Tag Archives: jabardast

Anasuya: నన్ను ఆంటీ అంటారా..? మిమ్మల్ని జైలుకి పంపిస్తా… నెటిజన్స్ ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించిన అనసూయ.. వైరలవుతున్న ట్వీట్స్!

Anasuya:విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా విడుదలయ్యి మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా మొదటి షో తోనే ఈ సినిమా డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో వెంటనే అనసూయ పరోక్షంగా హీరో విజయ్ దేవరకొండ పై సంచలనమైన ట్వీట్ చేసింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు..కర్మ ఫలితం రావడం ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం పక్క అంటూ చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయింది.

ఈ విధంగా అనసూయ విజయ్ దేవరకొండను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసింది అంటూ పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు దారుణంగా అనసూయను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కామెంట్లపై అనసూయ స్పందిస్తూ… ఛీ… ఛీ బోలెడంత చెత్త వస్తోంది ఎంత క్లీన్ చేసిన ఈ చెత్త ఇలాగే వస్తోంది అంటూ కామెంట్ చేశారు.

ఇలా ఈమె సోషల్ మీడియాలో వరుస ట్వీట్ చేయడంతో అభిమానుల సైతం రెచ్చిపోయి అనసూయ ను ఏకంగా ఆంటీ అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నన్ను ఆంటీ అని పిలుస్తూ ఏజ్ షేమింగ్ చేస్తారా…మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది తప్పకుండా మీపై చర్యలు తీసుకుంటా అంటూ ఈమె కామెంట్ చేశారు.

Anasuya: ఓ మహిళ చేస్తున్న పోరాటం…

ఈ క్రమంలోనే ఆంటీ అంటేనే కేసు ఫైల్ చేస్తే ట్విట్టర్లో ఉన్నటువంటి దాదాపు సగం మంది జైల్లోనే ఉండాల్సి ఉంటుంది అంటూ కామెంట్ చేయడంతో వెంటనే అనసూయ ఈ ట్వీట్ పై స్పందిస్తూ ఇక్కడ చాలా జైలు, సెక్షన్లో ఉన్నాయి అంటూ ఘాటుగా స్పందించారు. ఇలా ఈమె తన గురించి వచ్చినటువంటి ప్రతి ట్వీట్ కి రిప్లై ఇస్తూ ఘాటుగా స్పందించడమే కాకుండా ఓ మహిళకు జరుగుతున్న అన్యాయంపై చేస్తున్న పోరాటం అని, తన గౌరవం కోసం చేస్తున్న పోరాటమిదని రుజువు చేయడం కోసమే ఇలా రీ ట్వీట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. మీరు నన్ను మాత్రమే కాకుండా ఈ విషయంలోకి నా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారని తప్పకుండా ప్రతి ఒక్కరూ బాధపడతారంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

Anasuya: “అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు..” విజయ్ పై ఇలా పగ తీర్చుకున్న అనసూయ.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది.ఇలా ఈమె సోషల్ మీడియాలో హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశించి పరోక్షంగా పోస్ట్ చేసిందని భావిస్తున్నారు. లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతోనే అనసూయ ఇలాంటి ట్వీట్ చేశారని పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు భావిస్తూ అనసూయను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

అనసూయ విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి ట్వీట్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో భాగంగా విజయ్ దేవరకొండ అమ్మ గురించి మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున వివాదం సృష్టించాయి. ఆ సమయంలో అనసూయ సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున మండిపడ్డారు.

ఇక ఆ విషయం గురించి అందరూ మర్చిపోగా తాజాగా మరోసారి అనసూయ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ పెద్ద ఎత్తున వివాదానికి తెర తీశారు.ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమా విడుదల కావడం ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ కొన్నిసార్లు రావడం ఆలస్యం కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్క అంటూ ఈ సందర్భంగా ఈమె ట్వీట్ చేశారు.

Anasuya: అనసూయ డబుల్ మీనింగ్ డైలాగులతో డబ్బు సంపాదించలేదా…

ఈ విధంగా అనసూయ ట్వీట్ చేయడంతో ఈమె విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ కావడంతోనే అప్పట్లో అన్న మాటలకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని, పరోక్షంగా తనని ఉద్దేశించే ట్వీట్ చేశారని పలువురు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ సైతం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటమే కాకుండా అలాంటి డైలాగులు వేసినప్పుడు వెకిలి నవ్వులు నవ్వారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా జబర్దస్త్ కార్యక్రమంలో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాతూ డబ్బు సంపాదించిన అనసూయ ఇప్పుడు నీతులు చెబుతుంది అంటూ విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈమెపై కామెంట్లు చేస్తున్నారు.

