Tag Archives: Murali Mohan

Murali Mohan: ఆమె శ్రీదేవిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు… మురళీమోహన్ కామెంట్స్ వైరల్!

Murali Mohan: మురళీమోహన్ తెలుగు చిత్ర పరిశ్రమంలో సీనియర్ నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ఇప్పటికీ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తే సందడి చేస్తున్నారు. అయితే ఈయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించారు.కేవలం హీరోగా మాత్రమే కాకుండా పలు సినిమాలలో సహాయ నటుడి పాత్రలలో నటించారు అలాగే నిర్మాతగా కూడా వ్యవహరించారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో అనంతరం రాజకీయాలలోకి వచ్చి కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తనకు సినిమాలే కరెక్ట్ అని భావించిన మురళీమోహన్ ఇప్పటికీ సినిమాలలో కొనసాగుతున్నారని ఇకపై తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మురళీమోహన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.ఇండస్ట్రీలో తనను అందరూ శ్రీరామచంద్రుడు అని భావించేవారు. ఇక ఇదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీలో మీరు మాత్రమే శ్రీరామచంద్రుడు అంటూ తనకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారని తెలిపారు.తన గురించి ఇండస్ట్రీలో ఇలాంటి అభిప్రాయం ఉండడంతో శ్రీదేవి తల్లిగారు ఏకంగా తనకు అల్లుడుగా చేసుకోవాలని భావించారని ఈయన తెలిపారు.

Murali Mohan: అమ్మాయి సంతోషంగా ఉంటుందని…


ఆమె తనని చూసి చాలా మంచివాడు గుణవంతుడుగా ఉన్నారని ఇలాంటి అబ్బాయికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే తన కూతురు చాలా సంతోషంగా ఉంటుందని భావించి ఏకంగా శ్రీదేవితో నాకు పెళ్లి చేయాలని చూశారు అంటూ ఈ సందర్భంగా మురళీమోహన్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Murali Mohan: సొంతూరులో ఉన్న ఇంటి కోసం కోట్లు ఖర్చు చేస్తున్న మురళీమోహన్.. ఎందుకో తెలుసా?

Murali Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన కేవలం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలోకి వచ్చి ఎంపీగా బాధ్యతలు చేపట్టారు. ఇలా రాజకీయాలలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మురళీమోహన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇకపోతే తాజాగా మురళీమోహన్ తన సొంత గ్రామంలో ఉన్న ఇంటిని కోట్ల రూపాయలు ఖర్చు చేసి రీ మోడలింగ్ చేయిస్తున్నారు. మురళీమోహన్ ఏలూరు జిల్లా చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఇక్కడ ఈయన తాతల కాలం నాటి ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. అప్పట్లో ఇటుకలు మట్టితో నిర్మించిన ఈ ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో మురళి మోహన్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ఇంటి నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేకుండా రీ మోడలింగ్ చేస్తున్నారు.

కన్నతల్లిని పుట్టిన ఊరుని ఎప్పుడు మర్చిపోకూడదు అనే విషయాన్ని మదిలో ఉంచుకున్నటువంటి మురళీమోహన్ తన సొంత ఊరిలో ఉన్నటువంటి తన తాతల కాలంనాటి ఇంటిని రీ మోడలింగ్ చేస్తున్నారు. అయితే ఇదివరకు ఈ ఇంట్లో గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ప్రాథమిక వైద్యశాల ఉండేది. అయితే ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో వైద్యశాలను అక్కడి నుంచి తొలగించారు.

Murali Mohan: గ్రామ ప్రజల అవసరాలకే ఉపయోగిస్తాను..

