Tag Archives: khushi

Liger Movie: ఫస్ట్ టైం లైగర్ డిజాస్టర్ పై రియాక్ట్ అయిన విజయ్ దేవరకొండ… ఏమన్నారో తెలుసా?

Liger Movie: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండబాలీవుడ్ నటి అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా గత ఏడాది ఆగస్టు 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల సమయంలో విజయ్ దేవరకొండ కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.ఇకపోతే తాజాగా ఈయన ఖుషి సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా లైగర్ డిజాస్టర్ గురించి మొదటిసారి స్పందించారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడుతూ…ఒక సినిమా సరిగా ఆడకపోతే నాకు బాధ కలుగుతుంది అలాగని మరొక సినిమా చేయకుండా నన్ను ఆపలేదని తెలిపారు. ఇప్పటివరకు నేను నటించిన సినిమాలలో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. హిట్ సినిమాలు ఉన్నాయి. ఇకపై చేసే సినిమాలలో కూడా హిట్ సినిమాలు ఉంటాయి. అలాగే ఫ్లాప్ సినిమాలు కూడా ఉంటాయని తెలిపారు. కానీ మా లక్ష్యం మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమేనని తెలియజేశారు..

Liger Movie: పడిన లేచి పరిగెత్తాలి…


నాకు ఫెయిల్యూర్స్ అంటే భయం నిజానికి అవి మనల్ని చాలా హర్ట్ చేస్తాయి కానీ మరొక సినిమాని చేయకుండా మాత్రం ఆపలేవు. నేను కింద పెడతానని భయం లేదు.. పడితే బాధపడతా కానీ నేను పరిగెత్తకుండా ఆపలేరు పడి లేచి పరిగెడతాను జీవితంలో కూడా అంతేను అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండకు జోడిగా సమంత నటించిన సంగతి తెలిసిందే.

Vijay Devarakonda: అనసూయతో వివాదం పై స్పందించిన విజయ్ దేవరకొండ… ఏమన్నారో తెలుసా?

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఏమాత్రం ప్రేక్షకులు అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానుంది.

విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి చిత్ర బృందం మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా నుంచి అనసూయ పరోక్షంగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి ట్వీట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతున్నాయి. ఇలా అనసూయ విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం విజయ్ ఫాన్స్ ఆమెను భారీగా ట్రోల్ చేయడంతో ఒకానొక సమయంలో పెద్ద ఎత్తున వివాదంగా కూడా మారింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై మీడియా ప్రతినిధులు విజయ్ ను ప్రశ్నించారు.

Vijay Devarakonda: గొడవపడే వాళ్ళనే అడగండి….


అనసూయతో వివాదం ఎప్పుడు మొదలైంది అసలు ఈ వివాదానికి ఎప్పుడు పులిస్టాప్ పడుతుంది అంటూ ఈయనని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విజయ్ సమాధానం చెబుతూ ఏమో మీరు గొడవ పడే వాళ్ళనే అడగాలి సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో నాకు తెలియదు అంటూ చాలా సింపుల్ గా సమాధానం చెబుతూనే ఈ ప్రశ్నకు మీరు అనసూయనే అడగండి అంటూ ఈయన సమాధానం చెప్పేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ వైరల్ అవుతుంది.

Vijay Devarakonda: మన ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది… మోస్ట్ రొమాంటిక్ వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇలా ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.

ఈ విధంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం చిత్రబృందం పోస్టు ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్ అలాగే పాటలు కూడా విడుదల చేశారు. ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ సాంగ్స్ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి..

తాజాగా ఈ సినిమా నుంచి నా ఆరాధ్య అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఎంతో మంచి ఆదరణ లభించింది ఒక రొమాంటిక్ వీడియో క్లిప్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా ఈ రొమాంటిక్ వీడియోని షేర్ చేసినటువంటి ఈయన మన ప్రేమంటే ఇలాగే ఉంటుంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Vijay Devarakonda: ఖుషి పైనే ఆశలు..


ఇలా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.ఇప్పటివరకు వరుస సినిమాలలో నటిస్తూ వరుస ఫ్లాప్ అందుకున్నటువంటి సమంత విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా వీరిద్దరికీ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Vijay Devarakonda: పెళ్లి తర్వాత కూడా నా జీవితం అలాగే ఉండాలి…. పెళ్లి గురించి అలాంటి కామెంట్స్ చేసిన విజయ్?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలలో నటిస్తున్నటువంటి చిత్రం ఖుషి. ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ఆరాధ్య అనే లిరికల్ సాంగ్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే తాజాగా ఈ పాట గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.

ఖుషి సినిమాలో తనకు నచ్చిన పాటలలో ఆరాధ్య పాట ఒకటని తెలిపారు. ఈ పాటలో పెళ్లి అయిన ఏడాది తర్వాత వరకు భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే విషయాలను చాలా అద్భుతంగా చూపించారని తెలిపారు. ఇక పెళ్లి జరిగిన తర్వాత కూడా నా లైఫ్ ఈ పాట మాదిరిగానే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలియచేశారు.

