Tag Archives: family

Rishab Pant: అతనికి ఓ ఫ్యామిలీ ఉంది… రిషబ్ ప్రమాదంపై రోహిత్ సతీమణి ఫైర్… అసలేం జరిగిందంటే?

Rishab Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే.నూతన సంవత్సర వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడం కోసం ఉత్తరాఖండ్ వెళ్తున్న సమయంలో ఈయన కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి రిషబ్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇలా ఈయనకు ప్రమాదం జరగడంతో ఎంతోమంది అభిమానులు తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించడమే కాకుండా ఈయన ఆక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రిషబ్ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే రిషబ్ ప్రమాదానికి సంబంధించిన ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే నేటిజనులపై క్రికెటర్ రోహిత్ సతీమణి రితికా సజ్దే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె స్పందిస్తూ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే వారిని చూస్తే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎవరైనా బాధల్లో ఉంటే ఇలాంటివి చేయడం సరైనదా కాదా అనేది నిర్ణయించుకోలేకపోతున్నారు.

Rishab Pant: ఆ ఫోటోలు వీడియోలు కుటుంబం పై ప్రభావం చూపుతాయి..

సదరు బాధితుల వ్యక్తుల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయటం వల్ల ఆయన కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఆలోచించండి ఆయనకి ఓ కుటుంబం ఉంటుంది. కనీస జ్ఞానం కూడా లేకుండా ఇలా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు అంటూ రితిక ఈ సందర్భంగా రిషబ్ పంత్ ప్రమాద ఫోటోలు వీడియోలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Puneeth Rajkumar: పునీత్ ఇంట మరో విషాదం.. శోకసంద్రంలో పునీత్ కుటుంబ సభ్యులు!

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటు రావడంతో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరణ వార్త నుంచి ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు ఎంతో మంది అభిమానులు బయటపడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పునీత్ ఇంట మరో విషాద ఘటన చోటుచేసుకుంది.

Puneeth Rajkumar: పునీత్ ఇంట మరో విషాదం.. శోకసంద్రంలో పునీత్ కుటుంబ సభ్యులు!

పునీత్ రాజ్ కుమార్ మరణించి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ప్రతిక్షణం ఆయనను తలుచుకుంటూ పునీత్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ మామ, అశ్విని తండ్రి రేవనాథ్ ఫిబ్రవరి 20వ తేదీ గుండెపోటుతో మరణించారు.

Puneeth Rajkumar: పునీత్ ఇంట మరో విషాదం.. శోకసంద్రంలో పునీత్ కుటుంబ సభ్యులు!

పునీత్ మరణవార్త ఆయనను తీవ్రమైన ఒత్తిడికి గురి చేసిందని ఆయన మరణ వార్తను అనుక్షణం తలుచుకొని ఎంతో భావోద్వేగానికి గురి అయ్యే వారని ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని M.S రామయ్య ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.

భర్త, తండ్రి మరణంతో కృంగిపోయిన అశ్విని…

ఈ విధంగా భర్త చనిపోయి ఐదు నెలల వ్యవధిలోనే తండ్రి కూడా మరణించడంతో అశ్విని తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే పునీత్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక నేడు మధ్యాహ్నం రేవనాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇలా భర్త మరణించిన వెంటనే తన తండ్రి కూడా మరణించడంతో కుటుంబ సభ్యులకు పలువురు ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు.

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

Rahul: దేశం కోసం మా కుటుంబం(నెహ్రూ కుటుంబం) ప్రాణ త్యాగాలు చేసిందని కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, మోదీకి కౌంటర్ ఇచ్చారు. మా కుటుంబ త్యాగాలకు ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు.

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

పార్లమెంట్లో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలకు రాహుల్ ను మీడియా ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. తాను లేవనెత్తిన అంశాలపై కాకుండా ఇతర అంశాలు మాట్లాడుతూ, తన ప్రశ్నల నుంచి తప్పించుకున్నారని రాహుల్ పేర్కొన్నారు.

Rahul: దేశం కోసం మా కుటుంబం ప్రాణ త్యాగాలు చేసింది..! మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్..!

చైనా- పాక్ ఏకమవడం, రాజ్యాంగ ఉల్లంఘనలు, దేశంలో విభజన రాజకీయాలపై ప్రశ్నించినా సమాధానమే రాలేదన్నారు. రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డాడు.

తెలంగాణ నుంచి తొలి దళిత ముఖ్యమంతిగా..

