరాబాద్ పరువు హత్య నిందితులు అరెస్ట్!

Crime News: హైదరాబాద్ లో బుధవారం సాయంత్రం పరువు హత్య జరిగిన సంగతి మనకు తెలిసిందే. వికారాబాద్‌ జిల్లా మర్పల్లికి చెందిన బిల్లిపురం నాగరాజు (25), ఆశ్రిన్‌ సుల్తానా ప్రేమించుకొని జనవరి నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆశ్రిన్‌ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని వీరిద్దరూ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లిపోయారు. అయితే తమ కోసం తమ కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టలేదని తెలుసుకున్న ఈ జంట తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

Crime News: నెల రోజులు కాపుకాసి.. 10 నిమిషాల్లో ఖతం.. హైదరాబాద్ పరువు హత్య నిందితులు అరెస్ట్!

వీరిద్దరూ హైదరాబాద్ వచ్చారని తెలుసుకున్న ఆశ్రిన్‌ సోదరుడు అతని బావ వీరి కదలికలను అనుసరిస్తూ బుధవారం సాయంత్రం నాగరాజు పై దాడి చేసి చంపిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా హైదరాబాదులో జరిగిన ఈ పరువు హత్య ఒక్కసారిగా సంచలనం అయింది. కులాంతర వివాహం చేసుకోవడంతో వీరి పై పగ పెంచుకున్న ఆశ్రిన్‌ సోదరుడు నెలరోజులపాటు వీరి కోసం గాలించి చివరికి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో బయటకు వెళ్లిన ఇతనిపై ఆశ్రిన్‌ సోదరుడు ఆమె భావ దాడి చేసి దారుణంగా చంపారు.

Crime News: నెల రోజులు కాపుకాసి.. 10 నిమిషాల్లో ఖతం.. హైదరాబాద్ పరువు హత్య నిందితులు అరెస్ట్!

కేవలం పది నిమిషాల్లోనే నాగరాజు పై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా
ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి సారథ్యంలో పోలీసులు గాలించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ హత్యలో భాగంగా ఆశ్రిన్‌ సోదరుడు ఆమె రెండవ అక్క భర్తతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రభుత్వ పరిహారం అందజేస్తుంది…

ఈ సందర్భంగా డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ నాగరాజు ఎస్సీ వర్గానికి చెందిన వారు కావడంతో ప్రభుత్వ పరిహారం అతడి కుటుంబానికి చేరుతుందని డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ తెలిపారు. తన కొడుకు మృతి చెందడంతో నాగరాజు కుటుంబసభ్యులు ఆశ్రిన్‌ను తమ వెంట మర్పల్లి తీసుకెళ్లారు.

Crime News: పేరుకు వైద్యుడు.. చేసిన పని మాత్రం పాడుపని.. ఏం చేశాడంటే..!

Crime News: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నా కొంతమంది కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఎన్ని శిక్షలు విధించిన మారడం లేదు. అమ్మాయి అని తెలిస్తే చాలు.. వయస్సుతో సంబంధం లేకుండా.. అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

Crime News: పేరుకు వైద్యుడు.. చేసిన పని మాత్రం పాడుపని.. ఏం చేశాడంటే..!

వాయి వరుసలు మరిచి.. బంధువులు అని కూడా చూడకుండా.. కూతురు వరుస అయ్యే వాళ్లతో కూడా పాడు పనులు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ క్షేమంగా తిరిగి ఇంటికి వస్తుందన్న నమ్మకం లేకుండా చేస్తున్నారు ప్రబుద్ధులు.

Crime News: పేరుకు వైద్యుడు.. చేసిన పని మాత్రం పాడుపని.. ఏం చేశాడంటే..!

ప్రేమ పేరుతో మోసం చేసి ఆత్యాచారానికి పాల్పడిన ఘటనలు కూడా కొకొల్లలు జరిగాయి.ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో రాకేశ్ అనే అతడు సీనియర్ వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల అతడికి ఓ అమ్మాయి మ్యాట్రిమోని వెబ్ సైట్ ద్వారా పరిచయం అయింది.

వైద్యులు పోలీసులకు సమాచారం అందించగా..


