Tag Archives: good news

Tirumal Tirupati Devasthanam: తిరుమల భక్తులకు శుభవార్త..! నెరవేరబోతున్న కల..!

Tirumal Tirupati Devasthanam: ఆధ్యాత్మిక నగరం తిరుపతికి రోజురోజు భక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో తిరుపతి నగరం వేగంగా విస్తరిస్తోంది.

Tirumal Tirupati Devasthanam: తిరుమల భక్తులకు శుభవార్త..! నెరవేరబోతున్న కల..!

దీంతో ఇటు భక్తులు, అటు నగరవాసుల పెరుగుతుండటం.. ఫలితంగా వాహనాల రాకపోకలు ఎక్కువ అవ్వడంతో తిరుపతి  నగరాన్ని ట్రాఫిక్ సమస్యలు వేధిస్తున్నాయి. అయితే తాజాగా తిరుపతి వాసులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కల నెరవేరబోతోంది.

Tirumal Tirupati Devasthanam: తిరుమల భక్తులకు శుభవార్త..! నెరవేరబోతున్న కల..!

నగరంలోని ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. దీంతో  పాటు భక్తులు కొండపైకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. టీటీడీ, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పోరేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ఫ్లైఓవర్, గరుడ వారధి వారం, పది రోజుల్లో తిరుపతి వాసులకు అందుబాటులోకి రానుంది.

కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో..

ఫ్లై ఓవర్ నిర్మాణ ఖర్చులో టీటీడీ 67 శాతం భరించగా… తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధుల నుంచి 33 శాతం కేటాయిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఆదాయం తగ్గడంతో ఇప్పటి వరకు టీటీడీ రూ. 75 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ ప్రస్తుతం బస్టాండ్ నుంచి అలిపిరి వరకు గరుడ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. తర్వాత కడప మార్గం నుంచి తిరుపతి నగరంతో సంబంధం లేకుండా మరో కనెక్షన్ ను కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఆఫ్కాన్ సంస్థ ప్రయత్నిస్తోంది.

Good News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇక అన్నీ ఆ కార్డులోనే..!

Good News: తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలను ఈ హెల్త్ రికార్డ్ పేరిట నమోదు చేయనుంది. దీంతో రాష్ట్రంలోని అందరి ఆరోగ్య వివరాలను సేకరించి రికార్డ్ రూపంలో నమోదుచేయనుంది.

Good News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇక అన్నీ ఆ కార్డులోనే..!

ఇప్పటికే ఈ- హెల్త్ రికార్డ్ కార్డుల కోసం ప్రభుత్వం ఆర్డర్ పెట్టింది. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలు, వ్యాధులు అన్ని ఈ రికార్డ్ లో నమోదుకానున్నాయి. సుమారు 17 రకాల వివరాలను ఇందులో రికార్డ్ చేయనున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్ వేర్ రూపొందించి.. ఒక్కో వ్యక్తికి ఒక్కో యూనిక్ ఐడీ నెంబర్ ఇవ్వనున్నారు. 

Good News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇక అన్నీ ఆ కార్డులోనే..!

ఈ వివరాలను రాష్ట్రంలోని ప్రతీ ఆసుపత్రికి అనుసంధానించనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు ఈ వివరాలను అనుసంధానం చేయనున్నారు. దీని వల్ల ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలు, వారి హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఆసుపత్రుల చేతిల్లో ఉంటుంది.


తెలంగాణ వ్యాప్తంగా సర్వే ..

దీంతో వ్యక్తుల ఆరోగ్య వివరాలు తెలియడంతో చికిత్స సులభం అవుతుంది. దీని వల్ల సమయాభావం లేకుండా పేషెంట్లకు చికిత్స అందుతుంది. పేషెంట్ వివరాలను తెలుసుకునేందుకు యూనిక్ ఐడీ నెంబర్ ఎంటర్ చేయగానే.. సదరు వ్యక్తి మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయగానే పేషెంట్ యొక్క పూర్తి వివరాలు తెలియనున్నాయి.  దీని కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని యోచిస్తోంది. ఏఎన్ఎంలు, అంగన్వాడీలు ప్రతీ ఇంటికి తిరిగి ప్రజలు ఆరోగ్య వివరాలను నమోదు చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం వీరందరికీ ట్యాబులు ఇవ్వనుంది. వ్యక్తుల ఎత్తు, బరువు, బీపీ, షుగర్, బ్లడ్ గ్రూప్ వంటి వివరాలను పొందు పరుచనున్నారు.