ఇక ఈ ఇంటి గురించి మురళీమోహన్ మాట్లాడుతూ తాను ఇదే ఇంటిలో పుట్టి పెరిగానని ఈ ఇంటిలోనే తన విద్యాభ్యాసాలు పూర్తి అవ్వడమే కాకుండా తన వ్యాపారాలు కూడా ఈ ఇంటి నుంచి ప్రారంభమయ్యాయని తెలిపారు.ఈ ఇల్లు నిర్మించి దాదాపు 98 సంవత్సరాలు అవుతుంది అయితే శిథిలావస్థకు చేరుకుంటున్న ఈ ఇంటిని తిరిగి అదే రూపురేఖలతో రీ మోడలింగ్ చేయిస్తున్నానని తెలిపారు.ఇలా ఈ ఇల్లు రీ మోడలింగ్ పూర్తి అయిన తర్వాత ఈ ఇంటిని గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ఉపయోగిస్తానని ఈ సందర్భంగా మురళీమోహన్ తెలియజేశారు.

Murali Mohan – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిరంజీవిలా కాదు.. ఖచ్చితంగా పవన్ ముఖ్యమంత్రి అవుతారు : మురళీమోహన్

Murali Mohan – Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మురళీమోహన్ గత కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా సినిమాల గురించి రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ జనసేన పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశిస్తూ కొందరు రాజకీయాలలోకి వస్తారు అయితే రాజకీయాలలో రాణించడం చేత కాకపోతే వెనక్కి వెళ్తారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు తనకు గెలుపు వచ్చిన ఓటమి వచ్చిన పార్టీని నమ్ముకుని కష్టపడుతున్నారు.

నా అంచనాల ప్రకారం పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని అయితే ఎప్పుడు అవుతారు అనేది తెలియకపోయినా ఈయన మాత్రం కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని మురళీమోహన్ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి, ఆయన రాజకీయ జీవితం గురించి జోక్యం చెప్పారు. ఈ క్రమంలోనే మురళీమోహన్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

పవన్ రాజకీయ జీవితంపై జోస్యం చెప్పిన మురళీమోహన్…

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినప్పుడు మా సినిమా పరిశ్రమ నుంచి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారని చాలా గర్వంగా ఫీల్ అవుతామని మురళీమోహన్ తెలిపారు. రాజమహేంద్రవరం నుండి తాను బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీమద్దతు తెలిపి తన తరపున ప్రచారం చేశారని ఈ సందర్భంగా మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు.

Uday Kiran: చిరంజీవి ఉదయ్ కిరణ్ ను ఫ్యామిలీలో కలుపుకుందాం అనుకున్నాడు కానీ.. షాకింగ్ కామెంట్స్ చేసిన మురళీమోహన్..

Uday Kiran: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒక ఏడాదిలోనే ఏకంగా బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలలో నటిస్తూ హిట్ కొట్టిన వారిలో హీరో ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయన స్టార్ డమ్ చూసి అగ్ర హీరోలు దర్శక నిర్మాతలు సైతం ముక్కున వేలు వేసుకున్నారు. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా బ్యానర్లన్నీ కూడా ఉదయ్ కిరణ్ కోసం క్యూలో నిలబడ్డాయి.

ఈ విధంగా ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో స్టార్ హీరో అయ్యారు. అయితే ఈయన ఎంత తొందరగా స్టార్ డమ్ సంపాదించుకున్నారో అంతే తొందరగా తన కెరీర్ కు ఫుల్ స్టాప్ కూడా పెట్టారు. ఇలా వరుస సినిమాలకు కమిట్ అవ్వడంతో ఈయన సినిమాలు సక్సెస్ కాక సతమతమయ్యారు. చివరికి అవకాశాలు కూడా లేకపోవడంతో ఎంతో ఆందోళనకు గురై ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా సీనియర్ నటుడు నిర్మాత మురళీమోహన్ ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ కు చిరంజీవికి మధ్య ఉన్న రిలేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అయితే ఉదయ్ కిరణ్ కు హైపర్ టెన్షన్ ఎక్కువ. ఒక్కోసారి విపరీతమైన బిపి వస్తుంది ఆ టైంలో ఆయన తన కంట్రోల్లో ఉండరు. అలాంటి సమయంలో సిచువేషన్ కూడా బ్యాలెన్స్ చేయలేకపోయారు.

