Tag Archives: mother

Jr. Ntr: ఎన్టీఆర్ ఆ సినిమా అంటే తన తల్లికి అంత ఇష్టమా.. ఎందుకంత స్పెషల్?

Jr. Ntr: జూనియర్ ఎన్టీఆర్ పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి తారక్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకోవడమే కాకుండా ఈయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలా ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్నటువంటి దేవర సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మొదటి భాగం దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఎన్టీఆర్ తన సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. అయితే తాజాగా తన సినిమాలలో తన తల్లికి ఇష్టమైనటువంటి సినిమా గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ నటించిన సినిమాలలో కల్లా తన తల్లి శాలినికి టెంపర్ సినిమా అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఆమె ఫిదా అయిపోయారట ఆయన చెప్పే డైలాగులు కానీ ఆయన తెలియజేసే హావభావాలు తన తల్లికి బాగా నచ్చాయట.అంతేకాకుండా ఈ సినిమాలో ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే తనకు న్యాయం జరిగేలా ఎన్టీఆర్ పోరాడే తీరు తనుకు నచ్చిందని ఈమె తెలిపారు.

టెంపర్..
ఇలా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా అంటే ఎన్టీఆర్ తల్లి శాలినికి కూడా చాలా ఇష్టమని ఈమె పలు సందర్భాలలో తన స్నేహితుల వద్ద చెప్పారట ఇక తనకు తన కొడుకు సినిమాలు ఏదైనా చూడాలి అనిపిస్తే ఈమె మొదట టెంపర్ సినిమాకే ఆసక్తి చూపుతారని తెలుస్తోంది.

Ntr: నేను ఈ స్థాయిలో ఉండడానికి ఆ ఇద్దరు మహిళలే కారణం.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ తన జీవితంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు మహిళల గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు ఇలా తను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు మూల కారణం తన అమ్మ అని తెలిపారు తన అమ్మ నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయడం కోసం తనకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్పిందని తెలిపారు.

ఇలా డాన్స్ నేర్చుకోవడం ఒక మంచి ఆర్ట్ అని తనలో ఉన్నటువంటి భావాలన్నింటిని కూడా నేను డాన్స్ రూపంలో తెలియజేస్తానని ఈయన తెలియజేశారు ఇలా నా జీవితంలో అమ్మ కీలక పాత్ర పోషించిందని ప్రతి ఒక్క విషయంలో తాను నన్ను ఎంతగానో ప్రోత్సహించేదని తెలిపారు. ఇక నా జీవితంలో నా భార్య ప్రణతి కూడా కీలకపాత్ర పోషించారని తెలిపారు.

తన ఇష్టాలను నాపై రుద్దదు..

నేను ఇలా హోమ్లి మెన్ గా ఉన్నాను అంటే అందుకు కారణం ప్రణతి అని తెలిపారు. ఆమె తన ఇష్ట ఇష్టాలను ఎప్పుడూ కూడా నాపై రుద్దదు అంతేకాకుండా ప్రతిరోజు నేను వ్యాయామం చేసేలా నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు.ఇలా ప్రణతి కూడా నా విజయంలో భాగం అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన తల్లి భార్య గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Anasuya: మరోసారి తల్లి కాబోతున్న అనసూయ.. ఇదేం ట్విస్ట్ అంటూ షాక్ లో ఫ్యాన్స్?

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో అనసూయ ఒకరు. ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతూ సినిమా అవకాశాలను అందుకున్నారు. అవకాశాలతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.

ఇక అనసూయ ఇటీవల కాలంలో సినిమాల పరంగా పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పాలి. ఈమె విభిన్న పాత్రలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల అనసూయ నటించిన విమానం సినిమాలో వేశ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఇలాంటి సాహస భరితమైన పాత్రలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

తాజాగా అనసూయ మరోసారి తల్లి కాబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె తల్లి కాబోతుంది అంటే నిజ జీవితంలో తల్లి కాబోతుంది అనుకుంటే మనం పొరపాటు పడినట్టే స్టార్ హీరోకి తల్లి పాత్రలో కనిపించబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.