మూడు గంటలకు పైగా ఆయన ప్రసంగంలో ఆ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ కుటుంబ పాలనే(గాంధీల కుటుంబం) కారణమని తిట్టిపోశారు. దేశంలో అత్యవసర పరిస్థితికి, సిక్కుల ఊచకోతకు కారణం కాంగ్రెస్సే కారణమని విమర్శించారు. గతంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బలహీనపరిచిందన్నారు. ఈ సందర్భంగా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను తప్పుపట్టారు. సరైన చర్చ లేకుండా రాష్ర్టంను విడదీశారని ఆక్షేపించారు. పార్లమెంట్ తలుపులు మూసి అప్రజాస్వమిక పద్ధతుల్లో నాటి బిల్లును ఆమోదించారన్నారు. లోక్ సభలో పెప్పర్ స్ర్ప ఘటనలతో ఆనాడు హింస ఘటనలూ చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకోకపోవడంతో నాటి సమస్యలు రెండు తెలుగు రాష్ర్టలలో ఇంకా నలుగుతూనే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో నాటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బలహీనపరచారన్నారు. తెలంగాణ నుంచి తొలి దళిత ముఖ్యమంతి టి.అంజయ్య మరణాంతరం జరిగిన అవమానాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ ఆరోపణలకు మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అంటే భయమని, అందుకు నిదర్శనమే ఈ ప్రసంగమని ఆరోపించారు. తాను లేవనెత్తిన అంశాలను పక్కదోవపట్టించారన్నారు. ఈ ప్రభుత్వ విధానాలతో చైనా – పాకిస్తాన్ దేశాలు ఒక్కటవుతున్నాయని ఇది దేశానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాం. అయినప్పటికీ విషయమై సమాధానమే రాలేదన్నారు. ఈ వైఖరికి దేశ భద్రతకు మంచిది కాదన్నారు. కొవిడ్ మొదటి దశలోనూ మోదీ ప్రభుత్వానికి పలు చేసామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీనో, నెహ్రూ కుటుంబాన్నో విమర్శించడం కాదు మీరు(మోదీ) దేశ రక్షణకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Pushpa-Allu Arjun: ఫ్యామిలీతో కలిసి న్యూఇయర్ వేడుకలకు బన్నీ ప్లాన్… ఎక్కడికి వెళ్లాడో తెలుసా..?

Pushpa-Allu Arjun: పుష్ప ఇచ్చిన సక్సెస్ కిక్ లో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప భారీ వసూళ్లను రాబడుతోంది. ఊర మాస్ గెటప్ లో బన్నీ అదరగొట్టాడు. బన్నీ కెరీర్ లో తొలి ప్యాన్ ఇండియా సినిమా అయిన పుష్ప భారీ హిట్ కొట్టడంతో బన్నీ తెగ సంబరపడిపోతున్నాడు. 

Pushpa-Allu Arjun: ఫ్యామిలీతో కలిసి న్యూఇయర్ వేడుకలకు బన్నీ ప్లాన్… ఎక్కడికి వెళ్లాడో తెలుసా..?

దీంతో పాటు త్వరలోనే పుష్ప-2 షూటింగ్ జరుగబోతోందనే సమాచారం కూడా వస్తోంది. అందుకు డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమయి.. దసరాకు లేదా క్రిస్మస్ కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దామని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

Pushpa-Allu Arjun: ఫ్యామిలీతో కలిసి న్యూఇయర్ వేడుకలకు బన్నీ ప్లాన్… ఎక్కడికి వెళ్లాడో తెలుసా..?

అయితే పుష్ప సక్సెస్ తో బన్నీ, సుకుమార్ లు చెన్నై, హైదరాబాద్ లో సక్సెస్ పార్టీలు కూడా ఇచ్చారు. సక్సెస్ మీట్ లు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా  ఓసక్సెస్  మీట్ లో బన్నీ ఎమోషనల్ కూడా అయ్యాడు. సుకుమార్ లేకుంటే… స్టైలిష్ స్టార్.. ఐకాన్ స్టార్ అనేవి లేవని కంటతడి పెట్టాడు. 


ఇట్స్ ఫ్యామిలీ టైం అంటున్న బన్నీ..

