Nikhil: హ్యాపీడేస్ సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు నిఖిల్ సిద్ధార్థ. ఇలా ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి నిఖిల్ అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో హీరోగా బిజీ అయ్యారు. ఇక కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇలా హీరోగా కొనసాగుతూ వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి నిఖిల్ వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు ఈయన 2020వ సంవత్సరంలో డాక్టర్ అయినటువంటి పల్లవి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
ఇలా వైవాహిక జీవితంలో ఎంత సంతోషంగా గడుపుతున్నటువంటి ఈ జంట ఇటీవల తల్లిదండ్రులుగా మారారు. గత కొద్ది రోజుల క్రితం తన భార్య పల్లవి సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకడానికి మేము చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని తెలిపారు.
నాన్నే పుట్టాడు..
ఇకపోతే బుధవారం పల్లవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే నిఖిల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. మళ్ళీ నాన్నే మా ఇంటిలో పుట్టాడు ఆయనని మిస్ అయ్యి ఏడాది అవుతోంది తనే మా ఇంట్లో పుట్టాడు.అంటూ నిఖిల్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె వృత్తిపరమైన విషయం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే అనసూయ సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈమె ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఎన్సిసి క్యాంపులో సుశాంక్ పరిచయం ఏర్పడటంతో అప్పటినుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారు.
ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ రహస్యగా ప్రేమ ప్రయాణం కొనసాగించారు అయితే అనసూయ తండ్రి తనకోసం ఒక పైలెట్ సంబంధం తీసుకువచ్చారట మంచి ఉద్యోగం మంచి ఆస్తిపరుడు తనకు పెళ్లి చేయాలని భావించారు. అయితే అనసూయ మాత్రం తన ప్రేమ విషయాన్ని తన తల్లి ద్వారా తన తండ్రికి చేరవేయడంతో తన తండ్రి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా తాను తెచ్చిన సంబంధం చేసుకుంటే సరేనని లేదంటే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంటూ తన లగేజ్ మొత్తం బయటకు విసిరేసారట. దీంతో తన లగేజ్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి అనసూయ దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు తన తండ్రి అంగీకారం కోసం ఎదురు చూశారట. తన తండ్రి తమ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో సుశాంక్ తో మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామంటూ ఈమె మాట్లాడారట కానీ శశాంక్ మాత్రం అలా వెళ్లి పెళ్లి చేసుకుంటే మనకు ఎలాంటి గౌరవం ఉండదు ఆయన మనసు తప్పకుండా మారుతుందని ఎదురు చూశారట.
9 ఏళ్ల నిరీక్షణ..
ఇలా అనసూయ ఎంతకీ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి తన తండ్రి ఒక అడుగు వెనక్కి వేసి తన ప్రియుడుతోనే తనకు పెళ్లి చేశారని అయితే ఇష్టంగా మాత్రం చేయలేదని కానీ అనసూయకు పిల్లలు పుట్టిన తర్వాత తనని మనస్పూర్తిగా అంగీకరించారని తెలుస్తుంది. ఇలా తన పెళ్లిలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని తన ప్రేమ గెలిపించుకోవడం కోసం ఈమె ఎన్నో ఏళ్ళు ఎదురు చూశాను అంటూ గతంలో కూడా తెలిపిన సంగతి తెలిసిందే.
Shivani Rajasekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జీవిత రాజశేఖర్ గురించి పరిచయం అవసరం లేదు. అయితే వీరి కుమార్తెలు ఇద్దరు శివాని శివాత్మిక హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరూ పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ మాత్రం కాలేకపోయారు. శివాని కోటబొమ్మాలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..
ఈ సినిమా ద్వారా ఈమె మొదటి హిట్ అందుకున్నారని చెప్పాలి. సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి శివాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నష్టజాతుకురాలని మా ఇంటికి నేను దరిద్రం అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. శివాని రాజశేఖర్ మాట్లాడుతూ శేఖర్ సినిమా సమయంలో తనకు కరోనా వచ్చింది. అయితే ఈ సినిమాలో తన తండ్రి కూడా నటించడంతో ఆయనకి కూడా కరోనా వచ్చింది.
