Tag Archives: heroes

Tollywood Heroes Daughters: ఈ టాలీవుడ్ హీరోల కూతుర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారో తెలుసా?

Tollywood Heroes Daughters: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వారసత్వాలు కొనసాగడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే ఒక హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అంటే అనంతరం వారి పిల్లలు కూడా అదే వారసత్వంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల కొడుకులు కూతుర్లు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా స్థిరపడ్డారు. అలాగే మరికొందరు హీరోలు మాత్రం తమ కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. మరి ఆ హీరోలు ఎవరు వారి కూతుర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారనే విషయానికి వస్తే..

Tollywood Heroes Daughters: ఈ టాలీవుడ్ హీరోల కూతుర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారో తెలుసా?

హీరో శ్రీకాంత్ వారసుడిగా ఇప్పటికే రోషన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే శ్రీకాంత్ కూతురు మేధా తిరుపతిలో సందడి చేయగా శ్రీకాంత్ కూతురు ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఈమె డిగ్రీ చదువుతోంది తనకు సినిమాలలోకి రావాలనే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదని అందుకే చదువుపై దృష్టి పెట్టి పై చదువులు చదువుతుందని తెలుస్తుంది.

Tollywood Heroes Daughters: ఈ టాలీవుడ్ హీరోల కూతుర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారో తెలుసా?

మాస్ మహారాజ రవితేజ కుమారుడు ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజ పాత్ర ద్వారా మెప్పించారు. ఇకపోతే రవితేజ కూతురు మోక్ష భూపతి రాజు మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈమె ఫారెన్ లో డిగ్రీ చదువుతున్నారు.

ఇక సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న దగ్గుబాటి కుటుంబం నుంచి వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ ఇండస్ట్రీలోకి రాలేదు. ఇప్పటికే పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం చేసుకొని ఫారెన్ లో సెటిల్ కాగా రెండవ కుమార్తె హయ వాహిని సైతం పై చదువులు నిమిత్తం ఫారిన్లో ఉన్నారు. ఇక మూడవ కుమార్తె భావన కూడా ఉన్నత చదువులపై దృష్టి సారించారు.

ఉన్నత చదువులు చదువుతున్న స్టార్ హీరోల వారసురాళ్ళు..

హీరోగా విలన్ గా అందరిని మెప్పించిన నటుడు జగపతిబాబుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు పెళ్లి చేసే అమెరికా పంపించగా రెండవ కుమార్తె కూడా ఉన్నత చదువుల కోసం ఫారిన్ వెళ్లారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కూడా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి. వీటిలో పెద్ద కుమార్తె సాయి ప్రసీద ఇప్పటికే తన చదువులు పూర్తిచేసే బిజినెస్ వైపు అడుగులు వేశారు. ఇక ఈమె తన అన్నయ్య ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. మిగిలిన ఇద్దరు కూడా పై వారి చదువులను కొనసాగిస్తున్నారు.

Malavika: రాజేంద్రప్రసాద్ తో నిజంగానే గొడవ జరిగదంటున్న హీరోయిన్.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన మాళవిక..

Malavika: మాళవిక ఒకప్పుడు తెలుగు తెరపై కనిపించిన హీరోయిన్. తెలుగులో కొన్ని సినిమాలు చేసినా ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే తెలుగులో కొన్ని సినిమాలు చేసినా… తమిళంలో మాత్రం ఎక్కువ సినిమాలు చేసింది. అయితే తాజాగా ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది.

Malavika: ఆ హీరో కారణంగానే నా పరిస్థితి ఇలా అయింది.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన మాళవిక..

తాజాగా ఆలీతో సరదాగా షోలో తన ఫిలిం జర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  సాధారణంగా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య కొన్ని క్లాషెస్ వస్తుంటాయి. అయితే ఇవి చిన్నవే అయినా.. గొడవ పెద్దదిగా జరిగినట్లు మీడియాలో ప్రొజెక్ట్ అయింది.

Malavika: ఆ హీరో కారణంగానే నా పరిస్థితి ఇలా అయింది.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన మాళవిక..

ఇలాంటి విషయాలనే చెప్పుకొచ్చింది మాళవిక. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంతో వచ్చిన ‘చాలా బాగుంది’ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది మాళవిక. శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా వచ్చిన ఈసినిమా 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది.

ఓ రొమాంటిక్ సాంగ్ కంఫర్ట్ గా అనిపించలేదంటూ..

