Tag Archives: mother

Maharshi Raghava: సీనియర్ నటుడు మహర్షి ఇంట విషాదం… సంతాపం తెలియజేసిన సినీ ప్రముఖులు!

Maharshi Raghava: టాలీవుడ్ సీనియర్ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా పలు చిత్రాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మహర్షి రాఘవ తల్లి గోగినేని కమలమ్మ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

Maharshi Raghava: సీనియర్ నటుడు మహర్షి ఇంట విషాదం… సంతాపం తెలియజేసిన సినీ ప్రముఖులు!

అనారోగ్య కారణంగా కమలమ్మ బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈమెకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు రాఘవ సినీ ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్న కుమారుడు వెంకట్ ఆయన అమెరికాలో స్థిరపడ్డారు.

Maharshi Raghava: సీనియర్ నటుడు మహర్షి ఇంట విషాదం… సంతాపం తెలియజేసిన సినీ ప్రముఖులు!

బుధవారం మధ్యాహ్నం మృతి చెందిన కమలమ్మ అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఇక ఈమె మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాఘవ తల్లి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

సినిమా పేరు ఇంటిపేరుగా…

సీనియర్ డైరెక్టర్ వంశీ రూపొందించిన మహర్షి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రాఘవ ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు.ఇలా ఈ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన వరుస సినిమాల్లో నటించారు. ఇలా సుమారు 150 చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు.

Pooja Family Vacation: 13ఏళ్ల తర్వాత మమ్మీ కోసం అంత పనిచేసిన బన్నీ హీరోయిన్‌.. ఏమైందంటే..?

Pooja Family Vacation: వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్న ఫిలిం స్టార్లకు మాల్దీవులు మంచి డెస్టినేషన్ గా మారాయి. సమయం చిక్కినప్పుడల్లా చాలా మంది అక్కడికి చెక్కెస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ.. బీచ్ లో బికినీ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. ఈఫోటోలు చూసిన కుర్రాళ్ల మతులు పోయాయి. తాజాగా మరో హీరోయిన్ పూజా హెగ్డే కూడా మాల్దీవుల వెకేషన్ కు వెళ్లింది. గతేడాది నవంబర్ లో కూడా మాల్దీవులకు వెళ్లిన ఈ బన్నీ హీరోయిన్.. అప్పుడు తన బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. తన అందాలతో యూత్ ను కట్టిపడేసింది. అప్పట్లో ఈ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

Pooja Family Vacation: 13ఏళ్ల తర్వాత మమ్మీ కోసం అంత పనిచేసిన బన్నీ హీరోయిన్‌.. ఏమైందంటే..?

ప్రస్తుతం మరోసారి ఈ అమ్మడు మాల్దీవులకు వెళ్లింది. అయితే ఈసారి మాత్రం ఒంటరిగా కాదు.. తన ఫ్యామిలీతో ట్రిప్ కి చెక్కేసింది. వరసగా షూటింగ్ లకు విరామం దొరకడంతో.. వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తల్లిదండ్రులతో పాటు తన సోదరుడితో మాల్దీవుల్లో తెగ హల్చల్ చేస్తోంది ఈ బ్యూటి. 

Pooja Family Vacation: 13ఏళ్ల తర్వాత మమ్మీ కోసం అంత పనిచేసిన బన్నీ హీరోయిన్‌.. ఏమైందంటే..?

దాదాపు 13 ఏళ్ల తరువాత ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లినట్లు చెప్పింది పూజా హెగ్డే. అంటే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత మొదటి సారి అని అర్థం అవుతోంది. మాల్దీవుల్లో బోట్ వద్ద..తన తల్లిదండ్రులు, సోదరుడితో దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. 

