Tag Archives: death

Surya Kiran: కళ్యాణి భర్త సూర్య కిరణ్ చావుకు అదే కారణమా.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్?

Surya Kiran: సినీ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సూర్య కిరణ్ ఒకరు. ఈయన నటుడిగా ఇండస్ట్రీలో సుమారు 200 కు పైగా సినిమాలలో నటించారు. అనంతరం సుమంత్ హీరోగా నటించిన సత్యం అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇలా దర్శకుడుగా వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు.

ఇలా ఇండస్ట్రీలో డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో ఈయన నటి కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ పలు సినిమాలలో బిజీ అయ్యారు. అయితే వీరిద్దరూ నిర్మాతలగా మారి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు. అయితే ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి దీంతో ఆస్తులను కూడా అమ్ముకున్నారు.

ఇలా ఆస్తులు అమ్మడం నష్టాలు పాలు కావడంతో కళ్యాణికి తన భర్తతో మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు ఇలా తన భార్య తనకు కావాలని ఈయన కోరుకున్నప్పటికీ కళ్యాణి మాత్రం ఈయన నుంచి దూరంగా వెళ్లిపోయారు.. అయితే ఈయన అనారోగ్యానికి గురై జాండీస్ తో బాధపడుతూ చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు.

ఒంటరితనమే చంపేసింది..
ఇక ఈయన మరణ వార్త గురించి నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. సూర్య కిరణ్ చనిపోయింది అనారోగ్య సమస్యతో కాదని ఆయన ఒంటరితనమే తనని చంపేసిందని తెలిపారు. కళ్యాణిని ఎంతో ప్రేమించారు. అయినా తను కాదనుకొని వెళ్లిపోవడంతో మందుకు బానిసగా మారిపోయాడు. రాత్రంతా తాగుతూనే ఉంటే ఏ ఆరోగ్యం కూడా సహకరించదని దాంతో ఈయన అనారోగ్యానికి గురై చనిపోయారు అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Jayasudha: నా భర్త చనిపోతారని ముందే తెలుసు.. షాకింగ్ విషయాలు చెప్పిన జయసుధ?

Jayasudha: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జయసుధ ఒకానొక సమయంలో హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే తాజాగా ఈమె హీరోలకు హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె నితిన్ కపూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు అయితే గత ఏడు సంవత్సరాల క్రితం నితిన్ మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణించడానికి కారణం అప్పులేనని ఆర్థిక సమస్యలు ఎక్కువై అప్పుల అధికంగా ఉండడంతో మరణించారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ వార్తలపై జయసుధ స్పందించారు. అంతేకాకుండా తన భర్త ఆత్మహత్య చేసుకుంటాడని ముందే నాకు తెలుసు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అప్పుల బాధతోనే తన భర్త మరణించాడు అనేది పూర్తిగా అవాస్తవమని తెలిపారు మేము చేసిన అప్పులు తీర్చుకోలేనంత పెద్దవి కాదని ఈమె తెలియజేశారు.

సినిమాలు చేసి నష్టపోయాము అనేది వాస్తవం కానీ దానివల్ల తన భర్త చనిపోయారన్నది అవాస్తవమని తెలిపారు. అంతేకాకుండా తన భర్త ముందే చనిపోతారు అనే విషయం మాకు తెలుసు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరిది చాలా వీక్ మైండ్ అని ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే దానిని బ్యాలెన్స్ చేయలేక సూసైడ్ ఆలోచనలు చేస్తారని ఇదివరకే తన భర్త అన్నగారు అలాగే తన అత్తయ్య వాళ్ళు కూడా అలాగే సూసైడ్ చేసుకొని చనిపోయారని జయసుధ తెలిపారు.

సినిమాలు చేసే నష్టపోయాం..
ఆర్థిక ఇబ్బందులు రావడంతో తను చాలా టెన్షన్ పడ్డారు. ఎక్కడ సూసైడ్ చేసుకుంటారోనని మేము ముందుగానే గ్రహించి తనని ఎప్పుడు ఓ కంట కనిపెడుతూనే ఉండే వాళ్ళం అయితే మేము ఇంట్లో లేని సమయంలో తాను సూసైడ్ చేసుకొని చనిపోయారని జయసుధ ఈ సందర్భంగా తన భర్త మరణం గురించి చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Uday Kiran: ఉదయ్ కిరణ్ చావుకు వాళ్లే కారణం.. సంచలన వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ కమెడియన్!

