Tag Archives: lakshmi

Mohan Babu: మామయ్య అన్నం తినిపించేవారు… అత్తయ్య అలా చూసుకున్నారు: మౌనిక

Mohan Babu: మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ ఇటీవల భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండవ వివాహం కావటం గమనార్హం. మనోజ్,మౌనిక రెడ్డి వివాహాన్ని లక్ష్మీ ప్రసన్న తన నివాసంలో దగ్గరుండి అన్ని తానై ఘనంగా జరిపించింది. ఇక వివాహం జరిగిన తరువాత మొదటిసారిగా మంచు మనోజ్, మౌనిక రెడ్డి కలిసి టీవి షోలో పాల్గొన్నారు.

వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది షో లో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ షో లో మౌనిక రెడ్డి తన మామ మంచు మోహన్ బాబు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ షో లో మౌనిక రెడ్డి మాట్లాడుతూ…” మామయ్య చాలా సరదాగా ఉంటారు. మనోజ్ ని వివాహం చేసుకోక ముందు నుండి మామయ్య నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు.

పెళ్లి కాకముందు ఇంటికి వెళ్లిన సమయంలో మామయ్య నాకు అన్నం తినిపించారని మౌనిక తెలిపింది. నా కొడుకును, నన్ను మోహన్ బాబు కుటుంబ సభ్యులు సొంతవాళ్లలా దగ్గరకు తీసుకున్నారని భూమా మౌనిక ఎమోషనల్ అయ్యింది. ఇక తన అత్త గారి గురించి మాట్లాడుతూ ..’ అత్తయ్య ఫోన్ చేసి తరచూ తనతో మాట్లాడుతూ ఉంటారని, అమ్మ చనిపోయిన సమయంలో అత్తయ్య నాకు చాలా దైర్యం చెప్పారు.

Mohan Babu:మంచు కుటుంబంలోకి కోడలుగా రావడం నా అదృష్టం…

ఇలాంటి కుటుంబంలోకి కోడలిగా రావడం దేవుడిచ్చిన వరం అని మౌనిక రెడ్డి తెలిపింది. అలాగే మంచు లక్ష్మితో కూడా తనకు ఒక అందమైన అనుబంధం ఉందని మంచు లక్ష్మి నన్ను చిన్నపిల్లలా చూస్తుందని ,తానే దగ్గరుండి మనోజ్ తో నా పెళ్లి జరిపించింది అంటూ అత్త ,మామ, ఆడపడచు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Akkineni Family: ఒకేసారి అక్కినేని కుటుంబంలో జరుగునున్న మూడు పెళ్లిళ్లు… స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న నాగార్జున!

Akkineni Family: ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి.ఈ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారికంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడం కోసం పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. ఇక అక్కినేని వారసుల సినీ కెరియర్ గురించి పక్కన పెడితే వీరి వ్యక్తిగత విషయానికి వస్తే అక్కినేని కుటుంబంలో ఎక్కువగా విడాకుల కథనాలు మనకు వినపడుతుంటాయి.

నాగార్జున మొదట దగ్గుబాటి లక్ష్మీని పెళ్లి చేసుకొని తనకు విడాకులు ఇచ్చి తిరిగి నటి అమలను పెళ్లి చేసుకున్నారు. అయితే ఈయన పెద్ద కుమారుడు నాగచైతన్య కూడా సమంతను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చారు. చిన్న కుమారుడు అఖిల్ నిశ్చితార్థం జరుపుకొని బ్రేకప్ చెప్పుకున్నారు.ఇక అల్లుడు సుమంత్ సైతం కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉన్నారు. ఇక మేనకోడలు సుప్రియ కూడా తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను చూసుకుంటున్నారు.

ఇలా అక్కినేని ఫ్యామిలీలో విడాకులు తీసుకున్నటువంటి వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే వీరి విషయంలో నాగార్జున స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది నెలల వ్యవధిలోనే అక్కినేని కుటుంబంలో వరుసగా మూడు పెళ్లిళ్లు జరగబోతున్నాయని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పటికే విడాకులు ఇచ్చిన తన పెద్ద కుమారుడు నాగచైతన్య తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయడానికి నాగార్జున సిద్ధంగా ఉన్నారని సమాచారం.