దీని తర్వాత అప్పరావు డ్రైవింగ్ స్కూల్, నవ్వుతూ బతకాలిరా వంటి సినిమాలను చేసింది. తెలుగులో పెద్దగా కెరీర్ సాగలేదు. అయితే తమిళంలో మాత్రం 35 సినిమాలు చేసింది మాళవిక.  తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంకు గెస్ట్ గా మాళవిక వచ్చింది. ఈ షోకు సంబంధించిన ప్రోమో రన్ అవుతోంది. దీంతో ఆలీ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది. తనకు నాగార్జున అంటే ఎంతో ఇష్టం అని.. ప్రస్తుతం విజయ్ దేవర కొండ అభిమానిని అని వెల్లడించింది. చాలా బాగుంది సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ నాకు కంఫర్ట్ గా అనిపించలేదని.. హీరో శ్రీకాంత్ కు చెబితే కోప్పడ్డారంది. చాలా బాగుంది సినిమాలో ఓ రేప్ సీన్ ఇబ్బందిగా అనిపించిందని వెల్లడించింది. అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమా సమయంలో రాజేంద్ర ప్రసాద్ గొడవ గురించి అడగ్గానే నవ్వేసింది. ఆ విషయాలను చెప్పలేనంటూ దాటవేసింది. అయితే రాజేంద్రప్రసాద్ కు మాళవికకు మధ్య ఎలాంటి గొడవ జరిగింది అనేది పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయినప్పుడు తెలియనుంది.

Krishna – Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద 15 పోటీపడిన కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి.. ఎవరు గెలిచారో తెలుసా?

Krishna – Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరు సూపర్ స్టార్, మరొకరు మెగాస్టార్. ఇలా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలకు ఎంతో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలా హీరోల మధ్య పోటీ ఉండడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద విడుదల అవుతూ ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడుతుంటుంది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ మధ్య ఏకంగా 15 సార్లు బాక్సాఫీస్ వద్ద ఢీ అంటే ఢీఅని పోటీపడ్డారు. ఇలా వీరిద్దరి మధ్య మొట్టమొదటిసారిగా 1984వ సంవత్సరంలోనే మొదలైంది.కృష్ణ నటించిన బంగారు కాపురం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ చిత్రాల మధ్య పోటీ ఏర్పడింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

Krishna – Chiranjeevi: బాక్సాఫీస్ వద్ద 15 పోటీపడిన కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి.. ఎవరు గెలిచారో తెలుసా?

మరోసారి 1985లో వీరిద్దరి మధ్య పోటీ ఏర్పడింది. కృష్ణ నటించిన అగ్నిపర్వతం,మెగాస్టార్ చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం సినిమాల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.ఈ రెండు సినిమాలలో అగ్నిపర్వతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించినగా చట్టంతో పోరాటం సినిమా మాత్రం ఎలాంటి నష్టాలు లేకుండా బయటపడింది. 1985 ఏప్రిల్ నెలలో చిరంజీవి నటించిన చిరంజీవి సినిమాతో బాక్సాఫీసు వద్దకు వచ్చారు. అలాగే కృష్ణ అందరికంటే మొనగాడు చిత్రంతో అదే ఏడాది మరో సారి చిరంజీవికి పోటీగా వచ్చారు.

ఈ రెండు సినిమాలలో ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. ఆ తర్వాత అదే సంవత్సరం జులై నెలలో కృష్ణ నటించిన వజ్రాయుధం చిరంజీవి నటించిన జ్వాల సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో వజ్రాయుధం అద్భుతమైన విజయాన్ని అందుకోగా చిరంజీవి జ్వాలా సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకుంది.1986 జనవరి ఒకటవ తేదీన చిరంజీవి కిరాతకుడు సినిమా విడుదల కాగా మూడవ తేదీ కృష్ణ నటించినకృష్ణ గారడి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేకపోయాయి.

1986 ఆగస్టు నెలలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చంటబ్బాయి అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా విడుదలైన వారానికి కృష్ణ నటించిన కృష్ణ పరమాత్మ సినిమా విడుదలైంది. వారం వ్యవధిలో వచ్చిన ఈరెండు సినిమాలు ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. 1987 జనవరి నెలలో చిరంజీవి నటించిన దొంగమొగుడు సినిమా విడుదల కాగా ఈ సినిమాకు పోటీగా కృష్ణ నటించిన తండ్రి కొడుకుల ఛాలెంజ్ విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి దొంగ మొగుడు అద్భుతమైన విజయాన్ని అందుకోగా కృష్ణ సినిమా యావరేజ్ గా నడిచింది.