Uday Kiran: ఉదయ్ కిరణ్ పరిచయం అవసరం లేని పేరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు క్రమక్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి ఇలా అవకాశాలు తగ్గిపోయినటువంటి తరుణంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించారు ఇలా ఈయన ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే విషయాలు ఇప్పటివరకు తెలియడం లేదు.

అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వల్లే ఈయన ఆత్మహత్య చేసుకున్నారని కొందరు భావించగా మరికొందరు ఉద్దేశపూర్వకంగా ఈయనకు అవకాశాలు లేకుండా ఇండస్ట్రీలో కొందరు ఉదయ్ కిరణ్ ను తొక్కేశారు అంటూ ఈయన మరణం పై ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి అయితే తాజాగా ఉదయ్ కిరణ్ మరణం గురించి జబర్దస్త్ కమెడియన్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్గా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో షేకింగ్ శేషు ఒకరు అయితే ఈయన ఇటీవల జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు ఈయనకు సినిమాలలో అవకాశాలు వచ్చినటువంటి తరుణంలో జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసి తాను సినిమాల పరంగా బిజీ అయ్యానని తెలిపారు అయితే ప్రస్తుతం తనకు అవకాశాలు రాలేదని తెలిపారు.

అవకాశాలు రావడం లేదు…

అవకాశాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కూడా భారమైందని ఇలా ఏ వ్యక్తి అయితే కుటుంబానికి బరువుగా మారుతారో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లేనని ఈయన వెల్లడించారు.కొన్నిసార్లు తనకు అలాంటి ఆలోచనలు కూడా వస్తాయని ఈయన వెల్లడించారు. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ ప్రస్తావన తీసుకువస్తూ ఉదయ్ కిరణ్ మరణించడానికి కారణం ఆయనకు అవకాశాలు ఇవ్వలేనటువంటి వారు కూడా కారణమేనంటూ ఈ సందర్భంగా షేకింగ్ శేషు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Ray Stevenson: ఆర్ఆర్ఆర్ నటుడు స్కాట్ దొర హఠాన్మరణం..?

Ray Stevenson: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో స్కాట్ దొర పాత్రలో నటించిన రే స్టీవెన్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కరుడు కట్టిన స్కాట్ దొర పాత్రలో నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. ఇలా తన వీళ్ళ నిజంతో ఎంతో మందిని సంపాదించుకున్న రే స్టీవెన్సన్ హఠాన్మరణం సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

స్టీవెన్సన్ మరణంతో త్రిబుల్ ఆర్ టీం కూడా షాక్ కి గురయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది.ఇటీవల ‘ క్యాసినో ‘ పాల్గొన్న ఆయన మృతిచెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆయన మృతికి గల కారణాల గురించి తెలియలేదు. మొదట స్టేజ్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలు పెట్టిన రే స్టీవెన్సన్ ‘ ది థియరీ ఫ్లైట్ ‘ తో వెండితెర మీద రంగప్రవేశం చేసాడు.

ఆ తర్వాత 2004 లో విడుదలైన కింగ్ ఆర్థర్ సినిమాలో డాగోనెట్ పాత్రకి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత థోర్, స్టార్ వార్స్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. ఇలా దాదాపు 20 ఏళ్ల పాటు నటుడిగా రాణించిన రే స్టీవెన్సన్ ఇటీవల హఠాన్మరం చెందటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Ray Stevenson: మృతి చెందిన ఆర్ఆర్ఆర్ విలన్…

ఇదిలా ఉండగా రే స్టీవెన్సన్ వ్యక్తిగత విషయానికి వస్తే..ఆయన రుత్ గెమ్మెల్ అనే బ్రిటిష్ నటిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ఎనిమిదేళ్ళ పాటు సాఫీగా సాగిపోయిన వీరి సంసారంలో మనస్పర్ధలు మొదలయ్యాయి. అందువల్ల వీరిద్దరూ కూడా విడాకులు తీసుకొని ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఇక తాజాగా రే స్టీవెన్సన్ మరణించడంతో ఆయన మాజీ భార్య తీవ్ర దుఃఖానికి గురైనట్టు తెలుస్తోంది.

Kota Srinivarao: నేను బ్రతికే ఉన్నాను… తన మరణ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన కోటా శ్రీనివాసరావు!

Kota Srinivarao: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియా కారణంగా ప్రపంచం నలుమూలలో జరిగిన విషయాలు అన్ని నిమిషాలలోనే అందరికీ తెలిసిపోతున్నాయి. ఈ సోషల్ మీడియా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈ సోషల్ మీడియా వల్ల ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఉపయోగపడే విషయాలు షేర్ చేయటమే కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి అనేక దుష్ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు.