Anchor Anasuya: ఆ అవకాశమే ఉంటే ట్విట్టర్ పేలిపోయేది.. మెగాస్టార్ చిరంజీవి పై అనసూయ కామెంట్స్ వైరల్!

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస అవకాశాలను అందుకుంటున్న ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ కార్యక్రమానికి దూరం కావడానికి గల కారణాలను కూడా అనసూయ తెలియచేశారు. ఇకపోతే ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి అనసూయ అంటే ప్రత్యేకమైన అభిమానం అనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులు ఈయన సినిమాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ మెగాస్టార్ అంటూ కామెంట్లు మోత మోగిపోయింది.

చిరంజీవి పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేస్తూ…సోషల్ మీడియాలో మెగాస్టార్ అంటూ అరిచే ఆప్షన్ లేదు కానీ ఒకవేళ అదే ఆప్షన్ కనుక ఉంటే ట్విట్టర్ పేలిపోయేది అంటూ కామెంట్ చేశారు. ఇలా నేటిజన్ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ పై అనసూయ స్పందించి అవును కదా అంటూ రిప్లై ఇచ్చారు.

Anchor Anasuya: ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన అనసూయ…

ఇలా సోషల్ మీడియాలో మెగాస్టార్ అంటూ అరచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసేలా ఉంటే కచ్చితంగా ఈయన అభిమానుల అరుపులకు ట్విట్టర్ పేలిపోయేది అంటూ కామెంట్ చేయడంతో అనసూయ కూడా అది నిజమేనంటూ ఇలా ఒక్క మాటతో అవును కదా అంటూ రిప్లై ఇచ్చారు. మొత్తానికి అనసూయ ఈ ట్వీట్ పై రెస్పాండ్ అవుతూ రిప్లై ఇవ్వడం గమనార్హం. ఇకపోతే ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగినటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ ఆయనపై ఉన్న అభిమానాన్ని పదాల రూపంలో తెలియజేసి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sridevi Drama Company: ఇక మీరు మారరా… మరి ఇంత దిగజారి పోయారా.. మల్లెమాలపై మండిపడుతున్న నెటిజన్స్?

Sridevi Drama Company: బుల్లితెరపై మల్లెమాలవారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్నాయి. ఇకపోతే ఈకార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎంతో ఉత్కంఠ భరితంగా ప్రోమోలు కట్ చేయడం మనం చూస్తున్నాము.

ఈ ప్రోమోలు చూడగానే అసలు ఏం జరిగిందోననే కంగారు ఆత్రుత ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో కలిగేలా కట్ చేస్తున్నారు. వేదికపైనే గొడవపడి సెట్ లో నుంచి వెళ్లిపోవడం, ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితులు కల్పిస్తూ ప్రోమోలు కట్ చేశారు.ఇలా ప్రోమోలు చూసిన అభిమానులు ఈ కార్యక్రమాన్నిఅంతే ఆత్రుతగా చూసినప్పటికీ చివరికి అక్కడ ఏమీ లేకపోవడంతో కార్యక్రమ నిర్వాహకులపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

ఇప్పటికే ఇలా ఈ కార్యక్రమం రేటింగ్ కోసం ఇలాంటి ప్రోమోలు కట్ చేసి ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడటంతో మల్లెమాల వారిపై ప్రేక్షకులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో చూస్తుంటే ఈ కార్యక్రమం ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమాన్ని తలపించిందని చెప్పాలి.

Sridevi Drama Company: కన్నీళ్లు పెట్టుకున్న ఆది…

ఈ కార్యక్రమంలో భాగంగా మీకు నచ్చని వారి ఫోటోలను చింపడం లేదా కాల్చివేయడం చేయండి అంటూ రష్మి టాస్క్ ఇస్తుంది. అయితే ఈ టాస్క్ లో భాగంగా అందరూ హైపర్ ఆది ఫోటోలను చింపడంతో ఆయన ఎంతో ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ ప్రోమో కాస్త ఎపిసోడ్ పై భారీ అంచనాలను పెంచేలా ప్రోమో కట్ చేయడంతో ఇది చూసిన నెటిజన్ లు మరోసారి మీ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా మీరు మారరా అంటూ పెద్ద ఎత్తున మల్లెమాలపై నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rakesh Master: జబర్దస్త్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రాకేష్ మాస్టర్… అక్కడ ఫుడ్ మరి దారుణం !

