Tag Archives: krishna

Mahesh Babu: మీరు గర్వపడేలా చేస్తా నాన్న.. తండ్రి గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మహేష్ బాబు!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తల్లిదండ్రుని కోల్పోయి ఎంతో బాధలో ఉన్నారు. తల్లి మరణించిన కొన్ని రోజులకే తండ్రి కూడా మరణించడంతో మహేష్ బాధ వర్ణాతీతం అని చెప్పాలి. ఇలా మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించి పది రోజులు కావస్తుంది ఇప్పటికే మహేష్ కుటుంబ సభ్యులు తన తండ్రి మరణం నుంచి కోలుకోలేకపోతున్నారు.

మహేష్ బాబు కొడుకుగా తండ్రి కృష్ణ గారి అంత్యక్రియలతో పాటు ఆయనకు చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు తన సినిమా షూటింగుకు విరామం ప్రకటించి తన తండ్రి కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేస్తున్నారు. ఇకపోతే కృష్ణ గారు మరణించిన పది రోజులకు మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు తన తండ్రిని తలుచుకుంటూ మొదటిసారి తండ్రి మరణం తర్వాత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన తండ్రి ఫోటోని షేర్ చేస్తూ మీరు మీ జీవితంలో ఎంతో సంతోషంగా ధైర్యంగా గడిపారు. ధైర్యం, సాహసం మీ వ్యక్తిత్వం.

Mahesh Babu: వారసత్వాన్ని కొనసాగిస్తా…

ఈ విధంగా మీ నుంచి నాకు స్ఫూర్తి కలిగిన విషయాలన్నీ కూడా మీతోనే వెళ్లిపోయాయి. ఇకపై నాలో ఎలాంటి భయం ఉండదు. ముందు కన్నా ఇప్పుడు నాలో మరింత బలం చేరింది. మీ కాంతి ఎల్లప్పుడు నాలో ప్రసరిస్తుంటుంది…మీ వారసత్వాన్ని ఇలాగే కొనసాగిస్తూ మీరు మరింత గర్వపడేలా చేస్తా నాన్న.. ఐ మిస్ యు.. ఐ లవ్ యు సో మచ్ అంటూ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తూ మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Manjula: కృష్ణ ఇందిరా దేవి పెళ్లి రోజును గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన మంజుల.. పోస్ట్ వైరల్!

Manjula: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యల కారణంగా ఈ నెల 15వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణించి దాదాపు పది రోజులుగా కావస్తున్నప్పటికీ ఇంకా ఇతని మరణ వార్త నుంచి అభిమానులు మహేష్ బాబు కుటుంబ సభ్యులకు కోలుకోలేకపోతున్నారు.ఇక మహేష్ బాబు కొడుకుగా తన తండ్రికి నిర్వర్తించాల్సిన కార్యక్రమాలు అన్నింటిని కూడా పూర్తి చేస్తున్నారు.

ఇక కృష్ణ మొదటిసారిగా ఇందిరా దేవినీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా కృష్ణ ఇందిరా దేవికి ఐదుగురు సంతానం. ఇక కృష్ణ నటి విజయనిర్మలను రెండవ పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ దంపతులకు పిల్లలు లేరు. అయితే కృష్ణ విజయనిర్మలను పెళ్లిచేసుకున్నప్పటికీ ఇందిరా దేవిని కూడా ఎంతో మంచిగా చూసుకున్నారు.ఇకపోతే ఈమె మరణించిన తక్కువ వ్యవధిలోనే కృష్ణ గారు కూడా మరణించడం మహేష్ బాబు కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది.

ఇకపోతే కృష్ణ,ఇందిరా దేవి మరణించిన తర్వాత వారి మొదటి వివాహ వార్షికోత్సవం రావడంతో కృష్ణ కుమార్తె మంజుల ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. కృష్ణ నవంబర్ 15వ తేదీ మరణించారు. అయితే వీరి వివాహ వార్షికోత్సవం నవంబర్ 22వ తేదీ రావడంతో మంజుల తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకున్నారు.

తనని కలవడానికి మమ్మల్ని వదిలి వెళ్లారు…
తమ తల్లిదండ్రుల జీవిత భాగస్వామ్యం స్వర్గంలో జరుగుతుంది. తన తల్లి మరణించిన తర్వాత తండ్రి కృష్ణ గారు ఆమె లేని లోటును భరించారు. బహుశా అందుకేనేమో తనని కలవడానికి చాలా తొందరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు అంటూ ఈ సందర్భంగా మంజుల తన తల్లి తండ్రితో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ పెద్ద ఎత్తున ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Padmalaya Studio: తల్లి నాగరత్నమ్మ ఎన్టీఆర్ తో కలిసి పద్మాలయ స్టూడియోను ప్రారంభించిన సూపర్ స్టార్ కృష్ణ.. వైరల్ అవుతున్న రేర్ పిక్స్!