అయితే ఓ ఆశక్తికర విషయాన్ని వెల్లడించింది పూజా. తన తల్లి బర్త్ డేని సెలబ్రేట్ చేయడానికే వెకేషన్ కి వెళ్లిందట. ఇన్స్టాగ్రామ్ లో వారి ఫోటోలను షేర్ చేస్తూ.. ఆశక్తికర విషయాలను వెల్లడించింది. తమ అమ్మ పుట్టిన రోజు మాల్దీవుల్లో సెలబ్రేట్‌ చేయాలని ప్లాన్‌ చేసింది పూజా. సింపుల్‌గానే బర్త్ డే కేక్‌ కూడా కట్‌ చేయించారు. మరోవైపు తన సోదరుడు రిషబ్‌ హెగ్డేతోనూ ఫోటోని షేర్ చేస్తూ లెస్ గో అంటూ.. కామెంట్ పెట్టింది. 

నాన్న గురించి అలాంటి కామెంట్ చేసిన పూజ..

నాజీవితంలో అత్యంత డ్రామాటిక్ పర్సన్ అంటూ కామెంట్ పెట్టింది.  ప్రస్తుతం పూజా చేతిలో చేతి నిండా సినిమాాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘రాధేశ్యాం’, ‘ఆచార్య‌ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. త్రివిక్రమ్- మహేష్ కాంబినేషన్ లో వచ్చే మరో సినిమా కూడా త్వరలో స్టార్ట్ అవ్వబోతోంది. మరోవైపు కోలీవుడ్ స్టార్ విజయ్ తో చేసిన ‘బీస్ట్’ విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో పాటు రణ్వీర్ సింగ్ తో ‘సర్కస్’ అనే సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే.

Extramarital Affair: కన్నకూతురును వదిలేసి..! మరిదితో జంపైన వదిన..! అంతే కాకుండా..

Extramarital Affair: మానవత్వం మంటకలిసిపోతోంది. క్షణకాల సుఖం కోసం వావీవరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. అక్రమ సంబంధాలతో పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. సొంత వాళ్లనే చంపుతూ బరి తెగిస్తున్నారు కొంతమంది.

Extramarital Affair: కన్నకూతురును వదిలేసి..! మరిదితో జంపైన వదిన..! అంతే కాకుండా..

తాజాగా ఇలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని.. సొంత కూతురునే కన్న తల్లి హత్య చేసింది. తన మరిదితో సంబంధం పెట్టుకుంది.  ఆ తరువాత మరో వ్యక్తిని మూదో వివాహం చేసుకుంది ఓ దుర్మార్గురాలు. తమ ఆనందానికి, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని చివరకు కడతేర్చి కటకటాలపాలైంది. 

Extramarital Affair: కన్నకూతురును వదిలేసి..! మరిదితో జంపైన వదిన..! అంతే కాకుండా..

పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడు తూత్తుకూడికి చెందిన ఓ మహిళకు వివాహమై కూతురు కూడా ఉంది. తన కూతురును వదిలి మరిదితో ముంబైకి పారిపోయింది ఆ మహిళ. అయితే అక్కడ వీరిద్దరికి ఓ కూతురు పుట్టింది. ఆతరువాత మరిది ఆమెను వదిలిపారిపోయాడు.

మంటల్లో కాలుతున్న బిడ్డను రక్షించే ప్రయత్నం..

ఇదిలా ఉంటే తన కూతురుతో చెన్నైకి వచ్చి.. అక్కడ ఓ లారీ డ్రైవర్ ను మూడో పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరికి ఓ కుమారుడు, కూతురు పుట్టారు. కొద్ది రోజుల తర్వాాత మూడో భర్తకు అనుమానం రావడంతో గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే భర్తతో ఆదివారం గొడవపడింది. అతడు చెప్పాడని నిద్రలో ఉన్న రెండో భర్తకు పుట్టిన బిడ్డపై కిరోసిన్ పోసి తగలబెట్టింది. ఆ తరువాత మంటల్లో కాలుతున్న బిడ్డను రక్షించే ప్రయత్నం చేసింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న ఆ బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న సందర్భంలో ఆమె మూడు పెళ్లిళ్ల బాగోతం బయటపడింది. దీంతో ఆమెను, మూడో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

Mother – Son: ఆస్తి కోసం కన్న తల్లిని కడతేర్చిన కొడుకు…భార్యను పుట్టింటికి పంపించి ఇలా!

