Tag Archives: nagababu

Niharika: నిహారిక ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా… దానితో ఏం చేసిందంటే?

Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి నిహారిక ప్రస్తుతం హీరోయిన్ గాను నిర్మాతగాను కొనసాగుతూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి నిహారిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు..ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

నిహారిక తన తండ్రి నాగబాబు సపోర్టుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే కెరియర్ మొదట్లో ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి ఢీ డాన్స్ షో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇలా పలు సీజన్లకు నిహారిక యాంకర్ గా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇక తాజాగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ఈమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సమయంలో ఒక్కో ఎపిసోడ్ కి 20వేల రూపాయల వరకు తనుకు రెమ్యూనరేషన్ ఇచ్చే వారని తెలిపారు. అప్పట్లో ఆ రెమ్యూనరేషన్ అంటే తక్కువ ఏం కాదని చెప్పాలి.

అమ్మానాన్నలకు గిఫ్ట్…
ఇలా ఇచ్చిన రెమ్యూనరేషన్ నేను నాన్నకు ఇచ్చే దానిని నాన్న వాటిని డిపాజిట్ చేసి పెట్టారని నిహారిక తెలిపారు. ఇక నాకు వచ్చినటువంటి మొదటి రెమ్యూనరేషన్ తో అమ్మానాన్నలకు కూడా గిఫ్ట్ ఇచ్చానని ఈమె తెలిపారు నాన్నకు పాటలు వినడం అంటే చాలా పిచ్చి అందుకే నాన్న కోసం హెడ్ ఫోన్స్ కొన్నానని ఆయన మొబైల్ లో పాటలు వింటూ రిలాక్స్ అయ్యే వారిని తెలిపారు. అమ్మకు ముక్కు పుడక అంటే చాలా ఇష్టం కావడంతో తనకు గోల్డ్ ముక్కుపుడక గిఫ్ట్ గా ఇచ్చానని నిహారిక తెలిపారు.

Nagababu: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పొలిటికల్ కామెంట్స్ చేసిన నాగబాబు.. రైళ్లు పరిగెత్తాలంటూ?

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పొలిటికల్ కామెంట్స్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావనకు తీసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అభిమానులు అందరూ గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు దీంతో నాగబాబు ఇంకా గట్టిగా అరవండి ఈ అరుపులు వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి అంటూ ఈయన కామెంట్లు చేశారు.

తాను ఇప్పుడే పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఇక్కడికి వస్తున్నానని తెలిపారు. ఇలా నాగబాబు మాట్లాడుతూ ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం వారి అరుపులు మానలేదు దీంతో నాగబాబు మాట్లాడుతూ ఈ ఎనర్జీ మొత్తం మీరు ఓట్లు వేయడంలో కూడా చూపించండి అంటూ ఈయన చేసినటువంటి పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ ఎనర్జీ ఓట్లు వేయడంలో ఉండాలి..
ఇకపోతే నాగబాబు ఈసారి జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. జనసేన టిడిపి కూటమి కలసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. అయితే జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లతో పాటు మూడు ఎంపీ సీట్లను కేటాయించారని తెలుస్తోంది.

Nagababu: లావణ్య త్రిపాఠి నటనపై నాగబాబు షాకింగ్ కామెంట్స్!

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు తాజాగా నటి లావణ్య త్రిపాఠి గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే తన నటన ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత ఈమె వరసగా సినిమాలలో నటించారు. ఇకపోతే ఇటీవల లావణ్య మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. నటుడు వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్నటువంటి ఈమె మెగా ఇంటి కోడలు అయ్యారు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న తర్వాత నటించినటువంటి మిస్ ఫర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.

ఇకపోతే తాజాగా ఈ సిరీస్ గురించి లావణ్య త్రిపాఠి నటన గురించి నాగబాబు ఇంస్టాగ్రామ్ వేదికగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మై డియర్ లావణ్య నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ అద్భుతంగా ఉంది. వినోదాత్మక అంశాలతో కట్టిపడేసింది. అందరి చూడాల్సిన వెబ్ సిరీస్ అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశాడు.

లావణ్య పై పొగడ్తల వర్షం..

ఇలా పరోక్షంగా నాగబాబు ఈ సిరీస్ ప్రమోట్ చేశారు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించబోతున్నారని విషయం మనకు తెలిసిందే. ఈమెకు నటన పరంగా ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు. ఇక ఈమె పెళ్లి తర్వాత కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యారనే విషయాన్ని ఇటీవల లావణ్య వెల్లడించారు.