నేను కరోనా బారిన పడడంతో నావల్లే నాన్నకు కూడా కరోనా వచ్చింది. కానీ నాన్నకు చాలా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆయన వెంటిలేటర్ పై వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని,శాచురేషన్ పూర్తిగా పడిపోయిందనీ తెలిపారు. ఇలా నాన్నని బెడ్ పై చూసి తనకు చాలా బాధేసిందని నాన్న ఈ పొజిషన్ కి రావడానికి తానే కారణం అంటూ ఎంతో ఏడ్చానని తెలిపారు.
నాన్నే నాకు ధైర్యం చెప్పారు…
నావల్ల నాన్నకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆలోచిస్తూ బహుశా నేను మా ఇంటికి దరిద్రురాలినేమో నా జాతకం బాగా లేకపోవడం వల్లే ఇలా నాన్నకు ఇలా జరిగిందేమో అంటూ ఎన్నో ఆలోచనలు చేసేదానిని అంటూ ఈమె తెలియజేశారు. ఇక నాన్న వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ తమకు ఎంతో ధైర్యం చెప్పేవారని శివాని వెల్లడించారు. తాను గుండె దడ సమస్యతో బాధపడుతున్నాను అది నెలకు ఒకసారి మాత్రమే నాకు వచ్చేది. నాన్నే అందుకు ట్రీట్మెంట్ ఇచ్చేవారు. కానీ నాన్నకు అలా అయ్యేసరికి రోజుకు రెండు మూడు సార్లు అలాంటి సమస్యతో బాధపడ్డానని తనకు ఏమవుతుందోనని నాన్న నాకు చాలా ధైర్యం చెప్పారు అంటూ ఈ సందర్భంగా శివాని తెలిపారు.
Biggboss Kaushal: బుల్లితెర సీరియల్స్ లో నటుడిగా నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న కౌశల్ వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించి మెప్పించారు. అయితే ఈయనకు ఉన్న పాపులారిటీతో ఈయన బిగ్ బాస్ అవకాశాన్ని అందుకొని ఏకంగా విన్నర్ గా బయటకు తిరిగివచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న కౌశల్ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న బీ బీజోడి కార్యక్రమంలో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా కౌశల్ నూతన గృహప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. ఈయన ఈ ఇంటిని తన తండ్రికి సర్ప్రైజ్ గిఫ్ట్ గా అందించారని తెలుస్తోంది. 2021 వ సంవత్సరంలో ఫాదర్స్ డే సందర్భంగా కౌశల్ తండ్రి తన కోరికను బయట పెడుతూ ఎప్పటికైనా తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని తన కోరిక అని అది కూడా వైజాగ్లో ఉండాలని తన కోరిక అంటూ తెలియజేశారు.
ఈ విధంగా కౌశల్ తండ్రి కోరిక చెప్పడంతో ఎలాగైనా తన తండ్రి కోరిక నెరవేర్చాలన్న ఉద్దేశంతో కౌశల్ హైదరాబాదులో తన తండ్రికి ఒక ఇంటిని కొనుగోలు చేసి తనకు సర్ప్రైజ్ ఇచ్చారు.ప్రస్తుతం ఈ ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కౌశల్ తండ్రి వైజాగ్ లో తనకు ఇల్లు కావాలని కోరగా ఈయన మాత్రం హైదరాబాద్లో తనకు ఇల్లు కొనిచ్చారు.
Biggboss Kaushal: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కౌశల్….
ప్రస్తుతం తన తండ్రి హైదరాబాదులోనే ఉండటం వల్ల తనకు హైదరాబాద్ లోనే ఇంటిని కొనుగోలు చేసినట్టు కౌశల్ తెలిపారు.ఇలా ఈ ఇంటిని కొనుగోలు చేసి తన తండ్రి కోరిక తీర్చాలని తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ ఈయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కౌశల్ కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Gajuwaka Conductor: గాజువాక కండక్టర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గాజువాక బస్ డిపో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఈమె డాన్స్ పై మక్కువతో పలు కార్యక్రమాలలో డాన్సులు చేస్తూ పెద్ద ఎత్తున అందరిని సందడి చేసేవారు. అయితే ఈమె డాన్స్ వీడియోలు చూసినటువంటి మల్లెమాలవారు తనకు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో అవకాశం కల్పించారు.
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఝాన్సీ ప్రస్తుతం ఓంకార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి డాన్స్ ఐకాన్ షోలో సందడి చేశారు.ఆహాలో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ రమ్యకృష్ణ జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం తాజాగా ప్రోమోని విడుదల చేశారు.
వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాక ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా కండక్టర్ ఝాన్సీ మరోసారి పల్సర్ బండి పాటకి డాన్స్ వేస్తూ అందరిని సందడి చేశారు. అనంతరం వేదికపై ఈమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
Gajuwaka Conductor: తల్లి తమ్ముడి కోసం బ్రతికాను…
ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ తన తండ్రి వల్ల తాను చనిపోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అయితే ఆయన వల్ల నేను ఎందుకు చనిపోవాలని తనకు తానే ధైర్యం నింపుకొని తన తల్లి తమ్ముడు కోసం బ్రతకానని ఈమె వెల్లడించారు. ఇలా పొట్టకూటికోసం డాన్స్ ని ఎంచుకొని నేను డాన్స్ చేస్తున్నప్పటికీ ఎంతోమంది తనని విమర్శించారు. అలాగే కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ వదులుకోలేదని నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం డాన్స్ అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Prudhvi Raj: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఈయనకు ఖడ్గం సినిమాలో ఈ డైలాగు ద్వారా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి పలు సినిమాలలో నటించిన పృధ్విరాజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Prudhvi Raj: నా తండ్రి ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేశారు.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన కమెడియన్ పృథ్వీ రాజ్!
ఈ క్రమంలోనే 2019 ఎన్నికల సమయంలో పృథ్విరాజ్ వైసీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా ఈయన పడిన కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ చైర్మన్ పదవి ఇచ్చారు.ఇలా చైర్మన్ గా కొనసాగుతున్న ఈయన మహిళల పట్ల లైంగిక ఆరోపణలు రావడంతో ఈ పదవి నుంచి తొలగించారు.
Prudhvi Raj: నా తండ్రి ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేశారు.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన కమెడియన్ పృథ్వీ రాజ్!
ఇక రాజకీయాలలో అధికారంలోకి వచ్చిన ఈయన ఏకంగా ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో పలువురు నటీనటుల పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ విధంగా పృథ్వి రాజ్ పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి వంటి హీరోల పై కూడా ఆరోపణలు చేశారు.
పృథ్వీరాజు నోటిదూల కారణంగా ఈయన చైర్మన్ పదవిని కోల్పోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలను కోల్పోయారు.
కర్ణుడు పాత్రలో నటించిన పృథ్వి రాజ్ తండ్రి…
ఇదే విషయాన్ని పృథ్వీరాజ్ పొరపాటుగా మాట్లాడానని సినీ పెద్దలకు క్షమాపణలు చెబుతూ తిరిగి ఇండస్ట్రీలో అవకాశాలను అందుకున్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృధ్విరాజ్ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను వైసిపి అనే ఉగ్రవాద సంస్థలో ఉండి ఒక ఉగ్రవాదిగా మాట్లాడాను అంటూ ఏకంగా పార్టీపై ఆరోపణలు చేయడమే కాకుండా, తన కుటుంబ విషయాల గురించి కూడా తెలిపారు. తన తండ్రి సుబ్బారావు సీనియర్ ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణవతారం సినిమాలో కర్ణుడి పాత్రలో నటించారని, ఆయన సుమారు 17 సినిమాల వరకు నటించారని ఈ సందర్భంగా తెలిపారు.
Shivani: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శేఖర్. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో రాజశేఖర్ కుటుంబం సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
Shivani: నా వల్లే నాన్న ఆ స్థితిలో ఉన్నారు.. నేను నష్ట జాతకురాలిని.. ఫ్రీ రిలీజ్ వేడుక లో ఎమోషనల్ అయిన శివాని!
జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ముస్కాన్, ఆత్మీయ రాజన్ హీరోయిన్లుగా శివాని ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రాజశేఖర్ కూతురు శివాని మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయంలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో పెరిగిపోయాయి.దీంతో తాను కరోనా బారిన పడ్డానని తనకు కరోనా రావడం వల్ల తన నుంచి తన తండ్రి కూడా కరోనా బారిన పడ్డారని శివాని తెలిపారు.
Shivani: నా వల్లే నాన్న ఆ స్థితిలో ఉన్నారు.. నేను నష్ట జాతకురాలిని.. ఫ్రీ రిలీజ్ వేడుక లో ఎమోషనల్ అయిన శివాని!
కరోనా నుంచి నేను తొందరగా కోలుకున్నప్పటికీ నాన్న మాత్రం చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో డాక్టర్లు 50-50 ఛాన్స్ అని కూడా చెప్పారు. ఆ సమయంలో నాన్నను అలా చూసేసరికి నాన్న ఇలా కావడానికి ప్రధాన కారణం నేనే కదా అని నాపై నాకు చాలా కోపం వచ్చిందని శివాని తెలిపారు. ఆ సమయంలో బయట వాళ్ళు అందరూ నన్ను నష్ట జాతకురాలని పిలిచారు. నాకు అదే అనిపించింది.
