Tag Archives: drugs

Drugs: విశాఖ డ్రగ్స్ లో చంద్రబాబు హస్తం ఉంది.. నిజానిజాలు తేల్చాలి: సజ్జల

Drugs: విశాఖ సి పోర్టులో ఓ కంటైనర్ లో సుమారు 25 వేల కేజీల డ్రగ్స్ సిబిఐ అధికారులు సీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒక్కసారిగా భారీ మొత్తంలో డ్రగ్స్ అది ఎన్నికల సమయం ముందు అధికారులు సీజ్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది. అయితే ఈ డ్రగ్స్ బ్రెజిల్ నుంచి వచ్చాయని తెలుస్తుంది ఈ క్రమంలోనే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరి నుంచి ఎవరికి పంపిస్తున్నారనే విషయం గురించి సిబిఐ ఆరా తీస్తున్నారు.

ఇలా విశాఖ సీ పోర్టులో డ్రగ్స్ కలకలం సృష్టించడంతో చంద్రబాబు నాయుడు ఇదంతా వైకాపా పనే అంటూ ప్రచారాలు మొదలుపెట్టారు. దీంతో శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేశారు.

డ్రగ్స్ విషయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న తీరు ఎలా ఉంది అంటే దొంగనే దొంగ దొంగ అని అర్చినట్టూ ఉంది అంటూ ఈయన కామెంట్లు చేశారు. ఇలా విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం వెనుక తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు బిజెపి హస్తము ఉందని ఈయన ఆరోపణలు చేశారు. తప్పు నుంచి బయటపడటం కోసం ఆ తప్పును మేము చేయలేదని నిరూపించుకోవడం కోసమే చంద్రబాబునాయుడు మా పై బురద చల్లుతున్నానని సజ్జల వెల్లడించారు.

25 వేల కిలోల డ్రగ్స్..
విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్‌ను సీజ్‌ చేసింది. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. వ్యవస్థలపై చంద్రబాబు నాయుడుకి గౌరవం లేదని ఆయనది వీధి స్థాయిలో మనస్తత్వం చెలరేగిపోయారు. ఇక ఈ డ్రగ్స్ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉందని అందుకోసం తాము సిబిఐతో పాటు ఈసీ కి కూడా లేఖలు రాస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించడం కోసమే డ్రగ్ సరఫరా జరిగిందని అయితే పట్టుబడటంతో తప్పించుకోవడానికి ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారంటూ సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Puri Jagannath: రాత్రి ఆ పని చేయకుంటే నిద్ర అసలు పట్టదు… వైరల్ అవుతున్న పూరి కామెంట్స్!

Puri Jagannath: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను పరిచయం చేసినటువంటి ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరికీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించారు.

అయితే ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ సినిమాలన్నీ కూడా ఆయనకు తీవ్ర నిరాశను కలిగిస్తున్నాయి. గత ఏడాది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు లైగర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన రామ్ పోతినేనితో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పూరి తన గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా యాంకర్ పూరి జగన్నాథ్ ను ప్రశ్నిస్తూ మీకు డ్రగ్స్ తీసుకుని అలవాటు ఉందా అని అడిగారు. ఈ ప్రశ్నకు పూరి జగన్నాథ్ సమాధానం చెబుతూ నాకు డ్రగ్స్ తీసుకుని అలవాటు అయితే లేదు కానీ ప్రతిరోజు మందు తాగే అలవాటు ఉందని పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా తెలియజేశారు. తనకు ఇదివరకు ఈ అలవాటు అసలు ఉండేది కాదని తెలిపారు.

Puri Jagannath: మందు తాగనిదే నిద్రపోను…


తన స్నేహితుడు రాంగోపాల్ వర్మ వల్ల తాను మందు తాగే అలవాటు నేర్చుకున్నానని ఈయన తెలిపారు. గత మూడు సంవత్సరాల నుంచి నాకు ఈ అలవాటు వచ్చిందని, ప్రతిరోజు తను మందు తాగనిది నిద్రపోను అంటూ పూరి జగన్నాథ్ తెలిపారు. ఈ ఎదవ అలవాటు మార్చుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న తన వల్ల కావడం లేదు అంటూ పూరి జగన్నాథ్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Shruthi Hassan: మందు తాగుతావా అంటూ శృతిహాసన్ ను ప్రశ్నించిన నేటిజన్… ఆమె సమాధానం ఏంటో తెలుసా?