స్టార్ హీరోకి తల్లిగా..

అనసూయ స్టార్ హీరో సినిమాలో నటించబోతున్నారని అయితే ఈ సినిమాలో స్టార్ హీరో చిన్నప్పటి పాత్రకు సంబంధించినటువంటి సన్నివేశాలలో తన తల్లిగా అనసూయ కనిపించబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఈమె మరోసారి తల్లి పాత్రలలో నటిస్తూ పెద్ద సాహసమే చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా తల్లి పాత్రలలో నటిస్తే అలాంటి పాత్రలలోనే అవకాశాలు వస్తాయని చాలామంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అనసూయ మాత్రం అలాంటి పాత్రలకు ఒప్పుకొని పెద్ద సాహసమే చేస్తున్నారని తెలుస్తుంది.

Nagashaurya: నాగశౌర్య పెళ్లయిన నెలకే వేరు కాపురం పెట్టాడు… షాకింగ్ విషయాలు చెప్పిన నాగశౌర్య తల్లి!

Nagashaurya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి వారిలో నాగశౌర్య ఒకరు ప్లాపులతో సంబంధం లేకుండా అవకాశాలు వచ్చిన వాటన్నింటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ఏడాది బెంగళూరుకు చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

వీరి వివాహం జరిగి దాదాపు ఏడాది కూడా పూర్తి అయింది.అయితే తాజాగా అనూష నాగశౌర్య గురించి నాగశౌర్య తల్లి ఉష ప్రసాద్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టడంతో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో నాగశౌర్య తన భార్య అనూష గురించి ఈమె షాకింగ్ విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా నాగశౌర్య తల్లి మాట్లాడుతూ అనూష నాకు ముందు నుంచి తెలుసు తాను చాలా మంచి అమ్మాయి. ఏ విషయానైనా ఉన్నతంగా ఆలోచిస్తుంది తన పనులు అన్ని కూడా చాలా చక్కబెడుతుంది శౌర్యకు నా ప్లేస్ ను తాను రీప్లేస్ చేసిందని చెప్పాలి అంత మంచి అమ్మాయి. ఇక నన్ను మమ్మ అని పిలుస్తుంది మా ఆయనని డాడీ అంటూ పిలుస్తుందని తెలిపారు.

మమ్మల్ని మమ్మీ డాడీ అని పిలుస్తుంది..

అనుష నాగశౌర్యకు పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ ఈ సందర్భంగా తన కోడలు గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అయితే వీరిద్దరూ పెళ్లి అయిన తర్వాత తమ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండి మరొక ఇంట్లో ఉంటున్నారని వెల్లడించారు. అయితే ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని మేము వారి పెళ్లికముందే పెళ్లయిన తర్వాత వేరుగా ఉండాలని డిసైడ్ చేసామని తెలిపారు. ప్రస్తుత కాలంలో పిల్లల ప్రతి ఒక్కరు కూడా వారికి నచ్చిన విధంగా ఉండాలని కోరుకుంటారు. అందరూ కలిసి ఉండే వారి కోరికలకు మనం అడ్డుకట్ట వేస్తే గొడవలు జరుగుతాయి అందుకే వారికి కావలసిన స్వేచ్ఛ వారికిచ్చి అందరూ ఎప్పుడైనా ఒకసారి కలిసినప్పుడు బంధాలు బలపడతాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము అంటూ ఉష ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Sai Pallavi: నాకోసం నేనేం కొన్నా అమ్మకు తెలిసిపోతుంది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

Sai Pallavi: సాయిపల్లవి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్ర తారగా గుర్తింపు పొందారు.ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.ఇలా మొదటి సినిమా అద్భుతమైన విజయం కావడంతో వరుస సినిమా అవకాశాలను అందుకొని తెలుగు తమిళ సినిమాలలో బిజీగా గడుపుతున్నారు.