కృష్ణ దర్శకత్వంలో నటించిన శంఖారావం, మెగాస్టార్ చిరంజీవి పసివాడి ప్రాణం మధ్యాహ్నాలు ఏర్పడగా మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. చిరంజీవి జేబుదొంగ కృష్ణ దొంగగారు స్వాగతం మధ్య మరోసారి పోటీ ఏర్పడింది. ఈ చిత్రాలలో చిరంజీవి జేబుదొంగ ప్రేక్షకులను సందడి చేయలేకపోయినా కృష్ణ దొంగగారు స్వాగతం యావరేజ్ గా నడిచింది. అలాగే చిరంజీవి ఖైదీ నెంబర్ 786, కృష్ణ రౌడీ నెంబర్ వన్ చిత్రం మధ్య పోటీ ఏర్పడింది. ఈ రెండు సినిమాలలో చిరంజీవి ఖైదీ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

చిరంజీవి 100వ చిత్రం త్రినేత్రుడు కృష్ణ నటించిన అగ్ని కెరటాలు మధ్య మరోసారి పోటీ ఏర్పడింది. ఈ రెండు సినిమాలలో త్రినేత్రుడు వసూళ్ళ పరంగా పర్వాలేదనిపించింది. అదేవిధంగా చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడుకృష్ణ రాజకీయ చదరంగం మధ్య పోటీ ఏర్పడగా మెగాస్టార్ నటించిన సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అదే విధంగా చిరంజీవి రాజా విక్రమార్క, కృష్ణ నాగాస్త్రం మధ్య పోటీ ఏర్పడింది. ఈ రెండు సినిమాలలో నాగాస్త్రం విజయం సాధించింది. అలాగే చిరంజీవి నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, కృష్ణ నటించిన పరమశివుడు విడుదలయ్యాడు ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు సందడి చేయలేక పోయాయి.

ఒకేసారి హిట్ కొట్టిన మెగాస్టార్, కృష్ణ…

రెండు సంవత్సరాల తర్వాత కృష్ణ చిరంజీవి మధ్య మరి పోటీ ఏర్పడింది. కృష్ణ నటించిన పచ్చని సంసారం చిరంజీవి నటించిన ముఠామేస్త్రి మధ్య పోటీ ఏర్పడ్డాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. వీరిద్దరు 1994లో మరోసారి పోటీ పడ్డారు. మెగాస్టార్ ముగ్గురు మొనగాళ్లు కృష్ణ నెంబర్ వన్ చిత్రాల మధ్య పోటీ ఏర్పడింది. ఈ పోటీలో కృష్ణ విజయం సాధించారు.

Mahesh Babu – Tharun: మహేష్ బాబు సినిమాను దెబ్బకొట్టిన హీరో తరుణ్..!

Mahesh Babu – Tharun: సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా ఇండస్ట్రీలోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. ఇలా బాల నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సమయంలో కృష్ణ మహేష్ బాబు తన కాంబినేషన్ లో ఒక సూపర్ హిట్ చిత్రం కావాలని రచయితలకు చెప్పారు.

Mahesh Babu – Tharun: మహేష్ బాబు సినిమాని కలెక్షన్ల పరంగా దెబ్బకొట్టిన హీరో తరుణ్.. ఏ సినిమా అంటే?

వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలంటే చాలా అద్భుతమైన కథ ఉండాలని భావించిన రచయితలు వీరి కోసం వంశీ సినిమాని తీసుకువచ్చారు. బి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో 1999 జులై 12వ తేదీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి ఉంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటించారు.

Mahesh Babu – Tharun: మహేష్ బాబు సినిమాని కలెక్షన్ల పరంగా దెబ్బకొట్టిన హీరో తరుణ్.. ఏ సినిమా అంటే?

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నమ్రత నటించారు. ఈ సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా 2000 వ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదలైన వారానికి తరుణ్ సినిమా విడుదలైంది.