ఆ రోజునుంచి ఫోన్లలో మాట్లాడుకుంటూ.. ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. ఇదే అదునుగా భావించిన అతడు ఆమెను ఓ రోజు ఆసుపత్రికి రమ్మని పిలిచాడు. అక్కడ నుంచి అతడు ఆమెను తన క్వార్టర్స్ కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను మాటల్లో పెట్టి.. మాయమాటలు చెప్పి.. అత్యాచారం చేశాడు. ఈ ఘటన తర్వాత ఆమె స్పృహతప్పి పడిపోయింది. భయపడిపోయిన ఆమెను రాకేశ్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షలు చసిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు వెల్లడించారు. దీంతో రాకేశ్ అక్కడ నుంచి పారిపోయాడు. వైద్యులు పోలీసులకు సమాచారం అందించగా.. ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అతడు పని చేస్తున్న ఆసుపత్రికి వెళ్లిన పోలీసులకు అతడు పరారీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీనిపై పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా అతడి ఆచూకీ తెలుసుకున్నారు.

Crime news: సొంత కోడలిపైనే కన్నేసిన మామ.. కొడుకు చనిపోయడానే కనికరం లేకుండా దారుణం!

Crime news: వావీ వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు కామాంధులు. సంబంధాలకు విలువ ఇవ్వడం లేదు. చిన్నాపెద్దా అనే తారతమ్యాలు లేకుండా… బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో దేశంలో అత్యాచార ఘటనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దగ్గర ఉంటున్న వారే అత్యాచారాలకు తెగబడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటలనే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. 

Crime news: సొంత కోడలిపైనే కన్నేసిన మామ.. కొడుకు చనిపోయడానే కనికరం లేకుండా దారుణం!

చెట్టంత కొడుకు పోయాడనే దిగులు లేకుండా… సొంత కోడలుపైనే కన్నేశాడు కసాయి మామ. తన కొడుకు చనిపోయాడని బాధలేకుండా.. కామంతో ప్రవర్తించి.. సొంత కూతరులా చూసుకోవాల్సిన కోడలిపైనే మోజు పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడు.. మాట వినడం లేదనే ఆగ్రహంతో ఆమెపై హత్యాచారం చేశారు. 

Crime news: సొంత కోడలిపైనే కన్నేసిన మామ.. కొడుకు చనిపోయడానే కనికరం లేకుండా దారుణం!

ఖమ్మం జిల్లా చింతకాని మండలం రైల్వే కాలనీ చెందిన ఓ వ్యక్తి తన సొంత సోదరి కూతురునే తన కోడలిగా తెచ్చుకున్నాడు. సొంత కొడుకు ఇచ్చి వివాహం జరిపించాడు. ఇదిలా ఉంటే ఇటీవల అనారోగ్య కారణాల వల్ల కుమారుడు మరణించాడు. 

కోడలిపై హత్యాయత్నం:

కొన్నాళ్లుగా తనను పెళ్లి చేసుకోవానలి కోడలిపై మామ ఒత్తడి చేయడం ప్రారంభించాడు. ఈ విషయంపై కుటుంబంలో మంగళవారం ఘర్షణ కూడా  జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన మామ, కోడలిని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు.ఈ సమయంలో బాధితురాలి తల్లి అడ్డుగా వెళ్లింది. దీంతో ఆమెకు రెండు చోట్ల కత్తి పోట్లు తగిలాయి. .. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కెోడలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Crime news: అతిగా ఆశ పడితే.. బంపర్ ఆఫర్ పేరిట టోకరా..

Crime news: ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. నమ్మితే చాలు డబ్బులు దోచేస్తున్నారు. లాటరీ తగిలిందని.. ఎంతో కొంత డబ్బులు కడితే కస్టమ్స్ క్లియరెన్స్ లభిస్తుందని.. ఇలా మనం కొనని లాటరీకి బంపర్ ఆఫర్ తగిలిందంటూ.. ఫ్రాడ్ చేస్తున్నారు. మనలో ఉన్న అధిక ఆశను దోపిడీదారులు సొమ్ము చేసుకుంటున్నారు. 