తాజాగా సోషల్ మీడియా వల్ల సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన కోటా శ్రీనివాసరావు ఎన్నో మంచి మంచి పాత్రలలో నటించాడు. అలాగే విలన్ గా కూడా ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గత కొంతకాలంగా కోటా శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ క్రమంలో తాజాగా కోటా శ్రీనివాసరావు మరణించాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ వార్త తెలియగానే ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. దీంతో అనేకమంది సెలబ్రిటీలు ఆయన ఇంటికి ఫోన్లు చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన తన మరణ వార్త గురించి తెలుసుకున్న కోటా శ్రీనివాసరావు స్పందిస్తూ..” తన మరణం గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని వాటిని ఎవరు నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చాడు.

Kota Srinivarao: తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించకండి…


ఉదయం 7, 7:30 గంటల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.నేనే ఒక 50 కాల్స్ వరకు మాట్లాడాను.. ఇది నిజమే అనుకుని ఓ పది మంది పోలీసులు కూడా సెక్యూరిటీ కోసం వచ్చారు. ఇలాంటి అవాస్తవాలను మీరే అరికట్టాలని పోలీసులకు చెప్పాను. జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి.. మనిషి ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేయకండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇండస్ట్రీలో ప్రశాంతత నెలకొంది.

Vijayashanthi: ఎన్నోసార్లు చావును దగ్గరగా చూసి వచ్చాను.. విజయశాంతి కామెంట్స్ వైరల్!

Vijayashanthi: వెండితెర రాములమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయశాంతి తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న విజయశాంతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరియర్ గురించి నెమరు వేసుకున్నారు. తన చిన్నప్పుడే తన తండ్రి గుండెపోటుతో మరణించారు. అయితే తన తండ్రి మరణాన్ని తలుచుకొని తన తల్లి కూడా మంచాన పడి కొద్ది రోజులకే చనిపోయిందని ఈమె తెలిపారు.

ఇలా తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోవడంతో ఎవరి మీద ఆధారపడకుండా స్వసక్తితో పైకి వచ్చానని తెలిపారు.ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు 5000 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చేవారు అందులో కూడా 2000 ఎగ్గొట్టి 3000 మాత్రమే రెమ్యూనరేషన్ ఇచ్చేవారు.ఇలా 3000 నుంచి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే వరకు తాను ఎదిగానని విజయశాంతి తెలిపారు.

Vijayashanthi: మంటల్లో చిక్కుకుంటే ఆ హీరో కాపాడారు…

ఇక లేడి ఓరియంటెడ్ సినిమాలలో నటించే సమయంలో ఎన్నో సాహసభరితమైన సన్నివేశాలలో నటించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే చాలా సార్లు షూటింగులలో గాయపడి ఎన్నోసార్లు చావును దగ్గరగా చూసి బయటకు వచ్చానని తెలిపారు. ఒకసారి విమాన ప్రమాదం మరొకసారి నీటిలో కొట్టుకపోవడం ఇంకొకసారి అగ్ని ప్రమాదానికి గురి కావడం ఇలా చాలాసార్లు ప్రమాదానికి గురయ్యానని తెలిపారు. ఓ సినిమా షూటింగ్లో భాగంగా మంటల్లో చిక్కుకోవడంతో అందరూ భయంతో పరుగులు పెట్టినప్పటికీ నటుడు విజయ్ కాంత్ మాత్రం తనని రక్షించారని ఈమె అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

పునీత్ మరణం.. ఆ దర్శకనిర్మాతలకు కోలుకోలేని దెబ్బ.. వారి పరిస్థితి ఏమిటో?

పునీత్ ఆకస్మిక మరణం ఆయన కుటుంబ సభ్యులకు అలాగే అభిమానులకు,సినీ పరిశ్రమకు చాలామంది కు బాధను వేసింది. పునీత్ మరణం సౌత్ ఇండియా సినీ పరిశ్రమకే తీరని లోటు అని చెప్పవచ్చు. అయితే పునీత్ మరణ వార్త విని ఏకంగా ఒక అభిమాని మరణించాడు. ఇంకొందరు అయితే గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇక పునీత్ మరణం చాలామందికి బాధని మిగిలిస్తే, కొంతమందికి భారీ నష్టాన్ని కలిగించేలా ఉంది.