Shruthi Hassan: లిజెండరీ యాక్టర్ కమల్ హాసన్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చారు.ఈ విధంగా శృతిహాసన్ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో ఎన్నో ఫ్లాప్ సినిమాలనే ఎదుర్కొన్నారు. ఇలా వరుస ప్లాప్ సినిమాలు ఈమెను వెంటాడటంతో చాలా మంది తనను భారీగా ట్రోల్స్ చేశారు.

ఈ విధంగా ఈమె ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన టాలెంట్ నిరూపించుకుంటూ ఉన్నారు. ఇకపోతే ఈమె నటించిన వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి వంటి సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈమే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈమె తన ప్రియుడుతో కలిసి ప్రస్తుతం సహజీవనం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా తరుచు తన ప్రియుడుతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అదే విధంగా సోషల్ మీడియా వేదికగా తరచు అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.

Shruthi Hassan: మందే కాదు డ్రగ్స్ కూడా తీసుకోను…


ఈ క్రమంలోనే శృతిహాసన్ తాజాగా అభిమానులతో ముచ్చటించగా ఓ అభిమాని తనని ఏకంగా మందు తాగుతావా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ తాను కేవలం మందు మాత్రమే కాదని డ్రగ్స్ కూడా తీసుకోను అంటూ సమాధానం చెప్పారు. అలాగే తాను ఎంతో హుందాగా జీవితం గడిపే నటిని అంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Actor Nani: దసరా సినిమా కోసం మందు కొట్టి నటించాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో నాని?

Actor Nani: నాచురల్ స్టార్ నాని విభిన్న కథ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈయన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మార్చి 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాని ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నటువంటి ఈయనకు మీడియా ప్రతినిధి నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఈ సినిమాలో నటించడం కోసం కొన్ని సన్నివేశాలలో నాని మందు కొట్టారని వార్తలు వస్తున్నాయి ఇందులో నిజం ఎంత అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ కొన్ని సన్నివేశాలలో కళ్ళు ఎర్రగా కావడం, మందు కొట్టే మ్యానరిజమ్స్ ఉండడంతో డైరెక్టర్ శ్రీకాంత్ కొన్ని సన్నివేశాలలో మందు కొట్టి నటించాల్సి ఉంటుంది. మీకు ఏమైనా అభ్యంతరమా అని ప్రశ్నించారు. అయితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపానని నాని వెల్లడించారు.

Actor Nani: కథ డిమాండ్ చేయడంతోనే…


ఇలా కథ డిమాండ్ చేయడంతో తాను తప్పనిసరి పరిస్థితులలో మందు తాగి నటించానని ఈ సందర్భంగా నాని చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాగా,ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో నాని సరసన మరోసారి కీర్తి సురేష్ సందడి చేశారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో నాని కీర్తి సురేష్ డీ గ్లామర్ పాత్రలో నటించి సందడి చేయబోతున్నారు.

Actress Aamani: ఆ సినిమా షూటింగ్ సమయంలో నరేష్ మందు తాగమని ప్రోత్సహించారు: ఆమని

Actress Aamani: తెలుగు ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటీమనులలో ఆమని ఒకరు ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆమని తన సినిమాల గురించి పలు విషయాలను తెలియచేశారు.

ముఖ్యంగా ఈమె నటించిన జంబలకడిపంబ సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇవివి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాలో ఆడవాళ్లు మగవారిగాను మగవారు ఆడవాళ్ళగానో మారడం చాలా కొత్తదనంగా అనిపించింది. ఇప్పటికీ ఈ సినిమా చూసిన చాలా వినోద భరితంగా ఉంటుందని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో నరేష్ ఆమని జంటగా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆమని తెలియజేశారు.ఈ సినిమాలో ఆడవారు మగవారిగాను మగవారు ఆడవారిగాను నటించాల్సి వచ్చింది. అయితే ఓ సందర్భంలో తాను సిగరెట్ కాలుస్తూ మందు తాగాల్సిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం డైరెక్టర్ గారు నాకు ముందుగా చెప్పలేదు.కేవలం బాటిల్ ఓపెన్ చేయగానే మందు మొత్తం పైకి పొంగుతుంది జస్ట్ ఒక సిప్ చేస్తే చాలు అని షూటింగ్ కు ముందు డైరెక్టర్ చెప్పారు.