Mother – Son: నవమాసాలు మోసి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన పిల్లలకు తల్లిదండ్రుల చివరి రోజులలో ఆసరాగా ఉండి వారికి జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులకు రుణ పడాల్సింది పోయి..ఆస్తి కోసం డబ్బు కోసం కన్న తల్లిదండ్రులని నిర్దాక్షిణ్యంగా చంపుతున్న ఘటనలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన సంగారెడ్డిలో వెలుగులోకి వచ్చింది.

Mother – Son: ఆస్తి కోసం కన్న తల్లిని కడతేర్చిన కొడుకు…భార్యను పుట్టింటికి పంపించి ఇలా!

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…సంగారెడ్డి జిల్లాలోని వట్‌పల్లి మండలం పోతులబోగుడా గ్రామంలో నివాసముండే మొండి మల్లమ్మ పేరు పై నాలుగు ఎకరాల పొలం ఉంది. ఈ క్రమంలోనే ఆమె కొడుకు మురళి నిత్యం తాగి వచ్చి తనకు ఆస్తి రాసివ్వాలని తన తల్లితో గొడవ పడేవాడు..

Mother – Son: ఆస్తి కోసం కన్న తల్లిని కడతేర్చిన కొడుకు…భార్యను పుట్టింటికి పంపించి ఇలా!

ఈ క్రమంలోనే తన తల్లి దగ్గర ఉన్న ఆస్తి తన సొంతం చేసుకోవాలంటే తన తల్లిని చంపడమే మార్గమని భావించిన మురళి తన భార్యను పుట్టింటికి పంపించి బుధవారం మధ్యాహ్నం బాగా తాగి వచ్చి ఎవరూ లేని సమయంలో తన తల్లి గొంతు నులిమి చంపేశాడు. అయితే తనకు ఏమీ తెలియనట్టు తన తల్లి మృతి చెందిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు.

బయటపడిన అసలు విషయం..

ఈ విధంగా తల్లి అనారోగ్యంతో మృతి చెందిందనే విషయాన్ని అందరికీ చెప్పడంతో స్థానికులు అతన్ని తీరుపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే పోలీసులకు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది. దీంతో మల్లమ్మ అల్లుడు జనార్ధన్ ఫిర్యాదు మేరకు తన కొడుకు మురళి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

Raviteja Mother: హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పై పోలీస్ కేసు నమోదు.. ఎందుకంటే?

Raviteja Mother: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే రవితేజ తల్లి పై పోలీస్ కేసు నమోదు కావడంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అసలు ఎప్పుడూ వార్తలలో కూడా వినిపించని ఈమె పై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేసారనే విషయం గురించి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.

Raviteja Mother: హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పై పోలీస్ కేసు నమోదు.. ఎందుకంటే?

ఈ క్రమంలోనే రవితేజ తల్లి రాజ్యలక్ష్మితో పాటు మర్రి పాకకు చెందిన సంజయ్ అనే వ్యక్తి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా వీరి పై పోలీసులు కేసు నమోదు చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

Raviteja Mother: హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పై పోలీస్ కేసు నమోదు.. ఎందుకంటే?

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ఉన్న సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలవ స్లూయిజ్ నిర్మాణ పనులను రవితేజ తల్లి రాజ్యలక్ష్మితో పాటు సంజయ్ అనే వ్యక్తి ఆ నిర్మాణ పనులను ధ్వంసం చేశారని పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.

అనుమతి లేకుండా ధ్వంసం చేసినందుకే..

ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను అధికారుల అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వీరు నాశనం చేయడంతో పోలీసులు పోలీస్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.రవితేజ తల్లి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మరి రవితేజ తల్లి పై పోలీస్ కేసు పెట్టడంతో హీరో రవితేజ ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు..!

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత సినిమా అవకాశాలు అందుకుని గత దశాబ్ద కాలం నుంచి దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను వివాహం చేసుకుంది. ఇలా వివాహం తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు. వివాహం తరువాత కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అదేవిధంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఘోస్ట్ అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ లో దాదాపు వారం రోజుల పాటు పాల్గొన్న కాజల్ అగర్వాల్ అనూహ్యంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే కాజల్ అగర్వాల్ ఇలా సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణం ఆమె తల్లి కాబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇలా తన గురించి వార్తలు వస్తున్నప్పటికీ కాజల్ అగర్వాల్ ఈ విషయంపై మాత్రం స్పందించలేదు. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడైనా కాజల్ అగర్వాల్ తన ప్రెగ్నెన్సీ విషయం గురించి బయట పెడతారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.

దారుణం.. తొమ్మిది నెలల కుమార్తెతో పాటు తల్లి కూడా..

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు భరించలేక కన్న కూతురితో పాటు ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో గురువారం తెల్లవారుజామున ఓ మహిళ కూతురిని నడుముకు కట్టేసి వాటర్ ట్యాంక్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన చోటుచేసుకుంది .

తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సరిత(20)కు రెండేళ్ల క్రితం మేనబావ ఎత్తరి శ్రీశైలం(25)కు ఇచ్చి పెళ్లి చేశారు. వారికి ప్రస్తుతం తొమ్మిది నెలల కుమార్తె ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. అతనపు కట్నం కావాలని ప్రతీ రోజు అత్తామామలు వేధించడం మొదలు పెట్టారు. ఈ విషయం తన భర్తకు చెప్పినా పట్టించుకోకపోవడతో పాటు తల్లికే అతడు సపోర్ట్ చేశాడు.

దీంతో ఈ కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఆమె రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు రావడంతో కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. తెలిసిన వాళ్ల దగ్గర వెతికారు. బంధువుల ఇళ్లకు ఫోన్ చేసి ఆచూకీ అడిగారు. కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. చేసేది లేక వాళ్లు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వాళ్లకు జరిగిన విషయం చెప్పారు.

వారు అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, గురువారం ఉదయం ఆ ఊరి సమీపంలోనే వాటర్ ట్యాంక్‌లో తల్లీ కూతుళ్లు మృతదేహాలను ఆ గ్రామ ప్రజలు చూశారు. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇంత బాగా చూసుకున్నావు హగ్ ఇవ్వకపోతే ఎలా.. అమ్మకు ఇప్పుడు అర్థం అవుతుంది!

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే రౌండ్ జరుగుతుంది.ఇందులో భాగంగా కంటెస్టెంట్ ల మధ్య పెద్ద ఎత్తున పోటీపడుతూ డైరెక్ట్ ఫినాలే కి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ పక్కన పెట్టి మరి పోటీపడుతున్నారు.

ఇందులో భాగంగా మొదటి రౌండ్ ఐస్ లో నిలబడుతూ బాల్స్ పట్టుకుంటూ పక్కవారివి లాక్కోవాలని బిగ్ బాస్ సూచించారు. ఈ రౌండులో సిరి ఎక్కువ సేపు నిలబడటం వల్ల తన పాదాలకు నొప్పి కలగటంతో మెడికల్ రూమ్ కి వెళ్లి కట్లు కట్టించుకుంది.ఇలా తన పాదాలకు బ్యాండేజ్ వేయటం వల్ల తను ఎక్కడికి నడవలేని పరిస్థితికి వెళ్ళింది.

