Tag Archives: naresh

Naresh: నన్ను చూస్తే అబ్బాయిలు కూడా కన్ను కొడతారు.. నరేష్ బోల్డ్ కామెంట్స్ వైరల్!

Naresh: వీకే నరేష్ పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నరేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ఈయన తన వ్యక్తిగత విషయాలు ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.

తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చినటువంటి నరేష్ ప్రస్తుతం సినీనటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు ఈ విషయంపై తన మూడో భార్య రమ్య రఘుపతి తీవ్ర స్థాయిలో వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతా సర్దుకుపోయిందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈయన గోపీచంద్ హీరోగా హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన బీమా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నరేష్ మాట్లాడుతూ యువతలో చాలా ఉత్సాహాన్ని నింపారు. ఇక ఈ సినిమాలో తన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని తన పాత్ర గురించి నరేష్ చెప్పుకువచ్చారు. ఎలాంటి పాత్రలు చేయాలి అన్న సందిగ్ధంలో ఉన్న నాకు హర్ష విభిన్నమైనటువంటి పాత్ర వినిపించారని ఈ పాత్ర వినగానే వెంటనే ఓకే చెప్పానని తెలిపారు.

నా పాత్ర చూస్తే కన్ను కొడతారు..
ఇకపోతే ఈ సినిమాలో తన పాత్రను కనుక చూస్తే అబ్బాయిలు మీరందరూ కూడా నాకు కన్ను కొడతారు అంటూ ఈయన బోల్డ్ కామెంట్స్ చేశారు. అంత అద్భుతంగా నా పాత్రను తీర్చిదిద్దారు అంటూ ఈ సందర్భంగా నరేష్ బీమా సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఆల్ రౌండర్ అని ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని ఈయన తెలియజేశారు. ఇక ఈ సినిమా మార్చి 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Amar Deep: బెగ్గర్ గా మారిన అమర్ స్నేహితుడు నరేష్.. ఈ పరిస్థితికి కారణం అదేనా?

Amar Deep: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి బుల్లితెర నటుడు అమర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన బుల్లితెర నటుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రన్నర్ గా బయటకు వచ్చారు. ఇలా నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అమర్ బిగ్ బాస్ తర్వాత మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.

అమర్ ఈ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో ఆయన పట్ల ఆయన ఫ్యామిలీ పట్ల భారీ స్థాయిలో నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడమే కాకుండా తన ఫ్యామిలీని నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ ఇబ్బందులకు గురి చేశారు. ఇలాంటి సమయంలో అమర్ స్నేహితులు తన కుటుంబానికి అండగా నిలబడిన సంగతి మనకు తెలిసిందే. ఇలా అమర్ స్నేహితులలో ఒకరైనటువంటి నరేష్ లొల్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అమర్ బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో ఆయన పై వచ్చిన విమర్శలు అన్నిటిని ఈయన తిప్పి కొడుతూ ఎన్నో వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. అయితే ఇలా ఇతరుల క్రేజ్ ఉపయోగించుకుంటూ ఈయన వీడియోలు చేస్తూ తాను పాపులర్ అవుతున్నారని ఇలా అడుక్కోవడం దేనికి అంటూ చాలామంది ఈయన పట్ల విమర్శలు కురిపిస్తున్నారు.

60 వేలు వచ్చాయి..

అందరూ తనని అడుక్కోవడం అంటూ ఉండగా ఈయన ఈ విషయంపై ఆలోచించి ఇటీవల ఒక వీడియోని షేర్ చేశారు. అందరూ నన్ను అడుక్కుంటున్నావంటున్నారు. అందుకే నా సబ్స్క్రైబర్లు అందరు నాకు ఒక్క రూపాయి దానం చేయండి అంటూ నిజంగానే బెగ్గర్ గా మారిపోయారు. ఇలా అందరి నుంచి రూపాయి కలెక్ట్ చేసి నా సబ్స్క్రైబర్స్ లో ఎవరైతే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారో వారికి ఇస్తానని తెలిపారు. అయితే ఇప్పటివరకు తను 60000 సంపాదించానని త్వరలోనే ఆ డబ్బు ఎవరికి ఇవ్వబోతున్నాను అనే విషయాన్ని తెలియజేస్తాను అంటూ నరేష్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

Naveen: మహేష్ అన్నతో మంచి బాండింగ్ ఉంది… వైరల్ అవుతున్న నరేష్ కుమారుడు నవీన్ కామెంట్స్!

Naveen: నవీన్ అంటే తెలియకపోవచ్చు కానీ సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ అంటే మాత్రం అందరూ తప్పక గుర్తుపట్టారు. ఈయన కెరియర్లో హీరోగా ఒకే ఒక సినిమాలో నటించారు. హీరోగా నవీన్ మెప్పించకపోవడంతో ఈయన దర్శకుడిగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఈయన సాయి ధరమ్ తేజ్ హీరోగా సత్య అనే షార్ట్ ఫిలింకి దర్శకుడిగా వ్యవహరించారు.

ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఈయన వరుస ఇంటర్వ్యూలో హాజరవుతూ తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. తన నానమ్మ విజయనిర్మల చనిపోవడంతోనే ఆ జ్ఞాపకాలను మర్చిపోలేక అదే బాధలో ఉండే కృష్ణ గారు కూడా చనిపోయారు అంటూ నవీన్ తెలియచేశారు.

నానమ్మ చనిపోయిన తర్వాత మహేష్ బాబు గారు కృష్ణ గారిని తన ఇంటికి తీసుకెళ్లడానికి చాలా బ్రతిమలాడారు. కానీ అక్కడ 40 సంవత్సరాలు పాటు నాన్నమ్మతో కలిసి ఉన్నటువంటి కృష్ణ గారు ఆ జ్ఞాపకాలను విడిచి వెళ్లలేక అదే ఇంట్లోనే ఉండే వారిని నవీన్ తెలిపారు. ఇక కృష్ణ గారు మరణించిన తర్వాత మహేష్ బాబుతో నాకు మంచి బాండింగ్ ఉందని తెలిపారు.

Naveen: రమ్య రఘుపతి గారు నాతో మాట్లాడేవారు…


ఇప్పటికి కూడా మహేష్ అన్న రెండు మూడు రోజులకు ఒకసారి కాల్ చేసి నాతో మాట్లాడతారని లేదా నేనైనా తనుకు చేస్తూ ఉంటానని నవీన్ తెలిపారు. ఇలా మహేష్ గారితో తనకు మంచి బాండింగ్ ఉందని నవీన్ తెలిపారు. ఇక రమ్య రఘుపతి గురించి కూడా మాట్లాడుతూ ఆమె నా వరకు చాలా మంచిగానే ఉండేదని ఎప్పుడు మాట్లాడిన మంచిగానే మాట్లాడించేవారు అంటూ ఈ సందర్భంగా నవీన్ తెలిపారు. నాన్నతో ఆమెకు ఉన్నటువంటి గొడవలు అది పూర్తిగా వారి వ్యక్తిగతం అని నా వరకు అయితే చాలా మంచిగా ఉండే వారని తెలిపారు.

Naveen: పవిత్ర లోకేష్ నరేష్ లవ్ స్టోరీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నరేష్ కుమారుడు నవీన్!

Naveen: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నరేష్ ఒకరు. అయితే ఈయన గత కొంతకాలంగా తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు దూరమైనటువంటి నరేష్ ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇలా పవిత్ర లోకేష్ కారణంగా నరేష్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు అయితే తాజాగా నటుడు నరేష్ పవిత్ర లోకేష్ గురించి నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట్లోనవీన్ హీరోగా చేసినప్పటికీ అనంతరం సత్య అనే షార్ట్ ఫిలిం ద్వారా డైరెక్టర్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నవీన్ ఎన్నో విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ మొదటి నుంచి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఏది తోచితే అదే చేసే అలవాటు ఉంది ఇలా చేయడం వల్ల కొన్ని తప్పులు జరిగాయి అయితే మా ఫ్యామిలీ గురించి బయట ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయని వాటి గురించి పట్టించుకోనని నవీన్ తెలిపారు. వారు కోరుకున్నట్టు బ్రతకాలంటే మేము బ్రతకలేమని తెలియజేశారు.

Naveen: పవిత్ర గారు బాగా తెలుసు..


ఇక నాన్న తన గురించి ఎవరు ఏమన్నా వాటి గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్తారు ఆయనలో నాకు నచ్చినది ఇదేనని బయట ఎవరు ఎన్ని అనుకున్నా మా నాన్న హ్యాపీగా ఉండడమే మాకు ముఖ్యం అంటూ నవీన్ తెలిపారు.ఇక పవిత్ర గురించి కూడా మాట్లాడుతూ పవిత్ర గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆమె నేను ఏదైనా పని మొదలు పెడుతున్నటువంటి సమయంలో ఆమె నాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఉంటారు తరచూ నేను తనతో మాట్లాడుతూ ఉంటానని తనని పవిత్ర గారు అని పిలుస్తాను అంటూ నవీన్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pavitra Lokesh: లిప్ లాక్ పెట్టడానికి పవిత్ర అసలు ఒప్పుకోలేదు… ఈ సీన్ వెనుక మూడు రోజుల కష్టం ఉంది: నరేష్

Pavitra Lokesh:టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా భారీగా ట్రెండ్ అవుతున్నటువంటి వారిలో నరేష్ పవిత్ర లోకేష్ ఒకరు. లేటు వయసులో వీరిద్దరూ ఘాటు ప్రేమలో మునిగి తేలడమే కాకుండా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అలాగే త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని బహిరంగంగా వీరి ప్రేమ పెళ్లి విషయం గురించి కామెంట్ చేస్తున్నారు.

ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉండడమే కాకుండా ఇద్దరు జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేదని చెప్పాలి. ఇలా ఈ సినిమాకు పెద్దగా ఆదరణ రాకపోయినా పవిత్ర లోకేష్ మాత్రం చాలా ఫేమస్ అయ్యారు.

ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ లో వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకున్నటువంటి సన్నివేశం ఎలా హైలెట్ అయిందో మనకు తెలిసిందే. అయితే ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎన్నో వివాదాలకు కూడా కారణం అయింది. ఇలా లిప్ లాక్ వీడియో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Pavitra Lokesh: బ్రతిమలాడితే ఒప్పుకుంది…


అయితే ఈ సన్నివేశం చేయడం కోసం తాను మూడు రోజులపాటు కష్టపడ్డానంటూ ఓ సందర్భంలో నరేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశం ఉందని చెప్పగానే పవిత్ర ఒక్కసారిగా షాక్ అయిందని తాను ఈ సన్నివేశంలో నటించననీ చెప్పిందని నరేష్ తెలిపారు.అయితే మూడు రోజులపాటు తనని బ్రతిమలాడి ఈ సన్నివేశానికి ఒప్పించాము అంటూ ఈ సందర్భంగా నరేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pavitra Lokesh: వామ్మో నరేష్ కాకుండా ఆ ఇద్దరు హీరోలు అంటే పవిత్రకు అంత ఇష్టమా… ఎవరా హీరోలు?

Pavitra Lokesh:పవిత్ర లోకేష్ పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారిన ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నరేష్ తో రిలేషన్ లో ఉండడంతో ఒక్కసారిగా సెన్సేషనల్ గా నిలిచారు. పవిత్ర లోకేష్ నరేష్ వ్యవహార శైలి తీవ్రస్థాయిలో వివాదాస్పదంగా మారిన విషయం మనకు తెలిసిందే.

ఇక పవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు జంటగా తాజాగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫలితాలను అందుకున్నప్పటికీ ఈ సినిమాలో వీరిద్దరూ చాలా రొమాంటిక్గా నటించారని మాత్రం తెలుస్తుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నరేష్ పవిత్ర ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరైన సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరూ పళ్ళు ఇంటర్వ్యూలకు హాజరవుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే పవిత్ర లోకేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరోల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తనకు ఇద్దరు హీరోలు అంటే క్రష్ అని ఈ సందర్భంగా వారి పేర్లను బయటపెట్టారు. తాను స్కూల్లో చదువుతున్న సమయంలో నాగార్జున గారు నటించిన గీతాంజలి సినిమా విడుదలైంది.

Pavitra Lokesh: నాగార్జున… ప్రకాష్ రాజ్…


ఈ సినిమా చూసిన తర్వాత తనకు భర్త ఉంటే ఇలాంటి వ్యక్తి రావాలని ఆ క్షణం అనిపించిందని అందుకే తనకు నాగార్జున అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఇక నాగార్జున తర్వాత అదే స్థాయిలో ఇష్టమైనటువంటి మరొక నటుడు ప్రకాష్ రాజ్. ఈ ఇద్దరు హీరోలు తనకు క్రష్ అంటూ ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Naresh: ఈ వయసులో పిల్లలను కనడం గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన నరేష్… ఏమన్నారంటే?

Naresh: నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయిన సెలబ్రిటీలలో ఒకరు చెప్పాలి. వీరిద్దరూ ఇదివరకే పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు ఉన్నప్పటికీ వారి నుంచి దూరంగా ఉంటూ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉండటమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇద్దరూ జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పవిత్ర నరేష్ ఇద్దరు కూడా జంటగా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున డాన్సులు చేయడం, ముద్దులు పెట్టుకుంటూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు.

ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నపవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా ఈ వయసులో పిల్లలను కనడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తామిద్దరం శారీరకంగా చాలా ఫిట్ గా ఉన్నామని బోల్డ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం తనకు పవిత్రకు ఉన్న పిల్లలు ఇద్దరికీ సమానమేనని తెలియజేశారు అయితే భవిష్యత్తు ఏంటి అనేది మాత్రం చెప్పలేనని తెలిపారు.

Naresh: అమ్మలాంటి అమ్మాయే పవిత్ర…

మా అమ్మ నా విషయంలో ఎప్పుడు బాధపడుతూ ఉండేది తన లాంటి అమ్మాయిని నాకు భార్యగా ఇవ్వలేకపోయానని బాధపడుతూ ఉండేది.అయితే అమ్మలాంటి అమ్మాయి ఈ పవిత్ర అమ్మ పుట్టినరోజు తన పుట్టినరోజు అలాగే అమ్మ కళ్ళు మాదిరిగానే పవిత్ర కళ్ళు కూడా ఉంటాయని ఈ ఇద్దరికీ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా నరేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Naresh: మళ్లీ పెళ్లి సినిమాని కృష్ణ గారికి అంకితం చేస్తున్నా… నరేష్ పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్!