ఎందుకంటె ప్రస్తుతం పునీత్ రాజ్కుమార్ చేస్తున్న ప్రాజెక్టుల విలువ దాదాపు 400 కోట్లకు పైమాటే. పునీత్ ఒక సినిమాకు వంద కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. అయినా జేమ్స్, ద్విత్వ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ ఒక్కొక్క సినిమాలకు 50 నుంచి 60 కోట్ల బడ్జెట్ అనుకున్న, రెండు సినిమాలకు కలిపి 100 నుంచి 120 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది.

ఈ సినిమాలు ప్రస్తుతం సగంలోనే ఆగిపోతాయి. ప్రస్తుతం ఈ సినిమా దర్శక నిర్మాతల పరిస్థితి ఏంటో తెలియడం లేదు. పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఐదు సినిమాలు అతని బ్యానర్ లో ప్లాన్ చేసుకుంటున్నారట. వాటన్నిటికీ 60 కోట్ల బడ్జెట్ తో మార్కెట్ యావరేజ్ గా వేసుకున్నా అవన్నీ కలిపితే 300 కోట్లకు పైగానే మార్కెట్ ప్రభావం చూపిస్తాయి.

అలా మొత్తం కలుపుకుంటే దాదాపు 400 కోట్ల రూపాయల సినిమా బిజినెస్ ప్రశ్నార్థకంగా మారింది. అతను సినిమాలో నమ్ముకున్న దర్శకనిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్ పరిస్థితి అయోమయంగా మారింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నటుడిగానే కాకుండా ఎంతో మందికి సేవలు చేసిన మహానుభావుడు అయ్యాడు పునీత్.పునీత్ ని ఆఖరిసారిగా చూసేందుకు సినీ తారలందరూ బెంగళూరుకు చేరుకుంటున్నారు.

కళ్ళు లేకపోవడం కంటే చనిపోవడం మంచిది.. కత్తి మహేష్ మరణంపై ..నటుడు సమీర్ కామెంట్స్!

ప్రముఖ ఫిలిమ్ క్రిటిక్, నటుడు, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల ఆయనతో సన్నిహితంగా ఉన్న నటులు స్పందించి ఆయనతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. కత్తి మహేష్ తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలిచే వాడు. ఈ క్రమంలోనే కత్తి మహేష్ కు ఎంతో మంది శత్రువులు పెరిగారు.కత్తి మహేష్ మరణం కొన్ని వర్గాల వారికి తీరని లోటు అయితే మరి కొందరు అతని మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

కత్తి మహేష్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ లు పరిచయమైన నటుడు సమీర్ కత్తి మహేష్ మరణం పై స్పందించి ఎంతో బావోద్వేగం అయ్యారు. కత్తి మహేష్ తనకు బిగ్ బాస్ హౌస్ లోనే పరిచయం అయ్యారని, అందరూ అనుకుంటున్నట్టుగా తెరపై కనిపించే కత్తి మహేష్ వేరు తెర బయట కత్తి మహేష్ వేరు అతను ఎంతో మంచి వాడు అంటూ సమీర్ తెలిపారు.

బిగ్ బాస్ ద్వారా తనతో ఎంతో అనుబంధం ఏర్పడింది. మహేష్ ఈ విధంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు అని తెలియగానే ఎంతో షాక్ అయ్యానని,అయితే ఈ ప్రమాదంలో తనకు ఏమి ప్రమాదం లేదు ఒక కన్ను మాత్రమే తొలగించారని తెలియడంతో తను క్షేమంగా బయటపడతారని భావించాను. కానీ తర్వాత మరో కన్ను కూడా తొలగించాలని చెప్పారు. కానీ అతని మరణాన్ని ఊహించలేదని సమీర్ భావోద్వేగ మయ్యారు.

ఒక్కసారి మహేష్ తో మాట్లాడితే అతని మనస్తత్వం ఏమిటో తెలిసిపోతుంది. అతను టీవీలో కనిపించే విధంగా బయట ఉండరు. కత్తి మహేష్ చాలా లవ్లీ & నైస్ పర్సన్. చాలాసార్లు మా మధ్య డిస్కషన్ జరిగేది. ఎందుకు ఇలా కాంట్రవర్శిలలో ఉండటం అని అడిగేవాడిని. అందుకు మహేష్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి భయం ఎందుకు అనేవాడు. ఏది ఏమైనా కత్తి మహేష్ మరణం తీరనిలోటు. కళ్ళు తీసేసి ప్రపంచం మొత్తం చీకటి అవ్వడం కంటే చనిపోవడమే మంచిది దేవుడు ఈ విధంగా తనకు మంచి చేశాడని, అతని కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఆయనతో ఉన్న అనుబంధాన్ని సమీర్ పంచుకున్నారు.