Sai Pallavi: నాకోసం నేనేం కొన్నా అమ్మకు తెలిసిపోతుంది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

ఇకపోతే సాయిపల్లవి తాజాగా విరాటపర్వం సినిమా ద్వారా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అసలు తనకు సినిమా ఇండస్ట్రీ వైపు రావాలనే ఆలోచన కూడా లేదని తెలిపారు. ప్రేమమ్ సినిమాలో నటించే సమయంలో కూడా తాను ఎంతో అసంతృప్తిగా సినిమాల్లో నటించానని అయితే ఈ సినిమా మంచి విజయం అందుకొని అవకాశాలు రావడంతో సినిమాలపై దృష్టి పెట్టానని తెలిపారు.

Sai Pallavi: నాకోసం నేనేం కొన్నా అమ్మకు తెలిసిపోతుంది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

ఇక తనకు సినిమా అవకాశాలు రాకపోతే తన చేతిలో ఎలాగో డాక్టరేట్ ఉందని తాను వైద్య వృత్తిలో స్థిరపడతానని తెలియజేశారు.ఇక సాయి పల్లవి తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు తనకు డబ్బుకు లోటు లేకుండా పెంచారని అయితే డబ్బును ఎలా పొదుపుగా ఖర్చు చేయాలో కూడా నేర్పించారని తెలిపారు.

ఇప్పటికీ తల్లిచాటు బిడ్డనే..

ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే అది మనకు ఎంతవరకు అవసరం అవుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొంటానని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలిపారు.ఇకపోతే చిన్నప్పటినుంచి తాను ఏ వస్తువు కొన్నా తల్లి చేతుల మీదుగా కొనడం తనకు అలవాటు అని ఇప్పటికీ తను ఏం కొన్నా కూడా తన తల్లికి ఓటీపీ ద్వారా తెలిసిపోతుందని సాయి పల్లవి తెలియజేశారు. ఈ విధంగా తను అగ్రనటిగా కొనసాగుతున్నప్పటికీ తల్లిచాటు బిడ్డ నేనంటూ సాయి పల్లవి ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఈ విధంగా ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Namitha: తల్లి కాబోతున్న నమిత.. వైరల్ గా మారిన బేబీ బంప్ ఫోటో!

Namitha: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి గుజరాతి బ్యూటీ నమిత తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న నటి. తన అందానికి కాస్త గ్లామర్ ను పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా గ్లామర్ బ్యూటీ గా నిలిచి.. మిస్ ఇండియాగా నాల్గవ స్థానంలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా నటించింది.

Namitha: తల్లి కాబోతున్న నమిత.. వైరల్ గా మారిన బేబీ బంప్ ఫోటో!

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన జెమిని సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో తన అందంతో, నటనతో బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సొంతం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా పలు సినిమాలలో నటించగా.. ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో మాత్రం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

Namitha: తల్లి కాబోతున్న నమిత.. వైరల్ గా మారిన బేబీ బంప్ ఫోటో!

బిల్లా సినిమాలో ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఏకంగా గ్లామర్ షో లతో, ఎద అందాలతో అందర్నీ నోటిమీద వేసేలా చేసింది. ఇక బాలకృష్ణ నటించిన సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు సన్నగా, నాజూగ్గా ఉండే నమిత ఇప్పుడు బాగా బరువెక్కింది. దీంతో ఆమెకు సినిమాలలో కూడా అవకాశాలు రాలేక పోతున్నాయి.

ఇక పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీనే దూరం పెట్టింది. ఇక బరువు తగ్గించుకోడానికి తెగ ప్రయత్నించింది. 2017లో వీరేంద్ర చౌదరిని వివాహము చేసుకుంది నమిత. పెళ్లి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న నమిత తాజాగా గర్భవతి అయ్యిందని తెలిసింది. పైగా తను గర్భవతిగా ఉన్న ఫోటోను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

తన కోరిక ఫలించింది అంటున్న నమిత..