అయితే పుష్ప సినిమా ఇచ్చిన సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న బన్నీ.. కొన్ని రోజులు ఫ్యామిలీలో సరదాగా టూర్ ప్లాన్ చేస్తున్నాడు. వరసగా పుష్ప ప్రమోషన్లతో, షూటింగ్ తో అలసిపోయిన బన్నీ.. ఇప్పుడు పుష్ప సక్సెస్ ను ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీలో కలిసి గోవా వెళ్తున్నాడు. అక్కడే 2022 కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు ప్లాన్ చేశాడు. తన భార్య స్నేహ, పిల్లలు అర్హ, అయాన్ లతో గడపడానికి విరామం తీసుకున్నాడు. మళ్లీ త్వరలోనే సినిమా షూటింగ్ లతో బిజీ అయ్యే అవకాశం ఉండటంతో ఈకొద్ది సమయాన్ని ఫ్యామిలీకి కేటాయించాడు బన్నీ. ఇదిలా ఉంటే సమంత కూడా తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి గోవాలోనే ఉంది.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవిభార్య కూతురు.. ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఎన్నో ఎమోషన్ సన్నివేశాలు జరుగుతున్నాయి. కంటెస్టెంట్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి దాదాపు 80 రోజులు కావడంతో ప్రతి సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా బిగ్ బాస్ వారి కుటుంబ సభ్యులను హౌస్ లోపలకి పంపించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కాజల్, శ్రీరామ్, మానస్, సిరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా సన్నీ, రవి, పింకీ,షన్ను మదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ రవి భార్య నిత్య రావడంతో సంతోషపడిన రవి అనంతరం తన కూతురు రాలేదని బాధపడ్డారు. అయితే కొంత సమయానికి తన కూతుర్ని పంపించి బిగ్ బాస్ రవికి సర్ ప్రైస్ ఇచ్చారు.

ఇలా తన కూతురిని చూడటంతో రవి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం రవి తనకు బిగ్ బాస్ అంకుల్ ని చూపించమని కోరింది. అలాగే రవి కూతురు వియా రావడంతో హౌస్ మొత్తం ఎంతో సందడి వాతావరణం ఏర్పడింది. ప్రతి రోజు టీవీలో నిన్ను చూస్తూ మమ్మీ ఏడుస్తుందని వియా తన తండ్రికి ఫిర్యాదు చేసింది.

రవి కోసం బిగ్ బాస్ గుమ్మాడి గుమ్మాడి అనే పాటను ప్లే చేయడంతో హౌ సభ్యులందరూ ఎంతో సరదాగా డాన్స్ చేశారు.ఈ విధంగా అందరూ ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో బిగ్ బాస్ తన ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ నుంచి బయటకు రావాలని సూచించడంతో కంటెస్టెంట్స్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

టీఆర్పీ కోసం బిగ్ బాస్ భారీ స్కెచ్.. ఫ్యామిలీ మెంబర్స్ రాకతో..

బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు బిగ్బాస్. సీజన్ 4 లో కేవలం గ్లాస్ అవుతల నిలబడి మాట్లాడి వెళ్లారు. కారణం అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా అంలాంటి పరిస్థితి నెలకొంది.

అయితే ఈ సారి కరోనా వ్యాప్తి తగ్గడం.. అంతే కాకుండా హౌస్ లోకి వెళ్లేవారిని నాలుగు రోజుల ముందే కరోనా టెస్ట్ చేయించి.. క్వారంటైన్ చేసినట్లు సమాచారం. ఈ రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో హౌస్ అంతా ఇక ఫ్యామిలీ మెంబర్స్ తో గడపనున్నారు. అందుకే త్వరగా కెప్టెన్సీ టాస్క్ కూడా ముగించేశారు. బుధవారం, గురువారం, శుక్రవారం వరకు ఫ్యామిలీ మీటింగ్ ఎపిసోడ్లను టెలికాస్ట్ చేయనున్నట్లు సమాచారం.

దీంతో ఆ మూడు రోజులు స్టార్ మా కు మంచి టీఆర్పీ వస్తుందని బిగ్బాస్ విశ్లేషకులు చెబుతున్నారు. హౌస్ లోకి ఏ కంటెస్టెంట్ కోసం ఏ ఫ్యామిలీ మెంబెర్స్ వస్తున్నారో తెలుసుకుందాం.. ఈ మీటింగ్ అనేది బిగ్ బాస్ నిర్వాహకులు చాలా స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షణ్ముఖ్ కోసం వల్ల అమ్మ ఉమ రాణి, గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా రాబోతున్నారని సమాచారం.