EBC Nestam: ఆ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. త్వరలోనే వారి ఖాతాలో 15 వేలు జమ!

EBC Nestam: రాష్ట్రంలో వెనుకబడిన అగ్రవర్ణ పేద మహిళలకు జగన్ సర్కార్ శుభవార్తను తెలియజేసింది.ఈ క్రమంలోనే అగ్రవర్ణంలో పేద మహిళలకు చేయూత ఇవ్వడం కోసం ఆర్థికంగా జగన్ ప్రభుత్వం సహాయం చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 25వ తేదీ నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

EBC Nestam: ఆ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. త్వరలోనే వారి ఖాతాలో 15 వేలు జమ!

ఈ విధంగా ఈ పథకానికి అర్హులైన మహిళలందరికీ ఈనెల 25వ తేదీ నుంచి 15 వేల చొప్పున వారి ఖాతాలో జమ అవుతాయని వెల్లడించారు. అయితే ఈ పథకానికి కాపు నేస్తం, వైయస్సార్ చేయూత, ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీ మహిళలు అనర్హులుగా ప్రకటించారు.

EBC Nestam: ఆ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. త్వరలోనే వారి ఖాతాలో 15 వేలు జమ!

కేవలం ఈబీసీ కి చెందిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా లబ్ధిదారుల అయిన మహిళకు ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు బుక్కు ఉండాలి. అలాగే గ్రామాల్లో అయితే నెలకు 10 వేల ఆదాయం మించకూడదు పట్టణాలలో 12 వేల ఆదాయం మించకూడదు.

ఈ పథకానికి వీరు అనర్హులు..

ఈ పథకానికి అర్హులు కావాలంటే అభ్యర్థికి మూడు ఎకరాల కన్నా మాగాణి తక్కువగా ఉండాలి అదే విధంగా 10 ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండకూడదు. ఇలా భూమి ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. అదేవిధంగా లబ్ధిదారుడి కుటుంబంలో ఎవరికీ పెన్షన్ రాకూడదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు.అదేవిధంగా ఫోర్ వీలర్ ఉన్నవారు కూడా ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.

Manch Family: మంచు ఫ్యామిలీ ఎగిరి గంతేసే వార్త..! వారు అనుకున్న రోజు రానే వచ్చేసింది..!

Manch Family: తెలుగు పరిశ్రమలో ఎక్కువగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీల మధ్యనే ఎక్కువగా పోటీ ఉంటుంది అని అభిమానులు అభిప్రాయపడుతుంటారు. తన హీరో సినిమా హిట్ అయిందంటే.. లేదు మా హీరో సినిమా హిట్ అయిందంటూ.. వాళ్లకు వాళ్లే కొట్టుకునే పరిస్థితికి వస్తుంది.

Manch Family: మంచు ఫ్యామిలీ ఎగిరి గంతేసే వార్త..! వారు అనుకున్న రోజు రానే వచ్చేసింది..!

కానీ ఇదంత సినిమా వరకే.. నిజ జీవితంలో వాళ్లు కుటంబసభ్యులు బాగానే కలిసి ఉంటారు. ఈ రెండు ఫ్యామిలీలే కాక.. మరో రెండు ఫ్యామిలీలు కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కవగా టాపిక్ అవుతుంటారు. అందులో ముఖ్యంగా.. రాజేశేఖర్ ఫ్యామిలీ అండ్.. మంచు ఫ్యామిలీ.

Manch Family: మంచు ఫ్యామిలీ ఎగిరి గంతేసే వార్త..! వారు అనుకున్న రోజు రానే వచ్చేసింది..!

అప్పుడప్పడు రాజేశేఖర్ ఫ్యామిలీ చిరంజీవికి వ్యతిరేకంగా ఉంటారు అనే వార్తలు వస్తుంటాయి. వాళ్లు పరోక్షకంగా ఒకరపై ఒకరు దూషించుకోవడం చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. ఇక తాజాగా మా అధ్యక్ష ఎన్నికలో మాత్రం.. ఒకరిపై ఒకరు అసహనం ఎంత వరకు ఉందనేది తెలిసిపోయింది.


మోహన్ బాబు యూనివర్సిటీగా..