ఉదయ్ కిరణ్ హైపర్ టెన్షన్ తో బాధపడుతూ కంట్రోల్ తప్పేవారు…

ఇలా బాధపడుతున్న ఉదయ్ కిరణ్ ను మేము హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపించగా డాక్టర్ మీరు ఇలా ఆవేశ పడకూడదు ప్రశాంతంగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పారు. అప్పటికి సరే అని చెప్పిన ఉదయ్ కిరణ్ యధావిధిగా హైపర్ టెన్షన్ తో బాధపడేవారు. ఇకపోతే ఇండస్ట్రీలో చిరంజీవి ఎవరైనా ఒక హిట్ సినిమాలో నటిస్తే వారికి ఫోన్లు చేసి అభినందించడం ఆయన లక్షణం.ఈ క్రమంలోనే అప్పట్లో ఉదయ్ కిరణ్ మంచి సినిమాలు చేయడంతో తరచూ ఉదయ్ కిరణ్ ను అభినందించడమే కాకుండా ఆయనని తన ఇంటి అల్లుడిగా చేసుకోవాలని కూడా భావించారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ప్రకటన వెలబడటమే కాకుండా తన కూతురితో నిశ్చితార్థం కూడా జరిపించారు.అయితే ఏమైందో తెలియదు కానీ ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వటమే కాకుండా ఉదయ్ కిరణ్ సినిమాలో కూడా ఫ్లాప్ అవుతూ చివరికి అవకాశాలు లేకపోవడంతో అతను కూడా డిస్టర్బ్ కావడం వల్లే అలా సూసైడ్ చేసుకున్నారేమో అంటూ మురళి మోహన్ తెలిపారు. ప్రస్తుతం మురళీమోహన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Murali Mohan: ఆ సినిమా బడ్జెట్ మా కంట్రోల్ లో లేకుండా పోయింది.. మహేష్ సినిమాపై మురళీమోహన్ కామెంట్స్!

Murali Mohan:టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఎన్నో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు సంపాదించారు.

Murali Mohan: ఆ సినిమా బడ్జెట్ మా కంట్రోల్ లో లేదు.. మహేష్ సినిమాపై మురళీమోహన్ కామెంట్స్!

ఈ విధంగా వ్యాపార రంగంలో ఎంతో మంచి గుర్తింపు పొందిన మురళీమోహన్ నిర్మాతగా సొంత బ్యానర్ ఏర్పాటు చేసి తన బ్యానర్ లో సుమారు 25 చిత్రాలను తెరకెక్కించారు.ఈ విధంగా తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు 75శాతం మంచి విజయాలను అందుకున్నాయని మురళీమోహన్ వెల్లడించారు.

Murali Mohan: ఆ సినిమా బడ్జెట్ మా కంట్రోల్ లో లేదు.. మహేష్ సినిమాపై మురళీమోహన్ కామెంట్స్!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఈ క్రమంలోని సినిమాలలో కొనసాగుతూనే నిర్మాతగా అడుగు వేయడం ఎంతవరకు సబబు అని ఆలోచించి నిర్మాణ రంగం వైపు వచ్చామని వెల్లడించారు. అయితే తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు 75% మంచి విషయాలను అందుకున్నాయని మురళీమోహన్ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.