దారుణం: నిశ్చితార్థానికి ముందు రోజే కబళించిన మృత్యువు!

తెల్లవారితే నిశ్చితార్థం.. కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా నిశ్చితార్థ పనులలో నిమగ్నమయ్యారు. అప్పటికే బంధువులు అందరూ ఇంటికి చేరుకొని ఎంతో కళకళలాడుతోంది. తెల్లవారితే శుభకార్యంతో సంతోషంగా ఉండాల్సిన ఆ ఇంటిని మృత్యువు కబళించింది. తెల్లవారితే నిశ్చితార్థం జరుపుకోవాల్సిన యువతి మరణించడంతో ఆ ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసుల వివరాల మేరకు…

వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కరణ్‌కోట జయశంకర్‌ కాలనీకి చెందిన జెట్టూరి శేఖర్‌, సత్తమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కుమారుడు నవీన్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె రోజా ఎమ్మెస్సీ ఫార్మసీ చదివి ప్రైవేట్ ల్యాబ్ లో పని చేస్తోంది. ఈ క్రమంలోనే రోజాకు వికారాబాద్ లో మిషన్ ఆస్పత్రి వైద్యునితో ఆమె వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం వీరి నిశ్చితార్థం కార్యక్రమాలకు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే నిశ్చితార్థానికి కొత్త దుస్తులను తీసుకురావడానికి రోజా తన స్నేహితురాలు మౌనికతో కలిసి మంగళవారం రాత్రి 7.30 ప్రాంతంలో డిజైనర్‌ వద్దకు వెళ్లింది. ఆమె దుకాణంలో లేకపోవడంతో ఆమె కోసం దుకాణం బయట ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఈ క్రమంలోనే ఆ భవనం మూడో అంతస్థు పైనుంచి పెద్ద రెయిలింగ్‌ శకలాలు ఆమె తల పై పడటంతో తీవ్ర గాయాలపాలైఉంది.

ఈ క్రమంలోనే మెరుగైన చికిత్స కోసం రోజాను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈ విధంగా బుధవారం తెల్లవారితే నిశ్చితార్థం జరుపుకోవాల్సిన యువతికి రైలింగ్ రూపంలో మృత్యువు సంభవించడంతో ఇరు కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. రెయిలింగ్‌కు పగుళ్ళు ఉన్నాయని యజమాని దృష్టికి తీసుకువెళ్లిన అతడు పట్టించుకోవడం లేదని అక్కడివారు తెలియజేశారు.

కొడుకు చనిపోయిన కొన్ని నెలల తర్వాత దొరికిన సూసైడ్ నోట్.. అందులో ఏముందంటే..?

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో కొడుకు చనిపోయిన ఎనిమిది నెలల తరువాత తల్లికి సూసైడ్ నోట్ లభించింది. ఆ సూసైడ్ నోట్ లో ఉన్న విషయాలను తెలుసుకుని షాకవ్వడం తల్లి వంతయింది. కోడలు వల్లే కొడుకు చనిపోయాడని తెలిసిన ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మాధవ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవనం సాగించేవాడు.

వివాహం జరిగిన తర్వాత మాధవ్ కు కొన్ని శారీరక సమస్యలు తలెత్తాయి. దీంతో మాధవ భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కళ్ల ముందే భార్య అలా చేయడంతో తట్టుకోలేకపోయిన మాధవ్ 2019 సంవత్సరం ఏప్రిల్ నెలలో సూసైడ్ నోట్ రాసుకున్నాడు. అయితే చనిపోవాలని అనుకున్నప్పటికీ మాధవ్ కు చనిపోవడానికి ధైర్యం చాలలేదు. ఆ సూసైడ్ నోట్ ను మాధవ్ ఇంట్లో కప్ పోర్డ్ లో ఉంచాడు.

సూసైడ్ నోట్ రాసిన ఏడాది తరువాత 2020 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన మాధవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నిరోజుల క్రితం మాధవ్ తల్లి లీలా జాదవ్‌ ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో మాధవ్ కప్ బోర్డ్ ను పరిశీలించగా సూసైడ్ నోట్ లభ్యమైంది. మాధవ్ తన భార్యకు, ఆమె ప్రియునికి చాలాసార్లు చెప్పినా వినలేదని.. నిత్యం వాళ్లు తనను అవమానించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.

విషయం తెలిసిన మాధవ్ తల్లి ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికే పరోక్షంగా మాధవ్ ఆత్మహత్యకు కారణమైన మాధవ్ భార్యను, మాధవ్ భార్య ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు తరువాత మాధవ్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.