అంతేకాకుండా కొన్ని విషయాలు కూడా పంచుకోగా.. మాతృత్వం.. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని.. మారాను అంటూ.. తనలోని మార్పు మొదలైందని అన్నది. తన ముఖంలో సరికొత్త చిరునవ్వు వచ్చిందని.. కొత్త జీవితం, కొత్త పిలుపులు.. మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా.. ఎన్నో ప్రార్థనలు చేశా.. చివరకు నా కోరిక ఫలించిందని.. చిన్నారికి కిక్స్ కొత్త అనుభూతిని ఇస్తున్నాయని.. ఇంతకుముందు ఎప్పుడూ లేని సరికొత్త భావనను అనుభవిస్తాను అని పంచుకుంది.

Hero Yash: ఎన్టీఆర్ తల్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కేజిఎఫ్ హీరో.. ఏమన్నారంటే?

Hero Yash: కేజిఎఫ్ చిత్రం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు యశ్ గురించి అందరికీ సుపరిచితమే.ఈ చిత్రం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ఈయన ఈ సినిమాతో హీరోగా మారి పోయారు.ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని తెరకెక్కించారు.

Hero Yash: ఎన్టీఆర్ తల్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కేజిఎఫ్ హీరో.. ఏమన్నారంటే?

ఇక ఈ సినిమా దేశవ్యాప్తంగా నేడు అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యి ప్రీమియర్ షో తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందం అన్ని రాష్ట్రాల్లో పర్యటించి పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

Hero Yash: ఎన్టీఆర్ తల్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన కేజిఎఫ్ హీరో.. ఏమన్నారంటే?

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్ టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి షాలిని గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఒకరోజు ఎన్టీఆర్ తన ఇంటికి డిన్నర్ కు తనను ఆహ్వానించారని ఆరోజు ఎన్టీఆర్ కుటుంబం తనకిచ్చిన ఆతిథ్యం తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని వెల్లడించారు.

తనతో మంచి అనుబంధం ఉంది…

ఇక ఎన్టీఆర్ తల్లి గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ తల్లి షాలిని స్వస్థలం కనడ కావడంతో తనతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. తను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని, తనది చాలా మంచి హృదయమని, నన్ను కూడా ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా ట్రీట్ చేశారని యశ్ ఎన్టీఆర్ తల్లి షాలిని గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ తో కూడా తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని తెలిపారు.తను హైదరాబాద్లో షూటింగ్ లో పాల్గొంటే తప్పకుండా చరణ్ కుటుంబం నుంచి తనకు క్యారేజ్ వస్తుందని యశ్ వెల్లడించారు.

Anchor Anasuya: మరోసారి తల్లి కావాలనుకుంటున్న అనసూయ మనసులోని కోరికను బయటపెట్టిన జబర్దస్త్ యాంకర్!

Anchor Anasuya: బుల్లితెరపై జబర్దస్త్‌ అనే కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యి, ప్రస్తుతం పలు సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్. తన హావ భావాలతో, అందంతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. దీంతో భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ, ఇప్పుడు నటి గానూ మారి తన టాలెంట్‌ను నిరూపించుకుంటుంది.

Anchor Anasuya: మరోసారి తల్లి కావాలనుకుంటున్న అనసూయ మనసులోని కోరికను బయటపెట్టిన జబర్దస్త్ యాంకర్!

ఇటీవల పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన పుష్ప సినిమాలోనూ నెగెటివ్ రోల్‌లో కనిపించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కూడగట్టుకుంది. నెక్స్ట్ తీయబోయే పుష్ప పార్ట్ 2లోనూ నటించబోతున్నట్టు సమాచారం. ఈ ఒక్క సినిమా అనసూయ కెరీర్‌ను ఎక్కడికో తీసుకెళ్లి ఆమెకు ఎనలేని డిమాండ్‌ను కూడా తీసుకొచ్చింది.

Anchor Anasuya: మరోసారి తల్లి కావాలనుకుంటున్న అనసూయ మనసులోని కోరికను బయటపెట్టిన జబర్దస్త్ యాంకర్!