సినిమాలకు విరామం ఇచ్చాము…

ఇకపోతే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు సినిమాని కూడా మురళీమోహన్ తన సొంత బ్యానర్ లో నిర్మించారు. అయితే ఈ సినిమా అతనికి నష్టాలను తేవటం వల్లే అనంతరం తన బ్యానర్లో సినిమాలు చేయలేదని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వార్తలపై స్పందించిన మురళీమోహన్ క్లారిటీ ఇచ్చారు. అతడు సినిమా తనకు ఎలాంటి నష్టాలను తేలేదని అయితే ఈ కథ విన్న తర్వాత బడ్జెట్ ఎక్కువ అవుతుందని ముందుగానే భావించాము. అయితే తన బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలన్నీ కూడా ఫలానా టైంకు షూటింగ్ పూర్తి కావాలి అనుకున్న తేదీకే విడుదల కావాలని ఉంటుంది. ఈ సినిమా ఆరు నెలలలో పూర్తి అవుతుంది అనుకుంటే సంవత్సరం సమయం పట్టిందని, బడ్జెట్ కూడా మా కంట్రోల్ తప్పిందని మురళీమోహన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత సినిమాలలో నష్టాలు రావడం వల్ల సినిమాలు చేయడం మానేయలేదు కానీ వ్యాపార రంగంలో బిజీ కావడం వల్లే సినిమాలకి కొన్ని రోజులు విరామం ఇచ్చామని ఈ సందర్భంగా మురళీమోహన్ వెల్లడించారు.

Murali Mohan: ‘మా’ బిల్డింగ్ కట్టాలనుకున్నాం కానీ కుదరలేదు.. సొంత డబ్బులతో విష్ణు కడతా అన్నాడుగా కడతాడో లేదో చూద్దాం : మురళి మోహన్

Murali Mohan: మురళీమోహన్ నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.ఇలా ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగిన మురళీమోహన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు.

Murali Mohan: మా ప్రెసిడెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మురళీమోహన్.. మా బిల్డింగ్ కొడతాడో లేదో చూద్దాం!

ఈ క్రమంలోనే మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంది అవార్డుల గురించి ప్రస్తావించారు. నంది అవార్డుల విషయంలోఇప్పటికీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయంలేదని ఇది పూర్తిగా కమిటీ మెంబర్స్ సూచించిన విధంగా అవార్డులను ప్రకటిస్తారని మురళీమోహన్ వెల్లడించారు.

Murali Mohan: మా ప్రెసిడెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మురళీమోహన్.. మా బిల్డింగ్ కొడతాడో లేదో చూద్దాం!

అదేవిధంగా మురళీమోహన్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తాను అయ్యప్ప మాల దీక్ష తీసుకోవడం గురించి వెల్లడించారు.ఇప్పటివరకు తాను ముప్పై మూడు సార్లు అయ్యప్ప మాల దీక్ష తీసుకున్నానని ఇంకా మూడుసార్లు తీసుకోవాల్సి ఉందని ఆయన వెల్లడించారు. తనకు చిన్నప్పటి నుంచిఎక్కువ భక్తి ఉండటం వల్ల ప్రతి రోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా పూజ చేసుకునే వెళ్తానని ఈ సందర్భంగా మురళీ మోహన్ తెలిపారు.

మా అసోసియేషన్ అప్పుడు జీరో…

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మా బిల్డింగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు. మేము మా అసోసియేషన్ స్థాపించినప్పుడు జీరో. “మా” నుంచి మేము వైదొలగినప్పటికి మూడు కోట్ల రూపాయల మూలధనం సేకరించి పెట్టామని, మా తర్వాత వచ్చిన వారు కూడా కొంత డబ్బు సమకూర్చారని ఈ సందర్భంగా మురళీమోహన్ తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఉన్న మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గురించి కూడా మురళీమోహన్ మాట్లాడారు. మేము మా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో మా బిల్డింగ్ కట్టాలని చాలా ప్రయత్నాలు చేశాము. కానీ కుదరలేదు అయితే ప్రస్తుతం ఉన్న మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఎన్నికల సమయంలోనే మా బిల్డింగ్ కట్టిస్తానని మాట ఇచ్చారు. అది కూడా తన సొంత డబ్బులతో కడతాం అని మాట ఇచ్చారు. చాలా సంతోషం అంటూ మురళీమోహన్ మా ప్రెసిడెంట్, మా బిల్డింగ్ గురించి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించారు.