Padmalaya Studio: నటశేఖరుడు కృష్ణ మరణించి పది రోజులు కాస్తున్నప్పటికీ ఇంకా ఈయన మరణ వార్తను తెలుగు చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే కృష్ణ హీరోగా మాత్రమే కాకుండా పద్మాలయ స్టూడియోని కూడా స్థాపించి ఈ స్టూడియో నుంచి ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించిన సంగతి తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలతో సమానంగా ఈయన కూడా పద్మాలయ స్టూడియోని స్థాపించారు. అయితే ఈ స్టూడియో ప్రారంభించిన సమయంలో ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ స్టూడియోను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ స్టూడియో నిర్మాణంలో భాగంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ స్టూడియో ప్రారంభించడమే కాకుండా తన తల్లి నాగ రత్నమ్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మాలయ స్టూడియోని కృష్ణ హైదరాబాద్ ఫిలింనగర్ లో నవంబర్ 21 1983 న ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఎన్టీఆర్ చేతుల మీదుగా పద్మాలయ స్టూడియో ప్రారంభం…

ఈ విధంగా పద్మాలయ స్టూడియోస్ స్థాపించి 2022 నవంబర్ 21వ తేదీకి 39 సంవత్సరాలు పూర్తయింది.ఇక కృష్ణ మరణించడంతో పద్మాలయ స్టూడియో ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటో
లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఈ స్టూడియోని ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేశారు.

Krishna: దివంగత సీఎం జయలలితకు ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన కృష్ణ.. అసలేం జరిగిందంటే?

Krishna: ఐదు దశాబ్దాలకు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నట శేఖర్ కృష్ణ ఇక లేరు అనే వార్త ఇప్పటికీ మింగుడు పడటం లేదు. ఎన్నో సాహస ప్రయోగాత్మక సినిమాలను పరిచయం చేసిన ఘనత కృష్ణ గారికి ఉందని చెప్పాలి. ఇలా తన సినీ కెరియర్లో 350కు పైగా సినిమాలలో నటించిన ఈయన తుది శ్వాస విడిచారు.

సినీ ప్రస్థానంలో ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే.సాధారణంగా ఎవరైనా తమ కూతురు కుమారుడు పెళ్లికి సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తారు. అయితే కృష్ణ మాత్రమే ఏకంగా దివంగత మాజీ సీఎంకు ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పారట. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే..

కృష్ణ గారు పెద్ద కుమార్తె పద్మావతి వివాహాన్ని గల్లా జయదేవ్ తో నిశ్చయించారు. వీరి వివాహం చెన్నైలో జరగనుంది. ఈ క్రమంలోనే తన పెద్ద కుమార్తె వివాహానికి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలితను కృష్ణ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. జయలలిత కూడా తన కుమార్తె వివాహానికి రావడానికి ఆసక్తి చూపింది.ఇక వివాహ మూడు రోజులు ఉందనగా జయలలిత సెక్యూరిటీ వచ్చి సెక్యూరిటీ పరంగా ముందు మూడు వరుసలు ముఖ్యమంత్రి గారికి కేటాయించాలని సూచించారట.

Krishna: సెక్యూరిటీ పరంగా జయలలితను రావద్దని చెప్పిన కృష్ణ…

ఈ విషయం తెలుసుకున్న కృష్ణ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా తరలివస్తారు అలాంటిది 3 వరుసలు కేవలం జయలలిత గారి కోసం కేటాయించడం కుదరదు అంటూ ఆమెకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించి ఎంతో సున్నితంగా తన కూతురు పెళ్లికి రావద్దని మీ ఆశీర్వాదాలు ఉంటే చాలని చెప్పారట.పరిస్థితి అర్థం చేసుకున్నటువంటి జయలలిత సైతం పెళ్లి రోజు వధూవరులకు ఒక బోకే పంపించి వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Paruchuri Gopala Krishna: కృష్ణ అడగకుండానే ఇంటి కోసం సహాయం చేశారు: పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna: సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. ఇలా కృష్ణా మరణంతో సీనియర్ హీరోల శకం ముగిసింది. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కృష్ణ గారికి నివాళులు అర్పించారు.ఇదిలా ఉండగా కృష్ణ గారితో పనిచేసినటువంటి సెలబ్రిటీలు రచయితలు దర్శకనిర్మాతలు ఆయనతో వారికి ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పరుచూరి గోపాలకృష్ణ కృష్ణ గారి మరణం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కృష్ణ గారి గురించి ఆయన మాట్లాడుతూ ఆయన మంచితనాన్ని బయటపెట్టారు.కృష్ణ గారు తనకు అడగకుండానే సహాయం చేశారని ఆ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని ఈయన తెలిపారు.