ఇక సినిమాల్లో అవకాశం వచ్చినా అనసూయ మాత్రం టీవీ షోలను కంటిన్యూ చేస్తుండడం విశేషం. ఎందుకంటే నటిగా కంటే ముందు నుంచీ అందరికీ సుపరిచితమైంది యాంకర్‌గానే. కాబట్టి ఎంతో పేరు తెచ్చిన యాంకర్‌ వృత్తిని ఈమె ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. దానికి తోడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ తన హాట్ పిక్స్‌తో అదరగొడుతూ భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది.ఆ ఫొటోలకు కూడా లక్షల్లో వ్యూస్ రావడం విశేషం. అయితే కొన్ని సార్లు ఆమె డ్రెస్సింగ్‌పైనా నెగెటివ్‌గా కామెంట్స్ వచ్చినా, వాటికి ధీటుగా స్పందిస్తూ సమాధానిస్తోంది అనసూయ.

కూతురు కావాలనే కోరిక…

ఇక వివరాల్లోకి వెళితే టెలివిజన్ వచ్చే ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న అనసూయ, అందర్నీ నవ్విస్తూ, నవ్వుతూ ఆకట్టుకుంటుంది. తాజాగా తాను ఓ బాధను అనుభవిస్తున్నానంటూ కన్నీటి పర్యంతమైంది. శ్రీరామ నవమి సందర్భంగా ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించే షోలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో అనసూయ ఓ పాపను ఎత్తుకొని ముద్దాడుతూ , ప్రేమగా లాలించడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆ సమయంలోనే అక్కడే ఉన్న యాంకర్ రష్మీ, అనసూయ ఎప్పటినుంచో కూతుర్ని కనాలని ఎదురు చూస్తున్నట్టు చెబుతుంది. దీంతో ఎమోషనల్ అయిన అనసూయ, తాను కచ్చితంగా కూతుర్ని కంటానని ఆశిస్తున్నట్టు చెప్పగానే, యాంకర్ ప్రదీప్ వచ్చి తథాస్తు అనడం కొసమెరుపు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే అనసూయలోని కొత్త కోణం చూసిన ఆడియెన్స్ చలించిపోతున్నారు.

Crime news: మామతో అక్రమ సంబంధం.. బండారం బయటపడుతుందని కన్న కూతురినీ హత్యచేసిన కసాయి తల్లి…!

Crime news: కన్న కూతురనే కనికరం లేదు.. మనవరాలు అనే మమకారం లేదు. తన అనైతిక సంబంధాన్ని ఎక్కక  బయటపెడుతుందో అని ఓ తల్లి కర్కషంగా ప్రవర్తించింది. భర్త తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని బరితెగించింది. సొంత కూతురునే దారుణంగా చంపేసింది. 

Crime news: మామతో అక్రమ సంబంధం.. బండారం బయటపడుతుందని కన్న కూతురినీ హత్యచేసిన కసాయి తల్లి…!

ఈ ఘటన ఖమ్మం జిల్ల బోనకల్ లో జరిగింది. ఓ మహిళ తన భర్త తండ్రితోనే అక్రమ సంబంధం నెరుపుతూ.. ఎక్కడ తమ బండారాన్ని భర్తకు చెబుతుందో అని భయపడి కన్న కూతురును కడతేర్చింది. చివరకు పోలీస్ విచారణలో నేరాన్ని అంగీకరించింది. వైరా ఏసీపీ స్నేహ మెహ్రా ఈ దారుణానికి సంబంధించి వివరాలను వెల్లడించారు. 

Crime news: మామతో అక్రమ సంబంధం.. బండారం బయటపడుతుందని కన్న కూతురినీ హత్యచేసిన కసాయి తల్లి…!

బోనకల్ కు చెందని పాలెపు హరికృష్ణ– సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. హరికృష్ణ లారీ, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరుచూ పని నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్తుంటాడు. దీంతో ఇంటి వద్ద తక్కువగానే ఉండే వాడు. ఈక్రమంలో సునీత భర్త తండ్రి నర్సింహరావుతో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. ఐదారేళ్లుగా ఇది కొనసాగుతున్నా.. ఇటీవల తల్లి-తాత ఒకే గదిలో ఉండటాన్ని గమనించింది పెద్ద కూతురు మహాదేవి(11). ఈ విషయాన్ని తండ్రికి చెబుతా  అని బెదిరించింది. దీంతో సునీత, నర్సింహారావులు ఆ మెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు.

