Tag Archives: hari krishna

Hari krishna: బ్రహ్మదేవుడు ఆదేశించాడు ఇక సెలవు… హరికృష్ణ మాటలతో నందమూరి వంశస్థుల ఫోటో.. వీడియో వైరల్!

Hari krishna: నందమూరి తారకరత్న మరణంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలా నందమూరి నారా కుటుంబంలో తారకరత్న మరణ వార్త ఎంతగానో కృంగదీసిందని చెప్పాలి. తారకరత్న మరణించడంతో పెద్ద ఎత్తున అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇలా నందమూరి కుటుంబంలో ప్రతి ఏడాది ఇలాంటి విషాదాలు చోటు చేసుకోవడంతో అసలు నందమూరి కుటుంబానికి ఈ శాపం ఏంటి అని అభిమానులు నందమూరి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హరికృష్ణ జానకిరామ్ తారకరత్న వంటి వారందరూ కూడా వరుసగా మరణించడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇక తారకరత్న ఎంతో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఈయన పాదయాత్రలో భాగంగా ఒక్కసారి గుండెపోటు రావడంతో స్పృహ తప్పి పడిపోయారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చివరికి మృత్యు కౌగిలిలో బందీ అయ్యారు. ఇలా తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్, హరికృష్ణ, జానకిరామ్, తారకరత్న నందమూరి వంశస్థులు ఉన్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Hari krishna: నాలుగు రోజులు బ్రతికిన 40 తరాలు చెప్పుకునేలా బ్రతకాలి.

ఈ ఫోటోకి గాను బ్యాక్ గ్రౌండ్లో హరికృష్ణ చెప్పిన డైలాగ్స్ రూపొందించడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో నందమూరి అభిమానులను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈ వీడియోలో భాగంగా హరికృష్ణ మాట్లాడుతూ… మనం బ్రతికేది నాలుగు రోజులు అయినా 40 తరాలు చెప్పుకునేలా బ్రతకాలి. ఎవరైనా ఎదుటివారు మనల్ని చేయి చాచి యాచిస్తే ఎప్పుడు కూడా మన చేయి పైనే ఉండాలే తప్ప కింద ఉండకూడదు.పైన బ్రహ్మదేవుడు ఆదేశించాడు. ఇక సెలవు అంటూ హరికృష్ణ చెప్పినటువంటి ఈ డైలాగ్ తో ఉన్నటువంటి ఈ వీడియో వైరల్ అవుతుంది.

Jr NTR: ఇండస్ట్రీలో జూ.ఎన్టీఆర్ ని హీరోగా నిలబెట్టడానికి హరికృష్ణ ఇంత కథ నడిపించారా.. అసలు నిజాలు బయటపెట్టిన అశ్వినీ దత్!

Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి వారసుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి పరిచయం అవసరం లేదు. బాల నటుడిగా సందడి చేసి అనంతరం నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ మొదటి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేదు.
ఈ సినిమా అనంతరం ఈయన నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఎన్టీఆర్ కెరియర్ లో వెనుతిరిగి చూసుకోలేదు.

ఇకపోతే ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించడం విశేషం. తాజాగా ఈయన ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అశ్వినీ దత్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా గురించి అలాగే ఎన్టీఆర్ సక్సెస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక స్టార్ హీరోగా ఈ స్థానంలో ఉన్నారంటే అందుకు కారణం తన తండ్రి హరికృష్ణ అని ఈయన షాకింగ్ కామెంట్ చేశారు.

స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేయాలనుకున్నప్పుడు ముందుగా ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ ని అనుకున్నాము. అయితే ఈ సినిమా విషయం తెలిసిన హరికృష్ణ వెంటనే తనకు ఫోన్ చేసి ఈ సినిమాలో ఎన్టీఆర్ ను హీరోగా తీసుకోవాలని సూచించారట. హరికృష్ణ అంతటి వారు ఫోన్ చేయడంతో అశ్వినీ దత్ కాదనలేక ప్రభాస్ నటించాల్సిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాని ఎన్టీఆర్ తో చేయించారు. కట్ చేస్తే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది.