Actress Aamani: నా చేత నిజమైన బీర్ తాగించారు…

ఇక బాటిల్లో కూల్ డ్రింక్ వేసి ఇస్తారని తాను అనుకున్నాను కానీ నిజంగానే నిజమైన బీర్ బాటిల్ తీసుకువచ్చారని ఆమని తెలిపారు.ఈ సినిమాలోని సన్నివేశం షూట్ చేసే సమయంలో హీరో నరేష్ గారు కూడా ఏం పర్వాలేదు తాగమ్మా అంటూ తనని బీర్ తాగమని ప్రోత్సహించారు అంటూ అప్పటి సంఘటనలను ఆమని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇలా ఆమని చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Yendamuri Veerendranath: పెద్ద వారి ఇండ్లలో డ్రగ్స్, డివోర్స్ రావడానికి కారణం ఇదే: యండమూరి

Yendamuri Veerendranath: వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా, నవలా రచయితగా ఎంతో మంచి గుర్తింపు పొందిన యండమూరి గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసిన యండమూరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ప్రస్తుత కాలంలో పెద్ద వారి ఇళ్లలో అమ్మాయిలు డ్రగ్స్ కి అలవాటు పడటం, విడాకులు తీసుకోవడం గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.

Yendamuri Veerendranath: పెద్ద వారి ఇండ్లలో డ్రగ్స్, డివోర్స్ రావడానికి కారణం ఇదే: యండమూరి

ఈ సందర్భంగా ఆడపిల్లల గురించి ఆయన మాట్లాడుతూ ఒకానొక సమయంలో ఆడపిల్ల అంటే పట్టు పరికిని ధరించి ఎంతో చక్కగా ముస్తాబై పువ్వులు పెట్టుకుని ఉండే వాళ్ళు. అయితే జనరేషన్ మారుతున్న కొద్దీ అమ్మాయిల వస్త్రధారణలో అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయని ఆయన తెలియజేశారు. పెద్ద వారి ఇండ్లలో ఉండే ఆడపిల్లలను ఎక్కువగా గారాబం చేయటం వల్ల వాళ్ళు ఒక యుక్తవయసుకు రాగానే ఎక్కువగా ఫ్రెండ్స్ పార్టీ అంటూ ఎంజాయ్ చేస్తారు.

Yendamuri Veerendranath: పెద్ద వారి ఇండ్లలో డ్రగ్స్, డివోర్స్ రావడానికి కారణం ఇదే: యండమూరి

ఈ విధంగా ఫ్రెండ్స్ తో కలిసి పబ్ కి వెళ్లడం, పార్టీలు చేసుకోకపోవడం,డ్రగ్స్ తీసుకోకపోవడం వంటివి చేయటం వల్ల అదొక చిన్నతనంగా భావిస్తారు. అందుకే తప్పకుండా చాలామందికి డ్రగ్స్, మందు-సిగరెట్ వంటి అలవాట్లు ఉంటున్నాయని ఆయన తెలిపారు. ఇక పెళ్లయిన తర్వాత ఆ అమ్మాయికి ఉండే ఇలాంటి అలవాట్లు పూర్తిగా మార్చుకోవలసి వస్తుంది.

అసౌకర్యంగా ఉంటారు…

అమ్మాయి గర్భవతి అయినప్పుడు లోపల ఉన్న బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచించి సిగరెట్ మందు డ్రగ్స్ వంటి వాటిని దూరం పెడతారు.అదే సమయంలో తన తోటి స్నేహితులు ఇంకా పెళ్లి కాకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటే వారీలో ఒక అసౌకర్యమైన భావన కలుగుతుంది. తాను అలాంటి ఎంజాయ్ మెంట్ కు దూరం అయ్యాననే భావన వారిలో ఏర్పడుతుంది. ఇలా చాలా మందిలో ఇలాంటి భావన ఏర్పడటం వల్ల గొడవలు అవ్వడం విడాకుల వరకూ వెళ్లడం జరుగుతున్నాయని ఈ సందర్భంగా యండమూరి వెల్లడించారు.