యువతను ఆకట్టుకున్న నువ్వే కావాలి…

తరుణ్ హీరోగా నటించిన మొట్టమొదటి చిత్రం నువ్వే కావాలి. ఈ సినిమా విడుదల కావడంతో యువతను బాగా ఆకట్టుకుంది. ఇలా ఈ సినిమా మహేష్ బాబు వంశీ సినిమా కలెక్షన్ల పై భారీ దెబ్బ కొట్టిందని చెప్పాలి. నువ్వే కావాలి విడుదలైన తర్వాత మహేష్ బాబు వంశీ సినిమా కలెక్షన్లు పూర్తిగా తగ్గిపోయాయి. అప్పట్లో నువ్వేకావాలి సినిమా ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో మనందరికీ తెలిసిందే.

Gopi Chand: మరోసారి మహేష్ కు విలన్ గా మారిన యాక్షన్ హీరో గోపీచంద్.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Gopi Chand: టాలెంటెడ్, యాక్షన్ హీరో గోపీచంద్ కెరియర్ మొదట్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా పలు సినిమాలలో నటిస్తూ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో మంచి విజయాన్ని అందుకున్నారు.

Gopi Chand: మరోసారి మహేష్ కు విలన్ గా మారిన యాక్షన్ హీరో గోపీచంద్.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఇదిలా ఉండగా తాజాగా గోపీచంద్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోపీచంద్ తన కెరియర్ మొదట్లో వర్షం, నిజం, జయం వంటి సినిమాలలో విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనంతరం హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Gopi Chand: మరోసారి మహేష్ కు విలన్ గా మారిన యాక్షన్ హీరో గోపీచంద్.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఇలా హీరోగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోకి తిరిగి విలన్ పాత్రలో నటించే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇదివరకే మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో గోపీచంద్ విలన్ పాత్ర ద్వారా మహేష్ బాబుతో పోటీపడ్డారు. ఈ క్రమంలోనే గోపీచంద్ కు మరోసారి మహేష్ బాబుతో పోటీ పడే అవకాశం వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నెగిటివ్ పాత్రలకు గోపీచంద్ ఆసక్తి కనబరుస్తారా..

మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పాల్గొననున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాల్లో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో మహేష్ బాబుతో పోటీ పడటం కోసం దర్శక ధీరుడు గోపీచంద్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.హీరోగా మంచి పేరు సంపాదించుకున్న గోపీచంద్ ఇలా నెగిటివ్ పాత్రలో నటించడానికి ఒప్పుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Balakrishana – Mahesh Babu: బాలయ్యతో సందడి చేయబోతున్న మహేష్ బాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Balakrishana – Mahesh Babu: ఆహా ఓటీటీ లో నందమూరి బాలకృష్ణ చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె దేశంలోనే నెంబర్ వన్ టాక్ షో గా కొనసాగుతోంది. బాలయ్య బాబు తనదైన శైలిలో చేస్తున్న ఈ టాక్ షో కు మంచి క్రేజ్ ఉంది. ఐఎండిబి లో కూడా ఈ టాక్ షో 9.8 రైటింగ్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ టాక్ షోలో 9 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ 9 ఎపిసోడ్ లో బాలకృష్ణ పలువురు సినీ ప్రముఖులతో ముచ్చటిస్తూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచారు.

Balakrishana – Mahesh Babu: బాలయ్యతో సందడి చేయబోతున్న మహేష్ బాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇప్పుడు ఈ షో తొలి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా ప్రిన్స్ మహేష్ బాబు రానున్నారు. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
నందమూరి అభిమానులతో పాటు మహేష్ బాబు అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ కోసమే ఎదురు చూస్తున్నారు.

Balakrishana – Mahesh Babu: బాలయ్యతో సందడి చేయబోతున్న మహేష్ బాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తాజాగా ఈ ముగింపు ఎపిసోడ్ స్ట్రీమింగ్ తేదీని ఆహా ప్రకటించింది. ఫిబ్రవరి 4వ తేదీ ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది, దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇటీవల అబ్బాయి తారక్ హోస్ట్ గా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు రియాల్టీ షో చివరి ఎపిసోడ్ కోసం కూడా మహేష్ బాబు ముఖ్య అతిథిగా రావడం విశేషం.

ఎన్టీఆర్.. కృష్ణ ప్రస్తావన..

బాలకృష్ణ, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ చివరి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పాల కృష్ణ మహేష్ బాబు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు.. మహేష్ బాబు ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు అనే విషయాల గురించి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్, కృష్ణ ప్రస్తావన ఏమైనా తీసుకువస్తారా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

Tollywood-Bollywood: సౌత్ ఇండస్ట్రీ బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తోంది. ముఖ్యంగా తెలుగు డైరెక్టర్లు ఇకపై తమ సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్ లో తీయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి వెళ్లిన పాన్ ఇండియా చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి.