Rakesh Master: గత కొంతకాలం నుంచి జబర్దస్త్ కార్యక్రమ నిర్వాహకులు పలు వివాదాలను విమర్శలను ఎదుర్కొంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అందుకు గల కారణం ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎలాంటి దుమారం రేపాయో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్పీ జబర్దస్త్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా కోట్లు సంపాదిస్తున్న మల్లెమాలవారు కనీసం ఆర్టిస్టులకు ఫుడ్డు కూడా సరిగా పెట్టరంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.

అదేవిధంగా ఆపదలో ఉన్న కానీ ఎవరికీ శ్యాం ప్రసాద్ రెడ్డి సహాయం చేయరంటూ ఈయన చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈయన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ ఆర్పీ చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో కొద్ది రోజుల పాటు ప్రేక్షకులను సందడి చేసిన రాకేష్ మాస్టర్ ఈ విషయంపై స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన జబర్దస్త్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కార్యక్రమం గురించి చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు పాలు కరెక్టేనని ఈయన వెల్లడించారు. జబర్దస్త్ కార్యక్రమంలో ఫుడ్ ఏ మాత్రం బాగుండదని ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ ఫుడ్ విషయం గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Rakesh Master: బయట ఫుడ్డు తెప్పించుకొని తింటున్నారు…

తాను జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నప్పుడు బుల్లెట్ భాస్కర్ స్కిట్లో చేశాను అయితే బుల్లెట్ భాస్కర్ ఉన్నన్ని రోజులు నాకు ఫుడ్డు గురించి ఏ విధమైనటువంటి బాధ లేదు అయితే ఒక రోజు ఆయన లేకపోవడంతో తాను కూడా అందరిలాగే వెళ్లి క్యూలో నిలబడ్డానని కానీ అక్కడ ఫుడ్ ఏ మాత్రం బాగాలేదని అని తెలిపారు. బుల్లెట్ భాస్కర్ ఉన్నన్ని రోజులు తనకు బయట నుంచి ఫుడ్ తెప్పించి పెట్టారని ఇప్పటికి కొందరు అలాగే బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటున్నారు అంటూ రాకేష్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Hyper Aadi: అందరి ముందు పూర్ణను హనీమూన్ గురించి అడిగి పరువు తీసిన ఆది.. సిగ్గుతో తలదించుకున్న పూర్ణ !

Hyper Aadi:వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి జడ్జిగా వచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి తీస్ మార్ ఖాన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో ఆది సాయికుమార్, నటి పాయల్ రాజ్ పుత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది పెద్ద ఎత్తున సందడి చేసినట్లు తెలుస్తోంది.

ఎప్పటిలాగే ఆది తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ అందరిని సందడి చేశారు ఈ క్రమంలోనే ఆది హీరో ఆది సాయికుమార్ తో మాట్లాడుతూ ఉండగా.. మధ్యలో పూర్ణ జోక్యం చేసుకొని హైపర్ ఆది ఫ్లర్ట్ చేస్తున్నారు. హీరో ఆది చాలా క్వైట్ గా ఉన్నారు అంటూ ఈమె కామెంట్ చేశారు. దీంతో హైపర్ ఆది వెంటనే పూర్ణ గారు మీ హనీమూన్ బాగా జరిగిందా? అని ప్రశ్నించారు.

అందరి ముందు హైపర్ ఆది పూర్ణను హనీమూన్ గురించి అడగడంతో ఒక్కసారిగా ఆమె సిగ్గుతో తలదించుకుంది. ఇక షో టైం లో హైపర్ ఆదికి ఎవరు ఎక్కడ దొరికిన తను పంచులతో ఆట ఆడుకుంటారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పూర్ణను
ఇలా హనీమూన్ గురించి ప్రశ్నించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Hyper Aadi: వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్న పూర్ణ…

ఇకపోతే పెళ్లి కాకుండానే హనీమూన్ ఎలా జరిగిందని అడగడం ఏంటి విడ్డూరంగా అంటూ పలువురు ఈ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. అయితే పూర్ణ ప్రముఖ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరుపుకుందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.ఇలా తన పెళ్లి జరుగుతుందన్న నేపథ్యంలోనే హైపర్ ఆది తన హనీమూన్ గురించి ప్రశ్నించారు. దీంతో నేటిజన్లు యధావిధిగా హైపర్ ఆది వ్యాఖ్యలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Hyper Aadi: వాళ్లు చేసిన పనికి కంటతడి పెట్టుకున్న హైపర్ ఆది.. ఆదిపై ఇంత పగ ఉందా.. వైరల్ అవుతున్న వీడియో?