ఎన్టీఆర్ ను నమ్మించి మోసం చేశారు.. ఆ రోజు రాత్రి అలా జరగటంతో నా కడుపు మండిపోయింది: మురళీమోహన్

తెలుగు సినీ నటుడు, రాజకీయ నేత మురళీమోహన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న వ్యక్తి. ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో నటిస్తున్నారు. దాదాపు 350 సినిమాలలో నటించారు. ఈయన 2015 వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా కూడా బాధ్యతలు చేపట్టారు.

ఈయన తెలుగుదేశం తరపున రాజమండ్రి నియోజకవర్గం నుండి 2014 లోక్ సభలో ఎన్నికయ్యారు. సొంతంగా జయభేరి అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో సినిమాలను నిర్మించారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ గురించి పలు కీలక విషయాలు తెలిపారు.

తమ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తారని కానీ ఎన్టీఆర్ మాత్రం తమకు అభిమాన నాయకుడని అందుకే తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. ఎన్టీఆర్ ఎంతో శక్తివంతురాలైనా ఇందిరాగాంధీని ఎదిరించి మరీ గెలిచారని తెలిపారు. ఎన్టీఆర్ హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లి ఆపరేషన్ చేయించుకొని తిరిగి వచ్చిన రోజున 50, 60 మంది సినిమా ప్రముఖులతో పాటు ఎంతోమంది అభిమానులు ఎయిర్ పోర్ట్ లో ఎదురు చూశామని తెలిపారు.

ఇక ఎన్టీఆర్ అందర్నీ చూసి చాలా సంతోషపడ్డారని తమ దగ్గరికి వచ్చి పలకరించారని తెలిపారు. ఆ తరువాత ఎన్టీఆర్ ఓ రోజు రాత్రి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అక్కడ అందరితో కాసేపు సరదాగా మాట్లాడుకున్నారని తెలిపారు. ఆరోజు రాత్రి 11 గంటల వరకు అలా జరిగిందని ఇక హోటల్ కు వెళ్లి పడుకున్నామని తెలిపారు. మరుసటి రోజు ఉదయాన్నే మద్రాస్ కు వెళ్లాక రాత్రి జరిగిన ప్రోగ్రాం గురించి మాట్లాడుకున్నామని అప్పుడు రామారావు గారు అసలు విషయం చెప్పారని తెలిపాడు. ఆ విషయం చెప్పడంతో తనకు కడుపు మండిపోయిందట. నటులు కంటే గొప్పగా రాజకీయ నాయకులు నటిస్తున్నారని రాత్రి ఏమి తెలియని వారిగా అందరితో బాగా ఉన్నాడని తెల్లారేసరికి తనను ముఖ్యమంత్రిగా దించేసారని చెప్పడంతో కడుపు మండిందని తెలిపారు. ఇక వెంటనే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మొత్తం ప్రచారం చేశామని తెలిపారు. ఆ తరువాత నెల రోజులకే ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారని తెలిపారు మురళీమోహన్.

ఆ సినిమాతో కొన్ని కోట్లు నష్టపోయా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మురళీమోహన్..

మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమా కథానాయకుడిగా.. జయభేరి గ్రూపు అధిపతిగా.. 2014 లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుంచి గెలిచి ఎన్నో మైలురాళ్లు దాటాడు. తాజాగా అతడు ఓ యూట్యూబ్ చానల్ ఇటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

అవేంటంటే.. మొదటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరిక బలంగా అతడతికి ఉండేదట. తన తండ్రి పాలిటిక్స్ లో ఉండటంతో ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో వర్కింగ్ పార్టనర్ గా వర్క్ చేసేందుకు ఆఫర్ రాగా.. నెలకు రూ.100 జీతం.. లాభాల్లో వాటా కూడా ఇచ్చినట్లు చెప్పాడు. అదే కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పాడు. అందులోనే 10 ఏళ్ల చేసినట్లు చెప్పాడు. అందులో దాదాపు 50 శాతం షేర్ కూడా తెచ్చుకున్నాడట. హీరోగా అతడికి ఆఫర్ రాగా.. వెళ్లినట్లు చెప్పాడు. 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమేమాయ చిత్రంతో సినిమా రంగ ప్రవేశం చేసినట్లు చెప్పాడు.