Nagababu: దుర్మార్గపు పాలనకు ఎండ్ కార్డుపడే రోజులు దగ్గరకు వచ్చాయి… నాగబాబు ట్వీట్ వైరల్!

Nagababu: గత రెండు రోజులుగా మెగా వెర్సెస్ వైసీపీ అన్నట్టు సోషల్ మీడియాలోనూ మీడియా వార్తలులోను పెద్ద ఎత్తున వార్ జరుగుతుంది.చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా వైసీపీని ఉద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ముందు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రత్యేక హోదా తీసుకురావాలి అంటూ వైసిపి నేతలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ విధంగా చిరంజీవి వైసిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో వైసిపి నేతలు ఒక్కొక్కరు రంగంలోకి దిగుతూ చిరంజీవి పై అలాగే మెగా కుటుంబం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.తరుణంలో మెగా ఫాన్స్ అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందిస్తూ వైసిపి నేతలకు గట్టిగా బుద్ధి చెప్పారు.

ఈ సందర్భంగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… శ్రమను పెట్టుబడిగా పెట్టి పన్ను అనా పైసతో సహా చెల్లించి…వినోదాన్ని విజ్ఞానాన్ని జనాలకు పంచిపెట్టే 24 క్రాఫ్ట్ లకు కడుపునిండా భోజనం పెట్టే ఏకైక పరిశ్రమ చిత్ర పరిశ్రమ. ఏ పని పాట లేనోడు పిల్లి తల కొరిగినట్టు నిజం మాట్లాడిన వ్యక్తుల మీద విషం కక్కుతున్నారు.ప్రస్తుతం ఆయన గురించి విమర్శలు చేస్తున్నటువంటి ఆంధ్ర మంత్రులు ఒకానొక సమయంలో ఆ అన్నయ్యతో ఫోటో దిగడం కోసం పడిగాపులు కాచిన వారేనంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.

Nagababu: కాలం గాలం ఏస్తే ప్రకృతి కూడా శత్రువే…

మీ బతుకు శాఖలపై అవగాహన లేదు… అభివృద్ధి అంటే ఏంటో అర్థం తెలియదు కేవలం బటన్ నొక్కి పథకాలు అందిస్తేనే అభివృద్ధి కాదు…మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటేనే అర్థమవుతుంది. మీ దౌర్భాగ్యపు ధర్మాలను పాలనకు ఎండ్ కార్డు పడే రోజులు దగ్గర పడుతున్నాయి…కాలం గాలం ఏస్తే ప్రకృతి కూడా శత్రువే అంటూ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ నాగబాబు చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.

Niharika Divorce: నిహారిక కు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదా… ముందుగా చైతన్యనే విడాకులు కోరారా?

Niharika Divorce: ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక తన భర్త వెంకట చైతన్యతో విడాకులు తీసుకుని విడిపోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ దూరంగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు అలాగే పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారు.

ఈ విధంగా వెంకట చైతన్య నిహారిక విడాకులు తీసుకున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నటువంటి తరుణంలో కోర్టు కూడా వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది దీనితో నిహారిక సోషల్ మీడియా వేదికగా తన విడాకుల గురించి స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే నిహారిక విడాకులకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది. ముందుగా విడాకుల కోసం నిహారిక కాకుండా తన భర్త వెంకట చైతన్య కోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది.

నిహారికకు విడిపోవడం ఇష్టం లేదని కానీ తన భర్త ఇష్ట ప్రకారమే తాను కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధమైందని తెలుస్తోంది. నిహారిక కంటే ముందుగా వెంకట చైతన్య విడాకులు ఇవ్వడానికి కారణం కూడా ఉంది. నిహారిక తిరిగి ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేనటువంటి వెంకట చైతన్య తనకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకొని తానే ముందుగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.

Niharika Divorce: వెంకట చైతన్య ముందుగా పిటిషన్ వేశారా…

నిహారిక తరపు న్యాయవాది విరి విడాకుల గురించి చెబుతూ ముందుగా వెంకట చైతన్య విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఇక్కడ నిహారిక తరపు న్యాయవాది మరెవరో కాదు పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు అయినటువంటి దిలీప్ సుంకర నిహారిక తరపు లాయర్ గా నిలబడ్డారు నాగబాబుకి కూడా అత్యంత సన్నిహితుడు.

Lavanya Tripati: పెళ్లి కాకుండానే లావణ్య త్రిపాటిని వేరు పెట్టాలని నిర్ణయించుకున్న పద్మజ… కారణం అదేనా?