Crime news: అతిగా ఆశ పడితే.. బంపర్ ఆఫర్ పేరిట టోకరా..

ఇదిలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజపేటలో  కూడా ఇలాంటి మోసం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. బాధితుడు లింగాల వెంకటేష్ కు బంపర్ ఆఫర్ వచ్చిందని కేవలం… రూ. 1200 చెల్లిస్తే మంచి చీర, ముక్కుపుడక, మెడలో వేసుకునే గొలుసు అందచేస్తామని వారం క్రితం మొబైల్ నెంబర్ 7093492081 నుంచి కాల్ వచ్చినట్లు పేర్కొన్నాడు. 

Crime news: అతిగా ఆశ పడితే.. బంపర్ ఆఫర్ పేరిట టోకరా..

మంగళవారం అదే ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేసి మీ ఆఫర్ పార్సిల్ పోస్టాఫీస్ కు వచ్చిందని.. త్వరగా వెళ్లి తీసుకోండని తెలిపారు. ఎంతో ఆనందంగా వెళ్లిన బాధితుడు వెంకటేష్.. అక్కక ఫోస్ట్ మాస్టర్ కు రూ. 1200.. పోస్టల్ ఛార్జీ రూ. 60 చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు. 

పార్సిల్ లో కేవలం చీరమాత్రమే ఉంది:

ఎంతో ఆశగా పార్సిల్ తెరిచి చూస్తే.. అందులో కేవలం చీర మాత్రమే ఉందని మిగతా వస్తువులు ఏమీ లేవని వాపోయాడు. ఆ చీర కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతకమ్మ చీరను పోలి ఉందని ఆయన అన్నారు. తిరిగి ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే.. ఎలాంటి స్పందన రాలేదని బాధితుడు వెంకటేష్ వెల్లడించారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఆ పార్శిల్ పైన సాయిగంగ ఏజెన్సీ, ఏటీ కాలనీ, గుంటూరు-522001గా చిరునామా ఉందని తెలిపారు.

Crime news: మామతో అక్రమ సంబంధం.. బండారం బయటపడుతుందని కన్న కూతురినీ హత్యచేసిన కసాయి తల్లి…!

Crime news: కన్న కూతురనే కనికరం లేదు.. మనవరాలు అనే మమకారం లేదు. తన అనైతిక సంబంధాన్ని ఎక్కక  బయటపెడుతుందో అని ఓ తల్లి కర్కషంగా ప్రవర్తించింది. భర్త తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని బరితెగించింది. సొంత కూతురునే దారుణంగా చంపేసింది. 

Crime news: మామతో అక్రమ సంబంధం.. బండారం బయటపడుతుందని కన్న కూతురినీ హత్యచేసిన కసాయి తల్లి…!

ఈ ఘటన ఖమ్మం జిల్ల బోనకల్ లో జరిగింది. ఓ మహిళ తన భర్త తండ్రితోనే అక్రమ సంబంధం నెరుపుతూ.. ఎక్కడ తమ బండారాన్ని భర్తకు చెబుతుందో అని భయపడి కన్న కూతురును కడతేర్చింది. చివరకు పోలీస్ విచారణలో నేరాన్ని అంగీకరించింది. వైరా ఏసీపీ స్నేహ మెహ్రా ఈ దారుణానికి సంబంధించి వివరాలను వెల్లడించారు. 

Crime news: మామతో అక్రమ సంబంధం.. బండారం బయటపడుతుందని కన్న కూతురినీ హత్యచేసిన కసాయి తల్లి…!

బోనకల్ కు చెందని పాలెపు హరికృష్ణ– సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. హరికృష్ణ లారీ, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరుచూ పని నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్తుంటాడు. దీంతో ఇంటి వద్ద తక్కువగానే ఉండే వాడు. ఈక్రమంలో సునీత భర్త తండ్రి నర్సింహరావుతో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. ఐదారేళ్లుగా ఇది కొనసాగుతున్నా.. ఇటీవల తల్లి-తాత ఒకే గదిలో ఉండటాన్ని గమనించింది పెద్ద కూతురు మహాదేవి(11). ఈ విషయాన్ని తండ్రికి చెబుతా  అని బెదిరించింది. దీంతో సునీత, నర్సింహారావులు ఆ మెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు.