తర్వాత రెండో సినిమాకు సంవత్సరం వెయిట్ చేశానని.. తర్వాత దాసరి నారాయణరావు 1974లో తీసిన తిరుపతి సినిమాతో చేసిన తర్వాత మంచి గుర్తింపు వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. తర్వాత దాసరి సినిమాల్లోనే ఎక్కువగా నటించినట్లు పేర్కొన్నాడు. ఈ మధ్యలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి ఛైర్మన్‌గా వ్యవహరించినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఒక సినిమా హిట్ అయితే అందరూ ఆనందాలను పంచుకుంటారు.. ఒక వేళ ఫెయిల్ అయితే మాత్రం నిర్మాతమీదనే ఎక్కువగా తోసేస్తున్నట్లు చెప్పాడు.

మణిరత్నం సినిమా అయిన ‘ఇద్దరు’ సినిమాలో కరుణానిధి,  ఎంజీఆర్ కు సంబంధించిన సినిమా అని.. అందులో కరుణానిధి క్యారెక్టర్ ను నెగెటివ్ గా.. ఎంజీఆర్ క్యారెక్టర్ ను పాజిటివ్ గా తీశారు. అందులో తమిళనాడులో కరుణానిధి అధికారంలోకి రావడంతో.. ఆ సినిమాలో చాలాసీన్లు కట్ చేసినట్లు చెప్పాడు. దీంతో ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయిందని.. అప్పటి వరకు సంపాదించిన సంపద అంతా పోయిందని చెప్పాడు మురళిమోహన్.

అప్పట్లో మురళీమోహన్, జయచిత్ర లకు ఒక పాపులర్ దినపత్రిక పెళ్లి చేసిందని మీకు తెలుసా ?!

గత కొన్ని దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో మురళీమోహన్, జయచిత్రకు ఎంతో క్రేజ్ ఉండేది. వీరిద్దరు జంటగా ఎన్నో సినిమాలలో కలిసి నటించడంతో ఈ జంట ఎంతో పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ జంట బయట కనిపిస్తే చాలు వీరిపై ఎన్నో పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎక్కడ చూసిన ఈ జంట కనిపించడంతో వీరిపై అనుమానాలు మరింత బలపడ్డాయి.

షూటింగ్ నిమిత్తం మద్రాసులోని వాహినీ స్టూడియోకి మురళీమోహన్ వెళ్లగానే అక్కడున్న వారందరూ అతనిని చూసి “ఇవ‌ర్‌దా (ఇత‌నే) మురళీమోహన్” అని అనుకుంటున్నారు.అయితే వాళ్లు అందరూ తన గురించి అలా ఎందుకు అంటున్నారో అర్థం కాక మురళీమోహన్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే షూటింగ్ నిమిత్తం సెట్లోకి అడుగు పెట్టగానే సహ నటీనటులు మొత్తం నిజం చెప్పు.. నువ్వు జయ చిత్రను పెళ్లి చేసుకుంటున్నావా? అని అడిగారు.. అందుకు మురళీమోహన్ స్పందిస్తూ నేను జయచిత్రను పెళ్లి చేసుకోవడం ఏంటి?నాకు ఇదివరకే పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారని సమాధానం చెప్పాడు.