బంగారు భూమి సినిమా కోసం తాను నాలుగైదు డైలాగులు రాసానని ఇలా రాసినందుకే తన పేరుని మొదట్లో వేయించుకోమని చెప్పారు. కానీ నేను వద్దని చెప్పాను. ఇక ఈ సినిమాలో పద్మ మనిషిని నమ్ముకుంటే మన నోట్లో మట్టి కొడతాడు.. అదే మట్టిని నమ్ముకుంటే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది.ఆ మట్టికి నమస్కారం చేయి అనే డైలాగ్ విన్న తర్వాత కృష్ణ గారు ఎంతో అద్భుతంగా ఉంది ఎవరు రాశారు అని అడిగారు అప్పుడు పి సి రెడ్డి గారు ఆ డైలాగ్ నేను రాసానని కృష్ణ గారికి చెప్పారు.

Paruchuri Gopala Krishna: గొప్ప రచయిత అవుతా అంటూ జోస్యం చెప్పారు…

ఈ డైలాగ్ విన్న అనంతరం నేను ఇండస్ట్రీలో పెద్ద రచయిత అవుతానని అప్పట్లోనే కృష్ణ గారు జోస్యం చెప్పారని పరుచూరి వెల్లడించారు.హీరోగా ఇంత పేరు ప్రఖ్యాతలు పొందినప్పటికీ ఎంతోమందికి సహాయ సహకారాలు చేసి తన మంచి మనసును చాటుకున్నారు. ఈ క్రమంలోనే అవకాశాలు లేక సతమతమవుతున్న సమయంలో తన ఇంటి నిర్మాణానికి డబ్బు సహాయం చేశారని ఇలా కృష్ణగారు డబ్బు సహాయం చేయడంతోనే ఇంటి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టానని, అదే మంచితనమే మహేష్ బాబుకు కూడా వచ్చింది అంటూ పరుచూరి గోపాలకృష్ణ ఈ సందర్భంగా కృష్ణ గారిని తలుచుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Ramesh Babu: కృష్ణ ఇందిరా మరణంతో ఒంటరైంది మహేష్ బాబు కాదు… రమేష్ బాబు భార్య!

Ramesh Babu: ఘట్టమనేని కుటుంబానికి ఏడాది పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఈ ఏడాది మొదట్లోనే కృష్ణ మొదటి కుమారుడు రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో కృష్ణ తల్లి ఇందిరాదేవి, మూడు రోజుల క్రితం నటుడు కృష్ణ మరణించారు. ఈ విధంగా ఒకే ఏడాదిలోనే మహేష్ బాబు తన తల్లిదండ్రిని తన సోదరుడిని కోల్పోవడం ఎంతో విషాదం.

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అన్నయ్యతో పాటు తల్లిదండ్రులు కూడా దూరం కావడంతో మహేష్ బాబు ఒంటరయ్యారనీ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి కృష్ణ ఇందిరాదేవి రమేష్ బాబు మరణంతో మహేష్ బాబు ఒంటరి కాలేదు రమేష్ బాబు భార్య మృదుల ఒంటరి అయ్యారు.

కృష్ణ వారసుడిగా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమేష్ బాబు సామ్రాట్ సిమాతో హీరోగా మారారు. ఈ విధంగా హీరోగా పలు సినిమాలలో నటించిన ఈయన పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకున్నారు. ఇలా మృదలను వివాహం చేసుకున్న రమేష్ బాబు దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అమ్మాయి భారతి అబ్బాయి జయకృష్ణ అనే ఇద్దరు సంతానం కలరు.

Ramesh Babu:పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న మృదుల..

ఈ విధంగా కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి రమేష్ బాబు ఈ ఏడాది మొదట్లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరణించారు. తన భర్త దూరమైన అత్తమామలు తనకు అండగా ఉన్నారని ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి మృదులకు ఈ ఏడాదిలోనే తన అత్తమామలు కూడా మరణించడంతో మృదుల ఒంటరి అయిందనీ, ఆమెకు మహేష్ బాబు ఫ్యామిలీ అండదండలు కూడా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Krishna: సూపర్ స్టార్ కృష్ణ వీలునామాలో కీలక విషయాలు.. ఆస్తులన్నీ వారికేనా?