దారుణంగా చంపి పిట్స్ తో మృతిగా స్కెచ్..

ఈ నెల 8న మహాదేవి కాళ్లు, చేతులను చున్నీతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వైరుతో మెడకు బిగించి సునీత, నర్సింహారావులు హతమర్చారు. పాప స్కూల్ లో పిట్స్ వచ్చి చనిపోయిందని స్కెచ్ వేశారు. అయితే పాపమెడపై ఉన్న కమిలిన గాయాలను బంధువులు గమనించి పోలీసులకు చెప్పడంతో వారు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. మహాదేవి హత్యకు గురైనట్లు నివేదిక రావడంతో పోలీసులు బాలిక తల్లి, తాతను అదుపులోకి తీసుకుని విచారించారు. మహాదేవిని తామే హత్య చేసినట్లు సునీత, నర్సింహారావు అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు

Crime news: అనైతిక సంబంధానికి అడ్డుగా ఉందని.. తల్లిపట్ల దారుణంగా ప్రవర్తించిన కూతురు.. ఏం చేసిందంటే?

Crime news: రోజురోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. క్షణకాలం సుఖం కోసం సొంతవాళ్లనే కడతేరుస్తున్నారు. వారి బంగారు జీవితాల్లో చీకటి నింపుకుంటున్నారు. పెళ్లయి పిల్లలు ఉన్నవారు ప్రియుడి మోజులో పడి సొంత పిల్లలు, భర్తలను అత్యంత కిరాతకంగా చంపారనే వార్తలను చూస్తూనే ఉన్నాం. ఇక వావీవరసలు మరిచి విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. తమ సుఖానికి అడ్డుగా ఉన్నారని అడ్డు తొలగించుకుంటున్నారు. తాాగాజా ఇటాంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. కూతురు ప్రియుడితో కలిసి సొంత తల్లినే చంపేసింది.

Crime news: అనైతిక సంబంధానికి అడ్డుగా ఉందని.. తల్లిపట్ల దారుణంగా ప్రవర్తించిన కూతురు.. ఏం చేసిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళితే.. తన సంతోషానికి అడ్డుగా ఉందని సొంత కూతరే కన్న తల్లిని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. కర్ణాటక రాష్ట్రం తుముకూరు కొరటిగెరె పట్టణం సజ్జనర వీధిలో నివాసం సుమిత్ర(45)కు పెళ్లికాని కూతురు శైలజ ఉంది.

Crime news: అనైతిక సంబంధానికి అడ్డుగా ఉందని.. తల్లిపట్ల దారుణంగా ప్రవర్తించిన కూతురు.. ఏం చేసిందంటే?

శైలజకు సోదరుడి వరసయ్యే దూరపు బంధువు పునీత్ తో పరిచయం ఏర్పడి అనైతిక సంబంధానికి దారి తీసింంది. ఇది తెలుసుకున్న శైలజ తల్లి సుమిత్ర పునీత్ ని తమ ఇంటి వైపు రావద్దని హెచ్చరించింది. 

తల్లిని చంపి కొత్త డ్రామాకు తెరలేపింది..

తమ సంబంధానికి తల్లి అడ్డుగా ఉందని భావించిన శైలజ, తన ప్రియుడు పునీత్ తో కలిసి దారుణమైన నిర్ణయం తీసుకుంది. జనవరి 30న రాత్రి తల్లిని గొంతు పిసికి చంపేసింది. ఇంటి ముందు ఉన్న సంపులో పడేసింది. మరుసటి రోజు తల్లి అనుకోకుండా సంపులో జారి పడి చనిపోయిందని డ్రామాకు తెరలేపింది. అందరికి చెప్పి అంత్యక్రియలు కూడా జరిపింది. కొరటిగెరె పోలీసులకు ఎవరో ఈ కేసు గురించి చెప్పడంతో ఇద్దరిని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నారు. దీంతో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Crime News: కృష్ణాజిల్లాలో విషాదం.. వరకట్న వేధింపులు భరించలేక గర్భవతి ఆత్మహత్య..!

