Tag Archives: dasara

Actor Nani: హీరో నానికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన శృతిహాసన్ లవర్… కృతజ్ఞతలు తెలిపిన నాని!

Actor Nani: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటించిన దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా అన్ని భాషలలోనూ మంచి కలెక్షన్లను రాబడుతుంది.

ప్రస్తుతం నాని దసరా సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో నానికి ఊహించని విధంగా నటి శృతిహాసన్ ప్రియుడు శంతను హజారికా అదిరిపోయే గిఫ్ట్ పంపిస్తూ తనకి సర్ప్రైజ్ చేశారు. శంతను డూడల్ ఆర్టిస్ట్ అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన తనదైన శైలిలో కళాఖండాలు రూపొందిస్తుంటారు.

ఇకపోతే తాజాగా దసరా చిత్రంలోని నాని ఐకానిక్ స్టిల్ డూడుల్ ఆర్ట్ లో రూపొందించారు. దసరా చిత్ర డూడుల్ ఆర్ట్ పోస్టర్ అదిరిపోగా నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ సర్ప్రైజ్ డూడుల్ ఆర్ట్ రూపొందిస్తూ శంతను నాని పై ఉన్నటువంటి తన అభిమానాన్ని తెలియజేశారు. ఇక ఈ విషయంపై నాని స్పందిస్తూ తనకు కృతజ్ఞతలు తెలిపారు.

Actor Nani:సక్సెస్ సెలబ్రేషన్స్ లో దసరా టీం…

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాలో నానితో పాటు కీర్తి సురేష్ నటించిన విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకు అన్ని భాషలలో అనుహ్యమైన స్పందన రావడంతో చిత్ర బృందం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

Dasara Director: మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించిన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ గురించి ఈ విషయాలు తెలుసా?

Dasara Director: నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జంటగా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా నాని కీర్తి సురేష్ డి గ్లామర్ పాత్రలలో నటించిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

సాధారణంగా కొత్త దర్శకుడు అంటే కేవలం సొంత భాష చిత్రాన్ని తెరకెక్కిస్తారు కానీ ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అనంతరం డైరెక్టర్ గా మారిన శ్రీకాంత్ మాత్రం ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో సినిమాని చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శ్రీకాంత్ ఓదెలఎవరు ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే….

శ్రీకాంత్ ఓదెల మరెవరో కాదు లెక్కల మాస్టర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడే. శ్రీకాంత్ కరీంనగర్ జిల్లా సింగరేణి ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి శ్రీకాంత్ 2016లో టు ఫాదర్ విత్ లవ్ అనే షార్ట్ ఫిలిం కు ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇలా మొదలైన తన ప్రస్థానం నేడు పాన్ ఇండియా స్థాయి వరకు మారుమోగుతుంది.

Dasara Director: సుకుమార్ శిష్యుడే శ్రీకాంత్…


ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీకాంత్ మొదట్లో సుకుమార్ దగ్గర శిష్యరికం చేశారు.సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాకు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ అనంతరం నాని హీరోగా దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమా మంచి హిట్ అవడంతో శ్రీకాంత్ కు వరుస అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.

Hero Nani: అందరి ముందు ఆ డైరెక్టర్ దారుణంగా అవమానించారు… చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న నాని!

Hero Nani: సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి ఏ విధమైనటువంటి అవమానాలు, ఇబ్బందులు లేకుండా అవకాశాలు వస్తాయి.ఇలా అవకాశాలు వచ్చిన తర్వాత వారి టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో కొనసాగడం లేదా ఇండస్ట్రీకి దూరం అవడం అనేది జరుగుతుంది. కానీ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఉన్న వారికి అవకాశాలు రావడమే గగనం.

ఇలా అవకాశాల కోసం తిరుగుతూ ఎంతో మంది చేత అవమానాలను, తిరస్కరణలను ఎదుర్కొంటూ ఉంటారు.ఇలా ఎంతోమంది ఇలాంటి అవమానాలను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు.

ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన నాని తర్వాత డైరెక్టర్ గాను అలాగే హీరోగా స్థిరపడి మంచి గుర్తింపు పొందారు.ఇక ప్రస్తుతం ఈయన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా మార్చి 30 తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్నటువంటి అవమానాలను చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కెరియర్ మొదట్లో తాను కూడా ఎన్నో కష్టాలను అవమానాలను పడ్డానని తెలిపారు.


Hero Nani: డైరెక్టర్ కాలేనని అవమానించారు…

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఇక్కడ ఏం జరుగుతుందో తనకు తెలిసేది కాదని, ఎవరు తనకు చెప్పి సహాయం చేసేవారు కాదని తెలిపారు. అందరిలాగే తాను కూడా కష్టాలను పడ్డానని తెలిపారు. ఇక ఒక డైరెక్టర్ అందరి ముందు సెట్ లో నన్ను దారుణంగా అవమానించారని గుర్తు చేసుకున్నారు. నువ్వు ఈ జన్మకు డైరెక్టర్ కాలేవు అంటూ ఆయన తనని అవమానించారని, అయితే ఆ క్షణం బాధపడిన నాలో మరింత కసి పెంచుకొని నేను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ డైరెక్టర్ అవమానాలే కారణమని నాని తెలిపారు. మరి నానిను అవమానించిన ఆ డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు.