Krishna:టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తీవ్ర అనారోగ్య సమస్యతో మరణించిన సంగతి తెలిసిందే.ఇలా మంగళవారం మరణించడంతో బుధవారం సాయంత్రం ఈయన అంత్యక్రియలలో ఎంతో మంది అభిమానులు సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో పూర్తి చేశారు.

మహేష్ బాబు తన తండ్రికి దహన సంస్కరణ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేశారు.ఈ విధంగా మహేష్ బాబు ఒక ఏడాదిలోనే తనకు ఎంతో ఆప్తులైనటువంటి తల్లి తండ్రి అన్నయ్యను కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఈ విధంగా మహేష్ బాబు తన ఆప్తులని కోల్పోవడంతో మహేష్ బాబు కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఆయన అభిమానుల సైతం ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే అయిదు దశాబ్దల సినీ కెరియర్లో కృష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించడమే కాకుండా ఎన్నో సినిమాలకు దర్శకుడిగా నిర్మాతగా కూడా వ్యవహరించారు.ఇలా సినిమాల ద్వారా కృష్ణ ఏకంగా 400 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులను కూడా పెట్టినట్టు సమాచారం. ఇక కృష్ణ మరణం తర్వాత తన ఆస్తిలో మహేష్ బాబుకు రూపాయి కూడా దక్కకుండా వీలునామా రాశారట.

Krishna: మనవాళ్లు మనవరాళ్లకు ఆస్తి చెందేలా వీలునామా

ఈ విధంగా కృష్ణ తన ఆస్తులన్నింటినీ మహేష్ బాబు పేరు పై కాకుండా తన ఆస్తి మొత్తం తన మనవల్లు, మనవరాళ్ళకు చెందెలా వీలునామా రాశారనీ తెలుస్తోంది. ఇక ఈయన నరేష్ కి సైతం తన ఆస్తిలో వాటా లేకుండా చేశారట. విజయనిర్మల ఆస్తులు మొత్తం నరేష్ కి చెందాయని అందుకే కృష్ణ తన ఆస్తిలో నరేష్ కు ఎలాంటి వాటా ఇవ్వలేదని సమాచారం.

Krishna: నేను కేసు పెట్టినా కృష్ణ ఒక్క మాట కూడా అనలేదు… తమ్మారెడ్డి కామెంట్స్ వైరల్!

Krishna: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా దర్శకుడిగా పలు సినిమాలను నిర్మించిన తమ్మారెడ్డి భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇకపోతే ప్రస్తుతం ఈయన సినిమాలు తీయకపోయినా సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలు గురించి కూడా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే తమ్మారెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సినిమాల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తమ్మారెడ్డి కృష్ణ గారి అభిమానుల గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు. కృష్ణ గారి అభిమానులు తన ఆఫీసు పై దాడి చేయడంతో ఈయన తన అభిమానులపై కేసు పెట్టారు.

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి తనకు ప్రశ్న ఎదురైంది. మీరు ఇలా అభిమానులపై కేసు పెట్టినప్పుడు కృష్ణ గారు మీపై వారిని విడిపించాలి అని ఏమైనా ఒత్తిడి తీసుకు వచ్చారా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ నేను కేసు పెట్టినప్పటికీ కృష్ణ గారు మాత్రం ఒక్క మాట కూడా ఆ విషయం గురించి నాతో మాట్లాడలేదని, నాపై ఒత్తిడి తీసుకు రాలేదని తమ్మారెడ్డి వెల్లడించారు.

Krishna: ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు…

ఇలా తన అభిమానులపై కేసు పెట్టినప్పటికీ కృష్ణ గారు ఆ విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోలేదని, ఇలా ఒక సంవత్సరం తర్వాత ఆ కేసు రద్దయిందని ఈయన తెలియజేశారు.కృష్ణ గారి గురించి ఆయన మంచితనం గురించి ఇంటర్వ్యూ సందర్భంగా తమ్మారెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Krishna: కృష్ణ మనసు పడ్డ టాప్ హీరోయిన్ ఆమెనా.. అసలు విషయం చెప్పిన సీనియర్ జర్నలిస్ట్?

Krishna: తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన సాహస ప్రయోగాత్మక చిత్రాలను పరిచయం చేసిన నటుడిగా పేరుపొందారు.ఇలా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసినటువంటి కృష్ణ గారు మంగళవారం తుది శ్వాస విడిచారు. సుమారు ఐదు దశాబ్దాల సినీ కెరియర్ లో సుమారు 350 కి పైగా సినిమాలలో నటించారు.