ఇటు మెగా ఫ్యామిలీ అంతా ఒకవైపు ఉంటే.. మంచు ఫ్యామిలీ అంతా మరో వైపు ఉండి పోరాడారు. చివరకు మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు.. మంచు మోహన్ బాబు.. ఇటు విలన్ గా.. అటు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఒక్క సినీ రంగంలోనే కాదు అతడికి ప్రత్యేకంగా విద్యా సంస్థ కూడా ఉందన్న విషయం తెలసిందే. గత కొంతకాలంగా అతడు కుల మతాలకు అతీతంగా.. 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ విద్యను అందిస్తున్నాడు. ఇక ఈ ఫ్యామిలీ చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చింది.. వీళ్లకు సంబంధించిన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా వచ్చింది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మోహన్ బాబు. దీనికి సంబంధించి మోహన్ బాబు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. మీ ప్రేమ, అండదండలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. ఈ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీగా(ఎంబీయూ(MBU)) ఉంటుందన్నారు.

Good News: రేషన్ కార్డు, ఇల్లు లేని వారికి కేంద్రం శుభవార్త..ఇక ఆ సమస్య తీరినట్లే..!

Good News: కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు, సొంత ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పింది. దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూ వస్తున్నా.. రేషన్ కార్డు, ఇల్లు లేని వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఇలాంటి వాళ్లు మన చుట్టు ఎంతో మంది ఉన్నారు. వీరికి మేలు జరిగే విధంగా కేంద్రం చర్యలు చేపట్టింది.

Good News: రేషన్ కార్డు, ఇల్లు లేని వారికి కేంద్రం శుభవార్త..ఇక ఆ సమస్య తీరినట్లే..!

ఎలాంటి సబ్సిడీ లేకుండా.. ఆహార ధాన్యాలు ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంది. అలాంటి వారి డేటాను సేకరించే పనిలో పడింది. ఇదిలా ఉండగా.. దేశంలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకు కేజీకి రూ.1 నుంచి రూ. 3 ధరతో ధాన్యాలు లభిస్తున్నాయి. అయితే చాలా మంది రేషన్ కార్డు లేకుండా.. ఇల్లు లేని వాళ్లు చాలామంది ఉన్నారు.

Good News: రేషన్ కార్డు, ఇల్లు లేని వారికి కేంద్రం శుభవార్త..ఇక ఆ సమస్య తీరినట్లే..!

81 కోట్ల మందికి రేషన్ కార్డు ఉండగా.. మిగిలిన 1.6 కోట్ల మంది ఆ ధాన్యాలు పొందలేకపోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన కింద ఈ సంవత్సరం మార్చి 31 వరకు ఈ ప్రయోజనాన్ని రేషన్ కార్డు లేని వారికి కూడా కల్పించారు.

ఇల్లు లేని నిరాశ్రయులకు మేలు..

తాజా సమాచారం ప్రకారం ఈ సంవత్సరం మార్చి నెల చివరి వరకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఇల్లు లేని వారికి, రేషన్ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్ లేని వారికి ఈ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఇల్లు లేని నిరుపేదలు అందరి వివరాలు సేకరిస్తోంది కేంద్రం. ఈ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 1.6 కోట్ల మందిని ఎన్ఎఫ్ఎస్ఏ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. ఇల్లు లేని వారు నిరాశ్రయులు, సరైన ఐడెంటిటీ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్ లేని వారు సబ్సిడీ రేటు ఆహార ధాన్యాలు లేదా ఉచిత బియ్యాని ఈ విధానం ద్వరా పొందొచ్చు.

బిర్యానీ ప్రియులకు గుడ్ న్యూస్.. అక్కడ బిర్యానీ ఫ్రీ.. దాని కోసం ఏం చేయాలంటే..

బిర్యానీ అంటే ఎవరు ఇష్టపడరు. ప్రతీ ఒక్కరు లొట్టలేసుకొని మరీ తింటారు. వారి కోసం ఇప్పుడు చెప్పే న్యూస్. ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందేంటంటే.. తమిళనాడులోని అంబూర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

కిలో టమాటా తీసుకొస్తే.. రుచికరమైన బిర్యానీని ఉచితంగా ఇస్తామంటూ ప్రకటన ఇచ్చారు. దీంతో ఆ దుకాణానికి విపరీతంగా గిరాకీ పెరిగిపోయింది. అంతే కాదు అస్సలు ఆ షాప్ ఎక్కడ ఉంది.. అస్సలు అక్కడ జనాలు వస్తారో రారో అన్న స్థితిలో ఉన్న ఆ బిర్యానీ సెంటర్.. ఇప్పుడు ఆ జిల్లాలోనే ఫేమస్ అయిపోయింది. ఇలాంటి ఆఫర్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే.. అక్కడ టామాటాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