Lavanya Tripati: సినీ నటి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలుగా అడుగుపెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి ఎంతో ఘనంగా నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు. ఇలా వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే పెళ్లి కాకుండానే నాగబాబు సతీమణి లావణ్య త్రిపాటికి కొన్ని కండిషన్స్ పెట్టారని అలాగే పెళ్లి తర్వాత వీరిద్దరిని వేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నాగబాబు భార్య లావణ్య విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి తన అమ్మ గారి ఇంట్లో ఎలాగైతే ఉందో తన ఇంట్లో కూడా అలాగే ఉండాలని భావించారట. ఈ క్రమంలోనే తనకు ఫుల్ ఫ్రీడం ఇచ్చారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి సినిమాలలో నటించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే లావణ్య త్రిపాఠి ఏ పని చేసిన తాను ఎలా జీవించాలి అనుకున్న కూడా మెగా కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారట.

Lavanya Tripati: లావణ్యకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన పద్మజ…


అంతేకాకుండా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాటి వారితో పాటు కలిసి ఉంటే తన ఫ్రీడమ్ కోల్పోతుందని భావించిన పద్మజ పెళ్లయిన వెంటనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన వేరుగా ఉంచి వారికి స్వేచ్ఛను కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇలా కాబోయే కోడలు విషయంలో ఇంత మంచిగా ఆలోచించడంతో మెగా అభిమానులు అలాగే లావణ్య త్రిపాఠి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Nagababu: లావణ్య త్రిపాఠి గురించి ఆ విషయాలు తెలిసి నాగబాబు పెళ్లికి ఒప్పుకున్నారా… నిజంగా గ్రేట్ అబ్బా?

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి త్వరలోనే నటి లావణ్య త్రిపాఠి కోడలుగా అడుగుపెట్టబోతున్నారు. ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇన్ని రోజులు తమ ప్రేమ విషయాన్ని దాస్తూ వచ్చినటువంటి ఈ జంట ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టడమే కాకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.

ఇలా వీరి నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే త్వరలోనే వీరిద్దరి వివాహం కూడా ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది.వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లావణ్య త్రిపాఠి గతంలో మెగా హీరోలు అయినటువంటి సాయి ధరంతేజ్ అలాగే అల్లు శిరీష్ వంటి హీరోలతో ప్రేమలో ఉందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇక లావణ్య త్రిపాఠి కూడా హస్బెండ్ మెటీరియల్ ఎవరు అంటే వెంటనే సాయి ధరమ్ పేరు చెప్పారు. ఇలా తమ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని, తామిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ తెలియజేశారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓల్డ్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ ఇద్దరి మెగా హీరోలతో లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Nagababu: ఆ మెగా హీరోలతో బ్రేకప్


ఇలా లావణ్య గురించి ఈ విధమైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో వినిపించినప్పటికీ నాగబాబు మాత్రం తనని కోడలిగా అంగీకరించడంతో ప్రతి ఒక్కరు లావణ్య గురించి ఈ విషయాలు తెలిసి నాగబాబు తన కోడలుగా ఒప్పుకున్నారా అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో జరగబోతుందని తెలుస్తుంది.

Punch Prasad: తను లేకపోతే ఐదేళ్ల క్రితమే చనిపోయేవాడిని… పిల్లలను గుర్తు చేసుకుంటే ఏడుపాగదు: పంచ్ ప్రసాద్

Punch Prasad: బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా పలు బుల్లితెర కార్యక్రమాలలో కొనసాగుతున్నటువంటి ఈయన గత కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటూ తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్ ఆరోగ్యం రోజురోజుకీ క్షమించిపోతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను అనారోగ్యానికి గురైన సమయంలో జబర్దస్త్ ఆర్టిస్టులు రోజా గారు నాగబాబు గారు తనకు ఆర్థికంగా చాలా సహాయం చేశారని తెలియజేశారు.

నూకరాజు తనకు తమ్ముడి కన్నా చాలా ఎక్కువ అని తెలిపారు. ఇక కిరాక్ ఆర్ పి లక్ష రూపాయల వరకు సహాయం అందించారని తెలిపారు.ఇక నేను ఆరోగ్యంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే తనకు సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారని ప్రసాద్ తెలిపారు. అయితే తన పిల్లల గురించి ఆలోచించి సర్జరీ కాస్త ఆలస్యం చేశానని ఈయన వెల్లడించారు. తన భార్య గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