ఈ క్రమంలోనే సిరి బెడ్ కు పరిమితం కావడంతో షణ్ముఖ్ ఆమెకు సేవలు చేస్తున్నాడు. ఇలా షణ్ముఖ సేవలు చేయడంతో తనకు హగ్ ఇవ్వమని సిరి అడిగింది. సిరి అలా అడగగానే కాస్త తడబడిన షణ్ముఖ కెమెరాల వైపు చూస్తూ ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ తనని గట్టిగా కౌగలించుకుంది. ఇక సిరి కెమెరాల వైపు చూస్తూ నన్ను తను చాలా బాగా చూసుకుంటున్నాడు ఇవ్వకపోతే ఎలా అంటూ చెప్పుకొచ్చింది.

ఇప్పుడు మన గురించి మా అమ్మకు కూడా అర్థమవుతుందని సిరి తనలో తానే అనుకుంది. ఇలా సిరి, షణ్ముఖ్ హగ్ చేసుకోవడంతో అది చూసిన పింకీ తనకు కూడా హగ్ కావాలని మానస్ ను అడుగుతుంది. అయితే మానస్ తన మాటలు పట్టించుకోడు. టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లో మూడు ఛాలెంజ్‌లు పూర్తయ్యే సరికి తక్కువ పాయింట్లు ఉన్న కాజల్‌, ప్రియాంక రేసు నుంచి తప్పుకున్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు మరి ఫినాలేకి మొదటగా ఎవరు అడుగు పెడతారో తెలియాల్సి ఉంది.

ఆమెకు అమ్మగా నటించనని తెగేసి చెప్పేసా: నటి సుధ

ప్రొడక్షన్‌కు సంబంధించి వేరే వాళ్లకు అగ్రిమెంట్ అయిన తర్వాత అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం అనేది ఒక రెండు, మూడు సినిమాలకు జరిగిందని ప్రముఖ నటి సుధ తెలిపారు. అలాంటి వాటిలో ఒకటి నితిన్ ఫాదర్ సుధాకర్‌ రెడ్డి గారికి తానింకా అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఆయన ఒక క్యారెక్టర్‌ కోసం తనకు చెప్పినపుడు ఒక యాక్టర్‌కు ఉన్న ప్రాబ్లమ్ వల్ల ఒక ఇష్యూ అయిందని ఆమె తెలిపారు.

ఆ యాక్టర్‌ పేరు తాను చెప్పనన్న సుధ, ఆవిడకు మదర్ క్యారెక్టర్ చేయమని తనను అడిగినట్టు ఆమె వివరించారు. ఇప్పటివరకు చాలా మంది అగ్ర హీరోలకు మదర్‌గా నటించాను. అలా వాళ్లకు మదర్‌గా నటించానని చెప్పినపుడు ఒక రెప్యుటేషన్ ఉండేది. కానీ ఈ ఆర్టిస్ట్‌కు మదర్‌గా చేశానంటే మాత్రం తాను చెప్పుకోలేనని ఆమె చెప్పినట్టు సుధ స్పష్టం చేశారు.

లేదంటే మా ఇద్దరినీ పిలిపించి అడగండి. ఆవిడ ఒప్పుకుంటానంటే తాను మదర్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంటానని ఆమె అన్నట్టు వివరించారు. ఒక వేళ ఆమె ఒప్పుకోకపోతే ఎవరు చేసింది ఒప్పో తెలుస్తుంది అని వారు అన్నట్టు ఆమె తెలిపారు. ఆ తర్వాత వాళ్లు ఏదో మాట్లాడుతూ ఆ ఆర్టిస్ట్‌ను అడిగారట. మీ క్యారెక్టర్ తనకిచ్చి, మదర్ క్యారెక్టర్‌ను సుధ గారికి ఇద్దామనుకుంటున్నాం. ఏమంటారు అని అన్నారట. అప్పుడు తను ఆవిడ నాకు మదరా ? అలాగైతే నేను ఆ సినిమానే చేయనండి అన్నారట. అలా ఆ క్యారెక్టర్‌ చేయకుండా అలానే మిగిలిపోయిందని, ఆ అడ్వాన్స్‌ కూడా అలానే ఉందని సుధ స్పష్టం చేశారు. అది ఏదో ఒక రోజు వారికి ఇచ్చేస్తానని కూడా ఆమె చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత కూడా ఆ అడ్వాన్స్ పంపిస్తానని అన్నా, ఆయన మాత్రం మీ దగ్గరే ఉంచండి. మళ్లీ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా అవసరం వస్తుందని ఆయన అన్నట్టు ఆమె వివరించారు. ఒక వేళ ఆ ఆర్టిస్ట్‌కి గనక మదర్‌గా చేసి ఉంటే అందరూ తనను ఆమెకు మదర్ క్యారెక్టర్‌ ఎందుకు చేశావు అని అడుగుతారని సుధ అన్నారు.

