Tag Archives: janhvi kapoor

Janhvi kapoor: చిన్నప్పుడు దొంగతనం చేస్తే అమ్మ తెలుగులోనే తిట్టేది.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్!

Janhvi kapoor: జాన్వీ కపూర్ పరిచయం అవసరం లేని పేరు దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. అయితే దేవర సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఎన్టీఆర్ హీరోగా రాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ అందుకున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జాన్వీ కపూర్ చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

తాను చిన్నప్పుడు అమ్మ గదిలోకి వెళ్లి అమ్మ వస్తువులను దొంగతనం చేసేదాన్ని ముఖ్యంగా లిప్ స్టిక్స్ తన పాకెట్ లో పెట్టుకొని బయటకు వస్తూ ఉండేదాన్ని అమ్మ చూసి నీ పాకెట్స్ చూపించు అంటే నోమమ్మా అంటూ నేను చెప్పేదాన్ని. అప్పుడు అమ్మ నన్ను నా కొడకా అంటూ తిట్టేదని జాన్వీ కపూర్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎమోషనల్ అయినా జాన్వీ..

ఇలా చిన్నప్పుడు ఈమె చేసినటువంటి చిలిపి పనులు దొంగతనాలు గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవి మరణించిన తర్వాత జాన్వీ కపూర్ చాలా బాగా తన తల్లిని మిస్ అవుతుందని తెలుస్తుంది. ఈమె ప్రతిసారి తన తల్లిని తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు కూడా చేస్తూ ఉంటారు.

Janhvi Kapoor: దేవర సినిమా విషయంలో ఏడాది పాటు అదే కోరుకున్నాను…నటి జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్!

Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ధడక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి జాన్వీ కపూర్. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ సౌత్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.అయితే ఈ సినిమా కోసం తాను ఎంతగా ఎదురు చూశాననే విషయాన్ని ఓ సందర్భంలో ఈమె తెలియజేశారు. తాజాగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి అభిమానులతో ఈమె చిట్ చాట్ చేశారు. దీంతో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఓ అభిమాని దేవర సినిమా గురించి ఈమెను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా జాన్వీకపూర్ దేవర సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ గా నన్ను తీసుకుంటే చాలా బాగుంటుంది అంటూ దాదాపు ఏడాది పాటు దేవుడిని అదే కోరుకున్నానని తెలియజేశారు. అయితే నా కోరిక నెరవేరిందని ప్రస్తుతం తాను ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నానని తెలిపారు.

Janhvi Kapoor: నా కోరిక తీరింది…


ఎన్టీఆర్ పక్కన జాన్వి కపూర్ నటించాలని చాలా బలంగా కోరుకున్నారని ఈ సందర్భంగా ఈమె వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది.కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా శరగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవులకు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Janhvi Kapoor: తల్లి శ్రీదేవి మరణాన్ని తలుచుకొని ఎమోషనల్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్!

Janhvi Kapoor: జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ సాధించడం కోసం కష్టపడుతున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకులకు కూడా ఈమె పరిచయం కాబోతున్నారు.

ఈ విధంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి జాన్వీ కపూర్ తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన బవాల్ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఒక ఇంటర్వ్యూలో తన తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

ఇకనటిగా ఇండస్ట్రీలో శ్రీదేవి సినీ ప్రస్థానం ఏంటో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీదేవి 2018లో దుబాయ్ లో మరణించారు. ఇలా ఈమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో
భాగంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

Janhvi Kapoor: కాలంతో యుద్ధం చేశాను…


అమ్మ తన సినీ కెరియర్ ను చూడలేకపోయిందని ఈమె తెలిపారు .అమ్మ చనిపోయిన సమయంలో తాను దడక్ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు.అమ్మ మరణం తర్వాత నాకు పరిస్థితులన్నీ చాలా కష్టంగా మారిపోయాయి. అమ్మ లేని లోటును ఎవరు తీర్చలేకపోయారు. ఆ కొద్ది రోజులు కాలంతో తాను పెద్ద యుద్ధం చేస్తూ ఆ బాధ నుంచి బయటపడ్డానని ఈ సందర్భంగా తల్లి మరణం గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Janhvi Kapoor: అమ్మ నన్ను పట్టుకుని కూర్చుంది… శ్రీదేవితో ఆఖరి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయినా జాన్వీ!

Janhvi Kapoor: అందాల తార దివంగత నటి శ్రీదేవి మరణ వార్త ఇప్పటికి ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. సినిమాలలో అన్ని భాషలలో నటిస్తూ ఎంతోమంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె దుబాయ్ లో టబ్ బాత్ లో మరణించి విగత జీవిగా కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.

