బుల్లితెరలో ప్రసారమయ్యేపలు సీరియల్స్ లో హీరోగా రాణిస్తూ ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రవి కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవికృష్ణకు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.వీరిలో ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఈ హీరోకి ఎక్కువ అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన రవి కృష్ణ చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండటం చేత స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేవాడు. ఈ క్రమంలోనే నటన రంగంవైపు వెళ్తానని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.
రవికృష్ణ తన మామయ్య సహకారంతో ఇండస్ట్రీ వైపు వచ్చారు.ఈ క్రమంలోనే మొదటిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ యాక్టర్ గా ప్రయత్నాలు కొనసాగించేవాడు. ఈ క్రమంలోనే ఈ టీవీలో ప్రసారమయ్యే హృదయం అనే సీరియల్ ద్వారా మొట్టమొదటిసారిగా తెరపై కనిపించారు.ఆ తర్వాత బొమ్మరిల్లు సీరియల్ లో కూడా కొన్ని ఎపిసోడ్స్ వరకు రవికృష్ణ తెరపై సందడి చేశారు.
ఈ విధంగా సీరియల్స్లో నటించిన రవి కృష్ణ మరి అసిస్టెంట్ డైరెక్టర్ పనిలోకి వెళ్లారు.ఆ సమయంలోనే మొగలిరేకులు, వరూధిని పరిణయం సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది.వరూధిని పరిణయం ద్వారా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న రవి కృష్ణ ఆ తర్వాత వరుస సీరియల్ చేశారు. ఇదే ఫ్యాన్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ సీజన్ 3లోకి ఎంటర్ అయి మరింత క్రేజ్ సంపాదించుకున్నారని చెప్పవచ్చు.
బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఆమె కథ అనే సీరియల్ లో నటిస్తున్నారు.కెరియర్ మొదట్లో ఒక్కో ఎపిసోడ్ 5 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే రవికృష్ణ ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్ 20 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంటే సుమారుగా వారానికి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇతని ఆస్తిని కూడా బాగా పోగేసినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలానికి సుమారు నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించారని తెలుస్తోంది.
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…