Crime News: ఈ మధ్యకాలంలో అతి చిన్న వయసులోనే యువత ప్రేమ పేరుతో తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.పిచ్చుక దేవేంద్రకుమార్, కుసుమలక్ష్మి ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో 2021లో వివాహం చేసుకున్నారు.

Crime News: కృష్ణాజిల్లాలో విషాదం.. వరకట్న వేధింపులు భరించలేక గర్భవతి ఆత్మహత్య..!

వివాహం తర్వాత దంపతులిద్దరూ తల్లిదండ్రుల వద్దే ఉంటూ మూడు నెలలపాటు కాపురం చేశారు. తర్వాత కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కారణంగా పెద్దమనుషుల సలహా మేరకు దేవేంద్ర కుమార్ దంపతులు పట్టణంలోని 12వ వార్డులోని అద్దె ఇంట్లో ఉంటున్నారు.

Crime News: కృష్ణాజిల్లాలో విషాదం.. వరకట్న వేధింపులు భరించలేక గర్భవతి ఆత్మహత్య..!

వేరు కాపురం పెట్టిన కూడా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో గురువారం ఉదయం కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కుసుమలక్ష్మి ఫోన్ చేసి తన తల్లికి చెప్పి బాధ పడింది. కుసుమ లక్ష్మి తల్లి తన కూతురిని ఓదార్చి తాను వస్తున్నానని.. గొడవ పడొద్దని కూతురితో చెప్పింది. కుసుమ లక్ష్మి తల్లి ఇంటినుండి బయలుదేరి కూతురు ఇంటికి వచ్చేలోపు తన కూతురు ఇంట్లో దూలానికి వేలాడుతూ శవమై కనిపించింది. వెంటనే ఆమె చుట్టుపక్కల వారి సహాయంతో కూతురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించడంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఈ సంఘటన గురించి విచారణ చేపట్టారు.

అదనపు కట్నం కోసం వేధింపులు…

ఈ క్రమంలో పోలీసులు బాధితురాలి తల్లిని విచారించగా.. పెళ్లి అయిన సమయం నుండి తన కుమార్తె అత్త ,మొగుడు ,బావ ,ఆడపడుచు నిత్యం తన కూతురిని అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసేవారని ఆమె చెప్పుకొచ్చింది. వారి వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన కుమార్తె 5 వారాల గర్భిణీ అని, బుధవారం ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించి తీసుకువచ్చారని ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

CRIME: ఐదేళ్లుగా ఇంట్లో ఎవరూ లేరు.. అయినా అస్థిపంజరం దొరికింది..? ఎలా..?

CRIME: బీహార్ నలంద జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇల్లు వదిలి ఉపాధికి వెళ్లిన ఓ కుటుంబం.. ఐదారేళ్ల తరువాత ఇంటికి రావడంతో అక్కడ జరిగింది చూసి షాక్ తిన్నారు. ఇంటికి తాళాలు వేసి ఉన్నా.. ఇంట్లో ఓ మనిషి అస్థిపంజరం దొరకడం అందర్ని భయాందోళనకు గురిచేసింది.

CRIME: ఐదేళ్లుగా ఇంట్లో ఎవరూ లేరు.. అయినా అస్థిపంజరం దొరికింది..? ఎలా..?

వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని సర్మేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో దాదాపు 5-6 ఏళ్ల నుంచి ఓ ఇళ్లు మూసి ఉంది. అందులో ఉండే కుటుంబీకులు నారో కాబ్లర్ అనే వ్యక్తి అతని భార్య పిల్లలతో ఢిల్లీకి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. దీంతో మీర్ నగర్ గ్రామంలో తన సొంతింటికి తాళాలు వేసి ఊరు వదిలాడు.

CRIME: ఐదేళ్లుగా ఇంట్లో ఎవరూ లేరు.. అయినా అస్థిపంజరం దొరికింది..? ఎలా..?