Vijay Devarakonda:నా జీవితం అలాగే ఉండాలి..

ఈ విధంగా విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విజయ్ దేవరకొండ నటి రష్మిక మందన్నతో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ మేము స్నేహితులం అని చెప్పినప్పటికీ వీరిద్దరి మధ్య రహస్య ప్రేమ ప్రయాణం కొనసాగుతుందని అందరూ భావిస్తున్నారు.

Toliprema: రీ రిలీజ్ కు సిద్ధమైన పవన్ కళ్యాణ్ తొలిప్రేమ… ఖుషి రికార్డ్స్ బద్దలు కావాల్సిందేనా?

Toliprema: తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పలువురు స్టార్ హీరోలు నటించి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకున్నటువంటి సినిమాలను తిరిగి ప్రేక్షకుల కోసం ఫోర్ కే వెర్షన్ లో విడుదల చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఖుషి,జల్సా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సరికొత్త రికార్డులను సృష్టించాయి. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ సినిమా ఖుషికి వచ్చినటువంటి కలెక్షన్స్ ఏ ఇతర రీ రిలీజ్ సినిమాలు కూడా రాబట్ట లేకపోయాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్లను తిరిగి పవన్ కళ్యాణ్ సినిమాని బ్రేక్ చేస్తుందని పలువురు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించినటువంటి క్లాసిక్ లవ్ స్టోరీ తొలిప్రేమ సినిమాని తిరిగి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రింటును శ్రీమాతా క్రియేషన్స్ వారు కొనుగోలు చేసే దీనిని ఫోర్ కే వెర్షన్లో తయారు చేశారు. ఈ క్రమంలోనే శ్రీ మాత క్రియేషన్స్ వారు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా ఈ నెల 31వ తేదీ విడుదల కాబోతుందని ప్రకటించారు.

Toliprema జనసేన పార్టీకి విరాళం


ఇలా ఈ సినిమా తిరిగి విడుదలైన తర్వాత ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ అన్నిటిని కూడా జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వబోతున్నామని శ్రీమాతా క్రియేషన్స్ వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 30వ తేదీ విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమాని ప్రమోట్ చేయడం కోసం త్వరలోనే హైదరాబాద్లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లు శ్రీమాతా క్రియేషన్స్ అధికారికంగా తెలిపారు.

Samantha: ఓయమ్మ సమంత ధరించిన ఈ చెప్పులు విలువ అన్ని లక్షలా… సమంత రేంజ్ మామూలుగా లేదు?

Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలో వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లో మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ సమంత ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా పలు సినిమా షూటింగ్ పనులలో సమంత తరచూ ఇతర దేశాలకు పయనం అవుతున్నారు.

తాజాగా సమంత తన సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ఇతర దేశాలకు వెళుతూ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దీంతో ఒక్కసారిగా కెమెరాలన్నీ సమంతను బంధించేసాయి. అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ దృష్టి సమంత వేసుకున్నటువంటి చెప్పులపై పడింది.

దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సమంత ధరించిన ఈ చెప్పులు విలువ ఎంత అని తెలుసుకొనే పనిలో పడ్డారు.. సమంత ధరించిన చెప్పులు లూయిస్ విట్టన్ కంపెనీకి చెందినవి అని తెలుస్తోంది. వాటి ధర 2.5 లక్షలు అని తెలుస్తోంది.ఇలా సమంత ధరించిన చెప్పులు విలువ రెండున్నర లక్ష విలువ చేస్తాయని తెలిసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు.

Samantha: లక్షలు విలువ చేస్తున్న సమంత చెప్పులు..


కేవలం చెప్పుల కోసమే సమంత ఇలా రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదని ఈ చెప్పుల ధర సమంత రెంజ్ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. దీంతోపాటు సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు.

Vijay Devarakonda: శరీరం విశ్రాంతి కోరుతున్న ముందడుగు వేస్తున్నావ్… సమంత గురించి విజయ్ షాకింగ్ పోస్ట్!

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. మొదట హీరోగా వరుస హిట్లు అందుకున్న విజయ్ గత కొంతకాలంగా పరాజయాలు చవిచూస్తున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ దర్శకత్వంలో విజయ్ నటించిన లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత శివా నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాలో సమంతకి జోడిగా నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా సమంత గురించి విజయ్ ఒక సుదీర్ఘమైన నోట్ పోస్ట్ చేశాడు. ఈ నోట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తాజాగా సమంత కీలక పాత్రలో నటించిన శాకుంతలం సినిమా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమా విడుదలకి ముందు పలువురు సెలబ్రిటీలు సమంతకి , శాకుంతలం సినిమా యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా సమంతకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేశాడు.