Hyper Aadi: హైపర్ ఆది ఏ కార్యక్రమంలోనైనా అడుగుపెట్టారంటే అక్కడ తన పంచ్ డైలాగులతో అందరిని కడుపుబ్బ నవిస్తారు.ఇలా హైపర్ ఆది కామెడీ టైమింగ్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఈయన చేసే కామెడీ శృతి మించి పలు వివాదాలకు కారణమయ్యే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు ఈయన తీవ్ర విమర్శల పాలయ్యారు.

ఇదిలా ఉండగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే కంటెంట్ లో తమ ఆటపాటలతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమం చివరిలో యాంకర్ రష్మీ ఒక టాస్క్ నిర్వహించారు.ఇందులో భాగంగా కొందరి కమెడియన్ ఫోటోలను టేబుల్ పై పెట్టి ఎవరి వల్ల బాధపడి ఉంటారో తమకు నచ్చిన వారి ఫోటో తీసి చింపేయడం లేదా కాల్చి వేయడం చేయాలి అని టాస్క్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే మొదట ఆటో రాంప్రసాద్ వేదిక పైకి వచ్చి తాను హైపర్ ఆది వల్ల ఒక విషయంలో చాలా బాధపడ్డానని తనకు సారీ చెబుతూ తన ఫోటో కాల్చివేశాడు.ఇక పరదేశి నాకు అన్ని హైపర్ ఆది అన్న అయినప్పటికీ ఆయన వల్ల నేను చాలా బాధపడ్డాను అంటూ తన ఫోటో చింపి వేశాడు. ఇలా ఒక్కొక్కరు వచ్చి హైపర్ ఆది ఫోటో చింపి వేయడంతో హైపర్ ఆది ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Hyper Aadi: హైపర్ ఆది ఎవరిని టార్గెట్ చేశారు…

ఇక చివరికి రష్మీ కూడా హైపర్ ఆది ఫోటో తీసుకొని చింపి వేసింది. తాను హైపర్ ఆది ఫోటో చింపి వేయడానికి కారణం కూడా తెలిపింది.తాను శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ లో హైపర్ ఆది మాట్లాడుతూ రష్మీ ఎప్పుడు వచ్చావు అని అడగకుండా ఎప్పుడు వెళ్ళిపోతావు అని ప్రశ్నించాడని దానివల్ల తను చాలా బాధపడ్డానని ఈమె రీజన్ తెలిపారు.ఇకపోతే చివరికి హైపర్ ఆది వంతు వచ్చింది. ఈయన కూడా ఒకరి ఫోటో చేతిలో పట్టుకున్నారు. అయితే ఆయన ఎవరిని టార్గెట్ చేశారు అన్నది మాత్రం సస్పెన్స్ పెట్టారు.మరి హైపర్ ఆది ఎవరిని టార్గెట్ చేశారనే విషయం తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Anchor Anasuya: సిల్వర్ రంగు చీర కట్టి మెరిసిపోతున్న అనసూయ… ముసలమ్మలా ఉన్నావ్ అంటూ నేటిజన్స్ కామెంట్స్?

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా మంచి గుఎంతో ర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈమెకు ఇలా వెండితెరపై అవకాశాలు రావడంతో తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కార్యక్రమానికి కూడా ఈమె గుడ్ బై చెప్పి వెళ్లారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్న అనసూయ స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇలా ఓవైపు బుల్లితెర కార్యక్రమాలలోనూ మరోవైపు వెండితెర సినిమాలలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఈ యాంకరమ్మ.ఇలా పలు కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా అనసూయ సిల్వర్ రంగు చీర కట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా సిల్వర్ రంగు చీరలో అనసూయ దేవ కన్యలా మెరిసిపోతూ ఉండగా మరికొందరు మాత్రం ఈమె ఫోటోలపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు అనసూయ ఈ ఫోటోలపై స్పందిస్తూ అచ్చం ముసలమ్మలా ఉన్నావు అంటూ కామెంట్ చేశారు.

Anchor Anasuya: వేశ్య పాత్రలో అనసూయ….

ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే అనసూయ వస్త్రధారణ గురించి ఈ విధమైనటువంటి కామెంట్స్ రావడం ఇది మొదటిసారి కాదు.ఇలా ఎంతోమంది ఎన్నో రకాల కామెంట్స్ చేసినప్పటికీ అనసూయ వాటిని చూసి చూడనట్టు వెళ్లిపోవడమే కాకుండా కొన్నిసార్లు వీటిపై రియాక్ట్ అవుతూ ఘాటుగా సమాధానం చెబుతుంటారు. ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఈమె మధురవాణి అనే ఒక వేశ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

Geetu Royal: బాడీ షేమింగ్ చేశారంటూ లైవ్ లో ఏడ్చేసిన గీతూ రాయల్.. వైరల్ అవుతున్న విడియో.. భారీగా ట్రోల్ చేస్తున్న షణ్ముఖ్ ఫాన్స్!