దాదాపు కిలో టమాటా రూ.150 పలుకుతోంది. ఈ నేపథ్యంలో చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం ప్రాపర్టీలోని అంబూర్ బిర్యానీ షాప్ యజమాని తన సేల్స్ పెంచుకోవడం కోసం ఒక కొత్త ఆఫర్ కస్టమర్లకు ప్రకటిచారు. దీంతో బిర్యానీ కోసం భోజన ప్రియులు ఎగబడుతున్నారు. అక్కడ ఒక బిర్యానీ రూ.100. ఎవరైనా రెండు కిలోల టమాటాలు కొంటే.. అర కిలో టమాటా ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ప్రకటించారు. అంతే కాదు.. ఒక కేజీ టమాటోలు తీసుకుని వచ్చి ఇస్తే.. ఒక బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ఇవ్వడం వల్ల జనం తండోపతండాలు వస్తున్నారు.

దీంతో గిరాకీ పెరిగింది. తను అనుకున్నది సక్సెస్ అవ్వడంతో షాపు యాజమాని తెగ మురిసిపోతున్నాడు. ఇక ఇలా చేయడానికి మరో ఉద్దేశ్యం కూడా ఉందని చెప్పాడు నిర్వాహకుడు. టమాటా ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకే ఫ్రీ సేల్‌ నిర్వహించినట్లు దుకాణం యజమాని తెలిపారు.

తెలంగాణ సర్కార్ వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఈ నెల నుంచే అమలు..

వారికి తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. జ‌ల‌మండ‌లి బోర్డులో ప‌ని చేస్తున్న‌ ఉద్యోగులు అంద‌రికీ పీఆర్సీ అమ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింది. ఈ నెల నుంచే జ‌ల‌మండ‌లి ఉద్యోగులకు పీఆర్సీ అమ‌లు కానుంది.

న‌వంబ‌రు నుంచే పెంచిన వేత‌నాల‌ను చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. తమకు పీఆర్సీ అమలు చేయాలని ఎప్పటి నుంచే జలమండలి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ డిమాండ్ పై నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఖైరతాబాద్ జలమండలి ఎదుట ఎన్నో సార్లు ఇలా నిరసన చేపట్టారు.

గత నెలలో వాళ్లు .. అన్ని శాఖల వారికి పీఆర్సీ ఇస్తున్నప్పుడు మాకెందుకు ఇవ్వరంటూ డిమాండ్ చేశారు. దాదాపు బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులంతా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి ఆ బోర్డులో ప‌ని చేస్తున్న‌ ఉద్యోగులు అంద‌రికీ పీఆర్సీ ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది.

తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంతో జలమండలిలో పనిచేస్తున్న దాదాపు 4 వేల మంది ఉద్యోగులకు వేతన పెంపు లభించనుంది. ఈ నెల నుంచే ఇది అధికారికంగా అమలు కానుంది. దీంతో జలమండలిలో పని చేస్తున్న ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ దేవుడు అంటూ.. ప్రశంసలతో ముంచెత్తారు.

మా సభ్యులకు శుభవార్త చెప్పబోతున్న నూతన అధ్యక్షుడు.. అదేమిటంటే?

ఎన్నో విమర్శలు అనంతరం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవిని మంచు విష్ణు దక్కించుకున్నారు. ఈ ఎన్నికలలో భాగంగా ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. ఇలా ప్రకాష్ రాజ్ ప్యానల్ పై మంచు విష్ణు అధిక మెజారిటీతో గెలిచి మా అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే మా అధ్యక్ష పదవికి పోటీ చేసిన సమయంలోనే మా భవనాన్ని తన సొంత డబ్బులతో నిర్మిస్తానని చెప్పిన మంచు విష్ణు పలు ప్రాంతాలలో భవనాన్ని నిర్మించడం కోసం స్థలాన్ని కూడా వెతికే పనిలో పడ్డారు. అయితే మూడు నెలల్లోగా భవనం గురించి క్లారిటీ ఇస్తానని చెప్పిన మంచు విష్ణు తాజాగా మా సభ్యులకు శుభవార్త అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అయితే ఆ శుభవార్త ఏంటి అనేది మాత్రం 22 వ తేదీ అనగా రేపు వెల్లడించనున్నట్లు తెలిపారు. నూతన అధ్యక్షుడిగా ప్రమాణ ఉత్సవం స్వీకారం అనంతరం మొట్టమొదటిసారిగా మంచు విష్ణు మా సభ్యులకు శుభవార్తను తెలియజేయనున్నారు. అయితే ఏ విధమైనటువంటి శుభవార్త తెలియజేయనున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.

మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్,విష్ణు ప్యానల్ సభ్యుల మధ్య ఎన్నో విమర్శలు జరిగిన అనంతరం ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన సభ్యులందరూ ఆ తర్వాత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా మా ఎన్నికల గొడవ ముగిసిన తర్వాత మొట్టమొదటిసారిగా విష్ణు శుభవార్తను తెలియజేస్తున్నానని హింట్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.

మద్యం ప్రియులకు శుభవార్త.. సీఎం జగన్ సంచలన నిర్ణయం ..!

2019 లో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను సీఎం అయిన తర్వాత మద్యపానాన్ని విడతల వారీగా నిషేదిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2019 లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని.. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సీట్లతో అతడు తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వచ్చాడు.

మద్యం విషయంలో కూడా నిషేదాన్ని విడతల వారీగా అమలు పరుచుకుంటూ వచ్చాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ సంవత్సరం మద్యం దుకాణాలను తగ్గించడం లేదంటూ.. మద్యం ప్రియులకు శుభవార్త చెప్పాడు. అంతక ముందు ఉన్న మద్యం దుకాణాలనే పొడిగిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో కొంతమంది ఖుషీగా ఫీల్ అవుతుంటే మరికొంత మంది దీని వెనకాల ఏదో జరుగుతుందంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇదే సమయంలో మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం కూడా అవే ధరలు కొనసాగనున్నట్లు సమాచారం. మీడియం, ప్రీమియం బ్రాండ్ ధరలను సుమారు 25 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. బీరు, రెడీ టూ డ్రింక్ మ‌ద్యం ధ‌ర‌ల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం కూడా మద్యం దుకాణాలను తగ్గించడం లేదు కావునా.. ధరలు కూడా అలానే ఉంటాయని ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మహిళా కానిస్టేబుళ్లకు గుడ్ న్యూస్.. మారిన పని వేళలు..

ఒక మహిళ పోలీసు ఉద్యోగం చేసినా ఇంటికి మాత్రం ఇల్లాలే కదా.. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర పోలీసు విభాగం గుర్తించింది. పోలీస్ ఫోర్స్‌లోని మహిళా సిబ్బందికి 8 గంటల పని వేళలను అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అంతకు ముందు మహారాష్ట్ర డీజీపీ సంజయ్ పాండే మహిళలకు హామీ కూడా ఇచ్చారు.

దీనిలో భాగంగానే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దీనిని అమలు చేస్తున్నామని, ఇవే పనివేళలను త్వరలో దశల వారిగా రాష్ట్రమంతటా అమల్లోకి తెస్తామని అతడు చెప్పారు. ఇదిలా ఉండగా..12 గంటల వరకు పని ఉన్నా.. చేస్తున్నామని.. కానీ అంతకు మించి కూడా మాతో పనులు చేయించుకుంటున్నారని.. దీంతో కుటుంబబాధ్యతల నిర్వహణపై పని భారం పుడుతోందని పలువురు మహిళా కానిస్టేబుళ్ల ఇటీవల డీజీపీ దృష్టికి తెచ్చినట్టు ఒక అధికారి తెలిపారు.

దీనిని పరిగణలోకి తీసుకొని పోలీసు అధికారులు ఆ పని వేళలలను 12 నుంచి 8 గంటలకు విషయమై సీనియర్ అధికారులతో పాండే చర్చించారు. దీంతో చివరకు ఇంటి బాధ్యతలను సమతుల్యం చేసుకునేలా మహిళా కానిస్టేబుళ్ల పనివేళలను 12 నుంచి 8 గంటలకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నాగపూర్, పుణె, అమరావతి, నవీ ముంబైలలో ఇప్పటికే 8 గంటల పనివేళలను విజయవంతంగా అమల్లోకి తెచ్చారు.

మొట్టమొదటగా నాగపూర్ లో ఆగస్టు 28 న అమలు చేశారు. ఆ అమలు విజయవంతంగా అయింది. దాని ఫలితాలను పరిగణలోకి తీసుకొని మిగతా చోట్ల కూడా అమలయ్యేలా చూడాలని ఉత్తర్వులు జారీ చేశారు.మరో నెలరోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.