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

బాహుబలి1,2 సినిమా ద్వారా టాలీవుడ్ సత్తాను బాలీవుడ్ కు రుచిచూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా బాలీవుడ్ కలెక్షన్లు మరోసారి కొల్లగొట్టాలని చూస్తున్నాడు జక్కన్న. ఇదిలా ఉంటే ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా బాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. 

Tollywood-Bollywood: బాలీవుడ్ పై టాలీవుడ్ దర్శకుల కన్ను.. పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారుగా..!

ఇప్పటికే అక్కడ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే అక్కడ రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఈ ఊపుతో సుకుమార్ పుష్ప-2ను తెరకెక్కించనున్నారు. ఇక త్రివిక్రమ్ కూడా బాలీవుడ్ పై తన ముద్ర వేయాలనుకుంటున్నారు. 

మహేష్ తో ప్యాన్ ఇండియా స్థాయి హిట్ కొట్టాలని..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ ప్రాజెక్ట్ ను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించేందుకు హారికా అండ్ హాసిని క్రియేషన్ ప్లాన్ చేస్తోంది. అయితే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో కూడా ఓ సినిమా రానుంది. దీనికన్నా ముందుగానే మహేష్ తో ప్యాన్ ఇండియా స్థాయి హిట్ కొట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. వీళ్లే కాకుండా తమిళ డైరెక్టర్లు కూడా ప్యాన్ ఇండియా మూవీలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నడ చిత్ర సీమ నుంచి కేజీఎఫ్ సినిమా బాలీవుడ్ లో హిట్ కొట్టింది. హీరో యష్ తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ప్యాన్ ఇండియా రేంజ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా త్వరలో బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో విడుదల కానుంది.

Raviteja-Balakrishna: ఫ్యాన్స్ ను వీళ్లు చెప్పు చేతల్లో పెట్టుకున్నారా..లేకపోతే ఇలాంటివి ఏంటి మరి..?

Raviteja-Balakrishna: అన్‌స్టాపబుల్ టాక్ షోతో.. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా తనకంటూ ఒక ముద్ర వేసుకుంటున్నారు. తనదైన ప్రత్యేక శైలిలో ఈ షోకి వచ్చే సెలెబ్రిటీలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ షో బాలయ్య హోస్ట్ గా విజయవంతం అయిందనే చెప్పాలి. ఇప్పటిక వరకు దీనిలో మొత్తం 6 ఎపిసోడ్లు పూర్తవ్వగా.. ఎడో ఎపిసోడ్ లో రవితేజ మరియు గోపీచంద్ మలినేని హాజరయ్యారు.

Raviteja-Balakrishna: ఫ్యాన్స్ ను వీళ్లు చెప్పు చేతల్లో పెట్టుకున్నారా..లేకపోతే ఇలాంటివి ఏంటి మరి..?

వారితో బాలయ్య.. ఎన్నో విషయాలను మాట్లాడారు. వాటిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాం.. నందమూరి బాలకృష్ణ , రవితేజ అభిమానులు ఈ టాక్ షో డిసెంబర్ 31, 2021న ఆహాలో స్ట్రీమ్ అవ్వగా విపరీతంగా చూశారు. అందలో ముఖ్యంగా చెప్పుకునేది ఏముందంటే.. మాస్ మహారాజా రవితేజ అఖండ సినిమాలో ఫుల్ పాపులర్ అయిన ‘జై బాలయ్య’ పాటకు డ్యాన్స్ చేశాడు.

అతను ఆ పాట స్టెప్‌ను వేసి ప్రేక్షకులను.. ఫ్యాన్స్ ను అలరించాడు. బాలకృష్ణ ,రవితేజ మధ్య టగ్ ఆఫ్ వార్ పోటీ గేమ్ కూడా జరిగింది. ఈ వార్ లోని గోపీచంద్ వారిద్దరిని సరదా ప్రశ్నలు అడుగుతూ నవ్వులతో ఈ షోను ముందుకు నడిపించాడు. వాళ్ల షో సరదాగా.. కాస్త ఆవేదనతో సాగింది. అయితే బాలయ్య విషయానికి వస్తే.. కోపం విపరీతంగా ఉంటుంది. ఎవరైనా ఫ్యాన్స్ దగ్గరకు వచ్చి ఫొటో దిగాలని అనిపించినప్పుడు ఒక్కో సందర్భంలో ఒప్పుకుంటాడు.. మరో సందర్భంలో సర్రున చేయిలేపి చెంప చెల్లుమనిపిస్తాడు.