Akkineni Family:మూడు పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకున్న నాగ్…

ఇక అఖిల్ కిసైతం విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడితో పెళ్లి చేయడానికి నాగార్జున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మేనకోడలు సుప్రియ నటుడు అడవి శేష్ తో రిలేషన్ లో ఉన్నారనీ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ ఏడాదిలోనే ఈ ముగ్గురు పెళ్లిళ్లు చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

Manoj Marriage: మనోజ్ మౌనిక వివాహం సింపుల్ గా లక్ష్మి ఇంట్లో జరగడానికి కారణం ఇదేనా?

Manoj Marriage: మంచు వారసుడిగా మనోజ్ అందరికీ ఎంతో సుపరిచితమే. అయితే తాజాగా ఈయన భూమా మౌనికతో కలిసి రెండోసారి పెళ్లి పీటలు ఎక్కి ఎంతో ఘనంగా వీరి వివాహాన్ని జరుపుకున్నారు. శుక్రవారం రాత్రి 8:30కు మనోజ్ మౌనికల వివాహం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ఇదివరకే మనోజ్ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకొని కొన్ని కారణాల వల్ల తనకు విడాకులు ఇచ్చారు. మౌనిక సైతం ఇంతకుముందే ఒక అబ్బాయిని వివాహం చేసుకొని ఒక కుమారుడు జన్మించిన తర్వాత తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉన్నారు. ఇలా వీరిద్దరూ తిరిగి జీవితంలో ఒక్కటి అయ్యారు.ఇక మనోజ్ మొదటి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా సినీ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది కానీ రెండో వివాహం మాత్రం చాలా సింపుల్ గా జరిగింది.

మంచు కుటుంబం అనుకుంటే ఈయన పెళ్లి ఎంతో వైభవంగా చేసేవారు కానీ ఇతని పెళ్లి ఫిలింనగర్ లో ఉన్నటువంటి మంచు లక్ష్మి నివాసంలో జరిగింది.ఇలా జరగడానికి కారణం ఏంటనే విషయానికి వస్తే నిజానికి మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి మంచి ఫ్యామిలీ ఇతని పెళ్లి విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది.అందుకే మంచు లక్ష్మి మనోజ్ పెళ్లి వేడుకలను తన భుజాలపై వేసుకొని తన ఇంట్లో నిర్వహించినట్లు సమాచారం.


Manoj Marriage: మనోజ్ పెళ్లి బాధ్యతలు తీసుకున్న లక్ష్మి…

గతంలో మనోజ్ అంటే తనకు ఎంత ఇష్టమో లక్ష్మీ ప్రసన్న పలుసార్లు తెలియజేశారు. మా ఇద్దరు తల్లులు వేరైనా మా రక్తం మాత్రం ఒకటే నేను తనని తమ్ముడిగా కాకుండా కొడుకుగా చూసుకుంటాను అంటూ ఎన్నోసార్లు మనోజ్ పై ఉన్నటువంటి ప్రేమను బయటపెట్టారు. అందుకే మౌనికను ప్రేమిస్తున్నట్లు మనోజ్ ముందుగా తన సోదరీ లక్ష్మికి తెలియచేయడంతో తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా లక్ష్మీ ఒక అడుగు ముందుకు వేసి మనోజ్ పెళ్లి బాధ్యతలను తీసుకున్నారు. ఇక వీరి వివాహంలో ఇరుకు కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. మంచు మోహన్ బాబు సైతం వీరి వివాహానికి హాజరయ్యారు.

నటి లక్ష్మిని సిగ్గులేదా అని తిట్టినా సీనియర్ ఎన్టీఆర్.. కారణం అదే!

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. నందమూరి తారకరామారావు లక్ష్మి జంటగా ఒకే కుటుంబం చిత్రం ద్వారా మొట్టమొదటిసారి నటించారు. అనంతరం ఈ సినిమా తరువాత బంగారు మనిషి చిత్రంలో మరోసారి ఈ జంట తెరపై సందడి చేశారు. బంగారు మనిషి సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గారు నటి లక్ష్మికి మధ్య జరిగిన ఓ సంఘటనను తాజాగా లక్ష్మి గుర్తుచేసుకున్నారు.