అదే విధంగా మురళీమోహన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి అట్లూరి పూర్ణ‌చంద్ర‌రావు షూటింగ్ లొకేషన్ కి వచ్చి, “బాబూ నీతో ఓసారి మాట్లాడాలి. బ‌య‌ట‌కు రా” అని పిలవగానే మురళీమోహన్ ఎందుకో డౌట్ పడుతూ అతని దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలోనే మురళీమోహన్ తో మాట్లాడుతూ ఈ రోజు పేపర్లో వచ్చింది చూసావా.. నువ్వు, జయచిత్ర పెళ్లి చేసుకోబోతున్నారట నిజమేనా? నువ్వు తప్పు చేయవనే నమ్మకం నాకు ఉంది ఒకవేళ తప్పటడుగులు వేస్తున్నవేమో నిన్ను హెచ్చ‌రిద్దామ‌ని వ‌చ్చాను.” అన్నారు.

అప్పుడు మురళీమోహన్ అలాంటి తప్పు నేను ఎప్పుడు చేయను.. ఒకరి దగ్గర తలదించుకునే అవకాశాన్ని రానివ్వనని చెప్పడంతో పూర్ణచంద్రరావు ఎంతో సంతృప్తి చెందాడు. ఇలా పేపర్లో ఆ వార్త రావడంతో ఎంతో బాధ పడిన మురళీమోహన్ ఆ వార్త రాసినటువంటి ఎంతో పాపులర్ అయిన దిన‌తంతి అనే డైలీ పేప‌ర్‌. ఫ్రంట్ పేజీలోనే ప్ర‌ముఖంగా ఆ వార్త‌ను వేశారు. దీంతో ఆ దినపత్రికకు మురళీమోహన్ లీగల్ నోటీసులు పంపడంతో సదరు దినపత్రిక ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ వార్తలు రాయడం చేత తిరిగి మురళీమోహన్ కు క్షమాపణలు చెప్పింది.

అయితే ఒక రోజు షూటింగ్ నిమిత్తం దాసరి నారాయణరావుతో కలిసి మురళీమోహన్, జయచిత్ర ఓకే ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి అదే దినపత్రిక అప్పుడు మేము చెప్పినది నిజమే.. దాసరి నారాయణ రావు సమక్షంలో మురళీమోహన్, జయచిత్ర పెళ్లి హైదరాబాద్లో జరగనుందని మళ్లీ అదే పేపర్లో వచ్చింది. నిజానికి దాసరి నారాయణరావు అక్కినేని గారికి కథ చెబుదామని హైదరాబాద్ వచ్చారు. మురళీమోహన్ వడ్డే రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కోసం వచ్చారు. అలాగే జయచిత్ర కూడా వేరే సినిమా షూటింగ్ కోసం వచ్చారు.ఈ విధంగా వేరువేరు పనుల నిమిత్తం ఓకే ఫ్లైట్లో ఈ ముగ్గురు రావడం చేత దిన‌తంతి అనే దినపత్రిక మురళీమోహన్ , జయచిత్రకు ఏకంగా పెళ్లి కూడా చేశారు.

మురళీ మోహన్ కుటుంబానికి భారీ ఊరట

మాజీ ఎంపీ,జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్ మురళీమోహన్ ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనను మోసం చేశారని ఓ భూయజమాని ఇచ్చిన ఫిర్యాదుతో మురళీమోహన్.. అతని కుటుంబ సభ్యులను ఎపీ సీఐడీ కేసు నమోదు చేసింది. తర్వాత విచారణకు రావలంటూ 41A సెక్షన్ కింద నోటీసు జారీ చేసింది. దీంతో సీఐడీ నోటీసులపై ఏపీ హైకోర్టులో క్వ్యాష్ పిటీషన్ వేశారు మురళీ మోహన్. జయభేరి ప్రాపర్టీస్ తరుపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్.. సివిల్ వివాదాన్ని క్రిమినల్ వివాదంగా మారుస్తున్నారని సీఐడీ ప్రవర్తనను తప్పుబడుతూ అభ్యత్రం వ్యక్తం చేశారు.

ఈ వాదనలు విన్న ఏపీ హైకోర్డు ఈ కేసులో సంబంధించిన తదనంతర చర్యలు నిలిపివేయాలంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నిర్ణయంతో మురళీ మోహన్ కుటుంబానికి ఊరట లభించినట్లైంది.