ఫ్యాన్స్‌ వీళ్లకు ఆటవస్తువుల్లా కనిపిస్తున్నారా..?

ఇలాంటి సందర్భాలు చూశాం కూడా. అయితే సినిమా సెట్లో కూడా అతడు అలానే ఉంటాడట. ఇక రవితేజ విషయానికి వస్తే.. అతడికి కూడా ముక్కుపైనే కోపం ఉంటుంది. అతడు బూతుల పురాణం మొదలు పెడితే.. ఇక విక్రమార్కుడు సినిమాలో మొదటి 30 నిమిషాలు షో గుర్తుకు వస్తుంది. అంతలా బూతులు తిడతాడు. తనకు కోపం ఎక్కువ అని అతడు ఒప్పుకున్నాడు కూడా. ఇలా జరిగినవి అని సోషల్ మీడియాలో రాస్తుంటే.. పనీ పాటా లేని డ్యాష్‌ నా డ్యాష్‌ గాళ్లు’ అంటూ ఓ జోక్‌ టైప్‌ సెటైర్‌ వేస్తుంటారు. ఏ సోషల్ మీడియా వాళ్లు అయినా.. జరిగిన పనులు జరిగాయాయి అనే రాస్తారు కదా.. జరగనివి ఎవరూ రాయడానికి సాహసించరు. అలా రాస్తే.. ఇలా ఎందుకు రాశాం అని ఫ్యాన్స్ గగ్గోలు.. హీరో ఎవరినైనా తిడితే.. తిట్టండి.. అని.. పొగిడితే పొగడండి అని అంటున్నారు. ఏంటో మరి ఫ్యాన్స్‌ వీళ్లకు ఆటవస్తువుల్లా కనిపిస్తున్నారా..? మా హారో మా ఇష్టం అతడి కోసం ఏమైనా చేస్తాం అంటారా.. సరే మరి

2021 In Review: 2021 సంవత్సరం ఏ హీరోలకు కలిసి వచ్చిందో.. ఓ లుక్కేయండి!

2021 In Review: ఓవైపు కరోనా..మరో వైపు లాక్ డౌన్ల వల్ల సినిమా ఇండస్ట్రీ 2021లో తీవ్ర ఇబ్బందులు పడింది. చాలా వరకు సినిమాలు ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే కొంత మంది హీరోలకు మాత్రం 2021 కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. వరసగా ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సదరు హీరోలను 2021 గట్టెక్కించింది. ఈ ఏడాది హిట్లు పడటంతో కొంతలోకొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఏడాదిలో హిట్లు కొట్టిన హీరోలెవరో తెలుసుకుందాం.. 

వెంకటేష్:
ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ ఈ మధ్య రిమేక్ సినిమాలనే చేస్తున్నాడు. ధనుష్ హీరోగా తమిళంలో ’అసురన్‘గా వచ్చిన సినిమాను ’నారప్ప‘ పేరుతో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది. మళ్లీ వెంకీని దృశ్యం2 సినిమా ఫామ్ లోకి తెచ్చింది.

రవితేజ
మాస్ మాహారాజ రవితేజను వరసగా నాలుగు ఫ్లాప్ సినిమాలు వెనక్కి నెట్టాయి. ‘టచ్ చేసి చూడు’ ‘నేల టిక్కెట్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ ‘డిస్కో రాజా’ వంటి ప్లాప్ లతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయితే ’క్రాక్‘ సినిమాతో హిట్ కొట్టి కంబ్యాక్ అయ్యాడు.

అల్లరి నరేష్
గత కొన్నేళ్లుగా హిట్ లేని నరేష్ ’నాంది‘ సినిమా ద్వారా హిట్ కొట్టాడు. నటుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అయితే అంతకుముందు గత ఏడేనిమిది ఏళ్లుగా అల్లరి నరేష్ కళ్లుకాయలు కాసేలా చూశాడు. సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన మహర్షి సినిమా తప్పితే చెప్పుకోదగిన హిట్ లేదు. అయితే నరేష్ కు నాంది ఊరట నిచ్చింది.