ఇలా శ్రీదేవి మరణించిన తర్వాత తన కుమార్తె వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే శ్రీదేవి ఉన్న సమయంలోనే జాన్వీ కపూర్ ధడక్ సినిమా అవకాశాన్ని అందుకొని ఈ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తన తల్లి తనతో గడిపిన ఆఖరి క్షణాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తాను అప్పటికే దడక్ సినిమా షూటింగ్లో పాల్గొనడంతో అమ్మతో గడపడానికి సమయం లేకుండా పోయింది.

అమ్మ ఉదయమే దుబాయ్ వెళ్లాలి నైట్ తన గదిలో లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు. నేను షూటింగ్ నుంచి వచ్చి అమ్మ గదికి వెళ్ళగా తన బిజీగా ఉన్నారు. దాంతో నేను నా గదికి వెళ్లి పడుకున్నాను.అమ్మ పనులన్నీ ముగించుకొని నా గదికి వచ్చిందని అయితే అప్పటికే నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకున్నాను. నేను అలా చెప్పినప్పటికీ అమ్మ అక్కడే ఉందన్న విషయం నాకు తెలుసు.

Janhvi Kapoor: అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరు…


నేను నిద్రపోతూ ఉండగా అమ్మ నా దగ్గరకు వచ్చి నా తలపై చేయి వేసుకొని అలాగే కూర్చున్నారు. ఇదే నేను అమ్మతో గడిపిన ఆఖరి క్షణాలు అంటూ ఈ సందర్భంగా జాన్వి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమ్మ మరణం తర్వాత కుటుంబమంతా ఒక్కటే అయ్యాము. కానీ అమ్మలేని లోటును ఎవరు తీర్చలేరు అంటూ ఈ సందర్భంగా జాన్వీ చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Janhvi Kapoor: జాన్వీ కపూర్ కి ఇలాంటి పాడు అలవాట్లు ఉన్నాయా…. తల్లి పేరు చెడగొడుతుందిగా?

Janhvi Kapoor: ప్రముఖ దివంగత నటి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్ని భాషలలో అగ్ర హీరోలందరి సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎందరికో ఆరాధ్య దేవతగా నిలిచినటువంటి శ్రీదేవి ఆకాలమరణం ఇప్పటికే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె వారసురాలిగా ఇండస్ట్రీకి జాన్వీ కపూర్ వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన జాన్వి ఐదు సంవత్సరాలుగా హీరోయిన్గా కొనసాగుతున్న ఇప్పటివరకు తనకంటూ ఒక సరైన హిట్ సినిమాని అందుకోలేదు. ఇక ఈమె త్వరలోనే ఎన్టీఆర్ సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కాబోతున్నారు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకున్నారు.

ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం కోసం జాన్వీ కపూర్ పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్ షో చేస్తున్నారు అంతేకాకుండా తాజాగా ఈమెకు సంబంధించినటువంటి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎంతో పద్ధతిగా ఉండే ఈమె శని ఆదివారాలు మాత్రం హద్దులు మీది ప్రవర్తిస్తూ ఉంటారని తెలుస్తోంది.


Janhvi Kapoor: తల్లి పరువు తీస్తుందిగా…

వీకెండ్ వస్తే చాలు ఎక్కువగా పబ్ లో పార్టీలు చేసుకుంటూ పెద్ద ఎత్తున స్మోక్ చేయడం డ్రింక్ చేయడం చేస్తూ ఉంటారట.తన తల్లి మరణాంతరం వీరినీ కంట్రోల్ చేసేవారు లేకపోవడంతో ఇలాంటి చెడు అలవాట్లకు బానిస అయ్యారని ఈ అలవాట్లకు బానిస అయ్యి తన తల్లి పేరును చెడగొడుతుంది అంటూ నేటిజన్స్ మండిపడుతున్నారు.

Janhvi Kapoor: పెళ్లి చేసుకోబోయే వాడికి భారీగా కండిషన్స్ పెట్టిన జాన్వీ కపూర్… లిస్ట్ మామూలుగా లేదుగా?

