Tag Archives: mallemala

Hyper Aadi: సుడిగాలి సుదీర్ వల్ల మల్లెమాలకు పేరు రాలేదు… హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!

Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో మాత్రం తన స్టైల్ లో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ కార్యక్రమాల ద్వారా సుడిగాలి సుదీర్ కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈయనకు కూడా సినిమా అవకాశాలు రావడంతో సుడిగాలి సుదీర్ సైతం ఈ కార్యక్రమాల నుంచి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో సుధీర్ చేయకపోయినా సుదీర్ పై పంచులు వేస్తూ తరచూ సుడిగాలి సుదీర్ లో గుర్తు చేసుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సుధీర్ పట్ల పంచు డైలాగులు వేయడమే కాకుండా సుదీర్ స్థానాన్ని ఆక్రమించుకున్నారని చెప్పాలి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హైపర్ ఆదికి ఒక ప్రశ్న ఎదురయింది.సుధీర్ తిరిగి మల్లె మాల వారి కార్యక్రమాలలోకి వస్తే ఆయన ప్లేస్ తిరిగి ఆయనకు ఇస్తారా అంటూ యాంకర్ ప్రశ్నించారు.

Hyper Aadi: మేం లేకపోతే సుదీర్ ఫేమస్ కారు…


ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ కేవలం సుధీర్ అనే వ్యక్తి వల్ల మల్లెమాలవారికి పేరు రాలేదు. మేమందరం సుధీర్ వెంట ఉంటూ ఆయనపై పంచ్ డైలాగులు వేయటం వల్ల సుదీర్ ఫేమస్ అయ్యారు. మేము లేకపోతే సుదీర్ అంత ఫేమస్ అయ్యే వారు కాదని హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో సుడిగాలి సుదీర్ అభిమానులు మాత్రం హైపర్ ఆది పై కాస్త గుర్రుగా ఉన్నారు.

Sridevi Drama Company: వేదికపై కొట్టుకున్న సీరియల్ ఆర్టిస్టులు… అవమానంతో వెళ్లిపోయిన నటి కరుణ!

Sridevi Drama Company: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఎంతో మంచి క్రేజ్ ఉంది ప్రతి ఆదివారం ఏదో ఒక కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్ తో పాటు బుల్లితెర నటీనటులు కూడా పాల్గొంటూ సందడి చేస్తుంటారు. ఇక వచ్చే ఆదివారం ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు అనే కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా యాంకర్ రష్మీ టీవీ నటిమలు అయినటువంటి భావన కరుణ మధ్య ఒక చిన్న పోటీ పెట్టారు. మ్యూజిక్ ఆగేలోపు ఎవరైతే ఆ బంతి తెచ్చి నా చేతిలో పెడతారో వాళ్ళే విన్ అయినట్టు అని చెబుతారు ఈ ఆటలో భాగంగా భావన గెలిచారు. ఇలా ఈ ఆటలో గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వారికి చెంప దెబ్బ అయిన కొట్టాలి లేదా వారిని హగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే భావన మీరు గెలిచారు కనుక చెల్లిని హగ్ చేసుకుంటారా లేదా కొడతారా అని చెప్పడంతో భావన తనని కొట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటూ వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చి వేదికపై కరుణను లాగిపెట్టి చెంపపై కొట్టారు.ఇలా ఎక్కడో జరిగిన విషయాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ తనని కొట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఆర్గ్యుచేసిన కరుణ అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Sridevi Drama Company:టిఆర్పి రేటింగ్ కోసమేనా…

ఇలా వేదికపై ఈ ఇద్దరు కొట్టుకోవడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ కావడంతో కేవలం ఎపిసోడ్ పై హైలెట్ అవ్వడం కోసం ఎపిసోడ్ రేటింగ్ పెరగడం కోసమే మల్లెమాలవారు ఇలా ప్రోమో కట్ చేసి ఉంటారంటూ మరోసారి మల్లెమాల వారి వ్యవహార శైలిపై కామెంట్లు చేస్తున్నారు.మరి భావన ఎపిసోడ్ రేటింగ్ కోసమే అలా కొట్టారా లేదంటే నిజంగానే కొట్టారా అనేది తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి.

Rashmi Gautam: పిల్లలు పుట్టాలంటే మంచం పక్కన ఉండాలి… బోల్డ్ కామెంట్స్ తో రెచ్చిపోయిన యాంకర్ రష్మీ!