ఇలా ఇన్ని సినిమాలలో నటించిన కృష్ణ సుమారు 80 మంది హీరోయిన్లతో నటించి సందడి చేశారు. ఇకపోతే ఈ హీరోయిన్లలో కృష్ణ మనసు పడ్డ హీరోయిన్ మాత్రం శ్రీదేవి అంటూ సీనియర్ జర్నలిస్టు ఇమంది రామారావు తెలియజేశారు. సాధారణంగా కృష్ణ గారు ఇతర హీరోయిన్లతో నటిస్తే ఆయన ఎంతో రిజర్వ్డ్ గా ఉండేవారు.

హీరోయిన్లు చనువుగా అతనితో నటించిన ఆయన మాత్రం దూరం దూరంగా ఉండేవారని శ్రీదేవితో మాత్రం ఆయన ఎంతో ఆసక్తిగా నటించేవారని ఈయన తెలిపారు. ఈ విధంగా ఎంతో మంది హీరోయిన్లతో కృష్ణ నటించినప్పటికీ ఆయన మనసు పడ్డ టాప్ హీరోయిన్ మాత్రం శ్రీదేవినని ఆ తర్వాత జయప్రదతో కూడా అంతే ఇష్టంగా నటించేవారు అంటూ ఈయన వెల్లడించారు.

hna

Krishna: శ్రీదేవితో ఆసక్తిగా నటించేవారు…

కృష్ణ సుమారు 350 సినిమాలలో నటించిన ఈయన 50 సినిమాలను కేవలం విజయనిర్మలతో కలిసి నటించారు. 40 పైగా జయప్రదతో కలిసి నటించారు. అలాగే 32 సినిమాలను శ్రీదేవితో కలిసి నటించారు. ఇకపోతే కృష్ణ గారు మరణించారని వార్త తెలియగానే నటి జయప్రద సైతం ఆయన మంచితనం గురించి తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జర్నలిస్టు ఇమంది రామారావు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Super Star Krishna: వేలంపాటలో కృష్ణ ఆస్తులు.. అప్పుడు మహేష్ బాబు ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్య సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇలా కృష్ణ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు అలాగే చిత్ర బృందం అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.ఇలా కృష్ణ గారు మరణంతో ఆయన సినీ ప్రస్థానం గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎంతోమంది గుర్తుచేసుకొని బాధపడుతున్నారు.

ఈ క్రమంలోనే సీనియర్ జర్నలిస్టుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈయన కృష్ణ గారి గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఆయన ఆస్తిపాస్తుల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే కృష్ణ గారి ఆస్తుల గురించి మాట్లాడుతూ ఆయన స్వతహాగా సంపాదించినది చాలా ఉంది అలాగే విజయనిర్మల వల్ల కూడా ఆయనకు పెద్ద మొత్తంలో ఆస్తులు కలిసి వచ్చాయని తెలిపారు.

ఇకపోతే కృష్ణ గారు కెరియర్ మొదట్లో పద్మాలయ స్టూడియో స్థాపించిన తర్వాత కొన్ని కారణాల వల్ల బ్యాంకు రుణం చేశారు అయితే ఆ బ్యాంకు రుణం చెల్లించకపోవడంతో పద్మాలయ స్టూడియోతో పాటు ఆయన ఇల్లు ఇతరత ఆస్తులను కూడా వేలం వేశారు. ఇలా వేలం పాటలో ఆస్తులు కోల్పోవాల్సిన సమయంలో రంగంలోకి మహేష్ బాబు దిగారని రామారావు తెలిపారు.

Super Star Krishna: వేలకోట్ల ఆస్తులు

ఈ విధంగా ఈయన ఆస్తులన్నీ వేలం వేసే సమయంలో మహేష్ బాబు గారు బ్యాంక్ అధికారులతో మాట్లాడి తనకు కొంత సమయం కావాలని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తాను డబ్బు మొత్తం చెల్లిస్తానంటూ ఆ భారాన్నంత తన భుజాన వేసుకున్నారని ఈయన తెలిపారు. అప్పట్లో కృష్ణ గారి ఆస్తులు 15కోట్ల రూపాయలకు వేలం వేశారు అయితే అప్పట్లో ఆయనకు అంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఉండేది కాదు అయితే ఇప్పుడు ఆ ఆస్తులు ఆయనకు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుపాస్తులను తెచ్చి పెట్టిందని ఈ సందర్భంగా రామారావు తెలిపారు.