సన్నీ కోసం వాళ్ల అమ్మ కళావతి వస్తున్నారట. ఇక సిరి కోసం వాళ్ల అమ్మ మరియు తను దత్తత తీసుకున్న కుమారుడు హౌస్ లోకి రానున్నారని విశ్వసనీయ సమాచారం. అలాగే ప్రియాంక సింగ్ కోసం వాళ్ల తల్లిదండ్రులు రాబోతున్నారట. మానస్ కోసం వాళ్ల అమ్మ పద్మ వస్తున్నారట. ఇక హౌస్ లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు భావోద్వేగంతో కూడిన సందడి చేయనున్నారు.

నన్ను టార్చర్ పెట్టొద్దు నాకు ఫ్యామిలీ ఉందంటూ ఎమోషనల్ అయినా బిగ్ బాస్ బ్యూటీ..!

బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక బిగ్ బాస్ రియాలిటీ షో కి తెలుగులో కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాలుగు సీజన్లను పూర్తిచేసుకొని ఐదవ సీజన్ ప్రసారమవుతుంది.ఇక నాలుగవ సీజన్లో భాగంగా గుజరాతి అమ్మాయిగా అందరికీ పరిచయమైన కంటెస్టెంట్ మోనాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె బిగ్ బాస్ సీజన్ ఫోర్ హౌస్ లోకి అడుగుపెట్టి తనదైన శైలిలో దూసుకుపోయింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ చివరి వరకు హౌస్ లో ఉండి విశేష ఆదరణ దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మొదట్లో ఈమె అభిజిత్ తో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత అఖిల్ తో లవ్ ట్రాక్ నడిపింది.ఒకానొక సమయంలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనాల్ ఎన్నో కార్యక్రమాలు ద్వారా ఎంతో బిజీగా మారారు.ఇక ఈమె అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో ఏకంగా ఐటమ్ సాంగ్ లో నటించే అవకాశాన్ని దక్కించుకుని కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పవచ్చు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే మోనాల్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తుంటారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండే ఈమె పట్ల కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే డ్రామా క్వీన్ అంటూ ఈమె గురించి నెగిటివ్ కామెంట్ చేయడంతో ఈ కామెంట్లపై స్పందించారు. రేయ్ పిచ్చిపిచ్చిగా ఉందా నాకు ఫ్యామిలీ ఉంది ఈ పిచ్చి కామెంట్స్ ఏంటి మీకు అసలు కామన్సెన్స్ లేదు నన్ను ఫాలో కావడం ఇష్టం లేకపోతే అన్ ఫాలో అవ్వండి అంతేకానీ ఇలా పిచ్చి కామెంట్స్ తో మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఈమె గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇలా మోనాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన స్వామీజీ.. ఓ అభిమాని గుండు కొట్టించుకొని మరీ!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణించి దాదాపు రెండు వారాలు అవుతున్నా పునీత్ సమాధిని చూడటానికి రోజూ వేలల్లో సందర్శకులు వస్తున్నారు.

ఇటీవల ఆ సమాధి వద్ద ఓ జంట పెళ్లి కూడా చేసుకున్న విషయం తెలిసిందే. అతడి మరణ వార్త విని కొంతమంది అభిమానులు గుండెపోటుతో మరణించారు. మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పునీత్ కుటుంబసభ్యులు దయచేసి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెబుతున్నా.. అభిమానులు ఆ విషయాలను పెడచెవిన పెడుతున్నారు. ఆత్మహత్యల పర్వం అక్కడ కొనసాగుతూనే ఉంది. దీంతో పునీత్ కుటుంబసభ్యులు, కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పునీత్‌ పెద్దన్నయ్య రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ అభిమాని కుటుంబాన్ని పరామర్శించారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన అభిమాని కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు చిత్రదుర్గ మురుఘ రాజేంద్ర బృహమఠం డాక్టర్‌ శివమూర్తి మురుఘా వచ్చారు.

పునీత్ మరణం తర్వాత ఆయనకు బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించారు. ప్రశస్తిని స్వీకరించడానికి పునీత్ భార్య అశ్వినిని ఆహ్వానించారు. పునీత్ అభిమానులు కొంతమంది అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. నిర్వహించిన వారిలో టి.నరసిపుర తాలూకా బసవనహళ్ళి అభిమానులు, గ్రామస్తులు ఉన్నారు. అందులో ఓ అభిమాని గుండు కొట్టించుకొని పునీత్ కు నివాళులు అర్పించాడు.

