Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. మొదట హీరోగా వరుస హిట్లు అందుకున్న విజయ్ గత కొంతకాలంగా పరాజయాలు చవిచూస్తున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ దర్శకత్వంలో విజయ్ నటించిన లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత శివా నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాలో సమంతకి జోడిగా నటిస్తున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా సమంత గురించి విజయ్ ఒక సుదీర్ఘమైన నోట్ పోస్ట్ చేశాడు. ఈ నోట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తాజాగా సమంత కీలక పాత్రలో నటించిన శాకుంతలం సినిమా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమా విడుదలకి ముందు పలువురు సెలబ్రిటీలు సమంతకి , శాకుంతలం సినిమా యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా సమంతకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక ఇంట్రెస్టింగ్ నోట్ షేర్ చేశాడు.
ఈ నోట్ లో ” సామీ.. నువ్వు అందరితో ఎంతో ప్రేమగా ఉంటావు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ సినిమాలో ప్రతి షాట్ కోసం నువ్వు బెస్ట్ అందిస్తున్నావు. కానీ ఏడాదిగా నువ్వు నీ జీవితంలో ఎంత ఫైట్ చేస్తున్నావో అందరికీ తెలియకపోవవ్చు.. కానీ వాటన్నింటినీ మర్చిపోయి నవ్వుతూ ముందడు వేస్తూనే ఉన్నావు.
ఇప్పుడు నీ శరీరం విశ్రాంతి కోసం చూస్తున్నా, పనికి బ్రేక్ అవసరం ఉందని చెబుతున్నా వినకుండా ముందుకెళ్తూనే ఉన్నావు. ఈ పరిస్థితులలో విడుదల అవుతున్న ‘శాకుంతలం’ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా.
నీ పట్టుదల, లక్షలాది మంది అభిమానుల ప్రేమ నిన్ను ఎల్లప్పుడూ సురక్షితంగానే ఉంచుతుంది. అంతా మంచే జరుగుతుంది. ప్రేమతో విజయ్ అంటూ ఇంట్రెస్టింగ్ నోట్ ను విడుదల చేశారు. ఇక విజయ్ షేర్ చేసిన పోస్ట్ కి సమంత స్పందిస్తూ.. ఇలాంటి సమయంలో ఇదే నాకు కావాలి. మాటలు రావడం లేదు. థాంక్యూ మై హీరో అంటూ రిప్లై ఇచ్చింది.
తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…