Murali Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన కేవలం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలోకి వచ్చి ఎంపీగా బాధ్యతలు చేపట్టారు. ఇలా రాజకీయాలలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మురళీమోహన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇకపోతే తాజాగా మురళీమోహన్ తన సొంత గ్రామంలో ఉన్న ఇంటిని కోట్ల రూపాయలు ఖర్చు చేసి రీ మోడలింగ్ చేయిస్తున్నారు. మురళీమోహన్ ఏలూరు జిల్లా చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఇక్కడ ఈయన తాతల కాలం నాటి ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. అప్పట్లో ఇటుకలు మట్టితో నిర్మించిన ఈ ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో మురళి మోహన్ కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ఇంటి నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేకుండా రీ మోడలింగ్ చేస్తున్నారు.
కన్నతల్లిని పుట్టిన ఊరుని ఎప్పుడు మర్చిపోకూడదు అనే విషయాన్ని మదిలో ఉంచుకున్నటువంటి మురళీమోహన్ తన సొంత ఊరిలో ఉన్నటువంటి తన తాతల కాలంనాటి ఇంటిని రీ మోడలింగ్ చేస్తున్నారు. అయితే ఇదివరకు ఈ ఇంట్లో గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ప్రాథమిక వైద్యశాల ఉండేది. అయితే ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో వైద్యశాలను అక్కడి నుంచి తొలగించారు.
ఇక ఈ ఇంటి గురించి మురళీమోహన్ మాట్లాడుతూ తాను ఇదే ఇంటిలో పుట్టి పెరిగానని ఈ ఇంటిలోనే తన విద్యాభ్యాసాలు పూర్తి అవ్వడమే కాకుండా తన వ్యాపారాలు కూడా ఈ ఇంటి నుంచి ప్రారంభమయ్యాయని తెలిపారు.ఈ ఇల్లు నిర్మించి దాదాపు 98 సంవత్సరాలు అవుతుంది అయితే శిథిలావస్థకు చేరుకుంటున్న ఈ ఇంటిని తిరిగి అదే రూపురేఖలతో రీ మోడలింగ్ చేయిస్తున్నానని తెలిపారు.ఇలా ఈ ఇల్లు రీ మోడలింగ్ పూర్తి అయిన తర్వాత ఈ ఇంటిని గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం ఉపయోగిస్తానని ఈ సందర్భంగా మురళీమోహన్ తెలియజేశారు.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…