నాన్నను ఆ పరిస్థితులలో చూసి తట్టుకోలేకపోయానని భగవంతుడి దయవల్ల నాన్న ఆరోగ్యంగా బయటపడ్డారని శివాని ఈ సందర్భంగా తన నాన్న ఆరోగ్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. వేదికపై శివాని మాట్లాడుతూ వుండగా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక కరోనా నుంచి కోలుకున్న తర్వాత నాన్న ఎంతో యాక్టివ్ గా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలో తన పాత్ర సిగరెట్ తాగితేనే అద్భుతంగా ఉంటుంది. కానీ అప్పటికే కరోనా సోకిన నాన్న లంగ్స్ దెబ్బతిన్నాయి. అందుకే సిగరెట్ వద్దని చెప్పినా వినకుండా ఈ పాత్ర హైలెట్ కావాలంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సిగరెట్ తాగారని,ఈ సందర్భంగా ఈ సినిమా కోసం రాజశేఖర్ పడిన కష్టం గురించి శివాని వెల్లడించారు.
Major Movie: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా, ఆయన పాత్రలో హీరో అడివి శేష్ నటించిన చిత్రం మేజర్. ఈ సినిమా జూన్ 3వ తేదీ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దేశం కోసం సందీప్ చివరి క్షణం వరకు పోరాడిన తీరును ఎంతో అద్భుతంగా ఈ సినిమా ద్వారా చూపించనున్నారు.
Major Movie: మేజర్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ తండ్రి ఎవరో తెలుసా?
ఈ సినిమా వచ్చే నెల 3వ తేదీ విడుదల కావడంతో ఇప్పటి నుంచి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా మేజర్ హీరో అడవి శేష్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు.
Major Movie: మేజర్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ తండ్రి ఎవరో తెలుసా?
ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటి సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. సాయి మంజ్రేకర్ ఎవరు ఏమిటి అనే విషయానికి వస్తే ఈమె బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ కుమార్తె.మహేష్ మంజ్రేకర్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఈయన బాలీవుడ్ బోజ్ పురి చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
ఈయన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా మాత్రమే కాకుండా మరాఠీలో బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. ఇక ఈయన మొదటగా దీపా మెహతా అనే కాస్ట్యూమ్ డిజైనర్ ను వివాహం చేసుకున్నారు. అనంతరం వీరు విడాకులు తీసుకొని తరువాత ఈయన మేధా మంజ్రేకర్ అనే మహిళను వివాహం చేసుకున్నారు వీరిద్దరి కూతురే సాయి మంజ్రేకర్. ప్రస్తుతం ఈమె మేజర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.
Josh Ravi: నాగచైతన్య హీరోగా వెండితెర అరంగ్రేటం చేసిన జోష్ సినిమాలో నటించడం వల్ల జోష్ రవిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రవి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా జోష్ రవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఈయనకు జోష్ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయిన మీకు మంచి గుర్తింపు తీసుకు వచ్చిందని ప్రశ్నించగా అందుకు ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
సినిమా పేర్లు మన పేరు ముద్దు ఎవరు పెట్టుకోరు ఆ సినిమాలో అతని క్యారెక్టర్ నచ్చితేనే ప్రేక్షకులు ఆ నటుడికి సినిమా పేరును తన పేరుకు ముందుగా పెట్టుకుంటారు.ఇక జోష్ సినిమా కమర్షియల్ హిట్ కాలేదని చెప్పలేము చాలా మందికి ఈ సినిమా నచ్చింది అందులో నా పాత్ర నచ్చడం వల్ల ఇలా నాకు ఆ పేరు వచ్చిందని వెల్లడించారు.
ఇక జోష్ రవి సినిమాల గురించి మాట్లాడుతూ తన కెరియర్ తేజ గారి దగ్గర ప్రారంభమైందని హైదరాబాద్లో అడుగుపెట్టగానే అవకాశాల కోసం ఆయన దగ్గరకు వెళ్లాలని తెలియజేశారు. ఇక నాన్న కూడా రంగస్థల నటుడు కావడం వల్ల తాను సినిమాల్లోకి వస్తానంటే అడ్డుచెప్పలేదు. ఈ విధంగా నాన్న వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని జోష్ రవి వెల్లడించారు.