Punch Prasad: పిల్లల గురించి తలుచుకుంటే ఏడుపొస్తుంది…


తన భార్య తన పిల్లల కన్నా నన్నే చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారని ఆమె లేకపోతే నేను ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయేవాడిని అంటూ ఈయన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నా పిల్లల గురించి ఆలోచిస్తే కన్నీళ్లు ఆగవని ఒకప్పుడు నా గురించి చాలామంది ఆలోచించి తనకు సహాయం చేస్తామని చెప్పినా నేను వద్దని చెప్పానని ప్రసాద్ తెలిపారు. అయితే డాక్టర్లు మాత్రం టాబ్లెట్స్ వాడటం కన్నా సర్జరీ చేయించుకోవడమే బెటర్ అని చెప్పారు. కానీ ఈ సర్జరీ కొందరికి సక్సెస్ అవుతుంది మరికొందరికి సక్సెస్ కాదు అన్న భయంలో తాను ఉన్నానని తెలిపారు.ఇలా పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Nagababu: వరుణ్ తేజ్ చేసుకోబోయే అమ్మాయి గురించి నాకు సంబంధం లేదు.. నాగబాబు షాకింగ్ కామెంట్స్!

Nagababu:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన పెళ్లి చేసుకోబోతున్నారంట గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా జూన్ 9వ తేదీ ఇద్దరు ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారని వార్త వైరల్ గా మారింది. దీంతో వరుణ్ తేజ్ లావణ్య విషయం ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే తాజాగా వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగబాబుకి వరుణ్ తేజ్ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది.త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడగడంతో నాగబాబు ఈ విషయం గురించి సమాధానం చెబుతూ..

వరుణ్ తేజ్ పెళ్లి అయితే త్వరలోనే జరుగుతుంది కానీ తను చేసుకోబోయే అమ్మాయి గురించి నాకు ఏ మాత్రం సంబంధం లేదని తెలిపారు.తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి తానే అన్ని విషయాలు చెబుతాడు అంటూ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే వరుణ్ లావణ్య గురించి ప్రస్తావించినప్పటికీ ఈ వార్తలను ఖండించకుండా వరుణ్ చెబుతాడని దాట వేశారు.

Nagababu: వరుణ్ తేజ్ చెబుతాడు…


నాగబాబు ఇలా వరుణ్ పెళ్లి గురించి స్పందించడంతో వరుణ్ తేజ్ లావణ్య గురించి వచ్చే వార్తలలో నిజం ఉందని అందుకే నాగబాబు ఈ వార్తలను ఖండించలేదంటూ పలువురు ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య నిశ్చితార్థపు ఏర్పాట్లు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

Nagababu: చేతిలో కత్తి పట్టి శాంతి అహింస అంటూ సంచలన పోస్ట్ చేసిన నాగబాబు… పోస్ట్ వైరల్!

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా గుర్తింపు పొందిన నాగబాబు కొంతకాలం జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా కూడా వ్యవహరించాడు. ఆ తర్వాత సరైన అవకాశాలు లేకపోవడంతో అడపాదడపా సినిమాలలో నటిస్తూ రాజకీయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తూ ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇక ఎలక్షన్ల సమయం సమీపించటంతో పార్టీని బలోపేతం చేయడానికి సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టి దగ్గరుండి తానే అన్ని చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా నాగబాబు షేర్ చేసిన ఒక పోస్ట్ వివాదాలకు దారితీస్తోంది. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న నాగబాబు మరొసారి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.

ఇక తాజాగా వేట కొడవలి చేతిలో పట్టుకుని ఉన్న ఫోటోని నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..” మంచి అనేది విఫలం చెందినప్పుడు న్యాయం, శాంతి సాధించడానికి హింసే మార్గం” అంటూ రెచ్చగొట్టేలా పోస్ట్ షేర్ చేశాడు. అయితే నాగబాబు ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి పోస్టర్ షేర్ చేశాడా? లేక కావాలనే వైసిపి పార్టీ నాయకులను రెచ్చగొట్టేలా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా అన్నది తెలియాల్సి ఉంది.

Nagababu: నాగబాబు పోస్టుతో రెచ్చిపోతున్న జనసైనికులు…

ఇదిలా ఉండగా నాగబాబు షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ చూసిన జనసైనికులు కూడా మీ వెనక మేమున్నాం అంటూ తెగ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు నాగబాబు చేసిన పోస్ట్ రెచ్చగొట్టేలా ఉంటాయి. అయితే ఇలా పబ్లిక్ లో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటంతో కొందరు నాగబాబు పట్ల ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఒక కీలకమైన పదవిలో అంటూ ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడం సరైన పద్దతి కాదు అంటూ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నాగబాబు షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.