Jr NTR: ఎన్టీఆర్ సక్సెస్ చూడటానికి హరికృష్ణ లేరు…

నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా వచ్చినప్పటికీ తన కెరియర్ మాత్రం స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తోనే మొదలైందని చెప్పాలి. ఈ సినిమా విషయంలోనే కాకుండా ఎన్టీఆర్ సక్సెస్ లో హరికృష్ణ చాలా భాగమయ్యారని అయితే నేడు ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉండటం చూడడానికి హరికృష్ణ మన మధ్య లేరు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ సక్సెస్ వెనక తన తండ్రి హస్తం ఎంతో ఉంది అంటూ నిర్మాత అశ్వినీ దత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Kalyan Ram: తండ్రి మరణం పై మొదటి సారి స్పందించిన కళ్యాణ్ రామ్.. అసలు ఆరోజు ఏం జరిగిందంటే?

Kalyan Ram: సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా నందమూరి హరికృష్ణ అందరికీ సుపరిచితమే. ఈయన ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగడమే కాకుండా రాజకీయాలలో కూడా కొనసాగారు. ఇకపోతే ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి కళ్యాణ్ రామ్ జానకి రామ్ ఎన్టీఆర్ ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇకపోతే హరికృష్ణ సైతం పలు సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోను ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హరికృష్ణ గత మూడు సంవత్సరాల క్రితం ఆగస్టు 29వ తేదీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్ మొదటి సారి తన తండ్రి మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

ఇకపోతే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా మూవీ చరిత్రాత్మక అంశంతో ముడిపడి ఉన్న ట్రావెల్ మూవీ అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ కి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారికి ఒక ప్రశ్న ఎదురైంది. టైం ట్రావెల్ చేయాల్సి వస్తే.. ఏ రోజుకి వెళ్లి దేనిని ఆపాలి లేదా దీనిని మార్చాలి అనుకుంటారు? అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు కీరవాణి సమాధానం చెబుతూ తాను 2018 ఆగస్టు 28వ తేదీకి వెళ్లి హరికృష్ణ గారితో నాతో పాటు రెండు రోజులు మ్యూజిక్ సిట్టింగ్ వేయమని అడుగుతాను ఆయనకు నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అలా రెండు రోజులు నాతో గడిపితే 29వ తేదీ ఆయన మరణాన్ని నేను ఆపవచ్చు అంటూ కీరవాణి తెలిపారు.

Kalyan Ram: నాన్నతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది…

ఇక ఆరోజు ఏం జరిగిందనే విషయం గురించి కళ్యాణ్ రామ్ స్పందిస్తూ నాన్నగారు మరణించిన రోజు ఉదయం నేను ఇంట్లోనే ఉన్నాను. ఐదు గంటలకు నిద్రలేచి బాల్కనీలో టీ తాగుతూ కూర్చుని ఉండగా శివాజీ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అయితే ఆరోజు నాన్నతో పాటు ఈయన కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆయన ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది శివాజీ అని అడిగేలోపు ఫోన్ కట్ అయింది.ఇకపోతే అదే రోజు మా మామయ్య ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి విజయవాడ వెళుతున్నారు ఆయన కాల్ చేసి ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలు పెట్టారు. అది చూసి నేను రియాలిటీ లోకి రావడం అప్పుడే అసలు విషయం అర్థమైందని ఈ సందర్భంగా తన తండ్రి మరణం గురించి కళ్యాణ్ రామ్ మొదటిసారిగా స్పందించారు.

Sr NTR Family: నందమూరి కుటుంబానికి శాపంగా మారిన ఆగస్టు నెల.. ఆగస్టు కలిసి రాలేదా?

Sr NTR Family: నందమూరి కుటుంబంలో ప్రస్తుతం విషాదం చోటుచేసుకుంది.నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈమె అనారోగ్య సమస్యల కారణంగా మానసిక ఆందోళనకు గురై ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో జరిగిన విషాద సంఘటన మరోసారి బయటకు వచ్చాయి.