ఇకపోతే నాన్న తనికెళ్ళ భరణి గారు మంచి స్నేహితులని ఈ సందర్భంగా జోష్ రవి వెల్లడించారు. ఇక తనికెళ్ళ భరణి గారు నాన్నగారి స్నేహితుడు అయినప్పటికీ ఆయనని మీరు అవకాశాలు అడగలేదా అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తాను ఎప్పుడు ఎవరిని నోరు తెరిచి అవకాశాలు అడగలేదని తన టాలెంట్ చూసి, ఆడిషన్ టెస్ట్ పెట్టిన తర్వాతే అవకాశాలు ఇవ్వమని చెప్పేవాడినని వెల్లడించారు.ఇక తనికెళ్ల భరణి గారిని కూడా ఎప్పుడు అవకాశాలు అడగలేదు కానీ ఏదైనా ఒక సినిమాలో నాకు సరిపోయే పాత్ర ఉండి ఇతరుల రికమండేషన్ వల్ల ఆ పాత్ర నాకు కాకుండా వేరే వాళ్లకు వెళితే ఆ సమయంలో భరణి గారికి ఫోన్ చేసి పరిస్థితి ఇది అని ఆయనకు చెప్పి ఆ అవకాశం నాకు ఇప్పించాలని చెప్పేవాడిని. ఆ సమయంలో భరణి గారు వాళ్ళకి ఫోన్ చేసి ఆ కుర్రాడు బాగా మంచి టాలెంటెడ్, ఆ పాత్రకు కరెక్టుగా సరిపోతారని చెప్పేవారు అంటూ జోష్ రవి ఈ సందర్భంగా తెలిపారు.
Varun Tej: కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ కలిసి నటించిన తాజా చిత్రం గని. ఈ సినిమా నేడు అనగా ఏప్రిల్ 8న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే సమయం వచ్చేసింది. ఇకపోతే ఈ సినిమా ఎమోషన్స్ లో భాగంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
Varun Tej: నాన్న ఎప్పుడు తొందరగా వచ్చేయ్ అని చెప్పేవారు.. వినకుండా అలా చేసేవాళ్ళం: వరుణ్ తేజ్
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. తాత తండ్రి నాగబాబు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలగురించి పంచుకున్నారు. నా పెళ్లి ఎప్పుడు అని మా నాన్న ను తరచుగా అభిమానులు అడుగుతూ ఉంటారట, అయితే పెళ్లి విషయాన్ని పూర్తిగా మా నాన్న నాకే వదిలేశాడు అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. అనంతరం మీ నాన్నను మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అని యాంకర్ ప్రశ్నించడంతో.. ఆ విషయంపై స్పందించిన వరుణ్ తేజ్..
Varun Tej: నాన్న ఎప్పుడు తొందరగా వచ్చేయ్ అని చెప్పేవారు.. వినకుండా అలా చేసేవాళ్ళం: వరుణ్ తేజ్
ఒకప్పుడు చాలా ఉండేవి. మా నాన్నతో మాట్లాడాలి ఏదైనా అడగాలి అంటేనే భయంగా ఉండేది. కానీ నేను హీరోగా మారి సినిమా మూడు సినిమాలు చేసిన తర్వాత కూడా మా నాన్నతో మాట్లాడాలి అంటే భయపడేవాడిని. కానీ ప్రస్తుతం మా నాన్నతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాను. ఇప్పటికే అడగాల్సిన ప్రశ్నలు అని అడిగేసాను. అభిమానులు అడిగే ప్రశ్నల్లో దాదాపుగా చాలా వరకూ నేనే అడిగేశాను అని తెలిపాడు వరుణ్ తేజ్.
అలాగే నాకు,నిహారిక కు ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటారు. అలా అడగవద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా మా నాన్న వినకుండా అలానే చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఆయన షూటింగ్ లో ఉంటే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడని అడుగుతూనే ఉంటారని తెలిపాడు వరుణ్ తేజ్. షూటింగ్ లో ఉన్నాం అని చెబితే తొందరగా వచ్చేయండి అని అంటారు.. షూటింగ్ లో ఉంటే ఎలా త్వరగా వస్తాం.. కానీ ఒక తండ్రిగా మా నాన్న మమ్మల్ని అడుగుతూనే ఉంటారు అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.
Top Telugu website in the world | Telugu Gossips | Breaking News Headlines, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net