పార్టీలలో స్టార్ హీరోల భార్యలు డ్రగ్స్ తీసుకుంటున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన షెర్లిన్ చోప్రా..!

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో బీ టౌన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆర్యన్ అరెస్టుతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ తనయుడు అరెస్ట్ కావడంతో కొందరు ఆయనకు మద్దతుగా నిలబడగా మరికొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా డ్రగ్స్ వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే ఈమె ఒక వీడియోను షేర్ చేస్తూ పలు ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ విచ్చలవిడిగా వాడుతున్నారని ఈ సందర్భంగా ఈమె షాకింగ్ విషయాలను తెలిపారు.

షారుఖ్ ఖాన్ కి సొంతంగా కోల్ కత్తా నైట్ రైడర్స్ పేరుతో సొంతంగా ఐపీఎల్ జట్టు ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ రోజు క్రికెట్ లో భాగంగా అక్కడ డాన్స్ చేయడం కోసం షెర్లిన్ ఆ మ్యాచ్ కు వెళ్లిన సమయంలో తను కొన్ని షాకింగ్ సన్నివేశాలను చూశానని ఆ దృశ్యాలను చూసిన తర్వాత తన మైండ్ బ్లాక్ అయిపోయిందని తెలియజేశారు. డాన్స్ చేసి అలిసిపోయిన నేను వాష్ రూమ్ కి వెళ్ళాక అక్కడ దృశ్యాలను చూసేసరికి నేను కరెక్ట్ ప్లేస్ కు వచ్చానన్న సందేహం కలిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.

వాష్ రూమ్ డోర్స్ ఓపెన్ చేయగానే అక్కడ ఎంతో మంది స్టార్ హీరోల భార్యలు అద్దం ముందు నిలబడి డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఈమె తెలియజేశారు. ఆ సంఘటన చూడగానే జస్ట్ ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి బయటకు వచ్చానని ఆ ఇన్సిడెంట్ తర్వాత షారుఖ్ ఖాన్ అతని స్నేహితులకు గుడ్ బై చెప్పి బయటకు వచ్చానని ఈ సందర్భంగా షెర్లిన్ చోప్రా డ్రగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వీళ్ళ తెలివి మామూలుగా లేదు..గాజులలో 7.5 కోట్ల హెరాయిన్ రవాణా!

డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను రవాణా చేస్తూ పట్టుబడకుండా ఉండటం కోసం దుండగులు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇదివరకు ఈ విధంగా మాదకద్రవ్యాలను ఎన్నో రకాలుగా రవాణా చేస్తూ అధికారులకు పట్టుబడిన దుండగులు తాజాగా మరోసారి హెరాయిన్ ను గాజులలో రవాణా చేస్తున్నట్లు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ హెరాయిన్ విలువ సుమారు 7.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలియజేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ హెరాయిన్ ను సన్నని పైపులలోకి పెట్టి వాటిని గాజులు లాగా చుట్టి రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ హెరాయిన్ ను దక్షిణాఫ్రికా నుంచి డిల్లీలోని ఓ చిరునామాకు దిగుమతి చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలోనే వీటికి సంబంధించిన ఫోటోలను కస్టమ్స్ అధికారులు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

ఈ క్రమంలోనే అధికారులు మాట్లాడుతూ గత వారంలో దక్షిణాఫ్రికా దేశస్తులు ఏకంగా 126 కిలోల హెరాయిన్‌ను స్మగ్లింగ్‌ చేస్తూ దిల్లీ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ విధంగా హెరాయిన్‌ను గాజులలో పెట్టె స్మగ్లింగ్ చేస్తున్న పార్సిల్ ను అధికారులు గుర్తించి అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఫోటోలు చూసిన నెటిజన్లు వీళ్ళ తెలివి మామూలుగా లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.