సీనియర్ ఎన్టీఆర్ కి నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు సంతానం. అయితే వీరిలో మొదటి కుమారుడు రామకృష్ణ పది సంవత్సరాల వయసులోనే మృతి చెందడంతో తిరిగి తన ఏడవ కుమారుడికి అదే పేరు పెట్టారు. అయితే తన మూడవ సంతానం సాయి కృష్ణ మరణించడంతో ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.ఇకపోతే ఎన్టీఆర్ నాలుగవ కుమారుడు హరికృష్ణ సైతం గత మూడు సంవత్సరాల క్రితం ఆగస్టు నెలలోనే రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ సోదరుడు జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే కాకుండా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కూడా ఆగస్టు నెల కలిసి రాలేదని చెప్పాలి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆగస్టు నెలలో రెండు సార్లు ఈ పదవిని కోల్పోయారు. ఇకపోతే 1995 ఆగస్టు నెలలో స్వయంగా చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు. అప్పుడు జరిగిన వైస్రాయ్ స్కెచ్ కి ఇక ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదు.

Sr NTR Family: ఎన్టీఆర్ కుటుంబానికి టిడిపి పార్టీకి ఇది శాపమా…

ఇకపోతే తాజాగా ఆగస్టు నెలలోనే మరోసారి ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం అందరిలో విషాదం నింపింది.ఈ విధంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఆయన స్థాపించిన పార్టీకి ఆగస్టు నెల శాపంగా మారిందని, ఈ నెలను ఎన్టీఆర్ ఫ్యామిలీకి అలాగే టిడిపి పార్టీకి బ్యాడ్ సెంటిమెంట్ గా భావిస్తున్నారని చెప్పాలి.

సీరియల్ హీరో రవికృష్ణ సంపాదన ఎంతో తెలిస్తే… ఆశ్చర్యపోతారు!

బుల్లితెరలో ప్రసారమయ్యేపలు సీరియల్స్ లో హీరోగా రాణిస్తూ ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రవి కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవికృష్ణకు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.వీరిలో ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఈ హీరోకి ఎక్కువ అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన రవి కృష్ణ చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండటం చేత స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే నటన రంగంవైపు వెళ్తానని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.

రవికృష్ణ తన మామయ్య సహకారంతో ఇండస్ట్రీ వైపు వచ్చారు.ఈ క్రమంలోనే మొదటిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ యాక్టర్ గా ప్రయత్నాలు కొనసాగించేవాడు. ఈ క్రమంలోనే ఈ టీవీలో ప్రసారమయ్యే హృదయం అనే సీరియల్ ద్వారా మొట్టమొదటిసారిగా తెరపై కనిపించారు.ఆ తర్వాత బొమ్మరిల్లు సీరియల్ లో కూడా కొన్ని ఎపిసోడ్స్ వరకు రవికృష్ణ తెరపై సందడి చేశారు.

ఈ విధంగా సీరియల్స్లో నటించిన రవి కృష్ణ మరి అసిస్టెంట్ డైరెక్టర్ పనిలోకి వెళ్లారు.ఆ సమయంలోనే మొగలిరేకులు, వరూధిని పరిణయం సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది.వరూధిని పరిణయం ద్వారా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న రవి కృష్ణ ఆ తర్వాత వరుస సీరియల్ చేశారు. ఇదే ఫ్యాన్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ సీజన్ 3లోకి ఎంటర్ అయి మరింత క్రేజ్ సంపాదించుకున్నారని చెప్పవచ్చు.

బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఆమె కథ అనే సీరియల్ లో నటిస్తున్నారు.కెరియర్ మొదట్లో ఒక్కో ఎపిసోడ్ 5 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే రవికృష్ణ ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్ 20 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంటే సుమారుగా వారానికి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇతని ఆస్తిని కూడా బాగా పోగేసినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలానికి సుమారు నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించారని తెలుస్తోంది.