Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. మొదట హీరోగా వరుస హిట్లు అందుకున్న విజయ్ గత కొంతకాలంగా పరాజయాలు చవిచూస్తున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ దర్శకత్వంలో విజయ్ నటించిన లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత శివా నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాలో సమంతకి జోడిగా నటిస్తున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా సమంత గురించి విజయ్ ఒక సుదీర్ఘమైన నోట్ పోస్ట్ చేశాడు. ఈ నోట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తాజాగా సమంత కీలక పాత్రలో నటించిన శాకుంతలం సినిమా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమా విడుదలకి ముందు పలువురు సెలబ్రిటీలు సమంతకి , శాకుంతలం సినిమా యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా సమంతకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేశాడు.
ఈ నోట్ లో ” సామీ.. నువ్వు అందరితో ఎంతో ప్రేమగా ఉంటావు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ సినిమాలో ప్రతి షాట్ కోసం నువ్వు బెస్ట్ అందిస్తున్నావు. కానీ ఏడాదిగా నువ్వు నీ జీవితంలో ఎంత ఫైట్ చేస్తున్నావో అందరికీ తెలియకపోవవ్చు.. కానీ వాటన్నింటినీ మర్చిపోయి నవ్వుతూ ముందడు వేస్తూనే ఉన్నావు.
ఇప్పుడు నీ శరీరం విశ్రాంతి కోసం చూస్తున్నా, పనికి బ్రేక్ అవసరం ఉందని చెబుతున్నా వినకుండా ముందుకెళ్తూనే ఉన్నావు. ఈ పరిస్థితులలో విడుదల అవుతున్న ‘శాకుంతలం’ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా.
నీ పట్టుదల, లక్షలాది మంది అభిమానుల ప్రేమ నిన్ను ఎల్లప్పుడూ సురక్షితంగానే ఉంచుతుంది. అంతా మంచే జరుగుతుంది. ప్రేమతో విజయ్ అంటూ ఇంట్రెస్టింగ్ నోట్ ను విడుదల చేశారు. ఇక విజయ్ షేర్ చేసిన పోస్ట్ కి సమంత స్పందిస్తూ.. ఇలాంటి సమయంలో ఇదే నాకు కావాలి. మాటలు రావడం లేదు. థాంక్యూ మై హీరో అంటూ రిప్లై ఇచ్చింది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…