దారుణంగా చంపి పిట్స్ తో మృతిగా స్కెచ్..

ఈ నెల 8న మహాదేవి కాళ్లు, చేతులను చున్నీతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వైరుతో మెడకు బిగించి సునీత, నర్సింహారావులు హతమర్చారు. పాప స్కూల్ లో పిట్స్ వచ్చి చనిపోయిందని స్కెచ్ వేశారు. అయితే పాపమెడపై ఉన్న కమిలిన గాయాలను బంధువులు గమనించి పోలీసులకు చెప్పడంతో వారు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. మహాదేవి హత్యకు గురైనట్లు నివేదిక రావడంతో పోలీసులు బాలిక తల్లి, తాతను అదుపులోకి తీసుకుని విచారించారు. మహాదేవిని తామే హత్య చేసినట్లు సునీత, నర్సింహారావు అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు

Crime news: అనైతిక సంబంధానికి అడ్డుగా ఉందని.. తల్లిపట్ల దారుణంగా ప్రవర్తించిన కూతురు.. ఏం చేసిందంటే?

Crime news: రోజురోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. క్షణకాలం సుఖం కోసం సొంతవాళ్లనే కడతేరుస్తున్నారు. వారి బంగారు జీవితాల్లో చీకటి నింపుకుంటున్నారు. పెళ్లయి పిల్లలు ఉన్నవారు ప్రియుడి మోజులో పడి సొంత పిల్లలు, భర్తలను అత్యంత కిరాతకంగా చంపారనే వార్తలను చూస్తూనే ఉన్నాం. ఇక వావీవరసలు మరిచి విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. తమ సుఖానికి అడ్డుగా ఉన్నారని అడ్డు తొలగించుకుంటున్నారు. తాాగాజా ఇటాంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. కూతురు ప్రియుడితో కలిసి సొంత తల్లినే చంపేసింది.

Crime news: అనైతిక సంబంధానికి అడ్డుగా ఉందని.. తల్లిపట్ల దారుణంగా ప్రవర్తించిన కూతురు.. ఏం చేసిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళితే.. తన సంతోషానికి అడ్డుగా ఉందని సొంత కూతరే కన్న తల్లిని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. కర్ణాటక రాష్ట్రం తుముకూరు కొరటిగెరె పట్టణం సజ్జనర వీధిలో నివాసం సుమిత్ర(45)కు పెళ్లికాని కూతురు శైలజ ఉంది.

Crime news: అనైతిక సంబంధానికి అడ్డుగా ఉందని.. తల్లిపట్ల దారుణంగా ప్రవర్తించిన కూతురు.. ఏం చేసిందంటే?

శైలజకు సోదరుడి వరసయ్యే దూరపు బంధువు పునీత్ తో పరిచయం ఏర్పడి అనైతిక సంబంధానికి దారి తీసింంది. ఇది తెలుసుకున్న శైలజ తల్లి సుమిత్ర పునీత్ ని తమ ఇంటి వైపు రావద్దని హెచ్చరించింది. 

తల్లిని చంపి కొత్త డ్రామాకు తెరలేపింది..

తమ సంబంధానికి తల్లి అడ్డుగా ఉందని భావించిన శైలజ, తన ప్రియుడు పునీత్ తో కలిసి దారుణమైన నిర్ణయం తీసుకుంది. జనవరి 30న రాత్రి తల్లిని గొంతు పిసికి చంపేసింది. ఇంటి ముందు ఉన్న సంపులో పడేసింది. మరుసటి రోజు తల్లి అనుకోకుండా సంపులో జారి పడి చనిపోయిందని డ్రామాకు తెరలేపింది. అందరికి చెప్పి అంత్యక్రియలు కూడా జరిపింది. కొరటిగెరె పోలీసులకు ఎవరో ఈ కేసు గురించి చెప్పడంతో ఇద్దరిని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నారు. దీంతో నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.