గేమ్ గేమ్ లా చూడండి.. సిరికి వార్నింగ్ ఇచ్చిన షణ్ముఖ్ తల్లి !

బిగ్ బాస్ అంతా గత రెండు మూడు రోజుల నుంచి ఫ్యామిలీ మెంబర్స్ తో కళకళలాడుతోంది. ఎమోషన్స్ తో పాటు ఉప్పోంగిపోతోంది. తమ ఫ్యామిలీ మెంబర్స్ ను చూసి సంతోషంలో తేలిపోతున్నారు. హౌస్ అంతా ఎప్పుడూ గొడవలు, చిరాకులతో నిండిపోయేది.. ఇప్పుడు భావోద్వేగంతో నిండిపోతోంది.

ఇక మొదటి రోజు హౌస్ లో శ్రీరామచంద్ర ఫ్యామిలీ, కాజల్ ఫ్యామిలీ, సన్నీ ఫ్యామిలీ మెంబర్స్, మానస్ ఫ్యామిలీ, సిరి ఫ్యామిలీలు రాగా.. రెండో రోజు యాంకర్ రవి, ప్రియాంక సింగ్ మరియు షణ్ముఖ్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చారు. ఏ తప్పు చేస్తున్నారో ఇన్ డైరెక్ట్ గా చెబుతూ.. ఆటపై ఫోకస్ పెట్టండి అంటూ చెప్పారు. ఇక ప్రియాంక కోసం తన సోదరి మధు వచ్చింది.

వచ్చిరాగానే మానస్ కు సారీ అండీ అని చెప్తుంది. ఆమె అతడికి సారీ ఎందుకు చెప్పిందో ఇంట్లో ఉన్న వాళ్లకు ఏమి అర్థం కాలే కానీ.. ఆమె అలా చెప్పడానికి గల కారణం ఉంది. ప్రియాంక సింగ్ కు సపోర్ట్ ఇవ్వడం.. ఇక ఆ ఇష్టం అనేది వేరే విధంగా పోతుండటంతో.. ప్రియాంకకు ఆమె సోదరి వార్నింగ్ ఇస్తూ.. ఆటపై ఫోకస్ పెట్టు అంటూ పరోక్షంగా చెప్పింది.

దానిని దృష్టిలో ఉంచుకొని ఆమె మానస్ కు సారీ చెప్పింది. ఇక షణ్ముఖ్ విషయానికి వస్తే.. వాళ్ల అమ్మ హౌస్ లోకి వచ్చారు. వేరే వాళ్ల కోసం ఆట ఆడోద్దు.. ట్రిప్ అవ్వోద్దు.. నీ ఆటపై దృష్టి పెట్టు అంటూ ఆమె సలహా ఇచ్చారు. ఇక గేమ్ గేమ్ లా చూడు.. ఎక్కువ ఎమోషనల్ అవ్వొద్దు అంటూ ఆమె చెప్పారు. ఇక ఒకే దగ్గర కూర్చోకు.. అందరితో కలిసి మాట్లాడు అని తన కొడుకు షణ్ముఖ్ కు సలహా ఇస్తుంది.