పవన్ కళ్యాణ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కు హిట్లతో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తుంటాయి. ఇది అందరికి తెలిసిన నిజమే. అయితే గత కొన్నేళ్లుగా పవన్ కు ఆయన రేంజ్ కు తగిన హిట్ పడలేదు. మరోవైపు రాజకీయాల వల్ల గ్యాప్ తీసున్న చాలా రోజుల తర్వాత హిందీ ’పింక్‘ సినిమాను తెలుగులో ’వకీల్ సాబ్‘గా రిమేక్ చేసి హిట్ కొట్టాడు. 

శ్రీ విష్ణు.
మనకున్న కొద్దిమంది మంచి నటుల్లో శ్రీ విష్ణు ఒకరు. విభిన్న చిత్రాలు తీస్తుంటాడనే పేరు శ్రీ విష్ణుకు ఉంది. అయితే గతంలో శ్రీ విష్ణు చేసిన గాలి సంపత్, తిప్పరా మీసం సినిమాలు ఘోరంగా తన్నాయి. అయితే ’రాజరాజచోర‘ సినిమా మాత్రం విష్ణుకు మళ్లీ బూస్టప్ ఇచ్చింది.

నాని.
నానీస్ గ్యాంగ్ లీడర్, వీ, టక్ జగదీష్ ఇలా వరస ఫ్లాపులతో కెరీర్లో వెనకబడిపోయాడు నాని. ఇలాంటి సమయంలో వచ్చిన శ్యాంసింగరాయ్ మళ్లీ నానిని సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. సినిమాలో రెండు క్యారెక్టర్లు పోషించిన నాని.. తన యాక్టింగ్ తో మెప్పించాడు.

బాలక్రిష్ణ.
నందమూరి నట సింహం ’ అఖండ‘ సినిమాతో భారీ హిట్ కొట్టాడు. బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన అఖండ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతకుముందు బాలక్రిష్ణ చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ వంటి సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.

Vijay Devarakonda-Allu Arjun: ఆ హీరో తర్వాత రౌడీ హీరోగా రికార్డు సృష్టించిన విజయ్ దేవరకొండ..!

Vijay Devarakonda-Allu Arjun: గతంలో ఏ స్టార్ హీరో అయినా తన ఫ్యాన్స్ బలాన్ని, క్రేజ్ చూపించాలంటే… అభిమాన సంఘాలను చూపించే వారు. ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. స్టార్ల క్రేజ్ తెలియాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య డిసైడ్ చేసే పరిస్థితి ఏర్పడింది. 

Vijay Devarakonda-Allu Arjun: ఆ హీరో తర్వాత రౌడీ హీరోగా రికార్డు సృష్టించిన విజయ్ దేవరకొండ..!

గతంలో తెలుగు, తమిళ్ , హిందీ సినిమాలు అనే బౌండరీలు ఉండేవి. ప్రస్తుతం వరసగా సౌత్ హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తుండటంతో పాటు.. బాలీవుడ్ సినిమాలు వరసగా సౌత్ భాషల్లో డబ్ అవుతుండటంతో అంతా ఇండియన్ స్టార్స్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరగుతోంది.

Vijay Devarakonda-Allu Arjun: ఆ హీరో తర్వాత రౌడీ హీరోగా రికార్డు సృష్టించిన విజయ్ దేవరకొండ..!

తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నాడు. సారా అలిఖాన్, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ భామలు సైతం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లిస్ట్ లో ఉన్నారు. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో విజయ్ దేవరకొండ ఫాలోవర్ల సంఖ్య 1 కోటి 40 లక్షలను దాటింది.

ఇన్ స్టాలో బన్నీ తర్వాత.. విజయ్ దేవర కొండ..

ఐకాన్ స్టార్ బన్నీ తర్వాతి స్టానంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఉన్నారు. బన్నీకి ఇన్స్టాలో 1 కోటి 44 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే త్వరలోనే బన్నీని విజయ్ దేవరకొండ మించిపోతాడని అంటున్నారు. అయితే ఎంత కాలంలో బన్నీని క్రాస్ చేస్తాడో చూడాలి. స్టార్ హీరోలు తమ ఫాలోవర్లను పెంచుకోవడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుంటే.. కేవలం 4 ఏళ్లలోనే విజయ్ దేవరకొండ ఎవరికి అందనంత ఎత్తులో ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా లైగర్ రాబోతోంది. దీని తరువాత సుకుమార్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు విజయ్ దేవరకొండ.