అయితే ఇటీవల ఢిల్లీ నుంచి సొంతూరుకు వచ్చాడు.  తాళాలు తీసి ఇంట్లోకి అడుగుపెట్టగానే ఓ ఘాడమైన వాసన రావడంతో.. ఇళ్లంతా వెతికాడు. ఓ ప్రదేశంలో నుంచి ఎక్కువ వాసన వస్తుందని గుర్తించి తవ్వి చూస్తే.. మనిషి అస్థి పంజరం బయటపడింది. దీంతో భయపడిన కుటుంబీకులు.. ఆ విషయాన్ని గ్రామస్థులకు తెలియ జేశారు. 


ఫోరెన్సిక్ పరీక్షకు అస్థిపంజర్..

ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని.. గ్రామంలో విచారించారు. అస్థి పంజరాన్ని పోలీసులు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పాట్నాకు తరలించామని సర్మెర స్టేషన్ ఇంఛార్జ్ వివేక్ రాజ్ తెలిపాడు. అసలు పోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం భయటపడనుంది. తాళాలు వేసి ఉంచిన ఇంటిలోకి శవం ఎలా వచ్చింది…ఎవరైనా చంపి ఖాళీగా ఉన్న ఇంట్లో పాతిపెట్టారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Crime News: ఎంచక్కా ఫ్లైట్లలో వస్తారు..! సైకిళ్లపై రెక్కిచేసి, ఇళ్లుగుళ్ల చేస్తారు..!

Crime News: బడా బాబుల్లా విమానాల్లో వస్తారు… సైకిల్ పై తిరుగుతూ.. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తారు.. ఆతరువాత ఇళ్లును గుల్ల చేస్తారు. ఆ తరువాత రైల్లో సొంతూళ్లకు చెక్కెస్తారు. ఇలా దొంగతనాలకు పాల్పడే ముఠాను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. పశ్చిమ బెంగాల్ కు చెందిన దొంగలముఠా ఆటకట్టించారు.

Crime News: ఎంచక్కా ఫ్లైట్లలో వస్తారు..! సైకిళ్లపై రెక్కిచేసి, ఇళ్లుగుళ్ల చేస్తారు..!

ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేసి ఊచల వెనక్కి పంపారు. వారి వద్ద నుంచి సైకిల్, 520 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, రూ. 91 వేలను సహా.. మొత్తం రూ. 27.16 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే… రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఎఫ్బీఐ కాలనీకి చెందిన రైటర్డ్ వీఆర్వో లక్ష్మీనరసింహ రావు గతేడాది డిసెంబర్ 18న కుటుంబంతో షాపింగ్ కు వెళ్లాడు.

Crime News: ఎంచక్కా ఫ్లైట్లలో వస్తారు..! సైకిళ్లపై రెక్కిచేసి, ఇళ్లుగుళ్ల చేస్తారు..!

అలా వెళ్లి వచ్చే వరకు ఇంటిని దొంగలు దోచేశారు. ఇంటి వెనకాల ఉన్న డోర్ తాళం పగలగొట్టి ఇంటిలోకి వెళ్లిన దొంగలు బీరువాను, అల్మారాను పగలకొట్టి 30 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాలనీలో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

సీసీ పుటేజ్ ఆధారంగా ..

సీసీ పుటేజ్ ఆధారంగా దొంగలిద్దరు సాహెబ్ నగర్ లో ఓ రూంలో అద్దెకు ఉన్నట్లుగా తేల్చారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా… చోరీ చేసిన దొంగల్ని గుర్తించారు. గతంలో కూడా ఈ ముఠా సూర్యాపేటలో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈనెల 4న మళ్లీ చోరీ చేసేందుకు వచ్చిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. దొంగల్ని పశ్చిమ బెంగాల్ ముషీరాబాద్, కోల్ కతాలకు చెందిన రఫికుల్ ఖాన్, షేక్ సూరజ్ లుగా గుర్తించి రిమాండ్కు తరలించారు. తెలంగాణలో వీరిపై మొత్తం 14 కేసులు ఉన్నాయి. దోచుకున్న సొమ్మును ముషీరాబాద్ కు చెందిన అనిత్ సీతారాం బండగర్, నోబిన్ అనే వ్యక్తులకు అమ్మేసేవారిని పోలీసులు వెల్లడించారు. వీరిపై కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.