Rashmi Gautam: బుల్లితెరపై ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అయితే ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరిస్తున్న వారు కూడా ఎంతో మంచి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో యాంకర్ రష్మీ కూడా ఒకరు. ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న రష్మీ పలు ఈవెంట్లలో కూడా సందడి చేస్తూ ఉంటారు. ఇక జబర్దస్త్ కార్యక్రమం అంటే డబుల్ మీనింగ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి.ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్స్ వారి స్కిట్లలో డబుల్ మీనింగ్ డైలాగులు వాడితూ ఉంటారు.

ఇలా బూతు పదాలతో రెచ్చిపోతూ ఉండడంతో కొన్నిసార్లు ఈ కార్యక్రమం పై తీవ్ర వ్యతిరేకత కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో తరచూ ఇలాంటి డబల్ మీనింగ్ డైలాగులకు ఏమాత్రం కొదువ ఉండదు. అయితే తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో భాగంగా భార్యాభర్తల స్కిట్ లో భాగంగా భార్యాభర్తలు మాట్లాడుతూ… పిల్లలు పుట్టాలంటే ఇలా కంచం పక్కన ఉంటే సరిపోదు అంటూ డైలాగ్ చెబుతుంటారు.

Rashmi Gautam: రేటింగ్ కోసం బూతు డైలాగులు….


ఇలా డైలాగ్ చెబుతుండగానే వెంటనే రష్మీ ఈ డైలాగ్ అందుకుని పిల్లలు పుట్టాలంటే మంచం పక్కన ఉండాలి అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు.ఇలా రష్మీ ఒక్కసారిగా ఇలాంటి డైలాగు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ కావడంతో మల్లెమాలవారు ఎప్పటికీ మారరు టిఆర్పి రేటింగ్స్ కోసం ఇలా బోల్డ్ డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతూ ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Singer Mano: సింగర్ మనో జబర్దస్త్ వీడటానికి అదే కారణమా.. అసలు విషయం చెప్పిన మనో!

Singer Mano: బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.గత పది సంవత్సరాలు క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ కార్యక్రమానికి మొదట్లో నాగబాబు రోజా జడ్జిలుగా వ్యవహరించేవారు.

ఈ కార్యక్రమం నుంచి నాగబాబు కొన్ని కారణాలవల్ల తప్పుకున్నారు. అయితే ఈయన స్థానంలో సింగర్ మనో ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.ఈయన కూడా కొంతకాలం పాటు ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించి అనంతరం తప్పుకున్నారు. అయితే ఈయన తప్పుకోవడానికి గల కారణం మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలేనని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలపై సింగర్ మనో స్పందించారు.

ఈ సందర్భంగా సింగర్ మనో మాట్లాడుతూ…తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లిపోవడానికి గల కారణం మల్లెమాల వారితో గొడవలు కాదని ఈయన తెలియజేశారు. తాను జబర్దస్త్ కార్యక్రమానికి కేవలం చిన్న విరామం మాత్రమే ఇచ్చానని తెలిపారు. కరోనా వల్ల కొన్ని షోలు వాయిదా పడ్డాయి.వీటిలో ఇళయరాజా ఏఆర్ రెహమాన్లతో కలిసి చేయాల్సిన షోలు ఉన్నాయని ప్రస్తుతం ఈ షో లతో తాను బిజీగా ఉన్నానని తెలిపారు.

Singer Mano: జబర్దస్త్ కు చిన్న బ్రేక్ ఇచ్చాను..


ఇవి పూర్తి కాగానే తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలిపారు.ఇలా జబర్దస్త్ విడిపోవడానికి ఈ షోలే కారణమని అంతకుమించి మరే ఇతర కారణాలు లేవని తెలిపారు. తనకు కామెడీ అంటే చాలా ఇష్టమని తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి తాను హాజరవుతాను అంటూ మనో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Sudigali Sudheer: మల్లెమాలవారు సుదీర్ ను రానివ్వడం లేదా…. ఆది మాటలకు అర్థం అదేనా?

Sudigali Sudheer: బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా తన కెరియర్ ప్రారంభించారు. అనంతరం తన టాలెంట్ తో టీం లీడర్ గా ఎదిగారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో అంచలంచలుగా ఎదుగుతూ బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్నారు సుడిగాలి సుదీర్.