మామూలుగా ఎన్టీఆర్ సినిమా సెట్లో ఉన్నారంటే అతనికి భోజనం అల్పాహారం అని ఇంటి నుంచే వస్తాయి.ఇలా బంగారు మనిషి సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు సాయంత్రం అతని ఇంటి నుంచి అల్పాహారం వచ్చిందని అయితే అందరితో పాటు తింటున్న సమయంలో నేను కేవలం సగం దోసే తిని వెళ్తున్న సమయంలో ఎన్టీఆర్ గారు లక్ష్మీగారు ఒకసారి రండి అని మర్యాదగా పిలిచారు. ఏంటండీ అని నేను ఎన్టీఆర్ దగ్గరకు వెళితే సగం దోశ తినడానికి మీకు సిగ్గుగా లేదా? అని అడిగారు.

అలా ఎన్టీఆర్ గారు ఆ మాట అనగానే ఎంతో షాక్ అయ్యానని లక్ష్మీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ మాటలకు ఏంటండీ ఎంతో మర్యాదగా పిలిచి ఇలా మాట్లాడుతున్నారు అని సరదాగా అడిగాను. లేకపోతే మరి ఏంటండీ ఇంత చిన్న వయసులో మీరు ఎలా తినాలి. మరి సగం దోశ తినడం ఏంటండీ.. చిన్న వయసు వారు బాగా తిని ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యం బాగా చూసుకోవాలి.

ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే కదా ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో ఉండేది అంటూ ఆ రోజు ఎన్టీఆర్ తనకు చెప్పారని ఇప్పటికీ ఆ సన్నివేశం నాకు బాగా గుర్తు ఉందని ఈ సందర్భంగా లక్ష్మి బంగారు మనిషి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను పంచుకున్నారు.

చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండాలంటే ఈ పనులు చెయ్యండి!

ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు ఎంతో అవసరం. మన రోజు వారి అవసరాలు తీరాలన్న, ఏదైనా చిన్న పని నుంచి పెద్ద పని నెరవేరాలని డబ్బు ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. ఆ డబ్బు లేనిదే ఎటువంటి చిన్న పని కూడా సక్రమంగా నెరవేరదు అనే విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా డబ్బుతో సాధ్యం కానిదంటూ ఈ ప్రపంచంలో మరేదీ లేదు. అదృష్టం కలిసి వస్తే కొంతమందికి డబ్బులు ఎటువంటి పనులు చేయకున్నా వారికి లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. మరి కొంతమంది రాత్రి పగలు కష్టపడుతున్న చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. అలాంటి వారు చేతిలో డబ్బు నిలవాలంటే ఈ క్రింది నియమాలను పాటిస్తే వారి చేతిలో ఎప్పుడు డబ్బులు ఉంటాయి…

సాధారణంగా లక్ష్మీ దేవి సంపదకు మూలమని చెబుతుంటారు. అలాంటి సంపద మనకు కలగాలంటే లక్ష్మీ దేవిని పూజించాలని పండితులు తెలియజేస్తున్నారు.అయితే లక్ష్మీదేవిని బియ్యంతో పూజించిన తర్వాత పూజించిన బియ్యాన్ని మన దగ్గర ఉంచుకోవడం వల్ల మనకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే సంపాదించిన డబ్బు కూడా మన దగ్గర నిల్వ ఉంటుంది.

లక్ష్మీదేవి ఫోటోను విష్ణు పాదాల చెంత పెట్టడం వల్ల మన ఇంట్లో డబ్బు ఉంటుందని చెప్పవచ్చు. అలాగే శనివారం రావి చెట్టు ఆకులు కోసి ఆకులను శుభ్రంగా కడిగి ఆకుపై T అనే అక్షరాన్ని రాసి మన దగ్గర ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడవు. గవ్వలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.అటువంటి గవ్వలకు పూజ చేసి ఒక తెల్లటి వస్త్రంలో కట్టి మన ఇంటిలో డబ్బు నిల్వ ఉంటే చోట పెట్టడం ద్వారా మన ఇంట్లోకి లక్ష్మీ ప్రవాహం మొదలవుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.

అదేవిధంగా తెల్లని కోడిగుడ్డు ఆకారంలో ఉన్న రాయిని నిత్యం మన వెంట పెట్టుకోవడం ద్వారా మనలో ఏర్పడే ప్రతికూల ఆలోచనలను తొలగించి అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా కొన్ని నియమాలను పాటించటం వల్ల మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి మన చేతిలో కొంత వరకు డబ్బు నిల్వ ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.