ఈ నోట్ లో ” సామీ.. నువ్వు అందరితో ఎంతో ప్రేమగా ఉంటావు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ సినిమాలో ప్రతి షాట్ కోసం నువ్వు బెస్ట్ అందిస్తున్నావు. కానీ ఏడాదిగా నువ్వు నీ జీవితంలో ఎంత ఫైట్ చేస్తున్నావో అందరికీ తెలియకపోవవ్చు.. కానీ వాటన్నింటినీ మర్చిపోయి నవ్వుతూ ముందడు వేస్తూనే ఉన్నావు.

ఇప్పుడు నీ శరీరం విశ్రాంతి కోసం చూస్తున్నా, పనికి బ్రేక్ అవసరం ఉందని చెబుతున్నా వినకుండా ముందుకెళ్తూనే ఉన్నావు. ఈ పరిస్థితులలో విడుదల అవుతున్న ‘శాకుంతలం’ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా.

Vijay Devarakonda: మాటలు రావడం లేదు..


నీ పట్టుదల, లక్షలాది మంది అభిమానుల ప్రేమ నిన్ను ఎల్లప్పుడూ సురక్షితంగానే ఉంచుతుంది. అంతా మంచే జరుగుతుంది. ప్రేమతో విజయ్ అంటూ ఇంట్రెస్టింగ్ నోట్ ను విడుదల చేశారు. ఇక విజయ్ షేర్ చేసిన పోస్ట్ కి సమంత స్పందిస్తూ.. ఇలాంటి సమయంలో ఇదే నాకు కావాలి. మాటలు రావడం లేదు. థాంక్యూ మై హీరో అంటూ రిప్లై ఇచ్చింది.

Samantha: భయంకరమైన వ్యాధితో పోరాడి బయటపడిన సమంత?

Samantha:సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు తరచూ వారి పాత్రలకు అనుగుణంగా మేకప్ వేసుకోవడం వల్ల కొన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు రాత్రి పగలు అనే తేడా లేకుండా సినిమా షూటింగులలో పాల్గొనడం వల్ల కొన్ని రకాల వ్యాధులతో సతమతమవుతూ ఉంటారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత సైతం ఇలాంటి ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ వ్యాధితో పోరాడి గెలుచారని తెలుస్తోంది.

 

సమంత ఇండస్ట్రీలోకి వచ్చి అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే ఈమె పాలీమార్ఫస్ లైట్ ఎరప్షన్ అనే తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడ్డారని తెలుస్తోంది. ఈ విధమైనటువంటి వ్యాధితో బాధపడే వారికి కాస్త సూర్య రష్మి తగిలిన వెంటనే చర్మం మొత్తం ఎర్రటి దద్దుర్లు ఏర్పడుతూ ఎంతో బాధపడతారని సమంత కూడా ఈ వ్యాధితో బాధపడ్డారని తెలుస్తోంది.

ఇలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడిన సమంత ఈ వ్యాధికి సరైన చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి బయటపడినట్లు తెలుస్తోంది.ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే తాను నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక నాగచైతన్యతో విడాకులు అనంతరం సమంత పూర్తిగా తన దృష్టిని తన కెరియర్ పై పెట్టారు.

Samantha: వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న సమంత..

విడాకుల తర్వాత సమంత ఏకంగా ఐటమ్ సాంగు ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఒకసారిగా ప్రేక్షకులు ఆశ్చర్య పోయినప్పటికీ ఈ పాటతో ఈమె కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా విపరీతమైన సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే తనకు బాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నట్లు సమాచారం. యశోద ఖుషి వంటి సినిమా షూటింగులలో పాల్గొంటున్నారు. ఇక ఈమె నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Ennenno Janmala Bandham Child Artist: ఎన్నెన్నో జన్మల బంధం చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Ennenno Janmala Bandham Child Artist: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సీరియల్ సినిమా ద్వారా ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విధంగా మొదటి సినిమా లేదా సీరియల్ తోనే ఎంతోమంది విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఖుషి ఒకరు.

Ennenno Janmala Bandham Child Artist: ఎన్నెన్నో జన్మల బంధం చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

ఈ సీరియల్ లో ఖుషి పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తూ మొదటి సీరియల్ తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఖుషి పాత్రలో నటిస్తున్నటువంటి ఈ చిన్నారి అసలు పేరు నైనిక. తన ముద్దు పేరు మిన్ను సంగారెడ్డికి చెందిన ఖుషి ఊహా తెలిసినప్పటి నుంచి నటనపై ఎంతో ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలోనే డబ్ స్మాష్ వీడియోస్, టిక్ టాక్ వీడియోల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Ennenno Janmala Bandham Child Artist: ఎన్నెన్నో జన్మల బంధం చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

టిక్ టాక్ వీడియోలతో గుర్తింపు…

ఇలాంటి టిక్ టాక్ వీడియోలు ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నైనిక అనంతరం ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ సీరియల్ లోఖుషి తన అమాయకపు నటనతో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా మొదటి సీరియల్ తోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఖుషి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం నైనిక క్యూట్ ఫొటోస్ పై మీరు ఓ లుక్కేయండి.