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. తన అందం, అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన జాన్వి కపూర్ ప్రస్తుతం సౌత్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా ద్వారా టాలివుడ్ లో అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి జాన్వి కపూర్ ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఇలా సౌత్ లో కూడా హీరోయిన్ గా రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్న జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఈ క్రమంలో తనని పెళ్ళి చేసుకోబోయే వాడికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ పెట్టిన కండిషన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తనని పెళ్ళి చేసుకోబోయే వాడు తన వృత్తిని గౌరవించాలని, ఎక్కువ సమయం తనతోనే గడపాలని కండిషన్ పెట్టింది. అంతే కాకుండా కొత్త విషయాలు నేర్చుకొని తనకు తెలియచెప్పాలని, అలాగే తనని పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలని తన కోరిక బయటపెట్టింది. అంతేకాకుండా ఎప్పుడు తనతో ఉంటూ తనని కేరింగ్ గా చూసుకునేవాడు భర్తగా రావాలని కోరిక బయట పెట్టింది.

Janhvi Kapoor: ఆ విషయంలో తన తండ్రిని మించి ఉండాలి…

అలాగే మరొక ముఖ్యమైన కండిషన్ ఏమిటంటే తనని పెళ్లి చేసుకోబోయే వాడు తన తండ్రి కన్నా ఎక్కువ హైట్ ఉండాలని కండిషన్ పెట్టింది. ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ బిజినెస్ మెన్ శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరి ప్రేమ విషయం అఫీషియల్ గా వెల్లడించకపోయినా కూడా .. అతనితో కలిసి టూర్లు.. షికార్లు అంటూ తెగ తిరుగుతోంది. జాన్వీ కపూర్ చెప్పిన క్వాలిటీస్ అన్ని అతనిలో ఉన్నాయా? లేక అతను డేటింగ్ వరకేనా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Janhvi Kapoor: ఎన్టీఆర్ 30 కన్నా ముందుగానే ఆ తెలుగు హీరోలతో జాన్వీ నటించారని మీకు తెలుసా?

Janhvi Kapoor: జాన్వి కపూర్ పరిచయం అవసరం లేని పేరు అందాల నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితమైనటువంటి ఈమె సౌత్ సినిమాలలో నటిస్తే చూడాలని ఎంతోమంది అభిమానులు ఎదురు చూశారు అయితే ఈమె సౌత్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ హీరోయిన్ అని వార్తలు వచ్చాయి అయితే ఇదే నిజమని తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్ ను విడుదల చేస్తూ చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు. ఇక ఈమెకు తెలుగులో ఇది మొదటి సినిమా అని చాలామంది భావించారు.

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈమె ఎన్టీఆర్ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదని అంతకుముందే ఇతర టాలీవుడ్ హీరోలతో కలిసి ఈమె ఓ ప్రాజెక్టులో నటించారని చాలామందికి తెలియదు. మరి ఎన్టీఆర్ సినిమా కన్నా ముందుగా జాన్వీ కపూర్ ఏ టాలీవుడ్ హీరోతో ఏ సినిమాలో నటించారు ఏంటి అనే విషయానికి వస్తే…

Janhvi Kapoor: రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించిన జాన్వీ..

దగ్గుబాటి హీరోలు రానా, వెంకటేష్ నటిస్తున్నటువంటి తాజా వెబ్ సిరీస్ రానా నాయుడు.ఈ వెబ్ సిరీస్ లో జాన్వి కపూర్ కూడా నటించారనే విషయాన్ని తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా నెట్ఫ్లిక్స్ ఒక వీడియోని విడుదల చేశారు. ఇందులో ఏదో సమస్యలో ఉన్నటువంటి జాన్వీ కపూర్ ను రానా వచ్చి కాపాడినట్లు చూపించారు. ఇలా ఈమె ఎన్టీఆర్ సినిమా కన్నా ముందుగానే రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించారని ఈ వీడియో ద్వారా మేకర్ ప్రకటించారు. ఇక ఈ వెబ్ సిరీస్ మార్చ్ 10వ తేదీ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

Janhvi Kapoor: ఎన్టీఆర్ 30 లో తారక్ జోడిగా జాన్వీ కపూర్…. పెద్ద చిక్కుల్లో పడిన బాలయ్య?

Janhvi Kapoor: నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఇంకా షూటింగ్ పనులను మొదలుపెట్టలేదు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుందని సమాచారం. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించడం కోసం పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ చివరికి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం జాన్వీ హైదరాబాద్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె హైదరాబాద్ రావడానికి గల కారణం ఎన్టీఆర్ సినిమా కోసం ఫోటో షూట్స్ జరిగాయని దాదాపు ఈమె ఎన్టీఆర్ సినిమాలో కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

ఇలా ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను త్వరలోనే అధికారకంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లేనని పలువురు భావిస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవి కూతురు నటించిన బాలయ్య కాస్త చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి అనంతరం ఎన్టీఆర్ హీరోగా ఆయన సరసన హీరోయిన్గా నటించి వీరి కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Janhvi Kapoor:బాలయ్యతో నటించనీ శ్రీదేవి…