Hyper Aadi -Sudigali Sudheer: ఆ విషయంలో హైపర్ ఆది.. సుధీర్ నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందా?

ఇలా ఈయనకు బుల్లితెరపై ఎంతో మంచి క్రేజ్ రావడంతో ఏకంగా వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇప్పటికే పలు సినిమాలలో నటించిన సుధీర్ ఏ సినిమా పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయాయి అయితే గత ఏడాది ఈయన నటించిన గాలోడు సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.

ఇలా ఈ సినిమా మంచి హిట్ అవడంతో సుధీర్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈయన సినిమాలతో బిజీగా ఉండటం వల్లే జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన సుధీర్ తాను మల్లెమాల వారితో అనుమతి తీసుకునే బయటకు వచ్చానని త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తానని చెప్పారు.అయితే ఈ మాట చెప్పి దాదాపు రెండు మూడు నెలలు అవుతున్న సుధీర్ ఇంకా జబర్దస్త్ కార్యక్రమంలోకి రాలేదు.

Sudigali Sudheer: సుధీర్ కు నో ఎంట్రీ బోర్డు పెట్టిన మల్లెమాల…


ఇకపోతే తాజాగా హైపర్ ఆది చేసిన కామెంట్స్ కనుక చూస్తుంటే మల్లెమాల వారి కార్యక్రమాలలో పాల్గొనడం కోసం వారిని సుదీర్ బ్రతిమలాడుతున్నట్టు తెలుస్తోంది.ఓ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది రష్మితో మాట్లాడుతూ మీవాడు తిరిగి రావాలని తెగ బ్రతిమలాడుతున్నాడు అంట కదా అంటూ కామెంట్ చేశారు.దీంతో మల్లెమాలవారు సుదీర్ఘ తమ కార్యక్రమాలలో పాల్గొనడానికి అంగీకరించలేదా తనకు నో ఎంట్రీ బోర్డు పెట్టారా అంటూ కామెంట్లు వినపడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సుదీర్ సినిమాలతో పాటు అహాలో ప్రసారమవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

Cash Program: సుమ క్యాష్ ప్రోగ్రాంలో ఉన్న స్టూడెంట్స్ నిజమైన స్టూడెంట్స్ కాదా? ప్రేక్షకులను భారీగా మోసం చేస్తున్న మల్లెమాల!

Cash Program: బుల్లితెర పై ప్రతి ఒక్క చానల్లోనూ ఎన్నో కార్యక్రమాలు ప్రచారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారమవుతున్నటువంటి క్యాష్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షోలో సుమ పెద్ద ఎత్తున గెస్ట్ లను ఆహ్వానించి సందడి చేస్తుంటారు. అదేవిధంగా ఈ షోలో గెలిచిన వారికి భారీగా ప్రైజ్ మనీ ఉంటుందనే విషయాన్ని కూడా సుమా చెబుతూ ఉంటారు.

ఇలా ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరూ నిజంగానే గెలుచుకున్న డబ్బును వారికి ఇస్తారా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఇకపోతే సుమ క్యాష్ కార్యక్రమంలో భాగంగా ఒక రౌండ్ కాలేజ్ స్టూడెంట్స్ తో కలిసి నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈ స్టూడెంట్స్ అంతా నిజంగానే కాలేజీ విద్యార్థులేనా, ప్రతివారం ఇలా ఒక్కొక్క కాలేజ్ నుంచి వారిని అక్కడికి తీసుకు వస్తారా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.

ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.సుమ క్యాష్ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు గెలుచుకునే డబ్బును వారికి తిరిగి ఇవ్వరట. కేవలం షో కోసం వచ్చినందుకు మాత్రమే వారికి పేమెంట్ చెల్లిస్తారని తెలుస్తోంది. ఇక సినిమా ప్రమోషన్ల కోసం వచ్చేవారు వాళ్లే డబ్బు ఇచ్చి ఈ కార్యక్రమంలో సందడి చేస్తారు.