పవన్ తో మాట్లాడాను.. మీరెందుకు నమ్మడం లేదు: మంచు విష్ణు

దసరా తర్వాత నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. దీనిని గవర్నర్ దత్తాత్రేయ నేతృత్వంలో మొదట జరిగింది. ఈ కార్యక్రమంలో ప‌లువురు రాజ‌కీయ‌, సినీ, ప్రజాసంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. దీనిలో తాజాగా మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, జనసేన అధినేత పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అయితే వేదిక‌పై వీరిద్దరూ ప‌ర‌స్పరం ప‌ల‌క‌రించుకోక పోవడం చర్చనీయంశమైయింది. దీనిపై సీని వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై మంచు విష్ణు స్పందించారు. ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అంశంపై స్పందించాడు . అలయ్ బలయ్ కార్యక్రమంలో స్టేజ్ పైకి రాకముందే పవన్ కళ్యాణ్ తో తాను మాట్టాడాను అని.. మేమిద్దం చాలా విషయాలపై చర్చించుకున్నట్లు తెలిపాడు. ప్రోటోకాల్‌ ప్రకారం మేమిద్దరం స్టేజ్‌పై మాట్లాడుకోలేదు. స్టేజ్‌ మీద ఏం జరిగిందో అది మాత్రమే మీడియాకి తెలిసింది. పవన్ పెద్ద స్టార్ అని.. అతడి సహకారం ‘మా’ కు అవసరం అని పేర్కొన్నాడు. నేను, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులం.

ఆ కార్యక్రమంలో మేము మాట్లాడుకున్నాము అంటే మీరు ఎందుకు నమ్మరు? మాకు, మెగా ఫ్యామిలీకి మధ్య ఎప్పటికీ గోడవలు ఉండవంటూ విష్ణు కామెంట్స్ చేయడం విశేషం. ఇక మా లో మూకుమ్మడి రాజీనామాలపై అతడు మాట్లాడుతూ.. వాళ్లు రాజీనామాలు చేసినట్లు మీడియా ద్వారానే నాకు తెలుసు.. కానీ నాకు ఒక్కరి నుంచి మాత్రమే రాజీనామా అందిందని చెప్పాడు. మిగిలిన వాళ్ల నుంచి కూడా వచ్చాక.. మేము ఒక్కసారి చర్చించుకుని.. సినీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశాడు.

పూజా హెగ్డే సంపాదన ఎంతో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే..!

ఇప్పుడు సినీ పరిశ్రమలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అని చెప్పవచ్చు. వరుస సినిమాలతో ఆమె మస్తు బిజీగా ఉన్నారు. తన అంద చందాలతో, నటనతో కుర్రకారులను కట్టిపడేస్తుంది.

మొదట అక్కినేని నాగచైతన్య సరసన ‘ఒక లైలా కోసం’ అనే సినిమాలో నటించిన ఈ బుట్టబొమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. ఇటు బాలీవుడ్ లో కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలతో నటించింది. ప్రస్తుతం తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు సిద్ధం అయింది.

విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. అయితే విజయదశమి రోజును విడుదల అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో పూజా.. అక్కినేని అఖిల్ తో జత కట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక త్వరలో ప్రభాస్ నటించిన సినిమా రాధేశ్యామ్ లో కూడా నటించింది. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇంత బిజీగా ఉన్న పూజా హెగ్డే సంపాదన ఎంతో తెలుసుకోవాలని చాలామందికి అనిపిస్తుంటుంది. అయితే కొన్ని వార్తలు ఆమె రెమ్యూనరేషన్ మీద సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం పూజా ఒక్క సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ. 4కోట్ల వరకు తీసుకుంటోందట. ఇంకా మున్ముందు ఆమె రెమ్యూనరేషన్ పెరిగే అవకాశం కూడా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె అటు యాడ్స్ లో కూడా నటిస్తోంది కనుక దాదాపు ఆమె సంపాదన రూ.50 కోట్ల నుంచి రూ. 70 కోట్ల మధ్యలో ఉన్నట్లు సినీ వర్గాల టాక్.

సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్ పై.. స్పందించిన పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..!

కొన్ని రోజుల కిందట బైక్ ప్రమాదంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అతడు ఆసుపత్రిని నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 35 రోజుల పాటు అతడు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నాడు.

ఈ క్రమంలో అతడు పూర్తిగా కోలుకొని అతడు ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని మెగస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ ఇలా ఉన్నారు. ‘అనుకోకుండా ప్రమాదం బారిన పడి గత నెల రోజులుగా చికిత్స పొందిన సాయి కోలుకొని క్షేమంగా ఇంటికి చేరాడు.. విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వ‌దినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావ‌డం మా కుటుంబం అందరికి ఎంతో సంతోషాన్ని క‌లిగించింది.

ఈ రోజు తేజ్ పుట్టిన రోజు. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని విజ‌యాలు అందుకొని ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాలు మ‌రింత‌గా పొందాల‌ని శక్తి స్వ‌రూపిణిని ప్రార్ధిస్తున్నాను. తేజ్ ఆసుప‌త్రిలో చేరిన‌ప్ప‌టి నుంచి అభిమానులు ఎంతో బాధ‌ప‌డ్డారు’ అని అన్నాడు.అలాగే తేజ్ ఆరోగ్యంగా ఉండాలని.. ఆలయాల్లో పూజలు చేసి.. ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను’ అంటూ పవన్‌ చెప్పుకొచ్చాడు.

వారి పూజలు ఫలించాయని పేర్కొన్నాడు. తేజ్ క్షేమంగా తిరిగి ఇంటికి రావడంపై మెగా అభిమానులు, మెగా బ్రదర్స్ ఆనందం వ్యక్తం చేశారు. అది పండుగ రోజు ఇంటికి రావడంతో ఆ ఆనందం ఇంకా రెంట్టింపు అయింది.