Geetu Royal: బిగ్ బాస్ రివ్యూల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యి ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు నటి గీతూ రాయాల్. ప్రస్తుతం ఈమె రివ్యూల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని జబర్దస్త్ కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఈమెకు పాల్గొనే అవకాశం వచ్చిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. తనని చాలామంది చిన్నప్పటినుంచి బాడీ షేమింగ్ చేస్తున్నారని, ఇలా తన బాడీ గురించి మాట్లాడటంతో ఇతరులకు ఛాన్స్ ఇవ్వకుండా తను నిండుగా దుస్తులను దరిస్తున్నానని ఈమె తెలిపారు. అయితే నా స్నేహితులు కజిన్స్ ఇతర మాటలను పట్టించుకోకుండా నీ శరీరాన్ని నువ్వు ప్రేమించు అని చెప్పినట్లు ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.

ఇలా తనని చాలామంది బాడీ షేమింగ్ చేయడం ఎంతో బాధగా ఉందంటూ కంటతడి పెట్టుకున్నారు. అయితే ఈ వీడియో పై షణ్ముఖ జశ్వంత్ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. గత సీజన్ లో షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో నువ్వు అతనిని బాడీ షేమింగ్ చేయలేదా అంటూ పెద్ద ఎత్తున ఈమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే తాను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మాత్రమే తన గురించి మాట్లాడానని అక్కడ ఆ కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ ఇవ్వడమే తన పని అంటూ సమాధానం చెప్పారు.

Geetu Royal: బహిరంగంగా క్షమాపణలు చెబుతాను….

ఆయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను ఒక మాట కూడా అనలేదని, అలాంటి అవసరం నాకు లేదని ఈమె తెలిపారు. అయితే నా బాధ ఇలా బయటకు చెప్పడంతో చాలామంది నన్ను సింపతి కోసమే ఇలా చేస్తున్నానని అంటున్నారు. ఇలా సింపతి కోసం చేయాల్సిన అవసరం తనకు ఏ మాత్రం లేదని, తనకు ఎంతో టాలెంట్ ఉందని ఈమె ఘాటుగా సమాధానం చెప్పారు. ఇకపోతే తాను ఎవరినైనా బాడీ షేమింగ్ చేస్తున్నట్లు కనుక వీడియోలు ఉంటే వాటిని తనకు పంపించాలని అదే కనుక నిజమైతే తాను బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికి కూడా ఏమాత్రం వెనకాడనని గీతూ రాయల్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

RK Roja: జబర్దస్త్ ద్వారా లక్షలు సంపాదించా… కావాలంటే నా ఐటీ రిటన్స్ చెక్ చేసుకోండి.. సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా..!

RK Roja: వెండితెరపై నటిగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి రోజా ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఈమె బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తున్న ఈమె మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు.ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా నగరి నియోజక వర్గం నుంచి గెలుపొందిన రోజా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ పర్యటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

ఈ క్రమంలోనే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రోటోకాల్ ఫాలో అవుతూ తాను జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో ఈమె దాదాపు పది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.అయితే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన ఈమె మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఇక తాజాగా రోజా కోట్లు విలువచేసే ఖరీదైన కారును కొనుగోలు చేశారు.

ఇలా ఈమె ఖరీదైన కారు కొనుగోలు చేయడంతో ప్రతిపక్ష నేతలు రోజాపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. రోజా అక్రమంగా సంపాదిస్తూ ఇలాంటి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసింది అంటూ బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈమె గురించి ఇలా ప్రతిపక్ష నేతలు మాట్లాడటంతో రోజా స్పందించి ఘాటుగా సమాధానం చెప్పారు.

RK Roja: ప్రతిపక్షాలకు ఘాటుగా జవాబిచ్చిన మంత్రి…

తాను 150 సినిమాలకు పైగా నటించాను. అలాగే పది సంవత్సరాల నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా కొనసాగుతున్నాను జబర్దస్త్ కార్యక్రమం ద్వారా లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నానని తెలిపారు.అంతగా అనుమానం ఉంటే నేను కట్టే ఇన్కమ్ టాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. మొత్తానికి రోజా గురించి వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించి చెక్ పెట్టారు.