Cash Program: మల్లెమాలవారు ఇంత మోసం చేస్తున్నారా…


ఇకపోతే ఈ కార్యక్రమంలో కాలేజ్ స్టూడెంట్లుగా సందడి చేసే వాళ్ళు నిజమైన స్టూడెంట్స్ కాదని.. వాళ్లందరూ కూడా జూనియర్ ఆర్టిస్టులు అంటూ తాజాగా ఓ వార్త వైరల్ అయింది. ఇలా స్టూడెంట్స్ వచ్చిన తర్వాత సుమ కొందరిని మాత్రమే కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది అయితే ఈ షో స్టార్ట్ కాకముందే జూనియర్ ఆర్టిస్టులందరికీ ముందుగానే స్క్రిప్ట్ ఇచ్చి సిద్ధం చేసి ఉంటారని తాజాగా క్యాష్ కార్యక్రమం గురించి ఈ వార్త చెక్కరలు కొడుతుంది.అయితే ఈ విషయం తెలిసిన ఎంతోమంది అభిమానులు ఇలా జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ మల్లెమాలవారు ప్రేక్షకులను ఇంత మోసం చేస్తున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Jabardasth: ఒక్కో ఎపిసోడ్ కోసం జబర్దస్త్ జడ్జిలకి మల్లెమాల ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో తెలుసా?

Jabardasth: ఈటీవీలో మల్లెమాల వారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే ఈ కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

జబర్దస్త్ కార్యక్రమానికి మొదట్లో రోజా, నాగబాబు జడ్జిలుగా వ్యవహరించేవారు.అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి సింగర్ మనో వచ్చారు.అదేవిధంగా రోజా గారికి మంత్రి పదవి రావడం చేత రోజా కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో రోజా స్థానంలోకి ఇంద్రజ వచ్చారు. ఇక మనో కూడా ఈ కార్యక్రమానికి స్థిరంగా లేకపోవడంతో ఆయన స్థానంలో ఎవరో ఒకరు వస్తున్నారు.

ఇకపోతే తాజాగా జబర్దస్త్ జడ్జ్ ల కోసం మల్లెమాలవారు ఒక్కో ఎపిసోడ్ కోసం ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది. రోజా ఎక్కువ ఎపిసోడ్ కోసం ఐదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే వారట.ఇక ఈమె హీరోయిన్ కావడంతో ఈమెకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చారు ఇక ఈమెతో పాటు జడ్జిగా వ్యవహరించిన నాగబాబుకు మాత్రం ఒక్కో ఎపిసోడ్ కు మూడు లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చేవారు.

Jabardasth: ఒక్కో ఎపిసోడ్ కి లక్షల్లో రెమ్యూనరేషన్..

రోజా స్థానంలో కొనసాగుతున్న ఇంద్రజకు ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్ కు రెండున్నర లక్ష రెమ్యూనరేషన్ అందిస్తున్నారు. అదేవిధంగా నాగబాబు స్థానంలో కొనసాగుతున్న కమెడియన్ కృష్ణ భగవాన్ కు ఒక్కో ఎపిసోడ్ కి 2.50 లక్షల రెమ్యూనరేషన్ అందిస్తున్నారు. ప్రస్తుతం మల్లెమాలవారు జడ్జిలకు ఇస్తున్నటువంటి ఈ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Siva jyothi: రవి పాటకు వేదికపైనే వెక్కివెక్కి ఏడ్చిన శివజ్యోతి.. వైరల్ అవుతున్న వీడియో!

Siva jyothi: ఏదైనా పండుగలు ప్రత్యేకమైన రోజులు వస్తే పెద్ద ఎత్తున ఆ పండుగ రోజున సెలబ్రేట్ చేయడంలో మల్లెమాలవారు ముందు వరుసలో ఉంటారు.ఇలా ఇప్పటికే ఎన్నో ప్రత్యేకమైన ఈవెంట్లతో ప్రేక్షకులను సందడి చేస్తున్న మల్లెమాలవారు మరోసారి బుల్లితెర ప్రేక్షకులను నవరాత్రి ధమాకా పేరుతో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు జబర్దస్త్ కంటెస్టెంట్లు హీరోయిన్స్ సంఘవి ప్రేమ వంటి తదితరులు హాజరయ్యి ఎంతో సందడి చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమానికి యాంకర్ రవి వ్యాఖ్యతగా వ్యవహరించగా ఈ వేదికపై ఈయన గుమ్మడి గుమ్మాడి అనే పాటను పాడుతూ అందరిని ఎమోషనల్ గా టచ్ చేసారు.

ఇలా వేదికపై రవి పాట పాడటంతో అక్కడే ఉన్నటువంటి శివ జ్యోతి కంటతడి పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు.అనంతరం ఈమె వేదిక పైకి వెళ్తూ తన నాన్నని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికీ
ఊరికెళ్లితే.. మా నాగంపేట్ మొత్తం డాక్టర్ మల్లేష్ బిడ్డా అంటారు అంటూ కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

Siva jyothi: ఎమోషనల్ గా సాగిన ప్రోమో..