ఇక ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు అందరి సరసన నటించిన శ్రీదేవి బాలకృష్ణ సరసన మాత్రం నటించలేదు. బాలకృష్ణ సినిమాలో శ్రీదేవిను హీరోయిన్ గా ఎంపిక చేసిన ఎన్టీఆర్ మాత్రం బాలయ్య సినిమాలో శ్రీదేవి నటించడానికి ఒప్పుకోలేదట.బాలకృష్ణ కూడా తన తండ్రితో కలిసి నటించిన శ్రీదేవి తనకు తల్లితో సమానమని అందుకే తనతో సినిమాలు చేయలేదని పలు సందర్భాలలో తెలియజేశారు. అయితే ప్రస్తుతం శ్రీదేవి కుమార్తె జాన్వీ ఎన్టీఆర్ సినిమాలో నటించడంతో ఎప్పుడైనా బాలకృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే శ్రీదేవి గురించి ఎలా స్పందిస్తారనే విషయంపై అందరిలో ఆత్రుత నెలకొంది.

Mahesh Babu: మహేష్ అందాన్ని కొరుక్కు తినాలనిపిస్తుంది.. బరితెగించిన జాన్వీ కపూర్!

Mahesh Babu:టాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ యంగ్ హీరోగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అందం అభినయానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి.ఇక మహేష్ బాబుకి అబ్బాయిల కన్నా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది.

మహేష్ బాబు అందానికి ఎంతోమంది అమ్మాయిలు ఫిదా అవుతూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు సైతం మహేష్ బాబుతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించే ఛాన్స్ రావాలని కోరుకుంటారు.ఇలా అందానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి మహేష్ బాబు పై తాజాగా బాలీవుడ్ నటి దివంగత నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె టాలీవుడ్ హీరో మహేష్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ మహేష్ బాబు సర్ అందం చూస్తే కొరుకు తినాలనిపిస్తుంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా ఎవరికైనా వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతుంది కానీ మహేష్ సార్ విషయంలో ఇందుకు విభిన్నం.

Mahesh Babu వయసు పెరిగే కొద్దీ ఆయనకు అందం పెరుగుతుంది…

ఆయనకు వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతుందని అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటూ ఈమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు మహేష్ సార్ వైపు చూస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తనకు తెలియదని, అలా చూసినప్పుడు తన ఫేస్ మొత్తం బ్లాంక్ అవుతుంది అంటూ ఈమె మహేష్ బాబు అందంపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ కాక వెంటనే మహేష్ బాబు అభిమానులు స్పందిస్తూ మహేష్ బాబుకి దిష్టి తీయడం మర్చిపోకండి అంటూ కొందరు అభిమానులు నమ్రతకు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం జాన్వి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో నటించినని ముఖానే చెప్పిన హీరోయిన్… ఎవరంటే?

Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.

ఇకపోతే ఈ రౌడీ హీరో సినిమాలు వస్తున్నాయని తెలిస్తే అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పాలి. ఇలా విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చేంత అభిమానులు ఉన్నారు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం విజయ్ దేవరకొండకు అభిమానులుగా మారిపోయారు. ఆయన పక్కన ఛాన్స్ వస్తే చాలు నటించడానికి సిద్ధంగా ఎంతోమంది ముద్దుగుమ్మలు ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ వంటి వాళ్ళు కూడా తనతో డేట్ కి వెళ్లాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇంతటి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం వస్తే ముఖానే నటించనని ఒక హీరోయిన్ చెప్పారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికొస్తే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన డియర్ కామ్రేడ్ సినిమాలో నటించే అవకాశం రావడంతో తాను నటించనని చెప్పారట.

Vijay Devarakonda: ఎప్పటికీ ఆ హీరోతో నటించను…

ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు ఉండడంతో అలాంటి సన్నివేశాలలో తాను నటించలేనని అందుకే ఈ సినిమాని వదులుకున్నట్లు సమాచారం.ఈ సినిమానే కాదు భవిష్యత్తులో తనతో కలిసి ఎలాంటి సినిమాలలో కూడా నటించమని సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ సినిమాల ఎంపిక తన సినిమాల ఎంపిక చాలా భిన్నంగా ఉంటుందని అందుకే తన సినిమాలలో నటించడానికి తాను సిద్ధంగా లేనంటూ సాయి పల్లవి విజయ్ దేవరకొండ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.