Naresh: నరేష్ పవిత్ర మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారిపోయారు. నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు నిజ జీవితంలో సహజీవనం చేయడమే కాకుండా వీరిద్దరూ కలిసి జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మే 26వ తేదీ విడుదల అయింది.

నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది.ఇక ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ నరేష్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మళ్లీ పెళ్లి సినిమా గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.

ముఖ్యంగా నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ కి కృష్ణ గారి ఫ్యామిలీ తనకు ఏమాత్రం అడ్డు చెప్పలేదని వారికి కూడా మా రిలేషన్ ఇష్టమేనని తెలియజేశారు. ఇక వీరి వ్యవహారంలోకి మహేష్ బాబు పేరుని కూడా లాగడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే తాజాగా ఈయన మరోసారి మళ్లీ పెళ్లి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాని కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా ఆయనకు అంకితం చేస్తున్నామని తెలిపారు.

Naresh: కృష్ణ గారికి అంకితం..


మే 31వ తేదీ కృష్ణగారి 81వ జయంతి వేడుక కావడంతో తన మళ్లీ పెళ్లి సినిమాని కృష్ణ గారికి అంకితం చేస్తాను అంటూ ఈయన కృష్ణ గారికి గురించి ప్రస్తావన తీసుకురావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాని కృష్ణ గారికి అంకితం చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం నరేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pavitra Lokesh: మళ్లీ పెళ్లి సినిమా కోసం పవిత్ర లోకేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Pavitra Lokesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి పవిత్ర లోకేష్ ఒకరు. ఇలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి ఈమె నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ ఇద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా వీరిద్దరి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మే 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సినిమాని స్వయంగా నరేష్ విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ లో నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం నరేష్ భారీగానే ఖర్చు చేశారని తెలుస్తోంది.

ఇక ఇందులో నరేష్ పవిత్ర ఇద్దరూ ప్రధాన పాత్రలలో నటించడం వల్ల పవిత్ర లోకేష్ ఈ సినిమా కోసం తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక్కో సినిమాకు పవిత్ర లోకేష్ 60 వేల రూపాయల వరకు ఒక రోజు కాల్ షీట్ కోసం తీసుకుంటారట. అయితే ప్రస్తుతం ఈమెకు మంచి పాపులారిటీ రావడంతో ఒక రోజుకు లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.

Pavitra Lokesh: స్టార్ హీరోయిన్స్ ని మించిన రెమ్యూనరేషన్…

ఇక మళ్లీ పెళ్లి సినిమాలో పవిత్ర లోకేష్ లీడ్ రోల్ చేయడం వల్ల ఈ సినిమాకు ఈమె భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవిత్ర లోకేష్ దాదాపు పది కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఇలా ఈ సినిమా కోసం పవిత్ర లోకేష్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్న విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కి కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Karthika Deepam Soundarya: నరేష్ పవిత్ర లోకేష్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన కార్తీకదీపం సౌందర్య… ఎవరికి హక్కు లేదంటూ కామెంట్స్!

Karthika Deepam Soundarya:నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ఒక్కసారిగా సంచలనంగా మారారు. వీరిద్దరు వ్యక్తిగతంగా రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సినిమా ద్వారా వీరిద్దరూ ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారని చెప్పాలి.

ఇలా లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగితేలుతో సైలెంట్ గా ఉండకుండా ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా చెబుతూ అందరి ముందు కాస్త చులకనగా అయ్యారనే చెప్పాలి.ఇక మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వేదికపై వీటి ఇద్దరు చేసిన రొమాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

వ్యవహార శైలి వల్ల దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర లోకేష్ గురించి వస్తున్నటువంటి ఈ కామెంట్లపై కార్తీకదీపం నటి సౌందర్య స్పందించారు.కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య పాత్రలో నటించిన నటి అర్చన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఈమె సినిమాలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Karthika Deepam Soundarya: తల్లిదండ్రులకు కూడా హక్కు లేదు..


ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర లోకేష్ గురించి వస్తున్నటువంటి కామెంట్లపై సౌందర్య స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి ఇలాంటి వార్తలు రావడం తనని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని తెలిపారు. వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇలా వారు ఒకరినొకరు ఇష్టపడటం అనేది వారి వ్యక్తిగత విషయం.వారి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదు చివరికి తల్లిదండ్రులకు కూడా ఆ హక్కు లేదు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.