ఇక ఈ వేదికపై పెద్ద ఎత్తున కంటెస్టెంట్లు తమ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులను సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ నవరాత్రుల సందర్భంగా ప్రసారం చేయనున్నారు. ఇక హైపర్ ఆది యధావిధిగా కంటెస్టెంట్లపై తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ అందరిని సందడి చేశారు.

Hari Teja: మహానటి సావిత్రిని దించేసిన హరితేజ… సావిత్రి పాత్రలో అదరగొట్టిన హరితేజ.. వీడియో వైరల్!

Hari Teja: హరితేజ బుల్లితెర నటిగా యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా వెండితెరపై పలు సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమెకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న హరితేజ ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఏదైనా పండుగలు ప్రత్యేకమైన రోజులు వస్తే మల్లెమాలవారు ప్రత్యేక ఈవెంట్ ను సెలబ్రేట్ చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ క్రమంలోని త్వరలో నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే నవరాత్రి ధమాకా అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి మల్లెమాలవారు సిద్ధమయ్యారు.

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో నవరాత్రి వేడుకలను హైదరాబాదులో చేయాలని విజయవాడలో చేయాలని గొడవపడుతున్న నేపథ్యంలో హైపర్ ఆది యాంకర్ రవి వేదిక పైకి వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తారు. ఇక రవి గుమ్మడి గుమ్మాడి అనే పాటను పాడటంతో అక్కడున్నటువంటి వారు ఎమోషనల్ అయ్యారు.ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతమైన పర్ఫామెన్స్ చేస్తున్న సమయంలో హరితేజ కూడా మహానటి సావిత్రి వేషధారణలో సందడి చేశారు.

Hari Teja:సావిత్రినే నటించినట్టు ఉంది..

ఈ వేదికపై హరితేజను ఇలా చూడగానే అచ్చం సావిత్రి నే ఇక్కడికి వచ్చిందా అనేలా హరితేజ నటించారు. అచ్చం సావిత్రిలా హావభావాలను పలుకుతూ ఈమె చేస్తున్న పెర్ఫార్మెన్స్ కు అక్కడున్న వారందరూ ఫిదా అయ్యారు. హరితేజ పర్ఫామెన్స్ చూసిన హైపర్ ఆది మాట్లాడుతూ.. చనిపోయిన వారిని గుర్తు చేయడం వేరు నేరుగా వాళ్లే వచ్చినట్టుచేయడం వేరు అంటూ తన నటనపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Aadi -Akhil: ఢీ 14 కోసం హైపర్ ఆది, అఖిల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?

Aadi -Akhil: బుల్లితెరపై మల్లెమాలవారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఢీ కార్యక్రమం ద్వారా ఎంతోమంది డాన్సర్లుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమం 14 వ సీజన్ కొనసాగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది, అఖిల్, నవ్యస్వామి, రవి కృష్ణ వంటి వారు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమైనప్పటికీ ఈయన ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

ఇక ఢీకార్యక్రమంలో మెంటర్ గా ఉన్నటువంటి హైపర్ ఆది తన కామెడీ పంచ్ డైలాగులతో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం కోసం హైపర్ ఆది ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది.ఈ కార్యక్రమం కోసం హైపర్ ఆది ఒక కాల్ షీట్ కి ఏకంగా ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.ఈయన జడ్జెస్ తో పాటుగా ఈ కార్యక్రమంలో రెమ్యూనరేషన్ అందుకోవడం విశేషం.

Aadi -Akhil: భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అఖిల్…

ఇకపోతే ఈ కార్యక్రమంలో బుల్లితెర నటుడిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ సైతం మెంటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అఖిల్ ఈ కార్యక్రమంలో కొనసాగుతూ కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. సాధారణంగా ఒకసారి మల్లెమాల వారి కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన తర్వాత వారిని తిరిగి తీసుకోరు. కానీ అఖిల్ మాత్రం ఈ కార్యక్రమం నుంచి వెళ్లి బిగ్ బాస్ లో పాల్గొని, తిరిగి ఢీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు అఖిల్ ఒక వారానికి సుమారు రెండున్నర లక్ష వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఒక్కో కాల్ షీట్ కి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.