సూర్య అలాంటి వ్యక్తి..అందుకే అనుక్షణం నాకు టెన్షన్: జ్యోతిక

హీరో సూర్య తమిళ అగ్రహీరోలలో ఒకరు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సూర్య జ్యోతిక వీరిద్దరూ రీల్ అండ్ రియల్ లైఫ్ హిట్ పెయిర్ లలో ఒకరు. వీరిద్దరూ కలిసి చాలా చిత్రాల్లో నటించారు. ఆమె ఒక స్టార్ హీరో భార్య అలాగే ఇద్దరు పిల్లల తల్లి, వచ్చిన స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకొని నటిస్తున్న బెస్ట్ ఆర్టిస్ట్. ఈమె 2ఢీ ఎంటర్టైన్మెంట్స్ కి బాస్ లేడీ కూడా.

ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న జ్యోతిక గురించి, ఆమె భర్త గురించి, సౌత్ సినిమాల గురించి జ్యోతిక మనసులోని మాటలు తెలుసుకుందాం.. కొత్త ఎక్స్ పెరిమెంట్ చేసిన ప్రతిసారి చాలా టెన్షన్ ఉంటుంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్లు మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇలాంటి ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. అన్నీ కూడా టెన్షన్ పడాల్సిన విషయాలే. కానీ అలాంటివన్నీ చూసినప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం అంటుంది జ్యోతిక.

ప్రస్తుతం సూర్య,నేను సమాజంతో పాటు నడుస్తూ ఉన్నాం. థియేటర్లలో చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. అసలు బిగ్ స్క్రీన్ కి అతీతంగా చెప్పే కథలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని ఓటిటిలో చూడవచ్చు. ప్రస్తుతం ఓటీటీ, థియేటర్ అనేవి సేమ్ సైడ్ ఆఫ్ మేజ్ అన్నట్టు మారిపోయాయి అని అంటోంది

తన భర్త గురించి ఆమె ఈ విధంగా అంటోంది. సూర్య చాలా రొమాంటిక్ భర్త. పిల్లలను, నన్ను బాగా చూసుకుంటాడు. ప్రొడక్షన్ హౌస్ లో నా భాగస్వామ్యాన్ని ఎంకరేజ్ చేస్తారు. అంతే కాకుండా నాకు నచ్చిన సినిమాలు ఎంకరేజ్ చేస్తారు. భార్య మాటకు విలువ ఇస్తారు. ఉదయాన్నే కూర్చుని కాఫీ తాగడానికి ఇష్టపడతాం. ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. అందుకే ఎంతోమంది అమ్మాయిలు మా ఆయన్ని ఇష్టపడుతుంటారని ఆమె తెలిపింది. అంతమంది లేడీస్ ఫాలో అవుతున్నారు అని నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువ సరదాగా తెలిపింది.

వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న సుమ కనకాల.. ఎక్కడికి వెళ్లారో తెలుసా..?

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేరళకు చెందిన ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ.. తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు యాంకరింగ్‌ చేస్తూ కూడా ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకున్నారు. ఆమె యాంకరింగ్ స్పూర్తితో ఎంతో మంది యాంకర్స్ తయారు అయ్యారు.

ఆమె ప్రతీ ఒక్క కార్యక్రమాన్ని చక్కటి చిరునవ్వు, సమయస్ఫూర్తితో యాంకరింగ్ రంగంలో రాణిస్తుంది. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలోను ఆమె మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి మంచి గుర్తింపును పొందింది సుమ. టీవీ షోలనే కాకుండా ఆమె పలు చలన చిత్రాలకు సంబంధించి ఆడియో ఫంక్షన్లకు వ్యాఖ్యతా వ్యవహరించి ఎంతో పేరు తెచ్చుకుంది.

అయితే ఇటీవల ఆమె యూట్యూబ్ చానల్ కూడా ప్రారంభించి అందులో మంచి కంటెంట్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఆమె 1999లో తన తోటి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమెకు ఇద్దరు పిల్లలు రోషన్, కార్తికేయ. అయితే ఇటీవల ఆమె ఫ్యామిలీతో మాల్దీవ్స్ లో వెకేషన్ కు వెళ్లారు.

అక్కడ ఆమెతో పాటు తమ ఫ్యామిలీతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫొటోలకు నెటిజన్లు ‘ఎంజాయ్ యు ఆర్ వెకేషన్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.